25, మార్చి 2025, మంగళవారం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: శ్రీ భగవానువాచ


యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః 

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే (21)


న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన 

నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి (22)


పార్థా..

ఉత్తముడు చేసిన పనినే ఇతరులు కూడా అనుకరిస్తారు. అతను నెలకొల్పిన ప్రమాణాలనే లోకం అనుసరిస్తుంది. ముల్లోకాలలోనూ నేను చేయవలసిన పని ఏమీ లేదు. నాకు లేనిదికాని, కావలసింది కాని ఏమీ లేకపోయినప్పటికీ లోకవ్యవహారాలు నిత్యమూ నిర్వర్తిస్తూనే వున్నాను.

కామెంట్‌లు లేవు: