2, మే 2021, ఆదివారం

Human system is

 Human system is divided in three divisions as per sastras:

1. స్థూల శరీరము.

2. లింగ శరీరము.

3. సూక్ష్మ శరీరము.


స్థూల శరీరము; బాహ్యముగా వ్యక్తం అయే శరీర భాగాలు.( గూడు)


లింగ శరీరము: వ్యక్త భాగాలను ప్రభావితంచేసే అవ్యక్థభాగములు.

మనస్సు,అహంకారము, బుద్ధి, చిత్తము, పంచ ప్రాణములు.


సూక్ష్మ శరీరము: చైతన్యశక్తి.


స్థూల శరీరము, లింగ శరీరము

ఒకటితొ ఇకొంకటివల్ల ప్రభావితము 

జరుగుతుంది. కాని ఈ రెండూ 

సూక్ష్మ శరీరమును ప్రభావితము

చేయలేవు.


గూడు పాడైపోయాక చివరిగా పంచప్రాణాలు సూక్ష్మ శరీరమును

పల్లకీబోయలా వ్యహరించి పునర్జన్మ ఉంటే ఇంకొక గర్భంలోకి

ప్రవేశిస్తుంది. మోక్షం ఉంటే పంచప్రాణాలు వాయువులొకలసి

సూక్ష్మ శరీరము పరమాత్మ కుక్షిలోకి వెళ్లి పునర్జన్మ ఉండదు. ఓం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*ఆశ్రమ వాసానికి సన్నాహాలు..*


*(పదిహేనవ రోజు)*


శ్రీ స్వామివారు ఆశ్రమవాసానికి సన్నద్ధులవుతున్నారనివతెలుసుకున్నాము.. శ్రీధరరావు, ప్రభావతి గార్ల మనసులో ఇంకా సందేహాలు తొలగిపోలేదు..శ్రీధరరావు గారు మాలకొండకు తరచూ వెళుతూనే వున్నా..ప్రభావతి గారు మాత్రం ఆయనతో కలిసి ఇంతకుముందులా మాలకొండకు వెళ్లడం లేదు..


ప్రభావతి గారి మనసులో "ఇద్దరమూ వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుంటే..ఆయన ఆశ్రమం కోసం స్థలం కావాలని పట్టుబడతాడేమో.. తప్పించుకోలేక స్థలం విషయం లో వాగ్దానం చేసి.. స్థలం ఆయనకు ధారపోస్తే..ఆయన ఇక సాధారణ జీవనానికి అలవాటు పడి..ఇప్పుడున్న ఉన్నత స్థితి నుంచి దిగజారి పోతాడేమో..మాలకొండ మీదున్న ఆ పార్వతీదేవి మఠాన్ని బాగుచేయించి ఇద్దామంటే..ఆ పని పెట్టుకోవద్దని చెపుతున్నాడు..ఈ సంకట స్థితి నుంచి బయటపడేదెలా?.." అని సవాలక్ష ఆలోచనలతో సతమతం అవుతున్నారు..శ్రీధరరావు గారు కూడా ఎటూ తేల్చుకోలేక వున్నారు..


ఈలోపల, కందుకూరు రచయితల సంఘం వారి ఆధ్వర్యం లో మాలకొండ మీద ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు..ఆ సంఘానికి శ్రీధరరావు గారే ప్రెసిడెంట్..వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ రేవూరి అనంత పద్మనాభరావుగారు (కవి, పండితులు, అష్టావధాని.. కడప ఆకాశవాణి కేంద్రానికి డైరెక్టర్ గా పనిచేసి, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు..) వుండేవారు..ప్రఖ్యాత సంస్కృత పండితులు శ్రీ విక్రాల శేషాచార్యులు గారిని, వారి ధర్మపత్ని శ్రీదేవమ్మ గార్లను సన్మానించాలని తీర్మానం చేసి, ఆ వృద్ధ దంపతులను మాలకొండకు తీసుకొచ్చారు..వారిని ఘనంగా సన్మానించిన తరువాత, భక్తి పూర్వకంగా..ప్రభావతి శ్రీధరరావు గార్లు, శ్రీ శేషాచార్యులు శ్రీదేవమ్మ గార్ల కాళ్లకు నమస్కారం చేశారు..శ్రీదేవమ్మ గారు నిండుమనసుతో.."శ్రీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు!.." అని దీవించారు..శ్రీధరరావు దంపతులు..అక్కడున్న మిగిలిన సభికులు..కవులు, రచయితలు, పండితులూ..దేవాలయ సిబ్బంది అందరూ ఆశ్చర్యపోయారు..కారణం..శ్రీధరరావు ప్రభావతి గార్లకు ముగ్గురు పిల్లలు..హైస్కూల్ చదువుల్లో వున్నారు..పైగా ఆవిడ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు..ఈ మహాసాధ్వి..కొండంత మాలకొండ స్వామి సన్నిధిలో నిండుమనసుతో పెద్దగా దీవించింది..


శ్రీధరరావు, ప్రభావతి గార్ల ముఖాముఖాలు చూసుకోవడం..ఇతరులు కూడా ఆశ్చర్యంగా చూడటం గమనించిన శ్రీదేవమ్మ గారు, ప్రభావతి గారిని ప్రక్కకు పిలచి.."అమ్మాయీ..నా దీవెనలో ఏమన్నా పొరపాటు ఉందా తల్లీ?..నాకెలగూ సంతాన యోగం లేదు..మీకు కూడా పిల్లలు లేరేమోనని భావించి, అలా దీవించాను.." అన్నారు..ప్రభావతి గారు ఆవిడకు విషయమంతా చెప్పి.."ఆ మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో మీరు దీవించారు..మీ వాక్కు వృధా పోదు.. ఆ స్వామి లీల ఎలా వుందో?..ఎలా మలిస్తే అలా జరుగుతుంది.." అన్నారు..ఆ తరువాత ప్రభావతి శ్రీధరరావు గార్లు వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టించి..సగౌరవంగా సాగనంపి..శ్రీ స్వామివారి దర్శనం కొరకు పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లారు..


అంతకుముందు రోజు..శ్రీధరరావు గారి అన్నయ్య గారు, కూతురు కుమారి చెప్పిన ఉదంతం అంతా విని, శ్రీ స్వామివారికి ఒక జింక చర్మాన్ని పంపారు..అలాగే ప్రభావతి గారి నాన్నగారు కూడా వచ్చి వున్నారు..వారిని కూడా తోడ్కొని.. జింక చర్మాన్ని తీసుకొని శ్రీ స్వామివారి వద్దకు చేరారు..శ్రీ స్వామివారు ప్రశాంతంగా పార్వతీదేవి పాదాల వద్ద కూర్చుని వున్నారు..వీళ్ళను చూడగానే..దగ్గరకు వచ్చి, ప్రభావతి గారి నాన్న గారిని ఎంతో ఆప్యాయంగా పలకరించి.."మీరు నమ్మిన వైష్ణవ భక్తి నే కొనసాగించండి.." అని చెప్పారు..


అంత ప్రశాంతంగా ఉన్న స్వామివారు హఠాత్తుగా శ్రీధరరావు గారి దంపతుల వైపు తిరిగి..తీక్షణంగా చూస్తూ.."మీకు నేను ఇంతకుముందే చెప్పివున్నాను శ్రీధరరావు గారూ..ఈ అమ్మవారి ఆలయానికి మరమ్మత్తులు చేసి, సహజంగా రాతిలో ఏర్పడ్డ ఈ మందిరానికి హంగులు ఏర్పరచి..ఉన్న పవిత్రత పోగొట్టకండి..నాకు వచ్చింది దైవాజ్ఞ!..దానిని నేను అతిక్రమించలేను..మీరు లేనిపోని శంకలు పెట్టుకోకుండా స్థల నిర్ణయం చేయండి..మీకు మేలు జరుగుతుంది.." అన్నారు..సాక్షాత్తూ ఆ లక్ష్మీ నృసింహుడే కోపంతో ఆజ్ఞాపించినట్లు ఇద్దరూ అనుభూతి చెందారు..వారి మనసులోని భయాలన్నీ ఆ నిమిషంలోనే తొలగిపోయాయి..


"సరే స్వామీ..మా పొలమే రెండు ప్రదేశాలలో ఉన్నది..మీరు వచ్చి చూసి, ఏది కావాలో నిర్ణయిస్తే..దానినే మీరు కోరుకున్నంత ఇస్తాము..మీ తపోసాధనకు మా వంతు సహకారం అందించి, మా జీవితాలు ధన్యం చేసుకుంటాము.." అన్నారు శ్రీధరరావు గారు..


శ్రీ స్వామివారు చేయెత్తి ఆశీర్వదించారు..తిరిగి మొగలిచెర్లకు ఆ దంపతులు చేరారు..విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదమూ.. శ్రీ స్వామివారి ఆజ్ఞ..రెండూ ఆ దంపతుల మదిలో సుడులు తిరుగుతూనే ఉన్నాయి..


ఆశ్రమ స్థల నిర్ణయం...రేపు.. 


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

పూజల్లో దోషాలు

 పూజల్లో దోషాలు వస్తుంటాయి. అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే


ఒక ముసలి భిక్షువు 

శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూండేది.


ఒక రోజు ఓ యోగిపుంగవుడు శివదర్శనం చేసుకుని వెడుతూంటే, ఆ వృద్ధురాలు ఆయన పాదలమీద పడి " అయ్యా ! నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది. నాకేదైనా మంత్రమో, పద్యమో చెప్పండి. ఇఖ బతికి ఉన్న నాలుగురోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బతుకుతాను " అని ప్రాధేయపడింది.


ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు.


"తవ పాదే మమ శిర: ధారయతాం ! దేహిమే ముక్తి శివా ! " అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు.


ఆమె అది విని ఆనంద పడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది.


అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలయింది. అలాగే ఆ శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ గడుపుతోంది.


తిరిగి ఆ యోగి పుంగవుడు శివ దర్శనం చేసుకుని, ఈమెను గుర్తుపట్టి, " ఏమి అవ్వా! నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా ? "అనడిగాడు.


ఆమె ఆయనకు నమస్కరించి " అయ్యా ! అదీ మరువలేదు. తమరిని మరువలేదు " అన్నది.


" ఏదీ చెప్పిన పాఠం అప్పజెప్పు " అని నవ్వుతూ అడిగాడు.


ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పజెప్పింది.


" అవ్వా ! తప్పు చదువుతున్నావు ! నేను స్వామి పాదాల మీద నీ శిరసు పెట్టమంటే, నువ్వు స్వామి శిరసు మీద నీ పాదాలు పెట్టావు ! నీ ఇన్నేళ్ళ ధ్యానం వ్యర్ధం అయ్యింది " అని కోపంతో వెళ్ళిపోయాడు.


ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ " తవ, మమ " అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతోంది.


ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ, అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ళ శ్రమ వ్యర్ధం అయ్యింది అని రోజుల తరబడి బాధపడసాగింది.


ఓ  రాత్రి మన స్వామి ఆ యోగిపుంగవుని కలలో కనబడి " ఏం పని చేశావయ్యా ! నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. నేను శ్రద్ధాభక్తులకు వశుడను కానీ, భాషకు కాదయ్యా ! ముందు ఆమె బాధపోగొట్టి, ఆమె అహారం తీసుకునేలా చెయ్యి" అని ఆయనను హెచ్చరిక చేశాడు.


ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి, శివాలయం దగ్గరకు పరుగుపరుగున వెళ్ళి, ఆ వృద్ధురాలి పాదముల మీద పడి


" అమ్మా ! నువ్వు చేసే పూజే స్వామి కి నచ్చింది. నన్ను క్షమించి ఆహారం స్వీకరించు " అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు.


కాబట్టి మనం తెలుసుకోవలసింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ, భాషకు కాదని తెలుసుకోవాలి.


మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము. పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. పూజల్లో దోషాలు వస్తుంటాయి. అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే.

1, మే 2021, శనివారం

తెలుసా

 🙏


💐ని బలం ఎంతో తెలుసా💪


తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది. చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది. కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు ఆ తామర రేకలను ముడుచుకుంటాయి. అయ్యో నన్ను ఏదో  

బంధించేసింది అని చెప్పేసి ఆ తామర

రేకల్లోనే ఇరుక్కుని చనిపోతుంది

అయితే మహా మహా వృక్షాలకు రంద్రం చేయగలిగిన దాని సామర్థ్యం ఆ తామర రేెకులను తొలచలేదా? ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా? గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవడమో, మకరందం గ్రోలే మత్తులోనో... లేక నన్నేదో బంధించింది అన్న భావననో దాని శక్తిని బలహీన పర్చింది. ఆ భావనను నమ్మడమే దాని బలహీనత. నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న దాన్ని నమ్మింది... అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది.


మన జీవితంలో వచ్చే సమస్యలూ అంతే,

సమస్య బలమైంది కాదు.. మనశక్తిని మనం మర్చిపోవడమే దాని బలం అదే బలహీనత. మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే, గుర్తించడమే, నమ్మడమే దాని బలం.


"కరోనా మహమ్మారి" అనేది కూడా నీ శక్తి

కంటే బలమైంది కాదు...

దాని బలం తామర రేకు అంత...

నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంత...

తెలుసుకో అదే..జీవిత సత్యం..


        *ధైర్యం గా ఉండండి*

        *కరోనాని జయించండి*

                        💐

యధార్ధ సంఘటన

 యధార్ధ సంఘటన 


అది 1970 వ సంవత్సరం. తిరువనంతపురం ( నేటి త్రివేడ్రం) సముద్రపు ఒడ్డున ఒక పెద్దమనిషి భగవద్గీత పఠనములో ఉన్నాడు. అక్కడికి ఒక నాస్తికుడైన ఒక కుర్రవాడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు. 


ఆ కుర్రాడు ఈ పెద్దమనిషినితో  " ఈకాలంలో కూడా  ఇలాంటి పుస్తకాలు చదవడం వలన , మీరంతా  మూర్ఖులుగా మిగులుతున్నారు.  మాకు సిగ్గుగా ఉన్నది" అని రెచ్చగొడుతూ మాట్లాడము మొదలుపెట్టాడు.  


  పైగా " మీరే కనుక ఇలాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు పుస్తకాలు చదువుతూంటే, మనదేశం ఈపాటికి చాలా అభివృద్ధి సాధించి ఉండేది " అని ఆవేశంతో అన్నాడు. 


ఆ పెద్దమనిషి ఆ కుర్రవాని పరిచయం అడిగాడు.  అప్పుడా కుర్రవాడు " నేనొక కలకత్తానుండి వచ్చిన  సైన్స్ పట్టభద్రుడిని. ఇక్కడ భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్లో పనిచేయటానికి వచ్చాను " అని గర్వంగా చెప్పాడు. 


  " మీరు వెళ్ళి ఈ భగవద్గీత లాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు మీద పుస్తకాలు చదవమని, ఇలాంటి పుస్తకాలు చదవడం వలన జీవితంలో సాధించేది ఏదీ ఉండదని "  ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. 


ఆ పెద్దమనిషి నవ్వి, అక్కడనుండి వెళ్ళడానికి ఉపక్రమించాడు. ఆయన అలా లేవగానే నలుగురు రక్షక దళ భటులు ఆయనను చుట్టుముట్టి, ఆయనకు రక్షణగా నిలబడ్డారు. ఆయన కోసం ఒక అధికార  ఎర్రబుగ్గ కారు వచ్చింది. ఇదంతా చూసి, ఆ కుర్రవాడు భయపడి, ఆ పెద్దమనిషిని " మీరెవరూ " అనడిగాడు. ఆ పెద్దమనిషి తనపేరు " విక్రం సారాభాయి" చెప్పాడు. అంటే, అప్పటికి ఆ కుర్రవానికి తను  పనిచేయబోయే సంస్థకు ఆయన చైర్మన్ అని అర్ధం అయ్యింది. 


 ఆ సమయానికి భారతదేశంలో 13 రీసెర్చ్ సంస్థలు, విక్రం సారాభాయి పేరుమీద నడుస్తున్నాయి. అణువిజ్జాన  పధకాలు రచించే సంస్థకు ఆయన అధిపతి. ఆయనను ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా దానికి నియమించింది. 


   అప్పుడు ఆ కుర్రవాడు వలవలా ఏడుస్తూ, ఆయన కాళ్ళమీద పడ్డాడు. అప్పుడు కీ.శే. విక్రం సారాభాయి చెప్పిన గొప్ప విషయం ఇది. 


    " ఈ విశ్వంలో ప్రతి వస్తువు పరమాత్మచే సృష్టించబడినదే. అది పురాణకాలం కావచ్చును.  మహాభారత సమయం కావచ్చు. ప్రస్తుత సమయం కావచ్చును. మిత్రమా !! దైవాన్ని ఎప్పుడూ మరువకు. "  అని బోధించాడు.   


ఇప్పటి నాస్తికులు  ప్రతిదీ హేతువాదం ,   అంటూ డాంబికముగా కరాళ  నృత్యాలు చేయవచ్చును. కానీ  సైన్సును అభివృద్ది చేసినది మటుకు ఆస్తికులే అని చరిత్ర చెపుతోంది.  దైవం నిత్య సత్యం. భగవద్గీత ఒక అమోఘమైన విజ్జాన శాస్త్రము. దానిని ఎవరూ తప్పుబట్టలేరు. దానిలో చెప్పినది ఆచరించి ప్రపంచంలో ఎందరో లాభము పొందుతున్నారు. ప్రపంచములో ఉన్న సమస్యల కన్నిటికీ భగవద్గీతలో పరిష్కారాలున్నాయి. 


శ్రీమత్భగవద్గీత  సకలశాస్త్ర సారం ! 


శ్రీ కృష్ణం వందే జగద్గురుం !!

చర్మవ్యాధుల గురించి

 చర్మవ్యాధుల గురించి సంపూర్ణ వివరణ  - 


 చర్మవ్యాధులు రావడానికి గల కారణాలు  - 


  *  విరుద్ధములగు అన్నపానములు తినటం అనగా పాలతో తయారైన సేమ్యా , కోవా , ఐస్ క్రీం తిని పెరుగన్నం తినటం లేదా చల్లని కూల్ డ్రింక్ ని  వేడిఅన్నం , కూరలు కలిపి తినటం ఇలాంటి ఆహారపు అలవాట్లు పాటించటం . 


 *  మలమూత్రాలను ఆపడం , అదేవిధముగా వాంతి వంటి సహజ వేగాలను బలవంతముగా నిరోధించడం . 


 *  భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయుట , ఎండలో తిరుగుట చేయరాదు . 


 *  ఎండలో తిరిగి వచ్చి చల్లని నీరు తాగరాదు . 


 *  అతిగా శ్రమపడి వచ్చి వెంటనే నీటిని సేవించరాదు . 


 *  అజీర్ణముగా ఉండగా మరలా భుజించరాదు . అనగా ముందు తిన్నది సంపూర్ణముగా అరగక ముందు మరలా భోజనం చేయరాదు . 


 *  కొత్తబియ్యపు అన్నం , పెరుగు మరియు చేపలు కలిపి తినరాదు . 


 *  అధికంగా పులుపు , ఉప్పు తినరాదు . 


 *  మినుములు , ముల్లంగితో చేయబడిన వంటలు , పాలు నువ్వులతో చేసిన వంటలు ఎక్కువుగా తీసుకొనుట 


 *  తినిన ఆహారం జీర్ణం కాకముందే దాంపత్యములో పాల్గొనుట చేయరాదు . 


 *  పగలు నిద్రించరాదు . పగలు నిద్రించుట వలన శరీరం నందు శ్లేష్మము పెరిగి దానివలన రక్తప్రసరణకు అవరోధము కలిగి చర్మమునకు రక్తప్రసరణ సరిగ్గా జరగక చర్మవ్యాధులు సంభవించును . ఎండాకాలం కొంచంసేపు పగలు నిద్రించవచ్చు . 


        పైన చెప్పినవిధముగా విరుద్ధమైన ఆహారం , పనులు చేయుటవలన శరీరంలో చర్మము , రక్తము , మాంసము , లింప్ గ్రంథులు దోషమును పొంది రకరకాల చర్మవ్యాధులు కలుగును. 


  చర్మవ్యాధులు రావడానికి పూర్వము కనిపించు లక్షణములు  - 


 *  స్పర్శజ్ఞానం క్రమేపి తగ్గిపోవుట . 


 *  చెమట ఎక్కువుగా పట్టుట లేదా చర్మవ్యాధి ప్రదేశము నందు అసలు చెమట పట్టకపోవును . 


 *  శరీరవర్ణము మారి నల్లబారిపోవుట . 


 *  దద్దుర్లు . 


 *  పోట్లు . 


 *  అలసట , వడలినట్లు అగుట. 


 *  వ్రణములు లేచి అధికభాధతో కూడి శీఘ్రముగా  

      జనించి త్వరగా మానకుండా ఉండటం. 


 *  తాపము ( చర్మం అంతా మంటలు ) . 


  అసాధ్య చర్మవ్యాధి లక్షణములు  - 


 *  రోగి బలహీనుడుగా ఉండి దప్పిక , మంట ,   అగ్నిమాంద్యములతో కూడి క్రిములు ఏర్పడిన అసాధ్యము . 


 *  చర్మవ్యాధి ఏర్పడి 10 సంవత్సరాలు దాటిన     

      అసాధ్యము . 


  చర్మవ్యాధుల యందు చికిత్సాక్రమము  - 


        శరీరము నందలి వ్యర్ధపదార్ధముల వలన చర్మవ్యాధులు వచ్చును . కాబట్టి వానిని వివిధరకాల పద్ధతుల ద్వారా వాంతి , విరేచనం మొదలగు శోధన పద్ధతులను ఉపయోగించి వ్యర్ధాలను బయటకి పంపుతూ ఔషధాలను ఇయ్యవలెను . 


  చర్మవ్యాధుల యందు పథ్యము  - 


  *  తేలికగా అరిగెడి ఆహారం తీసికొనవలెను . 


  *  త్రిఫలములు - ఉశిరి , కరక్కాయ , తానికాయ 

       విరివిగా వాడవలెను . 

  

  *  త్రిఫలా ఘృతము కూడా వాడవచ్చు . 


  *  పాతధాన్యములు వాడవలెను . 


  *  యవలు , చామలు , కొర్రలు , కందికట్టు , పెసర 

       కట్టు , మేకమాంసం వాడవలెను . 


  *  బీరకాయ , పొట్లకాయ , దోసకాయ , పెరుగు 

      తోటకూర , పొన్నగంటికూర , మెంతికూర , ఆవు 

       నెయ్యి , తెల్ల గలిజేరుకూర , తేనె , నీరుల్లి . 


           పైన చెప్పిన పదార్ధాలు ఆహారంలో తప్పక భాగం చేసుకొనవలెను . 


  చర్మవ్యాధుల యందు అపథ్యము  - 


 *  చింతపండు పులుపు , అతిగా కారం , ఆవాలు , 

      గుమ్మడి , వెల్లుల్లి , పెరుగు , పాలు . 


 *  బెల్లం , కల్లు , సారాయి , నువ్వులు .


 *  మినుములు , చెరుకురసము , పానకము .


 *  చేపలు , నీటిపక్షులు , కోడి మాంసం , పావురం .


 *  అతిగా వ్యాయామం , స్త్రీసంభోగం చేయరాదు .  


          పైన చెప్పినవిధముగా ఆహారపు అలవాట్లు పాటిస్తూ సరైన వైద్యుడి పర్యవేక్షణలో ఔషధాలు సేవించుచున్న చర్మవ్యాధుల నుంచి త్వరగా బయటపడగలరు. ఇక్కడ మనం ముఖ్యముగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయము ఏమిటంటే వ్యాధి సంప్రాప్తినిచ్చిన తరువాత ఔషధాలు సేవించుట కంటే వ్యాధి రాకుండా చూసుకోవడమే అత్యంత ప్రధానమైనది. 


    


          మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

అంతర్ కాంతి

 అంతర్ కాంతి   శీర్షిక                                        సందర్భం..మేడే..

రచన రవికుమార్

బిడియల్


ఉదయమెప్పుడు                           మార్గనిర్దేశం..

అంతర్గత చీకట్లు తొలిచే కాంతి కేతనం..

గత భావాల   సంభావ్యతల అన్వేషించి ఎర్రని పాదాలఫై సరిహద్దులు లేని ప్రపంచం లోనికి అడుగులువేద్దాం..


భూమి తనచుట్టుతానుతిరుగుతూ డాలర్ చుట్టు తిరుగాడే..

సంపదే ప్రాధాన్యలో

సంస్కరణ సూర్యోదయ నీరీక్షణ..


భావదాస్యాల ఉగ్రభూతాల

మారణహోమంలో..

జీసస్ పరిశుధ్ద సోత్రాలు..

రాముని రాతి శిల్పాలతో ప్రార్ధనలు..

అల్లా అపరప్రేమఆలాపల్లో 

కుభేరవైభవం ప్రక్కన కుచేల నాగరికత ప్రగతి..


సమైక్య జీవనం..వాట్సాఫ్

ఫేస్ బుక్ సందేశాల్లో..

కాల పురుగుల ఫబ్ జీగేమ్

కార్పొరేట్ మొసలి ధనార్జన

చదువులు సంక్షోబాలు

రక్షణరాజకీయాల ..

గ్లోబలీకరణ భావకాలుష్యకాసారాల్లో..

మైళ్లదూరం మనుషులు

దగ్గరవుతూ..

మనసులు సమాచార కల్పనలో.. విసంగజీవులవుతూ

టెక్నాలజీ వ్యక్తి కేంద్ర విలాసాలకు.. పునరాతిజననం..


జన్మిస్తూనే తనకుతాను కోల్పోవడం..

మేడే స్ఫూర్తితో నేడే సంఘటిత మవుదాం..

కుంకుమ రేకుల కాంతుల

మనలో నింపుకొని పయణమవుదాం..

శ్రీ శ్రీ జయంతి

 *నా అభిమాన కవిదిగ్గజం మహాకవి శ్రీ శ్రీ జయంతి సందర్భంగా...*


కరోన రోగపు

కరాళనృత్యం

కన్నుల ముందర 

కథకళి చేస్తూ

కర్కషరోగపు 

కబంధ హస్తం

కన్నూమిన్నూ

ఎరుగని జనులను

కబళించేస్తూ..

కాటికి తోస్తూ..

కాలచరిత్రను 

ఖననం చేస్తూ

మహామహులకే

మరణాన్నిస్తూ

ధరాతలమ్మున

సర్వవ్యాప్తమై

మానవజాతిని 

అగ్నిశిఖలకై

ఆహుతినిస్తూ..

ఆజ్యం పోస్తూ...

మృత్యుఘంటికల

మ్రోగించేస్తూ...

ఇలాతలంలో

జనావళంతా

ప్రమోదకాంక్షల

పరాకాష్టకై

ప్రమాదరేఖల

పరిధిని దాటి

భయకంపితులై

భయవిహ్వలులై

పరుగులు పరుగులు

పరుగులు తీస్తే.....

మనిషికి స్వాంతన

ఎక్కడ?ఎక్కడ??????




*....బోర్పట్ల విరాట్ స్వరూపాచార్య సిద్ధాంతి*

ఏకం సత్.

 ఏకం సత్. ఉన్నది వకటే అన్నప్పుడు యీ విశ్వంలో పదార్ధం లేక శక్తిని లేక అయస్కాంత చలన శక్తియా? దీనిని లెక్కింప  శక్తి కొలమానం అశ్వ చలన శక్తి యని. అయిన సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఏక చక్ర రధం రూఢం సూర్యశక్తియని తెలియుచున్నది. ఏక చక్ర అనగా వకే వృత్తాకరంగా వున్న సమస్తం శక్తి రెండుగా రాహు కేతు తత్వ శక్తిగా మారి అపై ఐదు రంగులుగల  గాయత్రీ రంగులైన ముక్తా  విద్రుమ, హేమ నీల ధవళ రూపమై ఆపై గ్రహ శక్తి అది రూప గుణ లక్షణముగా మారు చున్నది. ఏడు రంగుల ఏడు గ్రహముల శక్తిగా మారు చున్నది. అది విబ్జాయర్ అని ఆధునికుల విషయం. సప్త సప్త మహా సప్త యని సప్త ద్వీప పరివృత్తమై యున్న శక్తిని కొలుచుట సాధ్యమా. పరిశీలన చేసిన అది అనంత మని పరిమాణ రూపం లేనిదని అదే వ్యాప్తంగా విషు విష్ణు  తత్వ మని తెలియుచున్నది. ఏడు గ్రహముల శక్తికి మూలం రాహు కేతు మూలమైన శక్తియే.మూల శక్తి లక్షణము తెలియుట అసాధ్యం. మహా సౌర నిర్ణయం కూడా రాహువు తత్వం తెలియక కేతు తత్వమే మూలమని భాసయత్ ప్రకాశించిన తరువాతనే తెలిసినది. అదియును అసంపూర్ణమే.ప్రకాశవంతవంతమైన తరువాతనే పదార్ధరూపం. జీవునికి చైతన్యరూప జీవునిగా దేహ సంబంధమైనదని  తెలియుట వక్క మానవునికే తప్ప యితర జీవ జాలము లకు తెలియదు. అదియే ప్ర ఙ్ఞానమని తెలియును. ఉత్తమమైనది మానవ జన్మయే. మరలా అది వచ్చునో రాదో.వచ్చినా పురుషుడు పురుషుడుగా వచ్చుట అసంభవం స్ర్రీ స్త్రీగా వచ్చుట కూడా అసంభవం. దీనికి సాధనయే మూలం. అసలు జీవుడుగా ధరించకుండుటకు సాధన తప్ప వేరు మార్గం లేదు. తస్మాత్ జాగృత జాగ్రతః ఎల్లప్పుడు జాగ్రత్తగా వుండుట కుదరదు. మాయవలన. మాయనుండి వచ్చుటవలన మాయ గానే వెడలుట సృష్టి ధర్మం. దీనికి అతీతముగా వెడలుటయే మెూక్షమని, తిరిగి రాకుండుటయే యని తెలియుట. దీనినే పునరావృత్తి రహితయని లలితా సహస్రం తెలుపు చున్నది. తెలుసుకుంటూ నే వుందాం. ఆచరిస్తూ నే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*శ్రీ స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు..*


*(పదునాలుగవ రోజు)*


శ్రీ స్వామివారు ఏర్పేడు వ్యాసాశ్రమంలో చేరి, కొంతకాలం సాధన చేసిన అనంతరం, చిత్తూరు జిల్లాలోని పాపానాయుడుపేట గ్రామంలో "బాలబ్రహ్మం" గారి వద్ద ఉపదేశం పొంది..తిరిగి స్వగ్రామం  ఎర్రబల్లె చేరారు..అక్కడనుంచి మాలకొండ కు వెళ్లి, అక్కడ తన తపోసాధన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు..


శ్రీ స్వామివారి తల్లి, సోదరులు అప్పటికే మానసికంగా సిద్ధపడిపోయారు..తమ బిడ్డ ఇక ఏవిధంగానూ సాధారణ జీవనం గడిపే అవకాశం లేదని వారికి తేటతెల్లంగా అవగతం అయింది..మాలకొండ క్షేత్రం తమ గ్రామం నుంచి రమారమి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది..శ్రీ స్వామివారు సాధన చేసుకుంటున్నప్పుడు ఆహారం మితంగా తీసుకునేవారు..కేవలం కొద్దిగా బియ్యం, అందులో కొద్దిగా పెసరపప్పు కలిపి ఉడికించుకొని దానినే ఆహారంగా స్వీకరించేవారు..అదికూడా తాను సాధన నుంచి లేచిన తరువాతే..శ్రీ స్వామివారు ఆహారం తిన్నా..తినకుండా వున్నా..తల్లి సోదరులు మాత్రం ఆయనకు అవసరమైన బియ్యం, పెసరపప్పు ఇతర వెచ్చాలు మాలకొండకు చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు..అలా ఎన్నాళ్ళు జరగాలి అని వారు అనుకోలేదు..ఎంతకాలం పాటు శ్రీ స్వామివారు తపస్సు చేసుకుంటున్నా..అంతకాలం పాటు తాము ఈ ఆహారపదార్ధాలు సమకూర్చాలని నిశ్చయం చేసుకున్నారు..


ఇక..క్రమం తప్పకుండా శ్రీ స్వామివారికి చేర్చే బాధ్యత ఎవరు తీసుకోవాలి?..ఒకరోజుతో తీరిపోయే విషయం కాదు..ఎంతకాలం అని ఎవరూ నిశ్చయంగా తేల్చి చెప్పలేరు..కానీ అక్కడ ఆయన తపోసాధన లో వున్నంతకాలం..తాము ఇక్కడనుండి పంపాలి..ఎలా?..ఆరోజుల్లో బస్సు సౌకర్యం కూడా లేదు..సైకిల్ మీద..తప్పిందా..ఇక కాలి నడకే..ఎర్రబల్లె నుంచి, వెలిగండ్ల గ్రామం మీదుగా మన్నేరు నది దాటి..మొగలిచెర్ల గ్రామం మీదుగా మాలకొండ చేరాలి..


శ్రీరాముడు వనవాసం చేయాలని నిర్ణయం తీసుకోగానే..సీతాదేవి కూడా నారవస్త్రాలు ధరించి ఆయనను అనుగమించింది..ఆ దంపతులు ఇద్దరూ గుమ్మం దగ్గరకు వచ్చేసరికి, లక్ష్మణుడు కూడా నారవస్త్రాలు ధరించి వారితో కలిసి వనవాసానికి బైలుదేరాడు..రాముడు వారించినా...అన్నగారి సేవే పరమార్ధం అని చెప్పాడు..ఆవిధంగానే నడచుకున్నాడు.. అదే విధంగా..శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్య కూడా..తల్లికి సోదరులకు అభయం ఇచ్చాడు.."అన్నయ్య కు వస్తువులు చేర్చే బాధ్యత నాది.." అప్పుడు పద్మయ్య వయసు కేవలం పదహారు మాత్రమే!..


ప్రతి ఇరవై రోజులకూ ఎర్రబల్లె లో బయలుదేరి మాలకొండ దాకా బియ్యం పప్పులు మోసుకుంటూ..(ఒక్కొక్కసారి సైకిల్ ఉండేది కాదు..కాలి నడకే శరణ్యం) వచ్చి, పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారి కోసం ఎదురుచూస్తూ వుండేవాడు..శ్రీ స్వామివారు సాధన పూర్తి చేసుకొని పద్మయ్య ను చూసి నవ్వేవారు..ఆ నవ్వు చూడగానే పద్మయ్యకు తాను అప్పటిదాకా పడిన శ్రమ అంతా ఎగిరిపోయేది..అతి కొద్దిసేపు మాత్రమే శ్రీ స్వామివారు పద్మయ్య తో గడిపేవారు..కానీ పద్మయ్యకు ఆ కొద్దిపాటి దర్శనమే కొండంత సంతోషాన్ని ఇచ్చేది..


ఒకరోజు..పద్మయ్య మాలకొండకు వచ్చి, శ్రీ స్వామివారి రాకకోసం పార్వతీదేవి మఠం వద్ద ఎదురుచూస్తూ వున్నాడు.. ఇంతలో శ్రీధరరావు గారు కూడా అక్కడికి వచ్చారు..ఇరవై ఏళ్లు కూడా లేని ఈ యువకుడెవరా అని శ్రీధరరావు గారు ఆలోచించి..ఆమాటే అడిగేశారు.. తాను ఫలానా అని, ఇలా స్వామివారికి తమ్ముణ్ణి అనీ..స్వామివారికి తమ ఇంటినుంచి వెచ్చాలు తీసుకొచ్చి ఇస్తూవుంటాననీ చెప్పాడు..శ్రీధరరావు గారు కూడా తనను పరిచయం చేసుకున్నారు..ఆనాటి నుండి..పద్మయ్య కు మొగలిచెర్ల గ్రామం లోని శ్రీధరరావు గారిల్లు ఒక మజిలీగా మారిపోయింది..ప్రభావతి గారు కూడా పద్మయ్య ను తమ బిడ్డల్లో ఒకరిగా ఆదరించారు..


పద్మయ్య ది నిస్వార్థ సేవ..శ్రీ స్వామివారిని అన్నయ్య గా కాదు..సాక్షాత్ దైవస్వరూపంగానే కొలిచాడు.. శ్రీ స్వామివారు సిద్ధిపొంది నేటికి దాదాపుగా 42 ఏళ్ళు అవుతోంది..పద్మయ్యనాయుడి మదిలో నేటికీ అదే దైవభావం..


"నేనే కోరికలు కోరలేదు..కానీ ఈరోజు నేను ఈమాత్రపు స్థితిలో ఉన్నానంటే..ఆయన ఆశీర్వాదమే కారణం "అంటూ ఉంటారు..శ్రీ స్వామివారిని తలుచుకున్నప్పుడల్లా..పద్మయ్య భావోద్వేగానికి లోనవుతూ ఉంటాడు..శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి..అలాగే మహాశివరాత్రి నాడు జరిగే ఉత్సవానికి కుటుంబసమేతంగా మొగలిచెర్ల ఆశ్రమానికి క్రమం తప్పకుండా వచ్చి, శ్రీ స్వామివారి సమాధి వద్ద కొద్దిసేపు గడిపి వెళ్లడం పద్మయ్య పెట్టుకున్న నియమం..


శ్రీ స్వామివారి సేవలో ఆనాటి నుంచీ ఈ క్షణం వరకూ తరిస్తున్న  ధన్యజీవి పద్మయ్య నాయుడు..


శ్రీ స్వామివారి ఆశ్రమ సన్నాహాలు..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

సంతోషం

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*"మాస్క్"* పెట్టుకుంటున్నారు. *సంతోషం* 👌


బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా

 *"భౌతిక_దూరం"* పాటిస్తున్నారు. *సంతోషం*.. 👌


బలవర్ధకమైన " *ఆహారం* " తీసుకుంటున్నారు. *సంతోషం*.. 👌


*"ప్రాణాయామం"* లాటి యోగా క్రియలు చేస్తున్నారు. *సంతోషం*


చాలా *సంతోషం* .....


చాలామంచి పని చేస్తున్నారు.. *సంతోషం*...


🤗కానీ...

మీరు *"తెలుగు_TV_న్యూస్_చానళ్ళు"* కూడా చూస్తే, 


మీరు *పైన చెప్పినవెన్ని*  చేసినా ప్రయోజనం వుండదు......


చేసినవన్నీ *బూడిద* లో పోసినట్టే.....


ఎందుకంటే, మన *తెలుగు చానళ్ళ* ల్లో వచ్చే *కరోనా* వార్తలు చూడ్డం వలన......


వాళ్ళు చెప్పే మాటల వల్ల...


*"వంటింటి పోపు"* కు మీకు... దగ్గు  వచ్చినా.....


మీకు *"కరోనా"* వచ్చిందనే ఓ భయానికి లోనై.......


మానసికంగా బలహీనమై మీరు *"రోగానిరోధక శక్తి"* ని సర్వం కోల్పోయి, 


అప్పుడు నిజంగానే 'కరోనా' భారిన పడవచ్చు.....


*కనుక మొట్టమొదటగా తెలుగు TV వార్తా చానళ్లు చూడ్డం ఆపేయండి*.....


*మన తెలుగు TV వార్తా చానళ్ళు గనుక చూస్తే*, 


ఎక్కడో నట్టనడి సముద్రంలో ఓ ద్వీపంలో ఒక్కరే పూర్తి ఒంటరిగా పూర్తిగా మానవ సమాజానికి అత్యంత దూరంగా వున్నప్పటికీ, 

మీకు *'కరోనా'* సోకవచ్చు.....

*వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి.*....


హెచ్చరిక :  


*ప్రస్తుత సమయంలోనే కాదు*,


*ఎప్పుడు... ఎక్కడ తెలుగు TV చానళ్లు చూసిన ప్రమాదమే.*.....


విస్తృత *జనబాహుళ్యం* క్షేమం కోరి ఈ మాటలు చెప్పడమైనది...️✊️

30, ఏప్రిల్ 2021, శుక్రవారం

మన సిద్దాంతాలు

 మన సిద్దాంతాలు ...


⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️


*విశిష్టాద్వైతం:- దీనిని రామానుజాచార్యులు వారు ప్రవచించినారు.  ఈ సిద్ధాంతం ప్రకారం సృష్టి మొత్తం మూడే విస్తరించాయని ప్రతిపాదించినారు.  అవి జీవుడు వేరు, ప్రకృతి వేరు, పరమాత్మ వేరు అని.*


*ద్వైతం:-  దీనిని మధ్వాచార్యులు వారు ప్రవచించినారు.  వీరి ప్రకారం సృష్టిలో ఉన్నవి రెండే అని అవి జీవుడు మరియు పరమాత్మ అని వీరి సిద్ధాంతం.  ప్రకృతి అనునది జీవునిలో అంతార్భాగమేనని వీరి సిద్ధాంతం.*


*అద్వైతం:-  దీనిని ఆదిశంకరాచార్యులు వారు ప్రవచించినారు.  రెండు లేవు, ఉన్నది ఒకటేనని, ఆ ఒకటి ఆత్మ పదార్థం అని.  ఈ సృష్టి మొత్తం నిండి వున్నది ఆత్మ తప్ప మరేమి లేదు అని వీరి సిద్ధాంతం.*


*ఆది, అంతం లేనిదే 'వేదాంతం'.*


ఏ దారిలో వెళ్ళినా చేరుకునే. దేవుడు ఒక్కడే 🙏🏻🌷🙏🏻


⚜️⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️

_రాబోయే తరాలకు


ఎండమావులు


                                 *****


చిన్నప్పుడు

ఏ పండక్కో..పబ్బానికో

కొత్త గౌను కుట్టిస్తే..

ఎంత ఆనందమో...


ఎప్పుడు పండగ

వస్తుందా, ఎప్పుడు

వేసేసుకుందామా

అన్న ఆతృతే...


ఇంటికి చుట్టాలొచ్చి

వెళ్తో వెళ్తూ.. చేతిలో

రూపాయో... అర్ధ

రూపాయో పెడితే

ఎంత వెర్రి ఆనందమో...


చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే

దుఃఖం తన్నుకు వచ్చేది...

ఇంకా ఉంటే బాగుండు

అన్న ఆశ...

ఎంత ఆప్యాయతలో...


సినిమా వచ్చిన ఏ

పదిహేను రోజులకో

ఎంతో ప్లాన్ చేసి

ఇంట్లో ఒప్పించి

అందరం కలిసి

నడిచి వెళ్లి..

బెంచీ టికెట్

కొనుక్కుని  సినిమా

చూస్తే ఎంత ఆనందమో...


ఇంటికొచ్చాకా ఒక గంటవరకూ

ఆ సినిమా కబుర్లే...

మర్నాడు స్కూల్ లో

కూడా...

ఆ ఆనందం ఇంకో పది

రోజులుండేది...


అసలు రేడియో విచిత్రం..

అందులోకి మనుషులు

వెళ్లి మాట్లాడతారా అన్న

ఆశ్చర్యం...అమాయకత్వం..


పక్కింట్లోవాళ్లకి రేడియో

ఉంటే..ఆదివారం

మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం

ముందు కూర్చుని 

రేడియోలో సంక్షిప్త

శబ్ద చిత్రం (ఒక గంటకి

కుదించిన) సినిమాని

వింటే ఎంత ఆనందం...

మనింట్లో కూడా రేడియో

ఉంటే...అన్న ఆశ...


కాలక్షేపానికి లోటే లేదు...

స్నేహితులు,

కబుర్లు, కధలు,

చందమామలు,

బాలమిత్రలు...


సెలవుల్లో మైలు దూరం

నడిచి లైబ్రరీ కి వెళ్లి

గంటలు గంటలు

కథల పుస్తకాలు

చదివి ఎగురుకుంటూ

ఇంటికి రావడం....


సర్కస్ లు, 

తోలు బొమ్మలాటలు

లక్కపిడతలాటలు...

దాగుడు మూతలు...

చింత పిక్కలు

వైకుంఠ పాళీ

పచ్చీసు..

తొక్కుడు బిళ్ళలు..

ఎన్ని ఆటలో...


మూడు గదుల రైలుపెట్టె

లాంటి ఇంట్లో అంతమంది

ఎంత సంతోషంగా ఉన్నాం...

వరుసగా కింద చాపేసుకుని

పడుకున్నా ఎంత హాయిగా

సర్వం మరిచి నిద్రపోయాం...


అన్నంలో కందిపొడి..

ఉల్లిపాయ పులుసు

వేసుకుని తింటే

ఏమి రుచి...

కూర అవసరమే లేదు..


రెండు రూపాయలు తీసుకెళ్లి

నాలుగు కిలోల 

బియ్యం తెచ్చేది...

ఇంట్లో,  చిన్నా చితకా

షాపింగ్ అంతా నేనే...

అన్నీ కొన్నాకా షాప్

అతను చేతిలో గుప్పెడు

పుట్నాల పప్పో, పటికబెల్లం

ముక్కో పెడితే ఎంత

సంతోషం...

ఎంత బరువైనా

మోసేసేవాని..


ఎగురుతున్న విమానం

కింద నుండి 

కళ్ళకు చెయ్యి అడ్డం

పెట్టి చూస్తే ఆనందం...


తీర్థంలో ముప్పావలా

పెట్టి కొన్న ముత్యాల దండ 

చూసుకుని మురిసి

ముక్కలైన రోజులు...


కొత్త పుస్తకం కొంటే

ఆనందం...వాసన

చూసి మురిపెం..

కొత్త పెన్సిల్ కొంటే

ఆనందం...

రిక్షా ఎక్కితే...

రెండు పైసల

ఇసుఫ్రూట్ తింటే

ఎంత ఆనందం..?


రిక్షా ఎక్కినంత తేలికగా... 

ఇప్పుడు విమానాల్లో 

తిరుగుతున్నాం...

మల్టీప్లెక్స్ లో ఐమాక్స్

లో సినిమా చూస్తున్నాం.

ఇంటర్వెల్ లో

ఐస్ క్రీం తింటున్నాం..


బీరువా తెరిస్తే మీద పడి

పోయేటన్ని బట్టలు...

చేతినిండా డబ్బు...

మెడలో ఆరు తులాల

నగ....

పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...

ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...

హోమ్ థియేటర్లు...

సౌండ్ సిస్టమ్స్, అరచేతిలో

ఫోన్లు...అరచేతిలో

స్వర్గాలు...

అనుకోవాలే గానీ క్షణంలో

మన ముందు ఉండే 

తిను బండారాలు.. 

సౌకర్యాలు...


అయినా చిన్నప్పుడు

పొందిన  ఆ ఆనందం

పొందలేకపోతున్నాం

ఎందుకు నేస్తం...?

ఎందుకు...?ఎందుకు...?


చిన్నప్పుడు కోరుకున్నవి

అన్నీ ఇప్పుడు  

పొందాము కదా...

మరి ఆనందం లేదేం...

ఎందుకంత మృగ్యం

అయిపోయింది...?

ఎండమావి 

అయిపోయింది..?


మార్పు ఎందులో...?

మనలోనా...?

మనసుల్లోనా...?

కాలంలోనా...?

పరిసరాల్లోనా...?

ఎందులో... ఎందులో...?

ఎందులో నేస్తం...?

చెప్పవా తెలిస్తే....!!                    


👍 _*త్వరలో అంతరించబోతున్న పాత తరం తస్మాత్ జాగ్రత్త ...*_😢😢🙏


_*రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచంనుండి కనుమరుగవబోతూవుంది..!


_అవును ఇది ఒక చేదు నిజం.!!_


_ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు._


_వాళ్ళు.._


 _రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు.!_

_ఉదయం పెందరాళే లేచేవాళ్ళు.!_

_నడక అలవాటు ఉన్నవాళ్ళు.!_ 

_మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు.!_


_వాళ్ళు....._


 _ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !_

_ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!_

_మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!_

 _పూజకు పూలు కోసే వాళ్ళు !_

_వాళ్ళు...._


_పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !_

_మడిగా వంట వండేవాళ్ళు!_

_దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!_

_దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు.!_

_దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!_

_మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!!_


_వాళ్ళు_ 


 _అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు.!_ 

_కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు..!_

_స్నేహంగా మెలిగే వాళ్ళు...!_

_తోచిన సాయం చేసేవాళ్ళు..!_

_చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు...!_


_వాళ్ళు_ 


_ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు..!_

_ఉత్తరాలు తీగకు గుచ్చిన వాళ్ళు...!_

_పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు...!_

_ఫోన్ నెంబర్ లు డైరీలో రాసిపెట్టుకునే వాళ్ళు....!


_వాళ్ళు_ 


_పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు.!_

_కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు..!_

_సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు...!_

_పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ....!_ 


_వాళ్ళు ..._


_తీర్థయాత్రలు చేసేవాళ్ళు.!_

_ఆచారాలు పాటించే వాళ్ళు..!_

_తిధి, వారం, నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు.!_

_పుట్టినరోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు..!_


_వాళ్ళు ...._


_చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు.!_

_లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు...!_

_చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు....!_

_అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు.!_


_వాళ్ళు ...._


_తలకు నూనె రాసుకునే వాళ్ళు .!_

_జడగంటలు పెట్టుకున్నవాళ్ళు..!_

_కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు...!_

_చేతికి గాజులు వేసుకునే వాళ్ళు.... !_


_ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషులతో స్నేహంగా గడిపిన తరం....._


_ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు_


_మీకు తెలుసా ?_


_వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు._


_మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు._


_మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి_ 


_లేదంటే ....._

_లేదంటే ...._ 

_లేదంటే ...._


_ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది._


_వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో, మానవత్వంతో, స్నేహంతో కూడి ఉండే తరం.._


_సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!_


 _స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !_


_కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!_


 _ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగినతరం_


_ద్వేషం, మోసం లేని స్నేహ జీవనం గడిపిన తరం అది!_


_సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది.!_


_లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !_🙏


_ఇరుగుపొరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!_😊


 _తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం_


_వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది_ 🤔


_మీ కుటుంబంలో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. ._🙏


_సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి..._


_సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశంగా ఈ భారతాన్ని  మార్చెయ్యకండి.!!!_


_తప్పులను సరిదిద్దగలది సంస్కారమే!_🤝

_సర్కారు చేసే చట్టాలు కాదు..._🙏


_రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను, స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు.._🤔


_*అందరూ బాగుండాలి అందులో మనం వుండాలి* జై భారత్🌹🙏

మెడికల్ కిట్..

 * ఇంట్లో ఉండవలసిన కోవిడ్ మెడికల్ కిట్..💼*


   _*1. డోలో  650 mg*_

   _*2. అజిత్రో మైసిన్  500mg*_

   _*3. _Montek LC*_

   _*4. మౌత్ వాష్ మరియు గార్గ్ల్*_ 

       _*కోసం బీటాడిన్*_

   _*5. విటమిన్ సి మరియు డి3*_

   _*6. బి కాంప్లెక్స్ Beplex forte*_

   _*7. Zincovit tablets*_

   _*8. ఆవిరి కోసం ఆవిరి యంత్రం +                       Karvol plus గుళికలు*_

   _*9. పల్స్ ఆక్సిమీటర్*_

   _*10. థర్మ మీటర్*_


   -_*ఆక్సిజన్ సిలిండర్ (అత్యవసర*_

        _*పరిస్థితికి మాత్రమే)*_

  - _* ఆరోగ సేతు అనువర్తనం*_

  - _* శ్వాస వ్యాయామ పరికరాలు *_


 *☘️ కోవిడ్ మూడు దశలు :*


   _*1. ముక్కులో మాత్రమే కోవిడ్ -*_

        _*రికవరీ సమయం సగం రోజు.*_

        _*(ఆవిరి పీల్చడం), విటమిన్ సి*_

        _*సాధారణంగా జ్వరం ఉండదు.*_

        _*కన్పించడం.*_


   _*2. గొంతులో కోవిడ్ - గొంతు నొప్పి,*_

        _*కోలుకునే సమయం 1 రోజు*_

        _*(వేడి నీటి గార్గ్లే, త్రాగడానికి*_

        _*వెచ్చని నీరు, టెంప్ ఉంటే*_

        _*పారాసెటమాల్. విటమిన్ సి,*_

        _*బికాంప్లెక్స్. యాంటీబయాటిక్*_

        _*కన్నా తీవ్రంగా ఉంటే.*_


   _*3. ఊపిరితిత్తులలో కోవిడ్-*_

        _*దగ్గు మరియు ఊపిరి 4 నుండి*_

        _*5 రోజులు.  (విటమిన్ సి,*_

        _*బి కాంప్లెక్స్, వేడి నీటి గార్గ్లే,*_

        _*ఆక్సిమీటర్, పారాసెటమాల్,*_

        _*తీవ్రంగా ఉంటే సిలిండర్,*_

        _*ద్రవం చాలా అవసరం, లోతైన*_

        _*శ్వాస వ్యాయామం.*_


*🌸 ఆసుపత్రికి చేరుకోవలసిన దశ :*


       _*ఆక్సిజన్ స్థాయిని పర్యవేక్షించండి. ఇది 94 (సాధారణ 98-100) దగ్గరకు వెళితే మీకు ఆక్సిజన్ సిలిండర్ అవసరం. ఇంట్లో అందుబాటులో ఉంటే, ఆసుపత్రిలో చేరవలసిన అవసరం ఉండకపోవచ్చు .*_


_*ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి!*_


       _దయచేసి భారతదేశంలోని మీ పరిచయాలకు ఫార్వార్డ్ చేయండి...  ఇది ఎవరికి సహాయపడుతుందో మీకు తెలియదు._


       _టాటా గ్రూప్ మంచి చొరవను ప్రారంభించింది, వారు చాటింగ్, టెలి మెడిసిన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచిత వైద్యుల సంప్రదింపులను అందిస్తున్నారు.  ఈ సదుపాయం మీ కోసం ప్రారంభించబడింది, తద్వారా మీరు వైద్యుల కోసం బయటకు వెళ్లవలసిన అవసరం లేదు మరియు మీరు ఇంట్లో సురక్షితంగా ఉంటారు._


       _క్రింద ఉన్న లింక్, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను._

 https://www.tatahealth.com/online-doctor-consultation/general-physician.


        [02/07, 15:20] 

       +91 74069 28123: 


       _*ఐసోలేషన్ ఆసుపత్రుల నుండి సలహా, మేము ఇంట్లో చేయవచ్చు.*_


       _*ఐసోలేషన్ ఆసుపత్రులలో తీసుకునే మందులు..*_


   _*1. విటమిన్ సి -1000*_

   _*2. విటమిన్ ఇ (ఇ)*_

   _*3. (10 నుండి 11) గంటల వరకు,*_

       _*సూర్యరశ్మిలో 15-20 నిమిషాలు*_

       _*కూర్చుని.*_

   _*4. గుడ్డు భోజనం ఒకసారి ..*_

   _*5. మేము కనీసం 7-8 గంటలు*_

       _*విశ్రాంతి తీసుకుంటాము /*_

       _*నిద్రపోతాము*_

   _*6. మేము రోజూ 1.5 లీటర్ల*_

       _*నీరు తాగుతాము*_

   _*7. అన్ని భోజనాలు వెచ్చగా*_

       _*ఉండాలి (చల్లగా కాదు).*_


       _*రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మేము ఆసుపత్రిలో చేస్తున్నది అంతే..!*_


       _*కరోనావైరస్ యొక్క pH 5.5 నుండి 8.5 వరకు మారుతుందని గమనించండి.*_


       _*అందువల్ల, వైరస్ను తొలగించడానికి మనం చేయాల్సిందల్లా వైరస్ యొక్క ఆమ్లత స్థాయి కంటే ఎక్కువ ఆల్కలీన్ ఆహారాలను తీసుకోవడం.*_

  

  _*● ఆకుపచ్చ నిమ్మకాయ - 9.9 పిహెచ్*_

  _*● పసుపు నిమ్మకాయ - 8.2 పిహెచ్*_

  _*● అవోకాడో - 15.6 పిహెచ్*_

  _*● వెల్లుల్లి - 13.2 పిహెచ్*_

  _*● మామిడి - 8.7 పిహెచ్*_

  _*● టాన్జేరిన్ - 8.5 పిహెచ్*_

  _*● పైనాపిల్ - 12.7 పిహెచ్*_

  _*● వాటర్‌క్రెస్ - 22.7 పిహెచ్*_

  _*● నారింజ - 9.2 పిహెచ్*_



       _*మీరు కరోనా వైరస్ బారిన పడ్డారని ఎలా తెలుసుకోవాలి?*_


   _*1. గొంతు దురద*_

   _*2. పొడి గొంతు*_

   _*3. పొడి దగ్గు*_

   _*4. అధిక ఉష్ణోగ్రత*_

   _*5. శ్వాస ఆడకపోవడం*_

   _*6. వాసన కోల్పోవడం ....*_


       _*మరియు వెచ్చని నీటితో నిమ్మకాయ ఊపిరితిత్తులకు చేరే ముందు ప్రారంభంలో వైరస్ను తొలగిస్తుంది ...*_



       _*👆ఈ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోవద్దు.  మీ కుటుంబం మరియు స్నేహితులందరికీ అందించండి..🙏*_

అద్వైతం

 *🏵కాకి నేర్పే అద్వైతం🏵*


ఒకసారి భక్తుడొకరు పరమాచార్య స్వామివారిని, “మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాము? మన పూర్వీకులు కాకులుగా మారారా? అయితే ఇంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు? ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు?” అని అడిగాడు.


స్వామివారు ఒకసారి చిరునవ్వి, “తమిళంలో మనం కాకిని ‘కాకా’ అని పిలుస్తాము. ఇక ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా? పిల్లిని ‘మ్యావ్’ అని, చిలుకలు కికి అంటాయి కాబట్టి వాటిని ‘కికి’ అని పిలుస్తామా? లేదు! కాకిని దాని అరుపుతో పిలుస్తాము. అదే దాని ప్రత్యేకత.


క అంటే కాపాత్తు (కాపాడు), రక్షించు అని అర్థం. కనుక నువ్వు కాకికి ఆహారం పెట్టి ‘కా కా’ అని పిలిస్తే, కాపాడు అని పితృదేవతలని అడిగినట్టు!


విరివిగా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి కాబాట్టి కాకిని నువ్వు అల్ప పక్షి అంటున్నావు. కాకి ఎంత గొప్పదో ఇప్పుడు చెబుతాను విను.


అది బ్రహ్మముహూర్తంలో లేస్తుంది. కా కా అని అరచి నిన్ను నిద్రలేపుతుంది. ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లేవవు. కాని కాకి సరైన సమయానికి లేస్తుంది. అది కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మముహూర్తంలో నిన్ను నిద్రలేపుతుంది. 


అది పూజకు సరైన నిర్దేశం. అవును కదా?


అంతేకాక, దానికి ఆహరం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ఆహారాన్ని పంచుకుని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేకక లక్షణంకలిగినది.


మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు, మరలా కాకా అని అంటుంది. ఆరోజు జరిగిన అన్ని విషయాలకు భగవంతునికి కృతజ్ఞతగా. అలాగే, కాకులు సూర్యాస్తమయం తరువాత ఏమీ తినవు. ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా.


ఇది ఎంతమంది పాటిస్తున్నారు?


కనుక నాకు తెలిసి కాకి అల్ప ప్రాణి కాదు. అది మనకు ఎంతో నేర్పుతుంది. అందుకే పితృ దేవతలు కాకి రూపంలో వస్తారు.

మరొక్క విషయం . . . కేవలం మహాలయంలోనే కాదు, ప్రతిరోజూ కాకికి ఆహారం పెట్టు.


కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది.


నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది. అది తినడం చూడడం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు. కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు. ఇద్దరూ భగవత్ స్వరూపులే!” అని తెలిపారు......🙏