8, మే 2022, ఆదివారం

భగవద్గీత

 "Establishment of Supreme Court Bench in AP for South India is our prime aim"👍


🌹భగవద్గీత🌹


పదునాల్గవ అధ్యాయము

గుణత్రయవిభాగయోగము

నుంచి 8 వ శ్లోకము


తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ౹

ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ౹ (8)


తమః , తు , అజ్ఞానజం , విద్ధి ,

మోహనమ్ , సర్వదేహినామ్ ౹

ప్రమాదాలస్యనిద్రాభిః , తత్ ,

నిబధ్నాతి , భారత ౹౹ (8)


భారత ! = ఓ అర్జున ! 

సర్వదేహినామ్ = దేహాభిమానము గలవారినందరిని 

మోహనమ్ = మోహింపజేయు 

తమః , తు = తమోగుణమయితే 

అజ్ఞానజమ్ = అజ్ఞానము నుండి ఉత్పన్నమైనదానినిగా

విద్ధి = తెలిసికొనుము 

తత్ = అది (ఆ తమోగుణము)

(దేహినమ్) = (జీవాత్మను) ప్రమాdha

ఆలస్, నిద్రాభిః =     ప్రమాదాలస్య నిద్రాదులతో

నిబధ్నాతి = బందించును 


తాత్పర్యము:- అర్జున ! తమోగుణము సకల దేహాభిమానులను మోహితులనుగా చేయును. అజ్ఞానము వలన జనించును. అది జీవాత్మను ప్రమదాలస్య నిద్రాదులతో బందించునu.(8)

   

         ఆత్మీయులందరికి శుభ శుభోదయం

                    Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy Advocate AP High Court Amaravathi

7, మే 2022, శనివారం

ఆదిశంకరాచార్య జయంతి*_

 _*నేడు ఆదిశంకరాచార్య జయంతి*_

          


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*జగద్గురు ఆదిశంకరాచార్యులు*


హిందూ  మత  పరిరక్షణ  కొరకు  అవతరించిన  సరళ సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరులు , శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు , మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం.



*శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్ !*

*నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్ !!*


*ఆది శంకర జయంతి*


ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు , మతాలూ పుట్టుకొచ్చి , ప్రజలకి సనాతన ధర్మం పట్ల , భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత , స్మార్త  క్రియలను సుప్రతిష్టితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని  భక్తుల  ప్రగాఢ విశ్వాసం


*దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే !*

*స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః !!*


దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (శివరహస్యము నుండి)


*కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః !*

*శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా !!*


శ్రౌత , స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి)


జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు , శని , గురుడు , కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ , శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ , శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి , ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి , సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో , ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ , కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం , ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది.


ఆయన తన రెండవ ఏటనే రాయడం , చదవడం  గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు. కారణజన్ములైన శంకరాచార్యులవారు , సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.


☘ ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది. 



☘  ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా , ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ. *“ కనకధారా స్తవం ”* ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.


☘ శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి

అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి , నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు. 


☘   ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది.  ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని , అనుమతినివ్వమనీ ప్రార్థించారు. తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ , ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను మెసలి వదిలివేసింది.



☘   గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ , *"ప్రాత:కాలం , రాత్రి , సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా , స్పృహలో ఉన్నపుడూ , స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే , నీవద్దకు వస్తాను"* అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి , అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.


☘  ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి , శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.



☘   ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు , ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు.



☘  ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ , అనేక , ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి , శివానందలహరి , భజగోవిందం మొదలైనవి.



☘  ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ , ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు. తల్లికిచ్చిన మాట  కోసం తల్లి అవసాన దశలో *" శ్రీకృష్ణభగవానుని "* లీలలను చూపించి సంతోష పరచాడు !!

ఆనాటి కట్టుబాటులను ఎదిరించి తాను సన్యాసి అయినా కన్నతల్లి అంత్యేష్ఠిని స్వయంగా నిర్వహించాడు !!



☘  ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు , మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు , పద్మపాదుడు , సురేశ్వరుడు , పృధ్వీవరుడు మొదలైన వారు.



☘  వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక , సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ , సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు.



☘  హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన , ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ , అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు , ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. 


☘  గణేశ పంచరత్న స్తోత్రం , భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం , కనకథారా స్తోత్రం , శివానందలహరి , సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.



☘  శృంగేరి .. బదరి .. పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే , ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. 



☘  ధర్మ సంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం , దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం , పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం , ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ , ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.



*🌹మఠము-పీఠము🌹*



సన్యాసులు , బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని , మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి , కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి , సుస్థిరంచేయడానికి , వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం , అప్పటి (వందల సంవత్సరాల) నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది.


*" అధ్వైతసిద్ధాంతాన్ని " ప్రచారం  చేశారు* 


దేశంలో  నాలుగు  వైపుల  నాలుగు ప్రధానమైన  పీఠాల్ని  నెలకొల్పి దేశ సమగ్రత ను  ఆధ్యాత్మికతను కాపాడారు !!


*1 .తూర్పున  పూరీ  క్షేత్రంలో  గోవర్ధన  పీఠం రుగ్వేదం !!*


*2- దక్షిణాన శృంగేరీ క్షేత్రంలో  శారదా  పీఠం - యజుర్వేదం!!*


*3 - పశ్చిమాన ద్వారకలో  ద్వారక పీఠం - సామ వేదం !!*


*4 - ఉత్తరాన బదరిర క్షేత్రంలో జ్యోతిష్ పీఠం-యజుర్వేదం!!*


నలుగురు శిష్యులను  నాలుగు పీఠాలకు అధిపతులను చేసారు.

*'’కంచికామకోటి '’* పీఠాన్ని స్థాపించి తానే స్వయంగా కొన్ని

రోజులు పీఠాన్ని అధిరోహించి  హిమాలయాలకు వెల్లి చిన్న వయసులోనే 32 సంవత్సరాలకే తనువు చాలించారు !!

                        *చతుర్మఠాలు*



☘  *ద్వారకా మఠము :-*

ఈ మఠము శంకరులచే , దేశానికి పశ్చిమంగా , మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికామఠమనీ , సిద్ధేశ్వరమఠమనీ , పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు. 


☘  *గోవర్ధన మఠము:-*

దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు. ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో


☘  *శృంగేరీ మఠము :-*

ఇది దక్షిణామ్నాయమఠమని , శారదాపీఠమనీ పిలువబడుతుంది. కర్ణాటక రాష్ట్రములోని శృంగేర(శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది


☘  *జ్యోతిర్మఠము :-*

దీనిని ఉత్తరామ్నాయమనీ , బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం , పీఠ దేవత నారాయణుడు.


☘  *శంకర మఠము(కంచికామకోటి పీఠము) :-*

సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా , శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.


🌳 *ఉన్నది ఒక్కటే  పరబ్రహ్మస్వరూపం అనే అధ్వైతం    నుప్రభోధించారు  !!*  


🌳  *ఇది జ్ఞానమార్గంలో ఉత్కృష్ఠ స్థాయిలో  వున్న వారికే ఈ  సత్యం  అవగతమౌతుంది కనుక సామాన్య జనం కోసం అనేక  దేవీ  దేవతల పై అష్టకాలు స్తోత్రాలను రచించాడు ! ముందు విగ్రహారాధన  చేయమన్నారు !!*


🌳  *ప్రస్థాన త్రయం అంటే  భగవద్గీత - బ్రహ్మసూత్రాలు -*

*ఉపనిషత్తలు ! వీటికి  భాష్యం (వేదాంత- వ్యాఖ్యానం)రాశారు !*


🌳  *శివుడు - అంబిక - గణపతి - విష్ణువు - సూర్యులను ఆరాధించి తరించాలని వేదోక్త " పంచాయతన "పూజ పద్ధతిని ప్రవేశ పెట్టి విగ్రహారాధనకు ఆలంభనగా నిలిచారు !!*


☘  ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళుతుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన  భాష్యాల మీద చర్చకు దిగాడు. ఎనిమిది రోజులపాటు చర్చ జరిగిన తరువాత వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాసుడే అని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలిపగా , శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి , తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా , వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమే అని ప్రశంసించాడు. వేదవ్యాసుడు వెళ్ళిపోతుండడం చూసి శంకరులు *'నేను చెయ్యవలసిన పని అయిపొయింది. నాకు ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించ'మని* వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు *'లేదు , అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేకమందిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకుని , ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్చానురక్తి అర్థాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకు ఇచ్చిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక అని దీవించి అంతర్థానం అయ్యాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు , తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వ ఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.

 

*శంకరులు :-*


అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి. పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి. వారి పిల్లల ఉన్నత విద్యకు ... ఉపనయనాలకు ఆర్ధికపరమైన సహాయ సహకారాలను అందించాలి. ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి. 


ఆదిశంకరులు అవతరణకు ముందు దేశంలో ఏ పరిస్థితులు

ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు శంకరుడు అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ

తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనలోనే , మనతోనే ఉన్నారు. అందుకే మనము ఈ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. సనాతన ధర్మం మన తల్లి. తల్లి రుణం తీర్చుకో వలసిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మాన్ని తెలుసుకొని , ఆచరించి , శక్తిని సంపాదించి , స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి. ధర్మాన్ని కాపాడు. ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు. కలియుగంలో గురువైన శ్రీ ఆదిశంకరాచార్యులు

రక్ష సదా మనపై ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుసరించు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి , అడుగడుగునా భక్తిభావ సుమాలను వికసింపజేసిన అపరశంకరులు. శ్రీ ఆదిశంకరులు

అలాంటి శంకరుల వారిని ఆయన జయంతి సందర్భంగా

స్మరించుకోవడం కన్నా పుణ్యమేముంటుంది ?

అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి.

ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల

అభివృద్ధికి పాటుపడాలి. ఈ విధంగా చేయడం వలన పాపాలు నశించి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.



*" జయ  జయ  శంకర  హర  హర  శంకర "*

శంకర జయంతి ప్రత్యేకం -8

 ॐ          శంకర జయంతి ప్రత్యేకం -8 

          ( ఈ నెల 6వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )  


7. వివిధ స్తోత్రాలు 


      ఆదిశంకరులు వివిధ దేవతలని స్తుతిస్తూ అనేక స్తోత్రాలు అనుగ్రహించారు. 

     ఒక్కొక్క స్తోత్రం చివరిలో ఆ స్తోత్రంద్వారా ఆ దైవాన్ని స్తుతిస్తే పొందే ఫలాన్ని కూడా ఫలశ్రుతి పేరుతో తెలిపారు. 

     ఉదాహరణకి "రోగదోషాలు లేకుండానూ, సత్సంతానంతో అష్టైశ్వర్యాలు పొందుతారు" అనే ఫలశ్రుతితో గణేశ పంచరత్నాలు అందించారు. 


శారదా, లక్ష్మీ, పార్వతీ దేవతా స్తోత్రాలు 


    ఈ శక్తులకి సంబంధించి 

  - శ్రీ శారదాభుజంగ ప్రయాతాష్టకమ్, 

    కనకధారాస్తవమ్, 

    భ్రమరాంబాష్టకమ్, 

    అన్నపుర్ణాష్టకమ్, 

    శ్రీ త్రిపురసుందర్యష్టకమ్, 

    శ్రీరాజరాజేశ్వరష్టకమ్, 

    లలితాపంచరత్నం, 

    మహిషాసురమర్దనీ స్తోత్రమ్, 

    సౌందర్యలహరి వంటివి - వివిధ ఫలితాలు పొందేలా, స్త్రీమూర్తులను స్తుతిస్తూ స్తోత్రాలు అనుగ్రహించారు. 


విష్ణు సంబంధిత స్తోత్రాలు 


     వివిధ అవతారాలతో సహా విష్ణు సంబంధ స్తోత్రాలు అనేకం వారు అందించారు. 

  - నారాయణ స్తోత్రమ్, 

    గోవిందాష్టకమ్, 

    అచ్యుతాష్టకమ్, 

    శ్రీకృష్ణాష్టకమ్, 

    పాండురంగాష్టకమ్, 

    శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రమ్, 

    శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రమ్ అనేవి వాటికి సంబంధించిన కొన్ని స్తోత్రాలు. 


శివునికి సంబంధించిన స్తోత్రాలు 


  - భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలనీ పేర్కొన్న  ద్వాదశజ్యోతిర్లింగ స్తోత్రమ్, 

    శివ పంచాక్షరీ నక్షత్రమాలా స్తోత్రమ్, 

    శివానందలహరి, 

    శివభుజంగ ప్రయాత స్తోత్రమ్, 

    దక్షిణామూర్తి స్తోత్రమ్, 

    ఆదిదంపతులకి సంబంధించి ఉమామహేశ్వర స్తోత్రమ్,  అర్ధనారీశ్వర స్తోత్రమ్ మొదలైనవి. 


ఇతర దేవతా స్తోత్రాలు 


  - ఇహపర సుఖాలకి భక్తసులభుడు ఆంజనేయస్వామిపై హనుమత్పంచరత్నాలు, 

    శ్రీఆంజనేయ భుజంగ స్తోత్రమ్ 

    శ్రీ సుబ్రహ్మణ్య భుజంగమ్ మొదలైనవ అనుగ్రహించారు. 

     

      ఏదో ఒక దేవతనిగానీ, కొంతమంది దేవతలనుగానీ, అందరు దేవతలనూగానీ జనులు వారివారి ఇష్టాలతో స్తోత్రంచేసి, అవుసరమైన ఫలితాలు పొందేలాగా శంకరులు అనేక స్తోత్రాలు అందిచ్చారు. 


      దీనిద్వారా  మానవాళికి వారివారి ఇబ్బందులను తొలగించుకొనే అవకాశమూ, వారి కోరికలు సఫలమయ్యే మార్గము సులభంకావడమూ జరుగుతోంది. 


http://www.kamakoti.org/kamakoti/stotras/Shankara%20Stotras%20nine%20scripts.html


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

వైశాఖ పురాణం - 07.

 వైశాఖ పురాణం - 07.

7వ అధ్యాయము - జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ


నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా! వినుము మాసవ్రతములన్నిటిలో ఉత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ.


పూర్వము యిక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటిబొట్టులను గణించుట, ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు సులభముగ దొరుకునది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుటయేమని తలచి జల దానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయుమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది అట్టిదానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎవరికిని సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే యెవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. అందరును ప్రసిద్దులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాధులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను.


ఇట్టి దోషముచే నా రాజు యొకప్పుడును జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను, కుక్కగ నేడుమార్లు జన్మించెను. అటు పిమ్మట మిధిలాదేశమును పాలించు శ్రుతకీర్తి మహారజు గృహమున గోడపైనుండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగ ఎనుబదియేడు సంవత్సరముల కాలముండెను.


మిధిలాదేశ రాజగృహమునకు శ్రుతదేవమహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్నకాలమున వచ్చెను. మహారాజు అగు శ్రుతకీర్తి ఆ మునిని జూచి సంభ్రమముతో ఆ మునికి యెదురు వెళ్ళి సగౌరవముగ ఇంటిలోనికి దీసికొవచ్చెను. వానిని మధుపర్కము మున్నగువానితో పూజించి వాని పాదములను కడిగి యా నీటిని తన తలపై జల్లుకొనెను. అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని యెగిరి గోడమీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము నన్ను రక్షింపుమని మానవునివలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ! నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు. నీవు యేపని చేసి యిట్టి దశనందితివి? ఇట్లేల అరచుచున్నావు? నీవు దేవజాతివాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరవు? నీకీదశయేల వచ్చెనో చెప్పుము. నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను.


శ్రుతదేవుని మాటలను విన్న బల్లిరూపమున నున్న హేమాంగదమహారాజు మహాత్మా! నేను యిక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర విశారదుడను. భూమియందలి రేణువులెన్ని యుందునో, నీటియందు జలబిందువు లెన్నియుండునో, ఆకాశమున నెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగ దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మల నాచరించినను, ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, యేడుమార్లు కుక్కగను, ప్రస్తుతము బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుచుండగా కొన్ని నీటితుంపురలు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కాని నేనింకను యిరువది యేడుమార్లు బల్లిగా జన్మించవలసి యున్నట్లుగ నాకు తోచుచున్నది. నాకీవిధమైన బల్లిగా జన్మపరంపరయెట్లు తొలగునాయని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మయేల కల్గెనో యెరుగజాలను. దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును ఆపాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను.


శ్రుతదేవమహాముని హేమాంగదుని మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి యిట్లనెను. రాజా! నీవు శ్రీమహావిష్ణువునకు ప్రియమైన వైశాఖమాసమున జలమునెవనికిని దానమీయలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట యేమి అని తలచితివి. ప్రయాణమున అలసినవారికిని జలదానమైనను చేయలేదు. వైశాఖమాస వ్రతమును గూడ పాటింపలేదు. హోమము చేయదలచినవారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలయును. అట్లుగాక బూడిద మున్నగువాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులగువారికి దానమీయక అయోగ్యులగువారికి దానముల నిచ్చితివి. అపాత్రులకెన్ని దానము లిచ్చినను ప్రయోజనము లేదు కదా! వైశాఖమాస వ్రతమును చేయలేదు. జలదానమును చేయలేదు. యెంతయేపుగ పెరిగినను, సుగంధాదిగుణములున్నను ముండ్లుకల వృక్షము నెవరాదరింతురు? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావిచెట్టు ప్రశస్తమైనది. అందువలన నది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావిచెట్టును, తులసిని వదలి వాకుడు చెట్టునెవరైన పూజింతురా? అట్టి పూజలవలన ఫలితముండునా? అనాధలు, అంగవైకల్యము కలవారు దయజూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మము. కాని వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టివారిని పూజించుట ఫల దాయకము కాదు. వారిపై దయ, జాలి చూపవచ్చును. కాని గౌరవింపరాదు. తపము, జ్ఞ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీమహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. వీరిలో జ్ఞానవంతులు శ్రీమహావిష్ణువునకు మిక్కిలి యిష్టమైనవారు. అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగ భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైనవారు సర్వాధికులు, సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపక పోవుట వారిని అనగా శ్రీమహావిష్ణువును అవమానించుటయే యగును. ఈ విధముగ చేయుట యిహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు, అంధులు - ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధుల నెంతమందిని పూజించినను ఫల్ముండునా? గ్రుడ్డివానికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారి నెంతమందిని యెంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములెట్లు సిద్దించును?


తీర్థములు కేవల జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము, సేవ చేసినచో శిలారూపముననున్న దైవమును చిరకాలము పూజించినచో వారియనుగ్రహము కలుగును. కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. ఇష్టఫలప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో వారియుపదేశములను పాటించినచో విషాదముండదు. యిష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అంఋతమును సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగువానిని వలని బాధయుండదు. అమృతత్వసిద్ది కలుగును. హేమాంగద మహారాజా! నీవు వైశాఖమాస వ్రతము నాచరింపలేదు. జలదానము చేయలేదు. జ్ఞానులగువారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు యీ వైశాఖమాస వ్రతము నాచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యద్వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము నందగలవు. అని పలికి శ్రుతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను.


ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్యరూపమును పొందెను. శ్రుతకీర్తి మహారాజునకు, శ్ర్తదేవమహామునికి నమస్కరించెను. వారి యనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరును హేమాంగదుని యదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట యిక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగ జన్మించెను. ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీమహావిష్ణువు అంశను పొంది యింద్రునికి స్నేహితుడై యుండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగ ఆచరించెను. అందుచేయవలసిన దానధర్మముల నన్నిటిని శ్రద్దాసక్తులతో భక్తి పూర్వకముగ చేసెను. సర్వపాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము నందెను. శ్రీమహావిష్ణువు సాయుజ్యము నందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము. అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాసవ్రతమును, వ్రతాంగములగు దాన ధర్మాదులను పాటించి శ్రీహరియనుగ్రహము నందవలెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాసవ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికావృత్తాంతమును వివరించెను.


వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం.

ప్రహేళిక*

 తే.గీ.పడతి నాలుగక్ష రములు పదము లోన

వనిత మొదటి వర్ణము బోవ వందన మగు

వెలది ఒకటిమూడును వేసవియగు

తెలిసి యున్నచో చెప్పుము తెలుగు లేమ

పి.మోహన్ రెడ్డి.

సప్తమీ భానునాయుతా

 రేపు అనగా 8.5.2022 తేదీ రోజున ఆదివారం, సప్తమి, పుష్యమి నక్షత్రం కలసి ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది.


"అమావాస్యేతుసోమేన సప్తమీ భానునాయుతా చతుర్థీ భౌమవారేణ సూర్యగ్రహణసన్నిభా:!స్నానందానంతథాశ్రాద్ధం సర్వంతత్రాక్షయంభవేత్!! తిథివార సమాయోగో యదాకాలేభవేదిహ/ప్రభాతేవాథ మధ్నాహ్న పుణ్యకాలన్సనాస్యదా ?


తా॥ సోమవారముతోగూడిన ఆమావాస్య, ఆదివారముతోగూడిన సప్తమి, మంగళవారముతోగూడిన చవితి, బుధవారముతోగూడిన అష్టమి,


ఈ నాలుగింటికి మహాపర్వత యోగములు అని పేరు. ఇవి సూర్యగ్రహణతుల్యములు.


ఈరోజుల్లో చేసిన గంగాస్నానము, దానం జపం ఉపాసన శ్రాద్ధము.. మొ||వి అక్షయ ఫలాన్ని ఇస్తాయి.


శ్లో॥"" సంక్రాన్తిషు వ్యతీపాతే గ్రహణే చన్ద్రసూర్య్యయోః, పుష్యే స్నాత్వాతు జాహ్నవ్యాం కులకోటి: సముద్ధరేత్.." అని బ్రహ్మాణపురాణమ్"


పుష్యమి నక్షత్ర యుక్తమైన ఈ రోజు గంగా స్నానం


చేయడం వల్ల వంశం పావనం అవుతుందని అర్థం.


"శృణు రాజన్ ! ప్రవక్ష్యామి పుష్యస్నానవిధిక్రమమ్ యేన విజ్ఞాతమాత్రేణ విఘ్నా నశ్యని సన్తతమ్.. ఖానౌ పుష్యర చ పుష్యస్నానం నరశ్చరేత్, సౌభాగ్యకల్యాణకరం దుర్భిక్షమరకాపహమ్.. గ్రహదోషాశ్చ జాయనే యది రాజ్యేషు చేతయః, తదా పుష్యర్క మాత్రే తు కుర్య్యానాసా రేవ్ తల్


అంటూ శాస్త్ర గ్రంథాలు చెబుతున్న దాన్ని బట్టి..


ఈరోజు చేసే గంగాస్నానం వల్ల ఎంతో కాలంగా ఉన్న విఘ్నాలు, గ్రహదోషాలు, ఆర్థిక బాధలు తొలగిపోయి సౌభాగ్య కళ్యాణ కరమైన మంచి ఫలితాలు సిద్ధిస్తాయని అర్థం.


గౌతమఋషి తపస్సువల్ల గంగాదేవియే గోదావరిగా అవతరించి కాబట్టి ఈరోజు గోదావరి స్నానం.. వీలైనంత భగవత్ ఆరాధన, దానం వంటివాటి వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.


గమనిక ఏమిటంటే.. ఇలాంటి ప్రత్యేక యోగాలు ఉన్న రోజుల్లో చేసే పాపాలు, లేదా తప్పుడు పనుల యొక్క దోషఫలం కూడా అనేక రెట్లుగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కధ

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*గాజు - వజ్రం* *కధ*


*ఒక రాజ దర్బారు నిర్వహించబడుతోంది. శీతాకాలం కావడంతో దర్బారు బహిరంగ ప్రదేశంల్లో ఏర్పాటుచేయబడింది*.

*పెద్దల సభ అంతా ఉదయపు నీరెండలో కూర్చుని ఉన్నారు. రాజు సింహాసనం ముందు ఒక రాచరికమైన బల్ల ఉంది, దాని మీద కొన్ని విలువైన వస్తువులు పెట్టి ఉంచారు*.


*పండితులు, మంత్రులు, దివానులు అందరూ అక్కడ ఉన్నారు*. *రాజ కుటుంబ సభ్యులు కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. అంతలోనే ఓ వ్యక్తి వచ్చి లోపలికి వెళ్లేందుకు అనుమతి కోరాడు*. 

*అతను లోపలికి ప్రవేశించి, రాజుకు నమస్కరించి ఇలా అన్నాడు, " మహారాజా! నా దగ్గర రెండు వస్తువులు ఉన్నాయి*, *నేను వివిధ రాజ్యాలు తిరిగి అక్కడ  ప్రతీ రాజుకు వాటిని చూపించాను, కానీ ఎవరూ వాటిని సరిగ్గా పరీక్షించలేకపోయారు*. *అందరూ ఓడిపోయారు, నేను విజేతగా అన్నీ చోట్లకు తిరుగుతున్నాను. ఇప్పుడు నేను మీ రాజ్యానికి వచ్చాను*.".

" *ఏమిటవి ?", అని రాజు కుతూహలంగా అడిగాడు*.


*అతను ఆ రెండు వస్తువులను రాజగారి బల్ల మీద పెట్టాడు. అవి రెండూ సరిగ్గా ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో, ఒకే రూపురేఖలతో, ఒకేలా  ప్రకాశిస్తూ, అన్నీ వైపులా నుండీ, అన్నీ రకాలుగా ఒకేలా ఉన్నాయి*.


*రాజు వెంటనే, "ఈ రెండూ వస్తువులూ ఒకటే" అన్నాడు*.

*దానికి ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "అవును, అవి ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ అవి భిన్నంగా ఉంటాయి. వాటిలో ఒకటి చాలా విలువైన వజ్రం, మరొకటి కేవలం ఒక గాజు ముక్క*.


*కానీ వాటి స్వరూపం, వాటి రంగు ఒకే విధంగా ఉంటాయి; ఇప్పటి వరకు ఏది వజ్రమో, ఏది గాజు ముక్కో ఎవరూ గుర్తించలేకపోయారు*... *ఎవరైనా వాటిని పరీక్షించి ఇది వజ్రం అని, మరొకటి గాజు అని చెప్పవచ్చు. ఎవరైనా సరిగ్గా గుర్తించగలిగితే, నేను ఓటమిని అంగీకరించి*, *ఈ విలువైన వజ్రాన్ని మీ రాజ్య ఖజానాలో నిక్షిప్తం చేస్తాను*.

*కానీ షరతు ఏమిటంటే, ఎవరైనా దానిని గుర్తించలేకపోతే, ఈ వజ్రం విలువతో సమానమైన మొత్తాన్ని మీరు నాకు ఇవ్వాలి. నేను చాలా రాజ్యాల నుండీ  ఇప్పటికి ఇలా  మొత్తాన్ని గెలుపొందాను*”.


" *నేను దానిని పరీక్షించలేను",అన్నాడు రాజు*.


*దివాన్లు కూడా, "రెండూ సరిగ్గా ఒకేలా ఉన్నందున మేము కూడా ధైర్యం చేయలేం*."


*ఓడిపోతామనే భయంతో ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఓడిపోయిన తర్వాత చెల్లించవలసిన డబ్బు, అంత సమస్య కాదు, ఎందుకంటే రాజు దగ్గర చాలా ధనం ఉంది. అయితే రాజుగారి పరువు పోతుందేమోనని అందరూ భయపడి, ఎవరూ గుర్తించదానికి ముందుకురాలేకపోయారు*


*హఠాత్తుగా, ఆ ప్రదేశానికి ఒక మూలన చిన్న అలజడి మొదలయ్యింది*.


*ఒక గుడ్డివాడు చేతిలో కర్ర పట్టుకుని ముందుకొచ్చాడు. "నన్ను రాజు దగ్గరకు తీసుకువెళ్ళండి. నేను ఇందాకటి నుండీ ఈ విషయాలన్నీ వింటున్నాను, అలాగే ఈ వజ్రాన్ని ఎవరూ పరీక్షించలేకపోతున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి", అన్నాడు*.


 *ఒక వ్యక్తి సహాయంతో రాజు వద్దకు చేరుకుని, రాజును ఇలా అభ్యర్థించాడు, "నేను పుట్టుకతో అంధుడిని, అయితే దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, తద్వారా నేను కూడా నా తెలివితేటలను ఒకసారి పరీక్షించుకోవచ్చు. బహుశా నేను విజయం సాధించవచ్చునేమో* .... *ఒకవేళ  నేను విజయం సాధించలేకపోయినా, మీరు ఎలాగూ పందెం ఓడిపోతున్నారు కాబట్టి అంతకుమించి వేరే కోల్పోయేదేమి ఉండదు*."


*అతని మాటలు రాజుకి అర్ధం అయ్యి ఒక అవకాశం ఇచ్చినందువల్ల నష్టం లేదని భావించాడు. రాజు తన ఆమోదం తెలుపుతూ, “సరే” అన్నాడు*.


*ఆ తర్వాత ఆ వృద్దుడికి ఆ  రెండు వస్తువులను తాకించి, వీటిలో ఏది నిజమైన వజ్రం, ఏది గాజుముక్క అని అడిగారు*.


*ఒక్క క్షణంలో, ఆ వ్యక్తి,  'ఇది విలువైన వజ్రం, ఆ రెండవది  కేవలం గాజుముక్క!' అని చెప్పాడు*.


*అన్నీ రాజ్యాలలో గెలిచి వచ్చిన వ్యక్తి నమస్కరించి, "అది నిజమే, నువ్వు బాగా గుర్తించావు.. నువ్వు చాలా గొప్పవాడివి...*ఇచ్చిన మాట ప్రకారం ఈ వజ్రాన్ని నీ రాజ్య ఖజానాకి ఇచ్చేస్తున్నాను", అన్నాడు*.


*అందరూ చాలా సంతోషించారు*. *వచ్చిన వ్యక్తి కూడా వజ్రాల నిజమైన నాణ్యతను గుర్తించేవారు కనీసం ఒకరైనా  ఉన్నారని చాలా సంతోషించాడు*.


*వచ్చిన వ్యక్తి , రాజు, ఇతర ప్రజలందరూ ఒకే ఉత్సుకతను వ్యక్తం చేస్తూ, ఆ అంధుడిని ఇలా అడిగారు, "నీవు కనీసం చూడలేవు కదా, ఇది వజ్రం, ఇంకోటి గాజు అని ఎలా గుర్తించావు*?"


*అంధుడైన ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, "అది చాలా తేలిక, ప్రభూ, మనమంతా ఇందాకటి నుండీ ఎండలో కూర్చుని ఉన్నాం. అలాగే ఈ రెండూ కూడా చాలాసేపటి నుండి ఎండలో ఉంచబడ్డాయి. రెండింటినీ ముట్టుకున్నాను. చల్లగా ఉన్నది నిజమైన వజ్రం. .. *వేడెక్కింది గాజు... అంతే*."



*జీవితంలో కూడా, ప్రతి చిన్న విషయానికి వేడెక్కిపోయినవారు, చిక్కుబడిపోతారు*, *బంధింపబడిపోతారు*  ... *ఆ వ్యక్తులు"గాజు" వంటివారు. ప్రతికూల పరిస్థితులలో కూడా చల్లగా (శాంతంగా, స్థిరంగా) ఉండేవాడు ... ఆ వ్యక్తి  మాత్రమే "విలువైన వజ్రం"లాంటివారు*.

శ్రీ శివానన్దలహరీ

 ॐ                 श्री शिवानन्दलहरी    

                     శ్రీ శివానన్దలహరీ    

      SREE SIVAANANDALAHAREE      


              (श्रीमच्छंकरभगवतः कृतौ)   

           (శ్రీ శంకరాచార్య విరచితమ్)  

        (BY SREE AADI SANKARA)            


                                  శ్లోకం : 18/100

                           SLOKAM : 18/100     


त्वमेको लोकानां परमफलदो दिव्यपदवीं

वहन्तस्त्वन्मूलां पुनरपि भजन्ते हरिमुखाः ।

कियद्वा दाक्षिण्यं तव शिव मदाशा च कियती

कदा वा मद्रक्षां वहसि करुणापूरितदृशा ॥ १८॥    


త్వమేకో లోకానాం పరమఫలదో 

                        దివ్యపదవీం 

వహంత స్త్వన్మూలాం పునరపి భజంతే 

                        హరిముఖాః I 

కియద్వా దాక్షిణ్యం తవ శివ! మదాశా చ 

                              కియతీ 

కదా వా మద్రక్షాం వహసి 

            కరుణాపూరితదృశా ॥          -18  


శంకరా! 

    సమస్తమైన వారికీ, నీవు ఒక్కడివే, 

    పరమఫలాన్ని - అంటే మోక్షాన్ని ఇచ్చేవాడవు. 

    నీవు కారణంగా దివ్యమైన పదవులు అనుభవిస్తున్నవారే అయినప్పటకీ, 

    విష్ణువు మున్నగువారు ఇంకా నిన్ను సేవిస్తూనే యున్నారు. 

    నీ దాక్షిణ్యం ఎంతటిదో కదా! అంటే అది చెప్పశక్యం కానిదీ, అపరిమితమైనదీ. 

    నా ఆశ ఏపాటిది? స్వల్పమైనదే కదా! 

    చల్లని చూపుతో మఱి నన్ను ఎప్పుడు రక్షిస్తావు? 

  (అంటే సంసారముక్తిని ఎప్పుడు కలిగిస్తావు?)  

 

O Shankara! 


    You alone grant great blessings and holy status to the common people of the world, 


    But carrying the holy position, 

    granted by thy kindness great, 

    Vishnu and others pray you always for getting more and more such positions great. 


    Your grace my Lord is immeasurable and 

    my desire too is immeasurable, 

    And so when are you taking up the job of protecting me by your merciful glance?


విశేషం 


    దేవతలందరిలో పరమఫలాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు ఒక్కడే!  

    దాన్ని పొందడంకోసం ఎంతటివారైనా ఆయనని ఆశ్రయింపవలసిందే! 

    పరమేశ్వరుని అనుగ్రహంచేతనే గొప్ప పదవులలో అంటే సృష్టి - స్థితి వ్యాపారాలలో ఉంటున్నప్పటికీ, బ్రహ్మ - విష్ణువు మరల మరల ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నారు.  

    పదవులు ఎంత విశిష్టమైనవి అయినప్పటికీ అశాశ్వతాలే! 

    పుణ్యం క్షీణింపగానే పదవి కోల్పోయి, 

    ఎంతటివాడైనా మళ్ళీ మర్త్యలోకంలో పుట్టి సంసార యాతనలు అనుభవింపక తప్పదు. 

  "క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" అని భగవద్గీతా వాక్యం. 

    కాబట్టి అత్యున్నతమైన పదవిలో ఉంటున్నప్పటికీ పరమేశ్వర సాయుజ్యాన్నే కోరుకోవాలి.  

    దానికి ఆయనని ఆరాధింపక తప్పదు.  


    అనంతమైన విశ్వంలో  భక్తుని స్థానం ఎంతో చిన్నది. 

    ఈ సంసార బంధాలనుండి ముక్తిని పొందాలన్న అతని కోరికకూడా అత్యంత అల్పమైనదే. 

    కాబట్టి అతడు భక్తితో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే, 

    ఆ స్వామి తప్పక కరుణార్ద్రమైన దృష్టితో భక్తుని రక్షిస్తాడు. 


https://youtu.be/h8qlcoPKG5o


                            కొనసాగింపు.. 


                         =x=x=x= 


సేకరణ, కూర్పు :                         

 రామాయణం శర్మ 

      భద్రాచలం

భాష్యపాఠం చెప్పిన స్వామివారు

 భాష్యపాఠం చెప్పిన స్వామివారు


దాదాపు ఇరవైఅయిదు సంవత్సరాల క్రితం పరమాచార్య స్వామివారు సతారాలోని శ్రీ శంకర మఠంలో పదకొండు నెలల పాటు మకాం చేశారు. 


అప్పుడు మా నాన్నగారు శ్రీ కాశీనాథ శాస్త్రి గారు మహాస్వామి వారి నోటి నుండి ప్రస్థానత్రయ (ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత) భాష్యం వినాలన్న తమ కోరికను స్వామివారికి విన్నవించారు.


అందుకు స్వామివారు, “అలాగే భవిష్యత్తులో చూద్దాం” అని తెలిపారు.


రెండు నెలలు గడచిన తరువాత, స్వామివారు మమ్మల్ని పిలిచి, భాష్య పుస్తకాలను తెప్పించుకుని, వాటిని వివరించడం మొదలుపెట్టారు. శ్రీ రాజగోప అయ్యర్ అనే వారొకరు ప్రతి ఉపనిషత్తు నుండి మొదటి వాక్యాన్ని మాత్రం చదివేవారు. స్వామివారు ఆ ఉపనిషత్తుకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకుషంగా ఎందఱో భాష్యకారుల భాష్యాన్ని ఉదహరిస్తూ తెగిన ఆనకట్ట నుండి పారే నీటిలా విస్తారంగా వివరించేవారు. ప్రతి రోజూ ఏడుగంటల పాటు ఈ భాష్యపాఠం కొనసాగేది. మాపై పరమాచార్య స్వామివారికి ఉన్న కారుణ్యాన్ని తెలపడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది?


ఈ సుదీర్ఘ ఉపన్యాసాలు పన్నెండు రోజులపాటు సాగి చివరకు పరిసమాప్తమయ్యాయి. కేవలం పరమాచార్య స్వామివారు ఒక్కరే ఏడుగంటల పాటు పాఠం చెప్పేవారు. ఆశర్యపోయే విశ్స్యం ఏంటంటే, ఏమాత్రం శ్రమ లేకుండా చెప్పడమే కాకుండా ప్రతి రోజూ ఎంతో ఉత్సాహంతో పాఠం చెప్పేవారు.


ఈ ఉపకారానికి మేము ఎన్ని జన్మలు ఎత్తి మహాస్వామివారికి సేవ చేసుకోవాలో.


స్వామివారి దర్శనానికి ప్రతిరోజూ ఒక కళాశాల అధ్యాపకులొకరు వచ్చేవారు. కాని అతను ఎన్నడూ స్వామివారికి తనను పరిచయం చేసుకోవడం కాని, మాట్లాడడానికి ప్రయత్నించడం చేయడం కాని చేసేవాడు కాదు. బహుశా స్వామివారి దర్శనమే తనకి అపరిమిత ఆనందాన్ని కలిగించేదేమో. 


అయిదారు నెలల తరువాత ఒకరోజు స్వామివారు అతణ్ణి చూసి, “నువ్వు ఇప్పుడు ఇక్కడకు వచ్చావేమిటి?” అని అడిగారు స్వామివారు.


అతను ఆశ్చర్యంతో, “నేను ఇక్కడకు రోజూ వస్తున్నాను పెరియవా” అని బదులిచ్చాడు.


మహాస్వామివారు మరలా అదే ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న పరమార్థం ఏమిటో అతనికి అర్థం కాక అయోమయంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంటిలోకి అడుగుపెట్టగానే, నేలపై పడ్డ ఒక ఉత్తరం కంటపడింది. దాని తీసుకుని చదివాడు. “చాలా ముఖ్యమైన సమాచారం. వెంటనే ఫలానా ప్రాంతంలో ఉన్న ఫలానా కళాశాలకు వెళ్లి నీ పని మొదలుపెట్టు” అన్నది సారాంశం.


ఆ ఉత్తరంలో ఉన్న విషయం ఏమిటో మహాస్వామివారికి ముందే ఎలా తెలుసు? ఏమైతేనేమి, ఆ అధ్యాపకుడు పెట్టెబేడా సర్దుకుని ఇంకో ఊరికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు.


పరమాచార్య స్వామివారు మకాం చేసిన చోట విపరీతంగా నల్లులు చేరాయి. ఎక్కడ కాలు పెడితే అక్కడ నల్లులు ఉన్నాయి. కొన్నిసార్లు మహాస్వామి వారి శరీరంపై కూడా తెనేపట్టుని అంటుకున్న తేనెటీగల గుంపులా అధిక మొత్తంలో నల్లులు గుంపులుగుంపులుగా ఉండేవి.


వాటిని చంపడానికి ఒక భక్తుడు క్రిమిసంహారక మందును తెచ్చాడు. మహాస్వామివారికి ఈ విషయం తెలిసి ఆ భక్తుణ్ణి పిలిచారు.


“మన శరీర పోషణం కొరకు మనం ఆహారం తీసుకుంటాము. నల్లులకు మనుష్య శరీరంలో ఉన్న రక్తమే ఆహారం. నల్లులు తమకు తామే ఆహారాన్ని తీసుకుంటాయి. ఆహారం లేకపోతే అవి ఎలా బ్రతుకుతాయి? నిజమే కదా?” అని అడిగారు.


“బ్రతికున్నవాటికి జీవహింస జరగరాదు. మనకు ఏదైనా సహాయం చేసేవారిపై మనం ఇష్టం కలిగిఉండడం గొప్ప విషయమేమీ కాదు. మన పెద్దలు చెప్పినట్టు మనకు అపకారం చేసేవారిని కూడా అమనం ఇష్టపడగలిగే వారే ధర్మాత్ములు”

ఈ మాటలు విన్న తరువాత ఆ భక్తునికి పరమాచార్య స్వామివారి గదిలో ఆ క్రిమిసంహారక మందును చల్లడానికి మనస్సు ఉంటుందా?


ఆశ్చర్యపరిచేది ఇది కాదు. ఈ సంభాషణ జరిగిన ఒకట్రెండు రోజుల తరువాత ఆ గదిలో నుండి నల్లులు మాయమైపోయాయి - ఇది అద్బుతాలకే అద్భుతం అంటే.


--- బ్రహ్మశ్రీ కృష్ణ శాస్త్రి జోషి, శ్రీ శంకర మఠం, సతారా. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శంకర జయంతి ప్రత్యేకం - 7

 ॐ          శంకరజయంతి శుభాకాంక్షలు 


              శంకర జయంతి ప్రత్యేకం - 7

          ( ఈరోజు వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి ) 


శంకరుల అవతారం 


6. స్తోత్రాలు - ప్రకరణలు - భాష్యాలు 


    ఇతర మతాలలో ఒక్కొక్క మతంలో ఒక్కొక్కటే గ్రంథం. సాధనలో ఏ స్థాయివారికైనా ఒకటే పద్ధతి తప్పని సరి. 

    కానీ హిందూత్వం - వివిధస్థితులలో, స్థాయిలలో ఉన్నవారికి సాధనలో వారిస్థాయి ఎరిగి, ఆ పైస్థితికి చేరుకునేందుకు సాహిత్యం వివిధ రకాలుగా ఉంటుంది. 

    జగద్గురువులు ఈ విషయానికి సంబంధించి, గ్రంథాలను మూడు రకాలుగా వర్గీకరించి అందించారు. అందులో 


అ) స్తోత్రాలు:— సామాన్యులకు కూడా ఇహలోక సుఖంతోనూ, మోక్షము  సులభంగా పొందేలాగానూ వివిధ దేవతలని స్తుతిస్తూండేవి స్తోత్రాలు. 

      శంకరులు అందించిన అనేక దేవుళ్ళమీద  అనేక స్తోత్రాలతోపాటు శివానందలహరి, సౌందర్యలహరి వంటివి ఈ కోవలోకి వస్తాయి. 


ఆ) ప్రకరణ గ్రంథాలు:— విశేషమైన శాస్త్ర జ్ఞానంలేక, కొద్ది అవగాహనగల మధ్యస్థాయి వారికోసం ఉద్దేశింపబడినవి. 

    పైస్థాయికి చెందిన జ్ఞాన సంబంధ విషయసారాన్ని గ్రహించి మరింత ఉన్నత స్థాయికి చేర్చే -  ఆత్మబోధ,అపరోక్షానుభూతి, వివేకచూడామణి మొదలైనవి జగద్గురువులందించిన రెండవ కోవకు చెందినవి. 


ఇ) భాష్యాలు:— మూడవ భాగంగా, శాస్త్ర పండితులకు మాత్రమే అధ్యయనం చేయడానికి సాధ్యమయ్యే వ్యాఖ్యాన గ్రంథాలు భాష్యాలు. 

     వివిధ శాస్త్ర సంప్రదాయాలతో సమన్వయిస్తూ శ్రుతి స్మృతులలోని వాక్యాలనుదహరిస్తూ, అద్వైత సిద్ధాన్తాన్ని బలపరుస్తూ శంకరభగవత్పాదులు భాష్యాలు రచించారు. 

     బ్రహ్మసూత్రాలుగా పిలువబడే శారీరక మీమాంసా, ఉపనిషత్తులు,భగవద్గీతపై వ్రాసిన భాష్యాలని ప్రస్థానత్రయంగా పిలుస్తారు. ఆ భాష్యాలను శంకరులు అనుగ్రహించారు. ఇవి గొప్ప శాస్త్రజ్ఞానంగల పండితుల స్థాయికి అవుసరమైనవి. 


     ఇట్లా సాధారణ, మధ్య, పాండిత్య స్థాయిలలో మూడు రకాల సాహిత్యాన్ని అనుగ్రహించారు శంకరులు. 

     తద్వారా ఏ స్థాయిలవారైనా, మూడంచెల మార్గం ద్వారా మూడుమెట్లు ఎక్కి ఉన్నతస్థితికి చేరుకునే అవకాశం కల్పించారు. 


                              కొనసాగింపు 


                              =x=x=x= 


   — రామాయణం శర్మ 

            భద్రాచలం

6, మే 2022, శుక్రవారం

శంకర జయంతి ప్రత్యేకం - 6

 ॐ          శంకర జయంతి ప్రత్యేకం - 6 

          ( ఈ నెల 6వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )


శంకరుల అవతారం 


5. వివిధ ఆరాధనలు - పంచాయతనం - సమన్వయం 


    ఈ రోజుల్లో, ఒక్కొక్క ప్రత్యేకమైన అర్చన/ప్రార్థన/ఆరాధన విధానాన్ని ఒక్కొక్కరు తీసికొనివస్తున్నారు. అనేక సందర్భాలలో ఇతర దేవతారాధనలని నిరసించడం కూడా చూస్తూన్నాం. 

    మిగతా విధానాలపై కనీస అవగాహనలైనాలేక, తమదే సర్వస్వమనుకునే అనేక వర్గాలు తయారవుతున్నాయి. 

    యాంత్రిక జీవితం గడుపుతున్న ఈ రోజుల్లో, శాస్త్రంపై సరియైన అవగాహనలేకుండానూ, 

    వారివారి పద్ధతులు మాత్రమే సరియైనవి అనినమ్మే ఆధునిక గురువుల విధానాలపై అందరూ ఆధారపడుతున్నారు. 


    పూర్వపురోజుల్లో ఏ యతి వచ్చినా, 

    చాతుర్మాస దీక్షకై, సంచారము ఆపి, ఆయా ప్రదేశాలలో ఆగిపోయినా, 

    ఆ ప్రాంతాలవారు సాంప్రదాయ భేదాలేవీలేకుండా, అందరూ ఆ యతిని దర్శించుకోవడం, వారిచ్చే సందేశం వినడం, పాదపూజలు చేయడం జరిగేవి. 

    దీనికి సరియైన కారణం జగద్గురువుల దృక్పథం. 


వివిధ ఆరాధనలు - పంచాయతనం  


    ఆదిశంకరులు ఆ రోజులలోనే వివిధ ఆరాధనా విధానాలని సమన్వయపరచి,  పంచాయతన పూజావిధానం ద్వారా అన్నిటినీ ఒకే తాటిపైకి తెచ్చారు. 

    దాని ద్వారా తత్త్వాన్ని తెలుపుతూ సమైక్య ఆరాధనా విధానాన్ని పటిష్ఠవంతంగా స్థిరపరిచారు.  


పంచశీర్షాలు 


గణపతి అథర్వశీర్షం, 

సూర్య అథర్వశీర్షం, 

నారాయణ అథర్వశీర్షం, 

శివ అథర్వశీర్షం, 

దేవీ అథర్వశీర్షం 

    - అనే ఐదు ప్రామాణికాలలో, 

    మొదటి నాల్గిటిలో "సృష్టి స్థితిలయా"లకి సంబంధించి ఒకే లక్షణాలు వర్ణించబడ్డాయి. 

    నాల్గవదైన దేవీ అథర్వశీర్షంలో మరింత ప్రత్యేకత కనిపిస్తుంది. 

    ఈ ఐదు దైవాలకి సంబందించి, దేశంలో ప్రధానంగా ఐదు ఆరాధనలు ఉన్నాయి.  

    అవి, గాణాపత్య, సౌర, వైష్ణవ, శైవ, శాక్తేయ అనే ఐదు మతాలకి చెందినవి. 


పంచభూతాలు - ఐదుగురు దేవుళ్ళు 


    పంచభూతాలతోనే ప్రపంచం ఏర్పడుతుంది. ఆ ఐదు శక్తులూ ఐదు దేవతలకి సణబంధించినవిగా ప్రతిపాదింపబడ్డాయి.  

      అవి 

* శక్తి(పృథ్వి - భూ), 

* గణపతి(ఆపః - నీరు), 

* సూర్యుడు(తేజః - అగ్ని), 

* విష్ణువు(వాయుః - గాలి), 

* శివుడు(ఆకాశః)గా పంచభూతాలతో అన్వయించబడ్డాయి. 


    పరమాత్మ ఒక్కొక్క కల్పంలో పంచభూతాలలో ఒక్కొక్కదానిని ఆధారంగా చేసికొని, ఒక్కొక్క రూపాన్ని ధరిస్తాడు. 

    ఒక కల్పంలో వ్యాపకుడుగాయున్న విష్ణువై అవతరించాడు. ఆ కల్పంలో పరబ్రహ్మను నారాయణుగా స్తుతించారు. ఆ రూపంలో ఆయననర్చించిన ఉపాసకులు వైష్ణవులయ్యారు. నారయణ సూక్తం వంటివి ఆయనని స్తుతిస్తాయి. 

    అలాగే మరొక కల్పంలో సూర్యుడు అరుణంవంటివాటితో స్తుతించబడ్డాడు. 

    మరొక కల్పంలో అమ్మవారు శక్తిగా ఆరాధింపబడుతుంటే, మేధాసూక్తం,శ్రీసూక్తం వంటివి అమ్మవారిని కీర్తించాయి. 

    శివుని రుద్రంతో ఒక కల్పంలోనూ, 

    గణపతిని గణపతి సూక్తంవంటివాటితో మరొక కల్పంలోనూ స్తుతించారు. 


    పరమాత్మ వివిధ కాలాలలో వివిధ రూపాలుగా అవతరించినా, అన్నిరూపాలనీ ఎల్లప్పుడూ మనం ఉపాసించడం విశేషం. 

    ఐదు మూర్తులనీ ఒకేచోట చేర్చి, తాను ప్రధానంగా ఉపాసించే దేవతని మధ్యలోనూ, 

    మిగిలిన నలుగురినీ నలుమూలలానూ ఉంచి,  ఆరాధించే పంచాయతనాన్ని శంకరులు ఎంతగొప్పగా సమన్వయపరిచారో కదా! 


    ఈ విధంగా ఐదు రకాల ఆరాధనలలో, ఐదురకాల కేంద్రాలతో (Vishnu centric, Siva centric, Devi centric, Sun centric and Ganesh centric), ఐదుగురు దేవతలనూ కొలవడం అత్యంత ఆవశ్యకం. 


పంచభూతాలు - ప్రపంచము - పాంచభౌతిక దేహము 


    పంచభూతాలూ ఒక్కొక్కదానిలో సగభాగం (1/2),  మిగిలిన నాలుగూ కలిసి (1/8+1/8+1/8+1/8=1/2) సగంగా ఉంటాయి. దానిని పంచీకరణము అంటారు. 

    ఆ ఐదూ కలిస్తేనే ప్రపంచం.  

    పాంచభౌతిక దేహం కూడా ఆ ఐదిటి కలయికే!

    ఐదూ కలిస్తేనే దేహం, ప్ర-పంచమూ కూడా కదా! 


    వేదప్రతిపాదిత ఈ విధానాన్ని వెలికితీసి, ఆనాడే మనకి అందించిన శంకరుల అవతారం ఎంత విశిష్టమైనదో కదా! 


                         కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

5, మే 2022, గురువారం

ముండనం

 ముస్లిం - ముండనం


పరమాచార్య స్వామివారు అప్పుడు కాష్టమౌనంలో ఉన్న కాలం. అందరితోపాటు నేను, నా స్నేహితురాలు నాగలక్ష్మి వరుసలో నిలబడి స్వామివారి దర్శనం కోసం ముందుకు వెళ్తున్నాము. మా వెనుక వచ్చినతను, “స్వామివారు ఆదేశించినట్టుగానే నేను ఇక్కడకు వచ్చాను” అని అన్నాడు. వెంటనే పరమాచార్య స్వామివారి వైపు చూసి చేతులు రెండూ జోడించి స్వామికి నమస్కరించాడు.


మహాస్వామివారు కూడా అక్కడున్నవారినెవ్వరినీ చూడక, అతనివైపు తీక్షణంగా చూసి చెయ్యెత్తి ఆశీర్వదించారు.


నేను అతని గురించి అడుగగా, తన పేరు సలీం అని, కుంభకోణం నుండి వచ్చానని తెలిపాడు. “నిన్న సామి నా కలలో వచ్చి, ‘రేపు నేను క్షవరం చేయించుకునే దినం. వచ్చి, నన్ను చూసి వెళ్ళిపో’ అని తెలిపారు. అందుకే వచ్చాను” అని తెలిపాడు.


ఆరోజు వపనం దినం - క్షవరం చేయించుకునే రోజు. సన్యాసులు రెండు నెలలకొకసారి పౌర్ణమి రోజు శిరస్సు ముండనం చేయించుకోవాలి. శ్రీమఠంలో దాన్ని సంస్కృత పదమైన ‘వపనం’ అన్న పేరుతో వ్యవహరిస్తారు. దాన్ని చూడడానికి వెళ్ళడమే మా ఆనవాయితీ. కాని ఆ ముస్లిమ్ భక్తుణ్ణి ఆరోజు రమ్మని చెప్పడమెందుకో నాకు అర్థం కాలేదు. 


నేను అతని గురించి నాగలక్ష్మికి చెప్పగా, “అతని పేరు చెల్లప్పన్ అయ్యుంటుంది. నీ చెవులకి అది సలీం అని వినబడి ఉంటుంది”. అని చెప్పింది. మేము మరలా ఆ ముస్లిం భక్తుణ్ణి కలిశాము. అతను మేడలో రుద్రాక్ష మాలను కూడా వేసుకున్నాడు. మరలా మేము అతణ్ణి అడిగాము, “నువ్వు రుద్రాక్షలు ధరించావు కదా! మసీదులోకి నువ్వు వెళ్ళడానికి వారు అనుమతించరు కదా?”


“అవును నేను ముస్లింనే; పేరు సలీం. ఇంతకుముందే స్వామివారిని నేను మూడు నలుగు సార్లు చూశాను. ఒకసారి స్వామివారు నాకు ఈ రుద్రాక్షలు ప్రసాదంగా ఇచ్చినప్పుడు వీటిని ఏం చెయ్యాలని అడిగాను. అందుకు సామి, ‘అది మెడలో ధరించాలి, కాని నీవారు దాన్ని అంగీకరించకపోవచ్చు. కాబట్టి ఒక డబ్బాలో ఉంచు’ అని చెప్పారు”


సామి వారు ఇచ్చినదాన్ని నేను మెడలోనే వేసుకోవాలని నిర్ణయించుకుని, అలాగే చేశాను. అయినా నేను ప్రార్థనలకోసం ఎప్పుడు మసీదుకు వెళ్ళినా, ఎవరూ నన్ను నిందించలేదు కనీసం ఆ మాలను తీసివేయమని కూడా చెప్పలేదు.

పరమాచార్య స్వామివారి దివ్యశక్తి ఎవరికి తెలుస్తుంది?


--- జయలక్ష్మీ అమ్మాళ్, పొల్లాచి. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు.!💐

 💐💐జన్మకు అర్థం..!!!

పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు.!💐💐


1) పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, అది తీసుకోకుండానే మరణించినవాడు, తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.


2) తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.


3) పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.


4) పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.


5) పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ - సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.


6) పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు.


7) ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు.


ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య - భర్త - సోదరుడు - పనిమనిషి - ఆవు - కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. ఋణము తీరగానే వదిలి వెళ్ళడమో, పరలోకానికి చేరడమో జరుగుతుంది.

 శ్లోకం:☝️

  *కాచం మణిం కాంచన మేకసూత్రే*

*గ్రథ్నాసి బాలే కిము చిత్రమేతత్*

  *అశేషవి త్పాణిని రేకసూత్రే*

*శ్వానం యువానం మఘవానమాహ*


అన్వయం: _కాచం మణిం కాంచనం ఏకసూత్రే గ్రథ్నాసి |_

_(హే) బాలే! కిము చిత్రం ఏతత్ ?_

_తాం ఆహ | అశేషవిత్ పాణినిః , ఏకసూత్రే శ్వానం యువానం మఘవానం (స్థాపితవాన్ ఖలు) |_


భావం: ఒక బాలిక గాజుముక్కను, మణిని, బంగారాన్ని కలిపి ఒకే సూత్రం (దారం)లో గ్రుచ్చి ఆడుకుంటున్నది.

దాన్ని చూచి ఒకాయన - ఓ బాలా! నీవు విలువైన మణిని, సాధారణమైన గాజుముక్కతో కలిపి ఒక చోట కడుతున్నావు ఏమి ఆశ్చర్యం ? - అని ప్రశ్నించాడు.

దానికి ఆ అమ్మాయి - అయ్యా! సర్వజ్ఞుడైన పాణిని కుక్కను, ఇంద్రుని, యువకుణ్ని ఒక్క సూత్రంలో బంధించలేదా? అంతటివాడు ఆ పని చేయగా లేనిది నేను ఒక దారంలో వీటిని చేర్చటం తప్పా? - అని చమత్కారంగా అడిగింది.

ప్రాచీన భారతదేశంలో చిన్నపిల్లలు, పనివాళ్ళు అని కాక అందరికీ ఎంతో కొంత శాస్త్ర జ్ఞానం ఉండేది అని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది!

పాణిని అష్టాధ్యాయిలో

*శ్వయువమఘోనామతద్దితే* - అనే సూత్రం అయా శబ్దాలకే చెప్పారు. కానీ ఆ బాలిక సూత్రంలో ఉన్న అర్థాలను చమత్కారంగా ఉపయోగించింది.

*తల్లికి కపిలుడి తత్త్వ బోధ* 

                  ➖➖➖

 *ఏకాగ్రతతో తప్పనిసరిగా చదవండి* 


ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. భర్త సన్యసించి మోక్షగామియై తపోవనాలకి వెళ్ళిపోయాడు. ఇక నా గతి ఏమిటి?’ అని చింతించిన దేవహూతి ఒకనాడు….


ధ్యాననిష్ఠుడై వున్న తన కొడుకు కపిల మహర్షిని సమీపించింది.         


తల్లి రాకలోని ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు ప్రసన్న మందహాసం చేసి 

”అమ్మా… నీ మనస్సులో చెలరేగుతున్న సంక్షోభాన్ని గుర్తించాను. స్వాయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. కర్ధమమహర్షి వంటి ఉత్తముడిని భర్తగా పొంది లోటులేని సంసారజీవనం సాగించావు. పదిమంది సంతానానికి జన్మనిచ్చి మాతృమూర్తిగా గృహిణిగా గృహధర్మాన్ని నిర్వర్తించావు. నీలాంటి ఉత్తమ జన్మ అనునది కోటికి ఒక్కరికి వస్తుంది.

‘లేదూ…’ అన్నది లేకుండా చక్కటి జీవితాన్ని గడిపిన నీకు  యీ దిగులు దేనికమ్మా?” అని అడిగాడు.


”నాయనా… నువ్వన్నది నిజమే.  

నా తండ్రి స్వాయంభువ మనువు అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. 

ఏ లేటూ లేకుండా తండ్రి నీడలో నా బాల్య జీవితం గడిచింది. అటుపై గృహస్థాశ్రమంలో నా భర్త చాటున 

ఏ కొరతా లేకుండా నా వైవాహిక జీవితం గడిచింది. తొమ్మిది మంది ఆడపిల్లలకి, ఒక సుపుత్రుడికి తల్లినైనందున నా గృహస్థజీవితం కూడా సంతృప్తిగా గడిచింది. నా అంతటి భాగ్యశాలి లేదనుకొని సంతోషిచాను. 


కానీ, నాయనా… నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు నా తండ్రి. నన్ను సంతానవతిని చేసి, వారి వివాహాలు చేసి తన బాధ్యత తీరిందని తపోవనాలకి వెళ్ళిపోయాడు నా భర్త. వివాహాలు కాగానే భర్తల వెంట నడిచి తమ బాధ్యత తీర్చుకున్నారు నా కూతుళ్ళు!   ఒక్కగానొక్కడివి, దైవాంశా సంభూతడివైన నీ పంచన నా శేషజీవితం గడపవచ్చనుకుంటే … నువ్వు పుడుతూనే యోగివై, విరాగివై, అవతార పురుషుడివై, సాంఖ్యయోగ ప్రబోధకుడివై    నా ఆశల మీద నీళ్ళు చల్లావు. 


నా తండ్రి, నా భర్త,   కుమార్తెలు, కుమారుడు… ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకొని నన్ను ఒంటరిదాన్ని చేశారు. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులకి కన్యాదాన ఫలం దక్కింది. నన్ను వివాహమాడినందుకు    నా భర్తకి గృహస్థాశ్రమ ధర్మఫలం, కన్యాదానఫలం దక్కింది. వివాహాలైన    నా కూతుళ్ళకీ, కుమారుడివైన నీకూ పితృఋణఫలం దక్కుతుంది. 


ఏ ఫలం, ఫలితం ఆశించకుండా బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి          మీ అందరికీ సేవలు చేసిన నాకు దక్కిన ఫలం ఏమిటి నాయనా? ఇక ముందు నా గతి ఏమిటి?” అని వాపోయింది దేవహూతి   గద్గద స్వరంతో.


కపిలుడు మందహాసం చేసి ”అమ్మా! నువ్వేదో భ్రాంతిలో యిలా మాట్లాడుతున్నావు. ఇలాంటి భ్రాంతికి కారణం నిరాహారం కావచ్చు. నువ్వు ఆహారం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదమ్మా” అన్నాడు. 


దేవహూతి విస్మయంగా కుమారుడి వైపు చూచి "నిరాహారిగా ఉండనిచ్చావా నన్ను? నీ మాట కాదనలేక నాలుగు కదళీఫలాలు భుజించాను కదయ్యా” అంది.


”అరటిపళ్ళు తిన్నావా? ఎక్కడివమ్మా?” ఆశ్చర్యంగా అడిగాడు కపిలుడు. 


దేవహూతి మరింత విస్తుబోతూ 

”అదేమిటయ్యా … మన ఆశ్రమంలో రకరకాల ఫలవృక్షాలను నాటాము. వాటికి కాసిన పళ్లని ఆరగిస్తున్నాము. 

ఆ ఫలవృక్షాల్లో ఏ ఋతువులో కాసే పళ్ళు ఆ ఋతువులో పండుతున్నాయి కదయ్యా” అంది. 


కపిలుడు తలపంకించి ”ఓహో… ఋతుధర్మమా?” అన్నాడు. 


‘అవునన్నట్లు’ తలవూపింది దేవహూతి. 


కపిలుడు తల్లి కళ్ళలోకి చూస్తూ…..

”ఋతుధర్మం అంటే…?” అనడిగాడు. 


ఆ ప్రశ్న విని నిర్ఘాంతపోయింది దేవహూతి.


”అమ్మా… ఋతువుకొక ధర్మం వుంది. అది ఏ కాలంలో ఏవి ఫలించాలో వాటిని ఫలింపజేస్తుంది. అలా ఒక్కొక్క ఋతువులో అందుకు తగ్గ ఆహారాన్ని మనకి ప్రసాదిస్తున్న ఋతువు తన ధర్మానికి ప్రతిఫలంగా మననించి ఏమాశిస్తోంది? కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం?” అని ప్రశ్నించాడు కపిలుడు. 


ఆ ప్రశ్నలకి తెల్లబోతూ ”ధర్మానికి కృతజ్ఞత ఎలా చెప్తాం? ఋతువుకి తగ్గవాటిని ఫలింపజేయడం ఋతుధర్మం కదా?” అని ఎదురు ప్రశ్నించింది. 


కపిలుడు మందహాసం చేసి "అంటే, ఋతువు ఎలాంటి ఫలం, కృతజ్ఞత ఆశించకుండా తన ధర్మాన్ని నెరవేరుస్తోందన్న మాట! మరి, అరటి సంగతేమిటి? అరటిచెట్టు కాయలిస్తోంది. పళ్లు యిస్తోంది. అరటి ఊచ యిస్తోంది. ఈ మూడూ మనకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. 


అలాగే అరటి ఆకులు మనకి ఆరోగ్యాన్నిస్తున్నాయి. శుభ కార్యాల సంధర్భాల్లో అరటి పిలకలు తెచ్చి ద్వారాల ముందు నిలుపుతున్నాం. ఇన్ని విధాలా ఉపయోగపడుతున్న అరటికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తోంది? దాని ఆకులు నరుకుతున్నాం.   కాయలు నరుకుతున్నాం.  అరటిబోదె నరుకుతున్నాం. చివరికి దాన్ని తీసిపారేస్తున్నాం. మనం ఇన్ని విధాలుగా హింసించి కృతఘ్నులం అవుతున్నా అరటిచెట్టు తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది… మననించి ప్రతిఫలం, కృతజ్ఞత ఆశించకుండా ఋతువులు, చెట్లు వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. 


మరి, ఇన్నింటి మీద ఆధారపడిన యీ దేహం తన ‘దేహధర్మం’ నిర్వర్తిస్తోందనీ, ఆ దేహధర్మం ప్రతిఫలం, కృతజ్ఞతల కోసం ఆశపడేది కాదని గ్రహించలేవా తల్లీ…” అని ప్రశ్నించాడు కపిలుడు సూటిగా. 


నిశ్చేష్ఠురాలైంది దేవహూతి. 


కపిలుడు మందహాసం చేసి "అమ్మా… నువ్వు బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి సేవలు చేశానన్నావు. ‘నువ్వు’ అంటే ఎవరు?   ఈ నీ దేహమా? 

దేహం ఎప్పటికైనా పతనమైపోయేదే కదా!    నశించిపోయే దేహం కోసం చింతిస్తావెందుకు?      ఒక శరీరాన్ని 

నీ ‘తండ్రి’ అన్నావు.   మరొక శరీరాన్ని 

నీ ‘భర్త’ అన్నావు. మరికొన్ని దేహాలని ‘సంతానం’ అన్నావు. 


ఈ దేహాలన్నీ నువ్వు సృష్టించావా? లేదే! నీ తల్లి, తండ్రి అనే దేహాలని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ భర్త దేహాన్ని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ ఈ దేహం ఎలా తయారైందో, నీ సంతానంగా చెప్పుకుంటున్న ఆ దేహాలు నీ గర్భవాసంలో ఎవరు తయారుచేశారో నీకు తెలియదు. నీ దేహమే నువ్వు నిర్మించలేనప్పుడు నీది కాని పరాయి దేహాలపై వ్యామోహం ఎందుకమ్మా?” అని అన్నాడు. 


దేవహూతి నిర్విణ్ణురాలైంది. 


కపిలుడు మందహాసం చేసి ఆమెకు సాంఖ్యయోగమును ఉపదేశించసాగాడు…


”అమ్మా… మనస్సు అనేది బంధ – మోక్షములకు కారణం. ప్రకృతి పురుష సంయోగం చేత సృష్టి జరుగుతుంది. ఆ పురుషుడే ప్రకృతి మాయలో పడి కర్మపాశం తగుల్కొని దుఃఖ భాజనుడవుతాడు.    నేను, నాది, నావాళ్ళు అన్న  ఆ శాపాశంలో చిక్కుకొని జనన మరణ చక్రంలో పడి అలమటిస్తూ అనేక జన్మలెత్తుతాడు.    జన్మ జన్మకో శరీరాన్ని ధరిస్తాడు. ఏ జన్మకి ఆ జన్మలో ‘ఇది నాది, ఈ దేహం నాది, నేను, నా వాళ్ళు’ అన్న భ్రమలో మునిగివుంటాడే గాని, నిజానికి ఏ జన్మా, ఏ దేహం శాశ్వతం కాదు. తనది కాదు. 


దేహంలోని జీవుడు బయల్వెడలినప్పుడు, మృత్యువు సంభవించినప్పుడు ఆ దేహం కూడా అతడిని అనుసరించదు. ఇంక, ‘నా వాళ్ళు’ అనుకునే దేహాలు ఎందుకు అనుసరిస్తాయి? దేహత్యాగంతోటే దేహం ద్వారా ఏర్పడ్డ కర్మబంధాలన్నీ తెగిపోతాయి. ఆఖరికి ఆ దేహంతోటి అనుబంధం కూడా తెగిపోతుంది. ఇలా తెగిపోయే దేహబంధాన్ని, నశించిపోయే దేహ సంబంధాన్ని శాశ్వతం అనుకుని దానిపై వ్యామోహం పెంచుకునేవారు ఇహ-పర సుఖాలకి దూరమై, జన్మరాహిత్య మోక్షపదాన్ని చేరలేక దుఃఖిస్తుంటారు. కానీ ఆ జీవుడే తామరాకు మీది నీటిబిందువువలె దేహకర్మబంధాలకి అతీతుడై, దేహధర్మానికి మాత్రం తాను నిమిత్తమాత్రుడై ఉండి, ఆచరించినట్లయితే కర్మబంధాలకు, దేహబంధాలకు అతీతంగా, ఆత్మరూపుడై ద్వందా తీతుడవుతాడు.


అరటి పిలక     మొక్క అవుతుంది. ఆకులు వేస్తుంది. పువ్వు పుష్పిస్తుంది. కాయ కాస్తుంది. కాయ పండు అవుతుంది. అది పరుల ఆకలి తీర్చడానికి నిస్వార్థంగా ఉపయోగపడుతుంది. అనంతరం ఆ చెట్టు నశించిపోతుంది. దానిస్థానంలో మరొక మొక్క పుడుతుంది. 

ఈ పరిణామక్రమంలో ఏ దశలోనూ ‘తనది’ అనేదేదీ దానికి లేదు. పుట్టడం, పెరగడం, పుష్పించడం, పరులకి ఉపయోగపడడం, రూపనాశనం పొందడం… ఇది దాని సృష్టి ధర్మం.


"మానవజన్మ కూడా అంతే… దేహాన్ని ధరించడం.. దేహానికి వచ్చే పరిణామ దశలను నిమిత్త మాత్రంగా అనుభవించడం… దేహియైనందుకు సాటి దేహాలకి చేతనైనంత సేవ చెయ్యడం… చివరికి జీవుడు త్యజించాక భూపతనమై, శిధిలమై నశించిపోవడం… ఇంతకు మించి ‘నేను… నాది… నావాళ్ళు’ అన్న బంధం ఏ దేహానికీ శాశ్వతం కాదు.


ఇక దేహంలోకి వచ్చిపోయే ‘జీవుడు’ ఎవరంటే …. పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అను పంచభూతముల సూక్ష్మరూపమే జీవుడు.   ఈ జీవుడు ‘జ్యోతి’ వలె ప్రకాశిస్తూ ‘ఆత్మ’ అనే పేరిట భాశిస్తుంటాడు. 


🙏ఇలాంటి కోట్లాది ‘ఆత్మ’ల ఏకత్వమే ‘పరమాత్మ’… 


ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే 🙏నిరాకారుడు. ఇతడే ‘భగవంతుడు’. 


ఆది, అనాది అయినవాడు యీ ‘భగవంతుడు.’ ఈ భగవంతుడు ‘ఆత్మ’గా ప్రకాశిస్తుంటాడు. ఇతడు ఇఛ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు… అప్పటి వరకు నిరాకారమైన తాను ‘సాకారం’గా తనని తాను సృష్టించుకుంటూ ‘దేహం’ ధరిస్తాడు. ఆ ‘దేహం’లోపల ‘జీవుడు’ అన్న పేరిట ‘ఆత్మ’గా తాను నివసించి ఆ దేహాన్ని నడిపిస్తాడు…. ఆడిస్తాడు… ఒక్కదేహం నించి కోట్లాది దేహాలు సృష్టిస్తాడు. అన్ని దేహాల్లో ‘ఆత్మపురుషుడిగా’ తానుంటూ, 

ఆ దేహాల ద్వారా ప్రపంచ నాటకాన్ని నడిపి వినోదిస్తాడు. 


ఒక్కొక్క దేహానిది ఒక్కొక్క కథ… కధకుడు తానైనా ఏ కథతోనూ తాను సంబంధం పెట్టుకోడు. తామరాకు మీది నీటిబొట్టులా తాను నిమిత్తమాత్రుడై దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు… ఏ దేహి కధని ముగిస్తాడో, ఆ దేహం రాలిపోతుంది. 


దేహం పతనమైనప్పుడు అందులోని ఆత్మ బయటికి వచ్చి తను నివసించడానికి అనుకూలమైన మరో దేహం దొరికేవరకూ దేహరహితంగా సంచరిస్తూ వుంటుంది.


ఇలా దేహాలను సృష్టించి ఆడించేవాడు కనకే ఆ పరమాత్మని ‘దేవుడు’ అన్నారు. ఈ దేవుడినే పురుషుడు అంటారు. 

ఇతడు నిర్వికారుడు, నిర్గుణుడు. కనుక ఇతడిని ‘నిర్గుణ పరబ్రహ్మము’ అంటారు. 

ఇతడిలో అంతర్గతంగా వుండి సృష్టికి సహకరించేది ప్రకృతి.


ఈ జీవసృష్టి పరిణామక్రమంలో భగవంతుడు త్రిమూర్తుల రూపాల్లో తానే సృష్టి, స్థితి, లయములను నిర్వర్తిస్తున్నా… ఏదీ ‘తనది’ అనడు… 

ఏ దేహంతోనూ సంబంధం కలిగి వుండడు. అట్టి పరమాత్ముడి సృష్టిలో పుట్టి నశించిపోయే ఈ దేహం ఎవరిది? ఎవరికి దేనిపై హక్కు, అధికారం ఉంటుంది?”


కపిలుడు అలా వివరంగా ఉపదేశించి 

”అమ్మా… దేహం ఉన్నంతవరకే బంధాలు – అనుబంధాలు. అట్టి దేహమే అశాశ్వితం అన్నప్పుడు దానితోపాటు ఏర్పడే భవబంధాల కోసం ప్రాకులాడి ఏమి ప్రయోజనం? 


తల్లీ, అందుకే జ్ఞానులైన వారు తమ హృదయ మందిరంలో శ్రీహరిని నిలుపుకొని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా! మనస్సే బంధ మోక్షములకు కారణం. అరిషడ్వార్గాలను జయించగలిగితే మనస్సు పరిశుద్దమవుతుంది. పరిశుద్దమైన మనస్సులో వున్న జీవుడే పరమాత్ముడు అన్న విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తి చేత భగవంతుడు దగ్గరవుతాడు. ‘దేహముతో సహా కనిపించే ప్రపంచమంతా’ మిధ్య అని, అంతా వాసుదేవ స్వరూపమే నన్న దృఢభక్తితో సర్వ వస్తువులలో, సర్వత్రా పరమాత్మమయంగా భావించి, అంతటా ఆ పరంధాముడిని దర్శించగలిగితే… దేహం ఎక్కడ? దేహి ఎక్కడ? 


నేను – నాది అనే చింత నశించి … భక్తిమార్గం ద్వారా అతి సులభంగా మోక్షం లభిస్తుంది … అమ్మా, ‘మోక్షం’ అంటే ఏమిటో తెలుసా? 

ఏ ‘పరమాత్మ’నించి అణువుగా, ఆత్మగా విడివడ్డామో… ఆ ‘పరమ – ఆత్మ’లో తిరిగి లీనమైపోవడం. 


తప్పిపోయిన పిల్ల తిరిగి తల్లిని చేరుకున్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని, ఎలాంటి సంతృప్తిని పొందుతుందో… అలాంటి బ్రహ్మానందాన్ని అనుభవించడం” అని ఉపదేశించాడు.


దేవహూతికి ఆత్మానందంతో ఆనందభాష్పాలు జాలువారాయి. అప్పటివరకూ తన పుత్రుడిగా భావిస్తున్న కపిలుడిలో ఆమెకి సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడు దృగ్గోచరమయ్యాడు. 


”నారాయణా… వాసుదేవా… పుండరీకాక్షా… పరంధామా… తండ్రీ… 

నీ దివ్యదర్శన భాగ్యం చేత 

నా జన్మధన్యమైంది. లీలామానుష విగ్రహుడివైన నీ కీర్తిని సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు కూడా వివరించలేడు. సర్వశాస్త్రాలను ఆవిష్కరించిన చతుర్వేదాలు సహితం నీ మహాత్తులను వర్ణించలేవు. పరబ్రహ్మవు, ప్రత్యగాత్మవు, వేదగర్భుడవు అయిన నీవు 

నా గర్భమున సుతుడవై జన్మించి 

నా జన్మను చరితార్థం చేశావు. సృష్టిరహాస్యాన్ని బోధించి, నా అహంకార, మమకారాలను భస్మీపటలం గావించి నాకు జ్ఞానబోధ గావించావు. తండ్రీ… ఈ దేహముపైన, ఈ దేహబంధాలపైన నాకున్న మోహమును నశింపజేసి అవిద్యను తొలగించావు. ఇక నాకే కోరికలు లేవు. పరమాత్ముడివైన నీలో ఐక్యం కావడానికి, జన్మరాహిత్యమైన తరుణోపాయాన్ని ఉపదేశించి అనుగ్రహించు తండ్రీ…” అని ప్రార్థించింది దేవహూతి ఆర్థ్రతతో.


కపిలుడు మందహాసం చేసి ”తల్లీ! సర్వజీవ స్వరూపము శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కన్పించే యీ సృష్టి సమస్తం నారాయణ స్వరూపం. చరాచర జీవరాసులన్నిటియందూ శ్రీమన్నారాయణుని ప్రతిష్టించుకొని ‘సర్వం వాసుదేవాయమయం’గా భావించు. నీకు జీవన్ముక్తి లభిస్తుంది” అని ప్రబోధించి తానే స్వయంగా ఆమెకు మహామంత్రమైన…

 ”ఓం నమో నారాయణాయ” ఉపదేశం చేశాడు.