25, మార్చి 2025, మంగళవారం

చెప్పదలచుకున్న అంశం

 పి.వి  నరసింహారావు గారు పి.ఏం  గా  ఉన్నప్పుడు అటల్ బిహారి వాజపేయి గారిని India representative గా UNO కి పంపడం జరిగింది. UNO లో కాశ్మీర్  issue గురించి hot డిస్కషన్స్ జరుగుతున్నాయి . వాజపేయి  గారు తన ఉపన్యాసం ఇలా ప్రారంభించారు . 

నా అభిప్రాయలు చెప్పడానికి ముందు మీకు చిన్న స్టోరీ చెప్తాను అన్నారు.  చాలా కాలానికి ముందు కశ్యప్ అనే ఒక ఋషి (saint)ఉండేవాడు. ఆయన పేరు మీదనే ప్రస్తుత kashmir కి ఆ పేరు వచ్చింది.  కశ్యప్ దట్టమైన అడవి దారిలో వెళ్తూ ఒక అందమైన  సరస్సు చూసాడు. అక్కడ స్నానం చేద్దామని నిర్ణయించుకొని బట్టలు తీసి ఒడ్డున  పెట్టి సరస్సులోకి దిగాడు. స్నానం చేసి ఒడ్డుకొచ్చేసరికి ఒక పాకిస్తానీ తన దుస్తులు అపహరించారని గ్రహించాడు.


ఇలా  చెప్పుకుపోతూ ఉండగా సభలో నుండి ఒక పాకిస్తానీ లేచి objection  raise చేశాడు.  ఋషి కశ్యప్ కాలంలో అసలు పాకిస్తాన్ లేనేలేదు,  అలాంటప్పుడు పాకిస్తానీ, ఋషి యొక్క బట్టలెలా అపహరిస్తాడు అని చెప్పి  వాజపేయి మీద  కేకలు వేసాడు.  అపుడు వాజపేయి  నవ్వుతూ "నేను UNO కి చెప్పదలచుకున్న అంశం పూర్తి అయింది. అప్పుడు పాకిస్తాన్ లేనేలేదు అంటున్నారు, మరి ఇప్పుడు kashmir,  pakistan కి చెందినది  అంటున్నారు" అని అన్నారు.  సభలో వాళ్లంతా తమ కరతాళధ్వనులతో జయజయ  నినాదాలు చేసారు.

కామెంట్‌లు లేవు: