🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*తన మనస్సు అనే రాజహంసను, ఈశ్వరుని పాదపద్మములు అనే సౌధాంతరాళములో అనగా దివ్యభవనము లోపల నివసించుమని ఈ శ్లోకంలో శంకరులు కోరారు.*
*శ్లోకం : 46*
*ఆకీర్ణే నఖరాజి కాంతి విభవై రుద్యత్సుధా వైభవైః*
*ఆధౌతే పిచ పద్మరాగ లలితే హంస వ్రజై రాశ్రితే,*
*నిత్యం భక్తి వధూ గణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు*
*స్థిత్వా మానస రాజ హంస! గిరినాథాంఘ్రి సౌధాంతరే !!*
*పదవిభాగం :~*
*ఆకీర్ణే _ నఖరాజికాంతివిభవైః _ ఉద్యత్సుధావైభవైః _ ఆధౌతే _ అపి _ చ _ పద్మరాగలలితే _ హంసవ్రజైః _ ఆశ్రితే _ నిత్యం _ భక్తివధూగణైః _ చ_ రహసి _ స్వేచ్ఛావిహారం _ కురు _ స్థిత్వా _ మానసరాజహంస _ గిరిజా నాథాంఘ్రిసౌధాంతరే॥*
*తాత్పర్యము:~*
*మనస్సనే ಓ రాజహంసమా! నీవు గోళ్ళ వరుసల కాంతి సంపదలచే కూడినదియూ, ప్రసరించు అమృత ప్రవాహముచే కడుగబడినదియూ, (సున్నపు కాంతులచే తెల్లనైనదియూ,* *పద్మరాగమణులచే పద్మముయొక్క కెంపు వర్ణముచే సుందరమైనదియూ, పరమహంసలచే (హంసల గుంపుతో) ఆశ్రయింపబడినదియూ, పార్వతీపతియైన శివుని పాదము అనే మేడ లోపలి భాగములో ఉండి , రహస్యముగా భక్తి అనే స్త్రీల ( హంసాంగనల) సమూహంతో కలసి, ఎల్లప్పుడునూ ఇష్టం వచ్చినట్లు విహరించు.*
*వివరణ :~*
*శంకర భగవత్పాదులు, ఈ శ్లోకంలో పరమేశ్వరుని పాదపద్మము ఆశ్రయింపదగిన దివ్య భవనంగా ఉన్నదని చెప్పారు. మనస్సు రాజ హంస వలె ఉన్నదని చెప్పారు. భక్తి పద్ధతులు ఆడు హంసలుగా చెప్పబడ్డాయి. శంకరులు తన మనస్సు నుద్దేశించి ఇలా చెప్పారు.*
*" ಓ మనస్సా ! నీవు శ్రేష్టమైన హంస వంటి దానవు. నీవు ఈశ్వరుని పాదములు అనే భవనం లోపల సుఖంగా ఇష్టానుసారంగా విహరించు. ఈశ్వరుని కాలి గోళ్ళ కాంతులు ఈశ్వరుని పాదాలను ధగధగ లాడిస్తున్నాయి. ఆపాదం మేడ అనుకుంటే , శివుని గోటి కాంతులే ఆ మేడలో వేల దీపాల కాంతులై , వెలుగులను వెదజల్లుతూ ఉంటాయి. శివుని జటాజూటంలో ఉన్న చంద్రుని నుండి అమృతము స్రవించి , మెల్లగా వచ్చి ఆ పాదాలను కడుగుతుంది. ఆ కాంతులు ఆ భవనానికి పూసిన తెల్లని సున్నపు పూత కాంతులుగా నున్నవి. స్వామి పాదాలు పద్మరాగ కాంతులతో ౘూడ ముచ్చటగా ఉన్నాయి.* *అందువల్ల ఆభవనం పద్మరాగమణులు గూర్చిన వైభవాలతో ప్రకాశిస్తోంది. స్వామి పాద సన్నిధిలో , హంసమంత్ర జప పరాయణులెందరో ఉన్నారు. వాళ్ళు నీతోడి హంసలవలె ఉంటారు .అక్కడ భక్తి వధువులు , ఎందరో ఉన్నారు. వారు నీకు ప్రియురాండ్రై, నీ హృదయానికి ఆనందాన్ని సమకూరుస్తారు.*
*కాబట్టి ಓమనసా! నీవు ఆ సుందర శివపాద దివ్య భవనంలో ప్రవేశించు. నీవు ఆ భగవంతుని పాదాలనాశ్రయించి వాటిని భక్తితో సేవిస్తూ పరమ సుఖాన్ని హాయిగా అనుభవించు.*
*మనం మనకు బాగా ఇష్టమైన వ్యక్తుల వద్ద ఉంటే మనకెంతో సుఖంగా ఉంటుంది కదా! అటువంటిది , నీవు భగవంతుని పాద సన్నిధి లోనే ఉంటే , ఇంకా ఎంత సుఖంగా ఉంటుందో ఆలోచించుకో.*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి