19, మార్చి 2025, బుధవారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*తన మనస్సు అనే రాజహంసను, ఈశ్వరుని పాదపద్మములు అనే సౌధాంతరాళములో అనగా దివ్యభవనము లోపల నివసించుమని ఈ శ్లోకంలో శంకరులు కోరారు.*


*శ్లోకం  :   46*


*ఆకీర్ణే నఖరాజి కాంతి విభవై రుద్యత్సుధా వైభవైః*

                   

*ఆధౌతే పిచ పద్మరాగ లలితే హంస వ్రజై రాశ్రితే,*

                   

*నిత్యం భక్తి వధూ గణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు*

                   

*స్థిత్వా మానస రాజ హంస! గిరినాథాంఘ్రి సౌధాంతరే !!*


*పదవిభాగం :~*


*ఆకీర్ణే _ నఖరాజికాంతివిభవైః _ ఉద్యత్సుధావైభవైః _ ఆధౌతే _ అపి _ చ  _ పద్మరాగలలితే _ హంసవ్రజైః _ ఆశ్రితే _ నిత్యం _ భక్తివధూగణైః _ చ_ రహసి _ స్వేచ్ఛావిహారం _ కురు _ స్థిత్వా _ మానసరాజహంస _ గిరిజా నాథాంఘ్రిసౌధాంతరే॥*


*తాత్పర్యము:~*


*మనస్సనే ಓ రాజహంసమా! నీవు గోళ్ళ వరుసల కాంతి సంపదలచే కూడినదియూ, ప్రసరించు అమృత ప్రవాహముచే కడుగబడినదియూ, (సున్నపు కాంతులచే తెల్లనైనదియూ,* *పద్మరాగమణులచే పద్మముయొక్క కెంపు వర్ణముచే సుందరమైనదియూ, పరమహంసలచే (హంసల గుంపుతో) ఆశ్రయింపబడినదియూ, పార్వతీపతియైన శివుని పాదము అనే మేడ లోపలి భాగములో ఉండి , రహస్యముగా భక్తి అనే స్త్రీల ( హంసాంగనల) సమూహంతో కలసి, ఎల్లప్పుడునూ ఇష్టం వచ్చినట్లు విహరించు.*


*వివరణ :~*


*శంకర భగవత్పాదులు, ఈ శ్లోకంలో పరమేశ్వరుని పాదపద్మము ఆశ్రయింపదగిన దివ్య భవనంగా ఉన్నదని చెప్పారు.  మనస్సు రాజ హంస వలె ఉన్నదని చెప్పారు. భక్తి పద్ధతులు ఆడు హంసలుగా చెప్పబడ్డాయి. శంకరులు తన మనస్సు నుద్దేశించి ఇలా చెప్పారు.*


*" ಓ మనస్సా ! నీవు శ్రేష్టమైన హంస వంటి దానవు. నీవు ఈశ్వరుని పాదములు అనే భవనం లోపల సుఖంగా ఇష్టానుసారంగా విహరించు. ఈశ్వరుని కాలి గోళ్ళ కాంతులు ఈశ్వరుని పాదాలను ధగధగ లాడిస్తున్నాయి. ఆపాదం మేడ అనుకుంటే , శివుని గోటి కాంతులే ఆ మేడలో వేల దీపాల కాంతులై , వెలుగులను వెదజల్లుతూ ఉంటాయి. శివుని జటాజూటంలో ఉన్న చంద్రుని  నుండి అమృతము స్రవించి , మెల్లగా వచ్చి ఆ పాదాలను కడుగుతుంది.  ఆ కాంతులు ఆ భవనానికి పూసిన తెల్లని సున్నపు పూత కాంతులుగా నున్నవి.  స్వామి పాదాలు పద్మరాగ కాంతులతో ౘూడ ముచ్చటగా ఉన్నాయి.* *అందువల్ల ఆభవనం పద్మరాగమణులు గూర్చిన వైభవాలతో  ప్రకాశిస్తోంది.  స్వామి పాద సన్నిధిలో , హంసమంత్ర జప పరాయణులెందరో ఉన్నారు. వాళ్ళు నీతోడి హంసలవలె ఉంటారు‌ .అక్కడ భక్తి వధువులు , ఎందరో ఉన్నారు. వారు నీకు ప్రియురాండ్రై, నీ హృదయానికి ఆనందాన్ని సమకూరుస్తారు.*


*కాబట్టి ಓమనసా! నీవు ఆ సుందర శివపాద దివ్య భవనంలో ప్రవేశించు. నీవు ఆ భగవంతుని పాదాలనాశ్రయించి వాటిని భక్తితో సేవిస్తూ పరమ సుఖాన్ని హాయిగా అనుభవించు.*


*మనం మనకు బాగా ఇష్టమైన వ్యక్తుల వద్ద ఉంటే మనకెంతో సుఖంగా ఉంటుంది కదా! అటువంటిది , నీవు భగవంతుని పాద సన్నిధి లోనే ఉంటే , ఇంకా ఎంత సుఖంగా ఉంటుందో ఆలోచించుకో.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: