7, మే 2022, శనివారం

శ్రీ శివానన్దలహరీ

 ॐ                 श्री शिवानन्दलहरी    

                     శ్రీ శివానన్దలహరీ    

      SREE SIVAANANDALAHAREE      


              (श्रीमच्छंकरभगवतः कृतौ)   

           (శ్రీ శంకరాచార్య విరచితమ్)  

        (BY SREE AADI SANKARA)            


                                  శ్లోకం : 18/100

                           SLOKAM : 18/100     


त्वमेको लोकानां परमफलदो दिव्यपदवीं

वहन्तस्त्वन्मूलां पुनरपि भजन्ते हरिमुखाः ।

कियद्वा दाक्षिण्यं तव शिव मदाशा च कियती

कदा वा मद्रक्षां वहसि करुणापूरितदृशा ॥ १८॥    


త్వమేకో లోకానాం పరమఫలదో 

                        దివ్యపదవీం 

వహంత స్త్వన్మూలాం పునరపి భజంతే 

                        హరిముఖాః I 

కియద్వా దాక్షిణ్యం తవ శివ! మదాశా చ 

                              కియతీ 

కదా వా మద్రక్షాం వహసి 

            కరుణాపూరితదృశా ॥          -18  


శంకరా! 

    సమస్తమైన వారికీ, నీవు ఒక్కడివే, 

    పరమఫలాన్ని - అంటే మోక్షాన్ని ఇచ్చేవాడవు. 

    నీవు కారణంగా దివ్యమైన పదవులు అనుభవిస్తున్నవారే అయినప్పటకీ, 

    విష్ణువు మున్నగువారు ఇంకా నిన్ను సేవిస్తూనే యున్నారు. 

    నీ దాక్షిణ్యం ఎంతటిదో కదా! అంటే అది చెప్పశక్యం కానిదీ, అపరిమితమైనదీ. 

    నా ఆశ ఏపాటిది? స్వల్పమైనదే కదా! 

    చల్లని చూపుతో మఱి నన్ను ఎప్పుడు రక్షిస్తావు? 

  (అంటే సంసారముక్తిని ఎప్పుడు కలిగిస్తావు?)  

 

O Shankara! 


    You alone grant great blessings and holy status to the common people of the world, 


    But carrying the holy position, 

    granted by thy kindness great, 

    Vishnu and others pray you always for getting more and more such positions great. 


    Your grace my Lord is immeasurable and 

    my desire too is immeasurable, 

    And so when are you taking up the job of protecting me by your merciful glance?


విశేషం 


    దేవతలందరిలో పరమఫలాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు ఒక్కడే!  

    దాన్ని పొందడంకోసం ఎంతటివారైనా ఆయనని ఆశ్రయింపవలసిందే! 

    పరమేశ్వరుని అనుగ్రహంచేతనే గొప్ప పదవులలో అంటే సృష్టి - స్థితి వ్యాపారాలలో ఉంటున్నప్పటికీ, బ్రహ్మ - విష్ణువు మరల మరల ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నారు.  

    పదవులు ఎంత విశిష్టమైనవి అయినప్పటికీ అశాశ్వతాలే! 

    పుణ్యం క్షీణింపగానే పదవి కోల్పోయి, 

    ఎంతటివాడైనా మళ్ళీ మర్త్యలోకంలో పుట్టి సంసార యాతనలు అనుభవింపక తప్పదు. 

  "క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" అని భగవద్గీతా వాక్యం. 

    కాబట్టి అత్యున్నతమైన పదవిలో ఉంటున్నప్పటికీ పరమేశ్వర సాయుజ్యాన్నే కోరుకోవాలి.  

    దానికి ఆయనని ఆరాధింపక తప్పదు.  


    అనంతమైన విశ్వంలో  భక్తుని స్థానం ఎంతో చిన్నది. 

    ఈ సంసార బంధాలనుండి ముక్తిని పొందాలన్న అతని కోరికకూడా అత్యంత అల్పమైనదే. 

    కాబట్టి అతడు భక్తితో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే, 

    ఆ స్వామి తప్పక కరుణార్ద్రమైన దృష్టితో భక్తుని రక్షిస్తాడు. 


https://youtu.be/h8qlcoPKG5o


                            కొనసాగింపు.. 


                         =x=x=x= 


సేకరణ, కూర్పు :                         

 రామాయణం శర్మ 

      భద్రాచలం

కామెంట్‌లు లేవు: