3, జనవరి 2023, మంగళవారం

కర్కోటకుడు - మంచివాడు

 కర్కోటకుడు - మంచివాడు


శ్రీమఠంతో చిరకాలంగా సంబంధం ఉన్న ఒక భక్తుడు. ఒకసారి పరమాచార్య స్వామివారితో మాట్లాడుతుండగా మరొక వ్యక్తి గురించి నింద చేస్తూ సంభాషించే అవకాశం లభించింది. “ఆ వ్యక్తి పరమ కర్కోటకుడు!” అని అన్నాడు.


ఒక నిముషం తరువాత స్వామివారు, “అతను మంచివాడు అని అంటున్నావా?” అని అడిగారు.


స్వామివారి మాటలు ఆ భక్తునికి అర్థం కాలేదు. “అతణ్ణి నేను భయంకరమైన విషం కలిగిన కర్కోటకుడు అని అన్నాను. . .”


“నీకు ప్రాతఃస్మరణ శ్లోకం తెలుసా?” అని అడిగారు స్వామివారు.


కర్కోటకస్య నాగస్య దమయన్త్యా నలస్య చ,

ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనమ్.


“కర్కోటక నాగుడు, దమయంతి, నల, ఋతుపర్ణుడు - వీరిని తలచినంతనే పాపాలు పోతాయి. వారందరూ అంతటి పుణ్యవంతులు”


అప్పటిదాకా దూషించిన ఆ భక్తుడు ఇప్పుడు సంకటంలో పడ్డాడు. అంటే ఇప్పటిదాకా అతని గురించి చెడుగా మాట్లాడాలి అనుకున్నప్పటికీ చెడుగా మాట్లాడలేదు అన్నమాట.


“నువ్వే అతడు మంచివాడు అని చెబుతున్నావు. అవును కదా?”

పరమాచార్య స్వామివారి దృష్టిలో అందరూ మంచివారే. అద్వైత ప్రతిష్టాపనాచార్యులైన శంకరులు అధిష్టించిన పీఠానికి పీఠాధిపతులు కదా మన స్వామివారు!


--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అయ్యప్పస్వామి

 అయ్యప్పస్వామి కాల్పనిక దైవమా? లేక నిజంగానే హిందూధర్మంలోని దైవమా?


అయ్యప్పస్వామి ఉనికి మీద, పుట్టుకమీద ఎన్నో అనుమానాలు, అపహాస్యాలు మన హిందువులలోనే చాలామందికి ఉన్నాయి.  ఇప్పుడు బైరి నరేష్, రాజేష్ ల మూలంగా వచ్చిన వివాదం కారణంగా అయ్యప్పస్వామి భక్తులంతా ఏకమయ్యారు. హిందూ ధర్మంలో అయ్యప్పస్వామి ఉనికి గురించి చర్చించడానికి ఇది సరైన సమయం.


మన హిందూ వాజ్ఞ్మయం మొత్తం వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఆగమాల మీద ఆధారపడి ఉంది. గ్రామదేవతలనుంచి నిరాకారపరబ్రహ్మ 

వరకు ఏ దేవతలను ఏయే మంత్రాలతో ఏవిధంగా ఏసమయంలో ఎలాంటి ద్రవ్యాలతో పూజలు, హోమాలు చేయాలో వీటిలో వివరంగా ఉంటుంది. దేవతలను మంత్రాలను వేదోక్తం, పురాణోక్తం అని రెండు రకాలుగా విభజన చేయాలి. అగ్ని, గణపతి, సుబ్రమణ్యం, సూర్యుడు, విష్ణువు, శివుడు, లక్ష్మీ, దుర్గ, రుద్ర, గౌరీ, సరస్వతి, బ్రహ్మ,  ఇంద్రాది దిక్పాలకులు, నవగ్రహాలు, నక్షత్ర దేవతలు, పితృ దేవతలు, వాస్తు, భూమి, సర్ప, గరుడ, గోవు లాంటి ప్రధాన దేవతల గురించి వేదమంత్రాలు ఉంటాయి. శ్రీ విద్య లాంటి కొన్ని పురాణోక్త మహావిద్యల గురించి కూడా వేదోపనిషత్తులలో వివరణ ఉంది.


పురాణోక్త దేవతలను గురించి చెప్పబడిన మంత్రోపాసనలకు పురాణాలతోపాటు విడిగా తంత్రాలు, కల్పాలు ఉన్నాయి. ఇలాంటి మంత్రాలు సప్తకోటి అంటే ఏడుకోట్లు ఉన్నాయని దాదాపుగా ప్రతి పురాణంలో వేదవ్యాసులు చెప్పారు. ఈ ఏడుకోట్ల మంత్రాలు పరమశివుని పంచముఖాలనుంచి వ్యక్తం కాగా కొన్నింటికి దక్షణామూర్తి ఋషిగా, కొన్నింటికి హయగ్రీవస్వామి ఋషిగా, మిగిలిన వాటిని ఆనందభైరవుడు ఋషిగా ఉండి దర్శించారు.


 దక్షిణామూర్తి, హయగ్రీవస్వామి బోధించిన మార్గం దక్షిణాచారం, సమయాచారం అని, ఆనందభైరవుడు బోధించిన మార్గం వామాచారం అని ప్రసిద్ధి పొందాయి. వామాచారం బ్రాహ్మణులకు నిషేధం అని వాటిలో చెప్పారు. అలాగే వామాచారం పాటించేవారు తులసి, గంగలను వదిలేయాలని చెప్పారు. ఇక అందరికీ ఆమోదయోగ్యమైన దక్షిణాచారం లేదా సమయాచారాన్ని ఆరు ఆమ్నాయాలుగా విభజించారు. వీటిని షడామ్నాయ మంత్రాలు అంటారు. వేదంలో చెప్పిన మృత్యుంజయ, గాయత్రీ లాంటి సమస్త దేవతలకు తాంత్రిక బీజాక్షరమంత్రాలు వీటిలో చెప్పారు. వాసుదేవ ద్వాదశాక్షరి, శివపంచాక్షరి, నారాయణ అష్టాక్షరి, కాళీ, తార , శ్రీ విద్య  లాంటి మహామంత్రాలు, దశమహావిద్యలు ఈషడామ్నాయాలలో భాగమే. 


వేదంలో చెప్పబడని చండీ, కాళీ, తార లాంటి దేవతామంత్రాలు కూడా షడామ్నాయాలలో కనబడతాయి. వీటిలో భాగంగా శాస్తా మంత్రం కూడా కనబడుతోంది. ఈ మంత్ర అంగన్యాస కరన్యాసాలలో  శాస్తా, హరిహరపుత్ర, మహాశాస్తా, ధర్మశాస్తా, మహాశాస్త్రీ అనే పేర్లతో అయ్యప్పస్వామి మంత్రోపాసన గురించి ఉంది. ఈ మంత్రానికి బ్రహ్మ ఋషి అని చెప్పారు.


దీనితో పాటు ప్రసిద్ధ లలితా సమస్రనామం చెప్పిన బ్రహ్మాండపురాణం, లలితోపాఖ్యానంలో హయగ్రీవస్వామి అగస్త్య మహర్షికి ప్రాయశ్చిత్తకర్మల గురించి చెబుతూ "లక్ష్మీః సరస్వతీ గౌరీ చండికా త్రిపురాంబికా, భైరవో భైరవీ కాళీ మహాశాస్త్రీచ మాతరః" అంటూ లక్ష్మీ, సరస్వతి, గౌరి, చండిక, త్రిపురాంబిక, భైరవ, భైరవి, కాళీలతో పాటు మహాశాస్త్రీ అంటూ అయ్యప్పస్వామిని కూడా పూజించాలంటారు. ఈ లలితోపాఖ్యానంలోనే మహామాయ గురించి చెబుతూ మన్మథుడిని సైతం భస్మం చేసిన పరమశివుడు మహామాయ ప్రభావం వల్ల జగన్మోహిని అవతారం చూసి మోహానికి గురైన కారణంగా హరిహరపుత్ర జననం జరిగిందని స్పష్టంగా ఉంది. 


సహ్యాద్రి నుంచి కన్యాకుమారి వరకు పశ్చిమ కనుమలలో అనేక ప్రాచీన దేవాలయాలను పరశురాముడు ప్రతిష్ట చేశారు. పోర్చుగీస్, టిప్పుసుల్తాన్, బ్రిటీష్ వాళ్ల దాడుల్లో వీటిలో ఎక్కువ శాతం ధ్వంసమై దోపిడీకి గురై దశాబ్దాల తరబడి ఆదరణ లేకుండా పోయాయి. స్వాతంత్ర్యం తరువాత ఈపరిస్థితి కొంత మారిన కారణంగా తిరిగి అయ్యప్పస్వామి దేవస్థానం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ స్వామి మీద ఒక సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు తోడు కావడంతో దక్షిణాదిలో స్వామిమాలధారులు విపరీతంగా పెరిగారు. షిర్డీసాయి సినిమా కూడా దాదాపు ఇదే సమయంలో రావడం వల్ల కొంతమంది సనాతన వాదులు సాయిబాబాలాగా అయ్యప్పస్వామి కూడా ఈమధ్య కాలంలో పుట్టించిన దేవుడని అపోహ పడుతున్నారు.


దీనికి సినిమా వాళ్ళు సృష్టించిన వావరు స్వామి, మకరజ్యోతి గురించి కల్పనలే కారణం. వావరు స్వామి సెక్యులర్ రైటర్స్ సృష్టించిన కథ. అరుణాచలంలో ఏటా కొండమీద వెలిగించే అఖండ దీపం లాంటిదే మకరజ్యోతి. దీన్ని అర్థం చేసుకుంటే అయ్యప్పస్వామి గురించి ఎలాంటి అనుమానాలు అపోహలు ఉండవు.

- స్వామి శరణం

బ్రాహ్మణిజం

 #ఇది బ్రాహ్మణిజం అంటే.. (పూర్తిగా చదవండి, అర్దం చేసుకోండి, గౌరవించండి, కుదిరితే పాటించండి.

ఎవరో బూతులు తిట్టేవిధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది. ఓ దిమ్మరిగా సంచరించే మానవుడు, మరి కొంతమంది తనలాంటి వాళ్ళను కలుపుకొని సమూహంగా, ఆ తరవాత ఇంకొందరిని పోగేసుకుని తెగలుగా ఏర్పడి సంఘజీవిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో వాళ్ల, వాళ్ల నైపుణ్యం, మేధస్సు ఆధారంగా పని విభజన జరిగింది. పాలించేతత్త్వం ఉన్న వాళ్లు క్షత్రియులు అని, బోధించే మేధస్సు కలిగిన వాళ్లు బ్రాహ్మణులు అని, వ్యాపార మెళకువలు తెలిసిన వాళ్లు వైశ్యులు అనీ, మిగిలిన వృత్తులలో చాతుర్యం కలవాళ్లు శూద్రులు అని వర్ణవిభజన జరిగి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రక్రియ ముమ్మాటికీ సహజసిద్దంగా చోటు చేసుకుందే కాని బ్రాహ్మణిజానికి ఏమాత్రం సంబంధం లేని అంశం. ఆ కారణంతో నిందించి, తిట్లతో దుమ్మెత్తి పోయటానికి వర్ణ వ్యవస్థ ఏర్పాటులో బ్రాహ్మణులకు వీసమెత్తు పాత్ర కూడా లేదు. పైగా అది బ్రాహ్మణుల మేధస్సు చూసి మిగిలిన వాళ్లు అక్కసుపడటం మినహా ఇంకోటికాదు అని గుర్తించాలి.

ఇక తాము ఆచరించి, ఆ మంచి అలవాట్లను ఇతరులు కూడా ఆచరించాలని చెప్పడమే బ్రాహ్మణవాదం ముఖ్య ఉద్దేశ్యం. బ్రాహ్మణులూ, బ్రాహ్మణవాదం రెండు అవిభాజ్యం. వాటిని విడదీసి చూస్తున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణవాదులు కారు, ఇందుకు ఫలానావాళ్లు ఉదాహరణ అనడం అవివేకం, మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఇక ఇక్కడ తర్కం అంతా బోధించేవాడి బోధనలు అన్నీ సబబేనా, ఐతే మాత్రం అసలు వాళ్లే ఎందుకు బోధించాలి అని ప్రశ్నించే అభ్యుదయ భావజాలంపైనే.

వీటికి సమాధానాలు రావాలంటే అసలు బ్రాహ్మణులు ప్రపంచానికి బోధించింది ఏమిటి ? దాంట్లో మంచి ఉందా లేక చెడునే బోధించారా ? అసలు బ్రాహ్మణవాదం సూత్రీకరించింది ఏమిటి ? అనే అంశాలను లోతుగా చర్చించాలి. ఆ మాటకొస్తే సర్వ కాల సర్వావస్థల్లో, నూటికి నూరు శాతం లోక కళ్యాణం కోసం తపిస్తూ, ఆహరహం సర్వే జనాః సుఖినో భవంతు అని ఆకాంక్షించిందే బ్రాహ్మణిజం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

★ పూర్వ కాలంలో సంచార జీవిగా ఉన్న మానవునికి నదుల ప్రాధాన్యత వివరించి, సంఘజీవిగా మార్చింది బ్రాహ్మణిజం.

★ తాను తినే కందమూలాలతో పాటు పచ్చిమాసం తినే ఇతరులకు ఆహారాన్ని ఉడకబెట్టుకుని తింటే శ్రేయస్కరం అని బోధించింది బ్రాహ్మణిజం.

★ ఉడికించక ఆహరం అట్లానే తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించింది బ్రాహ్మణవాదం.

★ పసుపుతో తినే పదార్థాల్లో చెడు బాక్టీరియాను నివారించవచ్చు అని చెప్పిందే బ్రాహ్మణవాదం.

★ నివసించే పరిసరాలను పేడతో అలికితే ఆప్రాంతంలో క్రిములు, కీటకాలు నశించి అక్కడి నివసితులకు రోగాలు రాకుండా ఉంటుందని సూత్రీకరించింది బ్రాహ్మణ వాదం.

★ ఊరు పొలిమేరలో అమ్మవారి ప్రతిష్ట చేస్తే దుష్టశక్తులు ఊళ్ళోకి ప్రవేశించవనీ, అనేక అరిష్టాలు గ్రామం దరి చేరకుండా ఉంటాయని సూచించింది బ్రాహ్మణవాదం.

★ ఆడది శక్తి స్వరూపిణి అంటూ, స్త్రీలను గౌరవించాలి, పరాయి మహిళలు తల్లితో సమానం అని ఉద్భోధించి, ఆనాటి తెగల్లో స్త్రీ, పురుషుల మధ్య ఆచరణలో ఉన్న సెక్స్ విశృంఖలత్వాన్ని కట్టడి చేసింది బ్రాహ్మణవాదం.

★ కట్టుబాట్లులేని పాశ్చాత్య సంస్కృతిలోని సెక్స్ పాశవికం మన దగ్గర లేకుండా చేసింది బ్రాహ్మణిజం.

★ చావు, పుట్టుకలు, పాప, పుణ్యాలను ప్రభోధించింది బ్రాహ్మణవాదం.

★ ఒక మనిషి చస్తే అయ్యో పాపం అనడం, ఆయన/ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అనడం బ్రాహ్మణవాదం.

★ చనిపోయిన వాళ్ళ శరీరాలను దహనం చేయాలి, ఖననం చేయాలి అనే సంస్కారాలను సమాజానికి నేర్పింది బ్రాహ్మణిజం.

★ విశ్వశాంతికి, ప్రక్రుతి వైపరీత్య పరిస్థితుల నుంచి మానవాళిని కాపాడుకోవటానికి, కరువు పరిస్థితుల్లో ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆనాటి రోజుల్లోనే శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులు చేయించింది బ్రాహ్మణవాదం.

★ ఇక అన్యులకు గుడి ప్రవేశాలను నియంత్రించి, నిషేధించింది బ్రాహ్మణులు అనడం, దాన్ని బ్రాహ్మణవాదానికి ఆపాదించడం ఓ పెద్ద కుట్ర, శుద్ధ తప్పు.

★ గుడి నిషేధం మధ్య యుగాలనాడు సమాజంపై ముమ్మాటికీ రాచరికం విసిరిన పంజా తాలూకు మరక.

★ విభిన్న కులాలకు చెందిన ఋషులను, మహర్షులను వాళ్ల కులాలకు అతీతంగా ప్రచారంలోకి తెచ్చి, వాళ్ళను కొలిచింది బ్రాహ్మణవాదం.

★ బ్రాహ్మణుడు ఏనాడూ తన కులం వాళ్లను దేవుళ్ళను చేయలేదు.

★ మీకు తెలిసిన దేవుళ్ళలో ఎవరైనా ఒక్క బ్రాహ్మణుడు ఉన్నారేమో ఆలోచించండి. అదే సమయంలో ఇతర కులాల్లో దేవుళ్ళు ఉన్నారా ఆలోచించండి. వాళ్లకు దేవుళ్ళ హోదా ఇచిన ఔన్నత్యం బ్రాహ్మణిజం.

★ తన మనుగడకు దోహదపడుతున్న ప్రకృతిని ఆరాధించి, దైవంగా కొలువాలనీ, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశాలను పంచ భూతాలుగా అభివర్ణించి పూజించాలని చెప్పింది బ్రాహ్మణవాదం.

★ ఇలా మొట్టమొదలు ప్రపంచానికి నడత, నడక, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ నేర్పింది బ్రాహ్మణవాదమే.

★ అటు నిరంతరం విస్తృత పరిశోధనలు చేస్తోన్న మోడ్రన్ సైన్స్ కానీ, ఆచరణలో ఉన్న నాస్తికవాదం కానీ, అనుసరిస్తున్న హేతువాదం కానీ, అరువు తెచ్చుకున్న వామపక్ష భావజాలం కానీ చెప్పలేని చాలా ప్రశ్నలకు ఇదే బ్రాహ్మణవాదం సమాధానం చెప్పింది.

★ భూగ్రహం పరిసరాల్లో ప్రకాశించే సూర్య, చంద్రులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇతర గ్రహాలు, వాటి ఆవశ్యకత, సంచారం, గుట్టుమట్లు, వాటి మీదుగా ప్రసరించే అతినీల లోహిత కిరణాలు, భూగ్రహంపై వాటి ప్రభావాల తీరు లాంటి విషయాలెన్నిటినో ఆనాడే విపులీకరించి చెప్పింది బ్రాహ్మణిజం.

★ అనంత విశ్వం, దాని పుట్టు పూర్వోత్తరాలు, మానవుడు, మానవసృష్టి లాంటి సమాధానం చెప్పలేని వాటిని దేవ రహస్యాలుగా పేర్కొంది.

బ్రాహ్మణవాదం తప్పు అని తేల్చాలనుకునే మేధావులు, నాస్తికులు, హేతువాదులు, సో కాల్డ్ కమ్యూనిస్ట్లు ముందు జనన మరణాల జీవ రహస్యాన్ని ఛేధించాలి, అనంత సృష్టి మూలాల అంతును విడమరచి లోకానికి చెప్పాలి. వాటిని శోధించి, ఛేదించి, బ్రాహ్మణులను, బ్రాహ్మణ వాదాన్ని తప్పు అనాలి. అంతేకాని ఉత్తగనే, అలవోకగా నోటికొచ్చింది వాగుతాము అంటే కుదరదు.

మనం నిత్యం ఆచరించే, మన సంస్కృతిలో భాగమైన వీటన్నిటినీ వదిలిపెట్టి సంబంధం లేని అంశాలను బ్రాహ్మణవాదంతో ముడిపెట్టి, ఆసంబద్ధ అభిప్రాయాలు ఏర్పరచుకొని, మీరు ఆనాడు చేసిందానికి, ఈనాడు మేం ఎంత చేసినా తక్కువే అని వితండవాదం చేస్తూ, బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణవాదం పట్లా ఒక రకమైన కక్ష పూరిత ధోరణిని ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. అలా అనవసరమైన అంశాలను బ్రాహ్మణిజానికి ముడిపెట్టి, మూర్ఖత్వంతో ఒక్క మాట అనే నైతిక హక్కు ఎవరికీ లేదు.

జై శ్రీరామ్.

చిదంబరం - కుంచితపాదం

 చిదంబరం - కుంచితపాదం


పరమాచార్య స్వామివారు సిద్ధి పొందే సంవత్సరం ముందు వారి తొంబైల చివర్లలో జరిగిన సంఘటన ఇది. మహాస్వామి వారు అక్కడ ఉన్న శిష్యులతో చిదంబరంలో ఉన్న శ్రీనటరాజ స్వామి గుడికి వెళ్ళాలని, స్వామి దర్శనం చేసుకోకావలని ఉందని చెప్పేవారు. చిదంబరం అలయముకు సంబధించిన వివిధ మొక్కల వేర్లతో చేయబడిన ఒక చిన్న మాల వంటి "కుంచితపాదం" గురించి చెప్పేవారు (ఇక్కడున్న చిత్రంలో స్వామివారు తలమీద దరించి ఉన్నది చూడవచ్చును).


చిదంబరం వెళ్ళిన వాళ్ళకు దీనిగురించి బాగా తెలిసిఉంటుంది. ‘కుంచితపాదము’ను దర్శిస్తే ఆ వ్యక్తికి ఉన్న రోగములు అన్ని నయం అవుతాయని, మోక్షం ప్రసాదింబడుతుందని అందరి విశ్వాసము.


స్వామివారి మాటలు విన్న శిష్యులు విచారంతో కొంత ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రస్తుతం స్వామివారు ఉన్నటువంటి పరిస్థితులలో వారు అక్కడికి పోవుట దాదాపుగా అసాధ్యము. అంతదూరం స్వామిని తీసుకొని వెళ్ళడం కూడా మంచిది కాదు. ఆశ్చర్యకరంగా స్వామివారు ఆ మాటలన్న మరుసటి రోజు ఉదయమున చిదంబరం దేవస్థానం నుండి కొందరు దీక్షితర్లు వచ్చారు.


థిల్లై నటరాజ స్వామివారి ప్రసాదమును, ‘కుంచితపాదము’ను తీసుకొని శ్రీ మఠానికి వచ్చారు. మహాస్వామి వారిని దర్శించాలని, చిదంబరం నుండి తీసుకు వచ్చిన ప్రసాదములను శ్రీ వారికి ఇవ్వాలని శిష్యులకు తెలియచేసారు.


ఆ మాటలు విని శిష్యులు చాలా సంతోషించారు. వెంటనే స్వామి దగ్గరకు వెళ్లి చిదంబరం ఆలయ దీక్షితర్లు తమ దర్శననికి ఎదురుచూస్తున్నారు అని తెలియజేసారు. వెంటనే స్వామి వారి అనుమతితో ప్రసాదములు తీసుకువచ్చారు. మహాస్వామి వారు వెంటనే ‘కుంచితపాదము’ను తీసుకుని తమ తల పైన పెట్టుకున్నారు. నటరాజ స్వామిని స్తుతిస్తూ వారిని ఆశీర్వదించి పంపించారు. అప్పుడు తీసిన ఫోటోనే ఇది.


ఈ చిత్రపటం చూసినంత మాత్రం చేత అన్ని రోగములు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఇందులో పరమౌషధమైన ‘కుంచితపాదము’, ఆది వైద్యుడైన సాక్షాత్ ధన్వంతరి స్వారుపము ‘పరమాచార్య స్వామి’ వారు ఉన్నారు.


స్వామి వారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యాలతో ప్రశాంతముగా జీవించుగాక!!!


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అంతరార్ధం

 శివ శివా..రామ రామా..అనడంలో అంతరార్ధం తెలుసా మీకు ?

ఏదైనా తప్పు జరిగినప్పుడు,

చూడకూడనిది చూసినప్పుడు

శివ శివా, రామరామా,

శ్రీరామా అని అనుకోవటంలో ఆంతర్యం ఏమిటి?

అసలిది ఎప్పటి నుంచి అలవాటైంది?

అనే విషయాన్ని గురించి..వివరించే కథా సందర్భం.

శివమహాపురాణం రుద్రసంహిత ఇరవైనాలుగో అధ్యాయంలో ..ఈ కథాసందర్భం కనిపిస్తుంది.

శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడు.

ఆ స్వామి అరణ్యవాసం చేస్తున్నప్పుడు రావణవధ అనే దైవకార్యం కోసం సీతాపహరణ జరిగింది. అప్పుడు రాముడు, ఆయనను వెన్నంటి ఉన్న తమ్ముడైన లక్ష్మణుడు ఇద్దరూ ఆ అడవుల్లో సీతకోసం అడుగడుగునా వెతుకుతూ ముందుకు వెళ్లసాగారు. సీతను వెతికే సమయంలో రామచంద్రుడిని అమితమైన దుఃఖం ఆవరించింది. అలాంటి స్థితిలో ఉన్న రాముడిని లక్ష్మణుడిని లోకసంచారం చేస్తూ ఆకాశమార్గాన వెళుతున్న శివుడు, పార్వతీదేవి చూశారు.

కట్టుకున్న భార్య కోసం రాముడు విలపిస్తున్న

తీరు సతీదేవికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.

భార్య కోసం భర్త నిజంగా ఇంత వేదనను అనుభవిస్తాడా?

పురుషులు స్త్రీల విషయంలో అందులోనూ

భార్య విషయంలో ఇంతగా మమకారాన్ని కలిగి ఉంటారా? అనే సందేహాలు ఆమెకు కలిగాయి. అదే విషయాన్ని గురించి శివుడిని సతీదేవి అడిగింది. అప్పుడు శివుడామెకు శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడని,

ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎలా పాటించాలో ఆయనకు బాగా తెలుసునని,

ఒక భర్తగా భార్యను ప్రేమించటంలోనూ, ఆరాధించటంలోనూ రాముడిని మించిన వారు మరొకరు లేరని వివరించాడు. అయినా సతీదేవికి ఆ విషయం అంతగా మనసుకు ఎక్కలేదు. రామచంద్రుడు ఆనందానికి దూరమై దేహకాంతి తగ్గి దుఃఖభారంతో అడుగులు ముందుకేయటం ఇవన్నీ నటన అని భ్రమించింది. అందుకే మళ్లీ ఆ పరమేశ్వరి శివుడిని రాముడి గురించి అడుగుతూ రాముడి ప్రవర్తన మీద తమకు నమ్మకం కలగటం లేదని అనుమతిస్తే, తాను స్వయంగా శ్రీరామచంద్రుడిని పరీక్షించి నిగ్గు తేల్చాలనుకొంటున్నట్లు చెప్పింది. శివుడు చిరునవ్వు నవ్వి ఎవరు ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా ఏకపత్నీవ్రతం విషయంలో రాముడిదే గెలుపవుతుందని అన్నాడు. సతీదేవిని వెళ్లి రాముడిని పరీక్షించమని చెప్పి

ఆయనొక మర్రిచెట్టు కిందకు వెళ్లాడు. సీత రూపంలో సతీదేవి వెంటనే సీతామాతలాగా రూపం మార్చుకొని సీతాన్వేషణ చేస్తున్న రామలక్ష్మణులకు కనిపించే మార్గంలో వారికెదురుగా నడుచుకొంటూ రాసాగింది. శ్రీరాముడు భార్య భ్రమలో ఉండి తనను సమీపిస్తాడని, తననే భార్యగా అనుకొని సంతోషంతో పొంగిపోతాడని ఆమె అనుకొంది. కానీ సీతగా రూపం మార్చుకొన్న సతీదేవి సమీపానికి వచ్చేసరికి శ్రీరాముడు శివ శివా అంటూ శివ నామస్మరణం చేస్తూ పక్కకు తప్పుకొని వెళ్లిపోయాడు.

లక్ష్మణుడు ఆయననే అనుసరించాడు.

రాముడి గురించి శివుడు చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని అలా సతీదేవి గ్రహించింది.

భార్య మీద ప్రేమానురాగాలు ఏ మేరకుండాలో,

భ్రమలు ఆకర్షణలకు దూరంగా వాస్తవమైన ప్రేమ అనేది ఎలా ఉంటుందో ఇలా రాముడి పాత్ర చిత్రణం ద్వారా శివమహాపురాణం వివరిస్తోంది.

అంతేకాక పరస్త్రీ తన ఎదురుగా ఆకర్షించే రూపంలో వచ్చినప్పుడు రాముడు శివశివా అనటంవల్ల

శివనామం పాపహరణమని,

అది రాముడికి కూడా ఎంతో ఇష్టమైనదని స్పష్టమవుతోంది.

అలాగే శివుడికి రామచంద్రుడి వ్యక్తిత్వం మీద ఎంత నమ్మకమో తెలుస్తుంది.

అందుకే రామనామం శివుడికి ఇష్టమైంది.

పురాణకాలం నుంచి ఇలా చూడకూడనివి చూసినప్పుడు లేదా పాపం అని అనిపించినప్పుడు శివ శివా, రామ రామా అని అనుకోవటం ఓ అలవాటుగా వస్తోందని

ఈ పురాణ కథవల్ల తెలుస్తోంది.


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

ఏ సమయంలో నిద్ర లేస్తే మంచిది

 ఏ సమయంలో నిద్ర లేస్తే మంచిది??


ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పుపట్టిన కత్తితో ఏ సైనికుడు యుద్ధం చేయలేడు.అందుకే యుద్ధానికి వెళ్లేవాడు కత్తిని పదును పెట్టుకోవాలి. అలాగే ఏదైనా ధర్మకార్యం చేయాలన్నా..జీవిత పరమర్థాన్ని తెలుసుకోవాలన్నా , సాధనమైన శరీరాన్ని అందుకు అనుకూలంగా సిద్ధం చేసుకోవాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రాచీన రుషులు మనకు అందించిన మార్గమే సదాచారం.


ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు. ఆయన తన చివరి రోజుల్లో… భగవంతుడిని ప్రార్థిస్తూ, తాను మరల పుడితే భారత దేశంలో పుట్టాలని కోరుకున్నాడట. అయితే ఈనాటి ఇంగ్లీష్ ఎడ్యుకెటేడ్ ఆధునిక మేధావులు, సెక్యులర్ వాదులు , మార్క్స్ మేకాలే వాదులు మాత్రం పుణ్యభూమి భారత్ విలువ తెలియక ఇప్పటికి మన దేశాన్ని నిందిస్తున్నారు. మాక్స్ ముల్లర్ భారత్ లో పుట్టాలని కోరుకోవడానికి ప్రధాన కారణం సదాచార పూర్ణమైన భారతీయ జీవన విధానం. మానవుడు నిద్రలేవడంతోనే అతని దైనందిన జీవితం ఆరంభమౌతుంది. సదాచారంలో మొదటి అంశం నిద్రలేవటం.


నిద్ర ఎప్పుడు లేవాలి..?


ఈ విషయంలో మన ధర్మ శాస్త్రాలు, వైద్యశాస్త్రం ఏం చెప్పాయి..?

నిద్ర లేచే విషయంలో హిందు ధర్మ శాస్త్రాలు, వైద్య శాస్త్రం కూడా ఒకే మాటగా “బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత” అని, అలాగే “బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితం” అని పేర్కొన్నాయి. ఆయురారోగ్యాలతోపాటు ధర్మాచరణకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలని హిందూ ధర్మ గ్రంథాలు తెలిపాయి.


సూర్యోదయానికి ముందున్న ముహూర్తాన్ని రౌద్రమంటారు. దీనికి ముందున్నదే బ్రాహ్మీ ముహూర్తం. అనగా సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందుండే సమయం. ఈ సమయంలో నిద్రలేవటంలో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. భూమి తన చట్టూ తాను తిరగటం వలన రాత్రింపగళ్లూ ఏర్పడతాయి. బ్రాహ్మీముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం. ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి, చురుగ్గా పనిచేస్తాయి. దీనిని ఆదాన సమయం అంటారు.


మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి దాటే వరకు శిథిలత నిచ్చు సమయం. ఈ సమయంలో అలసట స్వభావాలు ఏర్పడుతుంది. శరీరంలోని అన్ని అవయవాల శక్తులు సన్నగిల్లుతాయి. దేహం విశ్రాంతి కోరుకుంటుంది. దీనిని విసర్గ సమయం అంటారు. ఆదాన సమయంలో నిద్రపోవటం, విసర్గ సమయంలో మెలకువగా ఉండటం శారీరకంగానూ, మానసికంగానూ అనారోగ్యకరమైంది. దీంతో బుద్ది చురుకుదనం కోల్పోతుంది. లౌకిక వ్యవహారాలకే ప్రాధాన్యత నిచ్చేవారు ఈ వత్యాసం గుర్తించలేరు. ఇలాంటి వారు తమ ఆధ్యాత్మిక దృష్టిని వికసింప చేసుకునే అవకాశాలను చాలా వరకు కోల్పోతారు. అందుకే ఇలాంటి వారికి అవసరమైన శాంతస్థితి చేకూరదు. దీంతో వీరు నిజమైన సుఖ శాంతులకు దూరం అవుతారు. ఈ ప్రవృత్తిని నిశాచర ప్రవృత్తిగా పిలుస్తారు.


వేకువ జామునే నిద్ర లేచే విషయంలో పసిపిల్లలే సదాచారపరులు. చిన్నారులు తల్లిదండ్రుల కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తాన్నే నిద్రలేస్తారు. వాళ్లను నిద్రలేపుతారు. పసిపిల్లలు నిద్రలేచే ఈ ప్రవృత్తి ప్రకృతి సిద్ధం. బ్రాహ్మీ ముహూర్తంలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. పశుపక్ష్యాదులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి. అంతేకాదు సకల పుష్పాలు…ఈ ముహూర్తంలోనే పరిమళాలు వేదజల్లుతాయి. అలాగే ఈ ముహూర్తంలో నిద్రలేస్తే, మన బుద్ది కూడా వికసించి ఉత్తమ సమాలోచనలు పొందుతుంది. అందుకే ఇది బ్రాహ్మీ ముహూర్తం అయ్యింది. బ్రాహ్మీ అంటే సరస్వతి. బ్రాహ్మీ ముహూర్తాన లేచిన వెంటనే చల్లని నీటితో కళ్లు తుడుచుకోవాలి. కొన్ని గంటలుగా కాంతిని నిరోధించిన కళ్లకు హఠాత్తుగా వెలుగు చూపటం దోషం. అందుకై ఇలా చన్నీటితో తుడుచుకోవాలి.


ఆ తర్వాత ‘సముద్ర వసనే దేవి! పర్వత స్తనమండలే, విష్ణుపత్ని! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే’ అని భూదేవికి నమస్కరించిన తర్వాతే పాదం భూమిపై మోపే ఆచారం మన పెద్దలది. మన దైనిందిన జీవితమంతా సకల దుష్ట విసర్జనలతో సహా ఈ భూమి మీదే చేస్తాము. కాబట్టే మనకు తిండిని ప్రసాదించే, జీవితాంతం మనలను భరించే ఈ భూమికి క్షమాపణ చెప్పుకొని నెత్తిన కాలు పెట్టుటం కనీస కర్తవ్యం. కాలు తగిలితే సారీ చెప్పుకొనే నాగరికతను చూస్తున్న మనం…భూదేవిని క్షమించమని ప్రార్థనను చేయలేమా?


నిద్రలేవగానే శుభదర్శనం చేయాలని సదాచారం చెబుతోంది. నిద్రలేవగానే శ్రోతియుని , గుణ సంపన్నుని, గోవును, అగ్నిని, సోమయాజిలాంటి వారినే చూడాలని, పాపిష్ఠివారిని, అమంగళకర వ్యక్తులను చూడతగనది అంటారు. ఇలా అనడంలో నిద్రలేచిన వెంటనే చేసే దర్శనం ఆరోజు జీవితంపై ప్రభావం చూపుతుందని ప్రజల విశ్వాసం. అందుకే ఎప్పుడైన ప్రమాదం జరగగానే ఛీ..నిద్రలేస్తూ ఎవరి మొగం చూచానో అనుకోవడం మనం చూస్తాం. చాలా మంది నిద్రలేవగానే అరచేతిని చూచుకొంటారు.


కరాగ్రే వసతే లక్ష్మీ-కరమధ్యే సరస్వతీ! కరమూలే స్థితో బ్రహ్మా- ప్రభాతే కరదర్శనం!! అనేది ఆర్ష వ్యాక్యం. అరచేతి అగ్రభాగం లక్ష్మీస్థానం. మధ్యభాగం సరస్వతి స్థానం. కరమూల బ్రహ్మ లేదా గోవింద స్థానం. కాబట్టే ఉదయం లేవగానే అరచేతిని చూచుకొంటారు. అరచేతిలో శ్రీరామ వ్రాసి కన్నుల కద్దుకొవడం కొందరు చేస్తారు. నిద్రలేవనగానే ఏ విధంగానైన దర్శనం అయ్యేటట్లు చేసుకోవడం మంచిది.


దైవ ప్రార్థన తర్వాత ముఖం, కాళ్లు చేతులు కడుగుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి. అనంతరం జలపానం చేయాలి. ప్రాతఃకాల జలపానం ఎంతో ఆరోగ్యప్రదం. రాత్రి నిద్రకు ముందు రాగి, వెండి , కంచు లేదంటే మట్టి పాత్రలో మంచినీరుంచి ప్రాతః కాలంలో త్రాగితే సకల దోషాలు పోయి ఆరోగ్యం చేకూరుతుంది. వాత పిత్తశ్లేష్ఠు, ప్రకోపాలు తొలగటమేకాక హృద్రోగం, కాస, శ్యాస, క్షయ, అస్మరీ..మూత్రంలో రాళ్లు, గ్రహణీ….రక్త విరేచనాలు, అతిసార, అతి మూత్ర మొదలైన ఎన్నో వ్యాధులు క్రమంగా ఉపశమిస్తాయి. అంతేకాక సంతోషం, బలం, ఆయుర్వృద్ధి, వీర్యవృద్ధి,ఆరోగ్యం కలుగుతాయి. జలపానం చేశాక కొంత సేపు నడవడం మలబద్దకాన్ని పొగడుతుంది.


బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాతః స్మరణ కర్త్యవంగా మన పెద్దలు చెప్పారు. ప్రాతఃస్మరణతో పుణ్యము, సంస్కారం, చేకూరుతాయి. ఇష్టదైవాలతోపాటు, మహనీయులను, పుణ్యతీర్థాలను స్మరించటం, మహనీయుల జీవిత విశిష్టతను తెలుసుకొని ఆచరణలో వారిని ఆదర్శంగా స్వీకరించడం జీవితానికి ధన్యత.

విషపూరిత అలవాట్లు*

*మనల్ని నాశనం చేసే 5 విషపూరిత అలవాట్లు*
........................................................

1 . *వాయిదా వేయడం* ( procrastination )

2 . *ఫిర్యాదు చేయడం* ( complaining )

3 . *అతిగా ఆలోచించడం* ( overthing )

4 . *పోల్చుకోవడం* ( comparison )

5 .*(సేఫ్  జోన్లో) ఉండాలనుకోవడం* ( staying comfort zone )

............*వాయిదా వేయడం ..........*

ఏవేవో చేయాలనుకుంటాం . జీవితానికి లక్ష్యాలు పెట్టుకుంటాం . కానీ వాటిని రేపు ,, ఎల్లుండి,,,వారం ,,, సంవత్సరం అని వాయిదా వేసుకుంటూ వుంటాం ..పుణ్యకాలం కాస్తా వెళ్లిపోయాక... చేసేదేముండదు ఇక . 

................*కంప్లైంట్స్ చెయ్యడం..........*

ఇదో దరిద్రపు అలవాటు . మనకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనం 
ఎదుటి వారి మీదనో,,ఇంకేదో మీదనో కంప్లైంట్స్ చేస్తాం ..ఈ భూమ్మీద ఎవ్వరూ కరెక్ట్ కాదు...ఇంకా perfect మనిషి పుట్టలేదు.
మనలోని ఏదైతే లోపమో,, అవలక్షణమో ,,వాసనో ,,, అసమర్థతో వుంటే అది బయటి వాళ్ల మీద కంప్లైంట్స్ గా మారుస్తాం

..........*అతిగా ఆలోచించడం..........*

ఆలోచించేకీ ఏమీ లేనప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నట్టు నాకు బొత్తిగా అర్థం కాదు...ఒక సమస్య అతిగా ఆలోచిస్తే పరిష్కారం అవుతుంది అంటే భూమ్మీద మనుషులందరూ పనీ పాటా వదిలేసి కేవలం ఆలోచిస్తూ కూర్చొని వుండేవాళ్ళు...ఈ భూమ్మీద నువ్వో గెస్టువి మాత్రమే..కాబట్టి నీ బుర్రకి అతిగా పనిపెట్టకు..

......... *పోల్చుకోవడం* ...............

ఇదో పనికిమాలిన అలవాటు . సూది చేసే పని గునపం చెయ్యలేదు..గునపం చేసే పని సూది చెయ్యలేదు...దేని 
ప్రత్యేకత దానిదే...మల్లెపూలు వచ్చే సువాసన గులాబీలు ఇవ్వలేవు . గులాబీలు ఇచ్చే సువాసన మల్లెలు ఇవ్వలేవు..దేని 
ప్రత్యేకత దానిదే...టాయిలెట్లు కడిగే వాని ప్రత్యేకత వానిదే,,విమానం నడిపే వాని ప్రత్యేకత వానిదే.....కాబట్టి మీ జీవితంలో ఎవ్వరితోనూ మిమ్మల్ని పోల్చుకొకండి....ఈ భూమ్మీద మీకు మీరు మాత్రమే ప్రత్యేకం ..అలాగే ఎవరికి వారు ప్రత్యేకమే...

............ *సేఫ్ జోన్లో* ఉండాలనుకోవడం...........

భూమ్మీద చాలా మంది ఇంత డబ్బులు వుంటే సేఫ్ గా ఉంటామనో,,ఇన్ని ఆస్తులు వుంటే సేఫ్ గా ఉంటామనో
లేకపోతే ఫలానా జాగా లో వుంటే సేఫ్ గా వుంటామనో అనుకుంటారు...ముందు మీరు నిద్రలో నుండి మేల్కొవాలి..
అలాంటివేమీ లేవు...సేఫ్ జోన్లో వుండి నేర్చుకునేది ఏమీ వుండదు..
ఆ యుద్ధం చేసే వాడు గెలుస్తాడు... ఆడే వాడు గెలుస్తాడు..
*సేఫ్ గా ఉండాలనుకునే వాడు జీవితంలో ఏ పాఠాన్నీ నేర్చుకోలేడు..*

🙏................................🙏

1, జనవరి 2023, ఆదివారం

ఇంత త్వరగానా

 #మరణం : ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో యమధర్మరాజు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 


యమధర్మరాజు : మానవా.. నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.


మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!


యమధర్మరాజు : తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.


మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను


యమధర్మరాజు : నీకు చెందినవి ఉన్నాయి.


మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?


యమధర్మరాజు : అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి


మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?


యమధర్మరాజు : కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి


మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!


యమధర్మరాజు : అవి పరిస్థితులవి నీవి కావు 


మనిషి: నా స్నేహితులున్నారా అందులో?


యమధర్మరాజు : వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే


మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?


యమధర్మరాజు : వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు


మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!


యమధర్మరాజు : తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.


మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?


యమధర్మరాజు : ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.


మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.


మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.


మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?


యమధర్మరాజు : ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.


 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. పశ్చాతాపులను క్షమించాలి. 


 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

దేవుడున్నాడు

 *దేవుడున్నాడు!*

            

*ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు. అతను సామాన్య మానవుల వలె దేవుడిని నమ్మేవాడు...*


*అంటే పూలు, పళ్ళు, దీపం ధూపం, నైవేద్యం, ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు..*


*అతనికి అలా ఏమీ లభించలేదు దానితో కొంచెం అసంతృప్తి మనసులో ఉండేది.*


*ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు.*


*ఏదైనా మంత్రజపం సద్గురువు ద్వారా దీక్ష తీసుకుని చేయాలని ఎవరో చెప్పగా అతను విన్నాడు..*


*ఆ జ్ఞాని వచ్చారని తెలియగానే ఎంతో ఆశగా వెళ్ళి , దర్శనం చేసుకుని , తన కోరిక వెల్లడించాడు.....*


*సాధువు అంతా శాంతంగా విని, "నేను అలా ఎవరికీ దీక్ష ఇవ్వను కానీ             నీ తపన చూస్తుంటే.........."  భక్తుడు ఆనందభరితుడై సాష్టాంగ నమస్కారం చేసాడు..*

 

*"కానీ జప  విధానం  కొంచెం కష్టం. నీవు చేయగలవో........... లేదో...." *


*"ఎంత కష్టమైనా నేను చేయగలను.. మంత్రం ఫలిస్తే చాలు" అన్నాడు భక్తుడు ఆనందంగా....*


*"ఐతే విను ... నేను చెప్పే మంత్రం పఠించనవసరం లేదు కానీ రోజుకి తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి .... అలా తొమ్మిది రోజులు...*


*ఆ పంచాక్షరీ మంత్రం ఏమిటంటే........ "దేవుడున్నాడు" *


 *భక్తుడు అయోమయంగా చూసాడు.. సాధువు చెప్పిన ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు....ఇన్ని లక్షల,...కోట్ల జపం విన్నాడు కానీ ఇదేమిటి ?*

*పైగా పంచాక్షరీ మంత్రంట ఏమిటది !*

*దేవుడున్నాడనే కదా రోజూ పూజలు చేస్తున్నది ...*

*మళ్ళీ ప్రత్యేకంగా  చెప్పేదేమిటి....?* *అదీ ఇంకొకరితో ....తనను పిచ్చివాడి  క్రింద జమ కడ్తారేమో!!!!!!*


*సాధువు ఒకటే మాట చెప్పాడు "నన్నేమీ ప్రశ్నించ వద్దు...! మంత్రం ఫలించాలంటే తొమ్మిది రోజులు నేను చెప్పినట్లు చేసి, ఆపై నాకు కనిపించు ..."* 



*భక్తుడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా "దేవుడున్నాడు" అని ఎలా అనటం ?*


*ఇంతలో అతని భార్య వచ్చి, పక్కింటి వాళ్ళ గురించి ఏదో చాడీలు చెప్పబోయింది.*


*ఇతను అప్రయత్నంగా అన్నాడు... "దేవుడున్నాడు"*


*అంతే! ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఇతనికి చాలా ఆనందం వేసింది.. వెంటనే అతనికి ఏదో అర్థం అయినట్లు, కానీ ఇంకా సరిగా కానట్లు వింత భావన కలిగింది.* 


*ఆ పై ఇంక ఏ  మంచి కనిపించినా "దేవుడున్నాడు" మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతోనూ,  ఏదైనా చెడు కనిపిస్తే "దేవుడున్నాడు" అన్నీ గమనిస్తున్నాడనే అర్థంతోనూ , అన్యాయం జరుగుతోందని ఎవరైనా అంటే.. "దేవుడున్నాడు" శిక్షిస్తాడనే అర్థంతోనూ, పూజలు అనే విషయం వస్తే "దేవుడున్నాడు" అని భక్తివిశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు.*


*తొమ్మిది రోజులు గడిచాయి.*

*అంతా నెమరువేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్ళాడు...*

*సాధువు అన్నాడు…"నువ్వు ఎప్పుడు, ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకనవసరం. నువ్వు అలా అంటూ గ్రహించిదేమిటో నాకు చెప్పు.”* 


*భక్తుడు తెల్లబోయాడు..అయినా వెంటనే తేరుకుని అన్నాడు...*

*"నాకు తెలిసింది ఏమిటంటే... దైవం సర్వాంతర్యామి. అంతటా వున్నాడు... సర్వజ్ఞుడు...... అతనికి తెలియనిది....మనం దాచగలిగేది ఏమీ లేదు.. నిష్పక్షపాతంగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాడు.. దయాసాగరుడు. ఆనందస్వరూపుడు…. అతనిని మధ్యలో ఆపి సాధువు అన్నాడు….         "ఇప్పుడు చెప్పు... నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు?"*


*భక్తుడు తన్మయత్వంతో   కళ్ళు మూసుకుని అన్నాడు "ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనసులోనుండి 

 "దేవుడున్నాడు" అనే భావం చెదరకుండా స్థిరంగా  ఉండేలా చూస్తే చాలు!*


#*నీతి:*

*కర్మఫలం, స్వర్గం- నరకం, పాపభీతి.. త్యాగం... కరుణ, సానుభూతి.. ప్రేమ.. సేవ ..మానవత్వం.. సత్యం.. ధర్మం... మొదలైన ఉదాత్తమైన భావాలకి ఆలంబన , ఆధారం.. "దేవుడున్నాడు" అని మనసారా విశ్వసించటమే !!*


*ఈ పంచాక్షరీ మంత్రాన్ని నిత్యం జపించండి ....‌ తరించండి.!*


*మనకు  చదువులు చెప్పి  మన అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడే మన గురువులు ప్రత్యక్ష దైవాలు!*🕉️🚩🕉️

అశోక చక్రవర్తి

 *మన దేశంలో "అశోక చక్రవర్తి" జయంతి ఎందుకు జరుపుకోరు??* 


ఎంత ఆలోచించినా "సమాధానం" దొరకలేదు! మీరు ఈ "ప్రశ్నలను" కూడా పరిగణించండి!🤔🤔🤔 అశోక చక్రవర్తి *తండ్రి పేరు - బిందుసార్ గుప్తా* తల్లి పేరు - సుభద్రణి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు "గొప్ప" అనే పదాన్ని పెట్టిన "చక్రవర్తి" 


ఎవరిది - "చక్రవర్తి" యొక్క రాజ చిహ్నం "అశోక చక్రం" భారతీయులు తమ జెండాలో ఉంచారు. 


"చక్రవర్తి" రాజ చిహ్నం "చార్ముఖి సింహం"ను భారతీయులు "జాతీయ చిహ్నం"గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు "సత్యమేవ జయతే"ని స్వీకరించారు.


 అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం "అశోక చక్రం". ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు"... "అఖండ భారత్" (నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్) యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి. అశోక చక్రవర్తి కాలంలో "23విశ్వవిద్యాలయాలు"స్థాపించబడ్డాయి.ఇందులో తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్ మొదలైనవి ప్రముఖమైనవి.ప్రపంచనలుమూలల నుంచి విద్యనభ్యసించడానికిఇక్కడికి వచ్చేవారు. -"చక్రవర్తి" పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత "స్వర్ణ కాలం"గా పరిగణిస్తారు. "చక్రవర్తి" భారతదేశం యొక్క పాలనలో "విశ్వ గురువు". ఇది "బంగారు పక్షి". ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే "గ్రేడ్ ట్రంక్ రోడ్" వంటి అనేక హైవేలునిర్మించబడ్డాయి. 2,000 కిలోమీటర్ల మొత్తం "రోడ్డు"కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. "సరైస్" నిర్మించబడ్డాయి. మానవుడు మానవుడే.., జంతువుల కోసం కూడా తొలిసారిగా "వైద్యగృహాలు" (ఆసుపత్రులు) ప్రారంభించ బడ్డాయి.చంపడం ఆగిపోయింది అలాంటి *"గొప్ప చక్రవర్తి అశోక్"* జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపు కోలేదు?? లేదా సెలవు ప్రకటించలేదు? ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన పౌరులు తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం, తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు?? *"గెలిచినవాడు చంద్రగుప్తుడు"* అని కాకుండా *"గెలిచినవాడు అలెగ్జాండర్"* ఎలా జరిగింది?? చంద్రగుప్త మౌర్యుని ప్రభావం చూసి అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. చాలా ఘోరంగా నైతికత దెబ్బతింది మరియు అలెగ్జాండర్ "వెనుక తిరగవలసి వచ్చింది". *ఈ "చారిత్రక తప్పిదం"ని సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.🙏 🏻* *కనీసం ఐదు గ్రూపులుగా పంపాలి* *కొందరు పంపరు* *అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను🙏*👍🏻 *🙏

జరత్కారుడు

 జరత్కారుడు


సూర్యభగవానుడు కూడా ఎవరి అనుమతి లేకపోతే ఉదయించడో, అస్తమించడో ఆ మహర్షి పేరు జరత్కారుడు. ఆయన తపోశక్తి, సాధనా విధానాలు అనితర సాధ్యాలు. శరీరాన్ని తపస్సు చేత కృశింపచేసుకున్న కారణం చేత ఆయన్ను జరత్కారుడు అంటారు. కేవలం ఎముకలు, నరాలు మాత్రమే ఉండే మహర్షి నిరంతరం భూప్రదక్షిణ చేస్తూ సూర్యాస్తమయం నాటికి ఏ గ్రామం చేరితే అక్కడ ఆగి ఉదయాన్నే మరలా ఆప్రదేశం విడిచిపెట్టేవాడు. అలా పరివ్రాజక జీవితాన్ని అనుసరిస్తున్నాయన ఒకరోజు విచిత్రమైన వ్యక్తులను చూశాడు.


అంతులేని లోతైన గొయ్యి  ఒక చెట్టు ప్రక్క ఉంది. ఆ చెట్టు నుంచీ ఒక బలమైన వేరు గొయ్యికి అడ్డంగా ఉంది. ఆ వేరుకు తలకిందులుగా గొయ్యిలోకి వేళాడుతూ   కొందరు తపస్సు చేసుకుంటూ కనిపించారు. ఇదే వింత అనుకుంటే ఆ వేరును ఒక ఎలుక కొరికేస్తూ  ఉండడం మరో వింత. ఇప్పటికే చాలా మటుకు వేరును ఎలుక కొరికేసింది. మరికొంత భాగం కొరికేస్తే త్వరలోనే వారంతా అంతు కనిపించని గొయ్యిలో పడిపోతారు. అది భయంకరమైన చీకటిగా ఉంది.


ఇదంతా చూసిన జరత్కారుడు మహాశ్చర్యంతో అది ఏ విధమైన తపస్సో తెలుసుకోవాలని వారిని ‘‘మీరెవరు? ఈ మహాప్రమాదమైన తపస్సు ఎందుకు చేస్తున్నారు?‘‘ అని ప్రశ్నించాడు.


దానికి వారు సమాధానంగా ‘‘మేమంతా పితృదేవతలం. మా వంశంలో ఒకడు పెళ్ళీ పెటాకులూ లేకుండా దేశదిమ్మరిగా తిరుగుతున్నాడు. వాడు సంతానం లేకుండా  చనిపోతే మేమంతా ఈ తామసనరకంలో పడిపోతాము. ఈ చీకటి గొయ్యే నరకం. ఆ చెట్టువేరు మా వంశంలోని పనికిమాలిన వాడి ఆయుస్సు. దాన్ని కొరుకుతున్నవాడు యమధర్మరాజు‘‘ అని చెప్పారు.


అది విని గతుక్కుమన్న మహర్షి ‘‘వివాహం సంతానం లేకుండా ఉన్న ఆ వ్యక్తి పేరు ఏమిటి?‘‘అని అడిగాడు.


దానికి వారు‘‘ఆ ... ఉన్నాడులే మా వంశంలో ఒక పనికిమాలిన వాడు జరత్కారుడు అనే పేరుతో‘‘అని అన్నారు.


వారి సమాధానం విని మహాదుఃఖం పొంది జరత్కారుడు ‘‘పితృదేవతల్లారా! నా తాత ముత్తాతల్లారా! మీ దుర్గతి పోగొట్టాలంటే నేను ఏం చేయాలో చెప్పండి‘‘ అని వేడుకొన్నాడు.


‘‘నాయనా! నువ్వే జరత్కారుడని మాకు తెలుసు.  నీవు ప్రాపంచిక వైరాగ్యం వల్ల చేస్తున్న మహాతపస్సు మాకు సంతోషదాయకమే అయినా, నీవు పితృఋణం తీర్చుకోలేదు. పెళ్ళి చేసుకొని  పిల్లలను కనకపోతే మేము తిలోదకాలు లేకుండా శాశ్వతనరకంలో పడిపోతాము. కనుక వెంటనే పెళ్ళి చేసుకొని వంశతంతువు(తీగ) కొనసాగించు‘‘ అని చెప్పారు.


వ్యక్తిగతంగా బ్రహ్మచారిగా ఉండి ఎంత ఉన్నతి ఏ రంగంలో సాధించాము అనేది ప్రధానం కాదు. జన్మనిచ్చిన తల్లి తండ్రులకు నువ్వులూ నీళ్ళూ ఇచ్చే మనుమలను ఇవ్వని జన్మ వృథా.  అటువంటి వారికి మురిక్కాలువలోని పురుగులకూ తేడాలేదు. సూర్యగతిని కూడా శాసించగలిగే తపో సంపన్నుడైన జరత్కారుడికి కూడా పితృఋణవిముక్తి తప్పలేదు. ఆయనతో పోలిస్తే సామాన్య మానవులకు ప్రత్యేకంగా చెప్పేది ఏముందీ? 


ప్రపంచం మీద కోపం కలిగినా, ద్వేషం కలిగినా, వైరాగ్యం కలిగినా వివాహం చేసుకొని సంసారతీగను కొనసాగించి, వారికి తమ కాళ్ళ మీద నిలిచే శక్తి వచ్చే వరకూ గృహస్థాశ్రమ జీవితంలో ఉండి తీరాలి. కుటుంబ జీవనంలోని ప్రేమ ఆప్యాయతలు మనో హృదయబాంధవ్యాల వలన మనకు కలిగిన ప్రపంచ ద్వేషం, కోపం, వైరాగ్యం తగ్గి సామాన్యులం అయ్యే అవకాశం రావడం మాత్రమే కాక నిజమైన వైరాగ్యం త్వరగా పరిణతి చెంది మోక్షకారణం అవుతుంది. 


అయితే వేదవేదాంత అధ్యయనం చేసి సామాన్య సంసారం మీద ఏహ్యభావం పొంది గృహస్థాశ్రమం స్వీకరించని శిష్యుడిని కూడా గురువులు ‘‘ ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీహి‘‘ అని హెచ్చరిస్తారు. కానీ ఈ జీవితానికి భూ మండలం మీద ఉన్న సమస్త స్త్రీలూ నాకు అమ్మలే అనే ప్రమాణం చేసి సన్యాసం స్వీకరించి తన గురువునే సేవిస్తూ ఉండే వారికి మాత్రమే సశాస్త్రీయంగా మోక్షం లభిస్తుంది. ఈ విధంగా సన్యాసం స్వీకరించకుండా బ్రహ్మచర్యం వహించడం శాస్త్ర విధి రహితం. మహాపాపాత్మకమైన జీవితం. 


వివాహం ఎందుకు? అనే ప్రశ్నకు అత్యత్భుతమైన వివరణే ఈ జరత్కారుని జీవితం అని వ్యాసమహర్షి తన మహాభారత ప్రారంభంలో వ్రాశారు.


సకల సాధనలకూ గృహస్థాశ్రమమే మహాశ్రేయోమార్గమని రమణమహర్షి వంటి వారు కూడా చెప్పారు.  


                                  🕉🕉🕉

కోధానికి లోనుకాని మహానుభావుడికి

 శ్లోకం:☝️

*పుణ్యం చిత్తం వ్రతతపోనియమోపవాసైః*

 *క్రోధః క్షణేన దహతీంధనవద్ధుతాశః ।*

*మత్వేతి తస్య వశమేతి న యో మహాత్మా* *తస్యాభివృద్ధిముపయాతి నరస్య పుణ్యం॥*


భావం: అగ్ని ఇంధనాన్ని క్షణంలో దహించివేసినట్టు; బహుకాలం వ్రతము, తపస్సు, నియమాలు, ఉపవాసాల ద్వారా సంపాదించుకున్న పుణ్యాన్ని క్రోధం క్షణంలో నాశనం చేసివేస్తుంది. ఇది తెలుసుకుని కోధానికి లోనుకాని మహానుభావుడికి పుణ్యం వృద్ధిచెందితుంది.

గతానికి వీడ్కోలు

: *గతానికి వీడ్కోలు  - స్వగతంలో వేడికోలు*



గడిచినదంతా గతం    ఇకపై అసంగతం 

గడుస్తున్నది వర్తమానం    రేపటికిది గతం 

గడువబోయేదంతా వర్తమానం  అంగీకృతం 

ఆశల తీరాలలో పూబాటల సమాహితం 


నిన్నటి పొరపాట్లు పునరుక్తైతే అలవాట్లు 

పొరపాట్లను సవరిస్తే జీవితానికి దిద్దుబాట్లు 

దిద్ధుబాట్లే చక్కని నడతకు కట్టుబాట్లు 

కట్టుబాట్లే లేకపోతే అందరిచేతా చీవాట్లు 


మనది కానిచోట అవసరమైతే అర్థించటం 

మనదైనచోట అర్థవంతంగా ఉండటం 

ఘనచరిత్రకోసం సమర్థవంతంగా ఉండటం 

మమతల తోటలలో అనర్థాలను త్రుంచటం 


మారిన సంవత్సరంతో మారాలి మనసులు 

మనసులలో తొలగాలి నాటుకొన్న లొసుగులు 

నూతనత్వపరిమళంతో విరబూయాలి సొగసులు 

అనుభవాలు హరివిల్లై విరిస్తే ఆనందపు సొబగులు 

*~శ్రీశర్మద* 

1-1-2023.

 *నా భారతీయుల్ ఘనుల్*


శార్దూలము:

ప్రాచ్యాచారము గల్గి హైందవసుధాపానమ్ముతో దీప్తమై 

వాచ్యాహార్యములందు శుద్ధమతులై వాల్లభ్యము న్వెల్గుచున్ 

రోచ్యప్రాభవసద్గుణానుభవచిద్రూపోజ్జ్వలాత్మీయతన్ 

నైచ్యాఽప్రాచ్యమనోజదూరగుణులౌ నా భారతీయుల్ ఘనుల్ 

మత్తేభము:

ఘనులై విద్వదపారసారమతులై కారుణ్యకాసారులై 

మునులై విద్యలకాలవాలమణులై మోహారులై ధీరులై 

అనిలో తగ్గని వీరశూరగుణులై అర్యాహసంహర్త్రలై 

కనగా సౌమ్యత వెల్గు భారతజనుల్ కైమోడ్పు కర్హుల్ సుమా! 

*~శ్రీశర్మద* 

1-1-2023.

31, డిసెంబర్ 2022, శనివారం

వైదిక యజ్ఞం - జీవ హింస

 వైదిక యజ్ఞం - జీవ హింస


1957లో పరమాచార్య స్వామివారు అప్పుడు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు. అడయార్ థియోసొఫికల్ సొసైటి ఆధ్వర్యంలో శాఖాహార సదస్సు జరిగింది. ఆ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. కారణమేదైనప్పటికి జంతువులను చంపడం పాపం అని తీర్మానించారు. కాబట్టి మాంసాహారాన్ని వదలి అందరూ శాఖాహారులుగా మారాలి అని చెప్పారు. అహింస, శాఖాహార ప్రాముఖ్యతపై జనంలో అవగాహన కలిగించడానికి చర్యలు కూడా చేపట్టాలని సూచించారు. 


ఆ సదస్సు ముగిసిన తరువాత థియోసొఫికల్ సొసైటి అధ్యక్షుడు శ్రీ శంకర మీనన్ కొంతమంది పాశ్చాత్యులని పరమాచార్య స్వామి అనుమతితో వారి దర్శనానికి తీసుకుని వచ్చారు. స్వామి వారిని కలవాలని ఆ ప్రతినుధులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. 


శంకర మీనన్ అందరిని పేరు ఊరుతో సహా స్వామి వారికి పరిచయం చేసారు. వారిని పరిచయం చేసిన తరువాత స్వామివారి గురించి వారికి చెప్పబోతుండగా మహాస్వామి వారు వారించి, “నా గురించి నువ్వు ఏమి చెప్పనవసరం లేదు. నా గురించి వాళ్ళకు తెలిసింది చాలు” అని అన్నారు. 


కొంతమంది ప్రతినిధులు స్వామి వారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నారు. స్వామి వారు దానికి అంగీకరించగానే మొదటగా వచ్చిన ప్రశ్న “వైదిక యజ్ఞాలలో ఇచ్చే జంతుబలి ఎలా సమర్థిస్తారు? అది పాపం కాదా?”


అందుకు మహాస్వామి వారు “అవును అది చేయతగినదే. అది పాపం కాదు” అని బదులిచ్చారు. ఇది వినగానె వారందరూ ఫక్కున నవ్వారు. స్వామి వారిని అవమానపరిచారు అని మీనన్ గారికి కోపం వచ్చింది. వారివైపు తిరిగి ఆవేశంతో, “నేను మిమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చింది స్వామి వారి ఆశీస్సులకోసం. మీరు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తారు అని తెలిసుంటె నేను ఈ పనికి పూనుకునేవాణ్ణి కాదు” అని అరిచారు. 


స్వామివారు మీనన్ ను శాంతపరిచారు. “వాళ్ళపై కోపం పడవద్దు. వారు ఒక స్పష్టతతో ఇక్కడికి వచ్చారు. జీవహింస పాపం అని అది ఏ కారణానికి అమోదయోగ్యం కాదని నిర్ధారణకు వచ్చారు. కాని నా సమాధానం దాన్ని వ్యతిరేకించడం వలన వాళ్ళు నవ్వారు. నన్ను అవమాన పరచలాని వాళ్ళకు ఆలోచన లేదు. మనం వారికి అర్థం అయ్యే లాగా సమాధానం చెప్పాలి” అని శాంతంగా చెప్పారు. 


మీనన్ కోపం తగ్గిన తరువాత మళ్ళా స్వామి వారు ఇలా చెప్పారు “ఒక హంతకుడు ఒక వ్యక్తిని చంపుతాడు. కోర్టు ఆ విషయాన్ని నిర్ధారించి ఆ హంతకుడికి మరణ శిక్ష విధిస్తుంది. ఆ హంతకుడు పాపభీతి లేక ఆవేశంలో ఒకణ్ణి చంపాడు. మరి అతణ్ణి కోర్టు ఉరితీయడం జీవహింస కాదా? మరి న్యాయమూర్తి చెసినది పాపం కాదా?”


స్వామి వారి మాటలు వారిని అలోచనల్లో పడేసాయి. వారు చాలా విద్యావంతులు. సత్యప్రమాణములైన మాటలు స్వామి వారు చెప్తున్నారని అర్థం చేసుకుని వారి మాటలు వినడానికి ఉత్సాహం చూపారు. 


మరలా మహాస్వామి వారు “నాలుగు రోడ్ల కూడలిలో ఒక ఆంబులెన్స్ వస్తే, అందరిని ఆపి ప్రాణాలు నిలబెట్టే ఆంబులెన్సును ముందు పంపిస్తాము. అంటే అంతమంది ప్రయాణం కంటే ఒక ప్రాణం గొప్పది. వేరొక సందర్భంలో ఒక ఆంబులెన్సు, ఒక అగ్నిమాపక వాహనం వచ్చాయనుకుందాం. అప్పుడు ముందు అగ్నిమాకప యంత్రాన్ని పంపిస్తాం. అంటే ఒక్కడి ప్రాణం కంటే పది మంది ప్రాణాలు గొప్పవి. మరొక్క సంఘటనలో ఒక అగ్నిమాపక వాహనం, అత్యవసరంలో ఉన్న మిలటరి వ్యాను వస్తే ముందు మిలటరి వ్యానును పంపిస్తాం. కొంతమంది ప్రాణాల కంటే దేశ రక్షణ గొప్పది. కాబట్టి అలాంటి సందర్భంలో దేశరక్షణ కోసం కొంతమంది ప్రాణాలను లెక్కచెయ్యము.

 

రాజ్యాన్ని రక్షించుకోవడానికి రాజు యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమందిని చంపుతాడు. ఒకర్ని చంపితేనే మరణదండన విధిస్తే, మరి ఆ రాజుకు ఎన్ని మరణ దండనలు విధించాలి? కాని యుద్ధంలో గెలిస్తే పండగ చేసుకుంటారు. ఈ అన్ని సంఘటనల్లో మనం జీవహింసను అమోదిస్తాం. ఇలాంటి నియమాలణ్ణి మనం ఏర్పరుచుకున్నవే. అలాగే యజ్ఞాలలో ఇచ్చే జంతుబలులు పాపం కాదు. ప్రపంచశాంతి కోసం మానవాళి క్షేమం కోసం ఇలా చేసినా పాపం కాదని వేదాలు ఘోషిస్తున్నాయి.


వేదం అపౌరుషేయం. అది పరమాత్ముని ఊపిరి కాబట్టి ఈశ్వరునకు వేదాలకు అభేదం లేదు. వేదము శాశ్వతము, సత్య ప్రమాణము. ‘శాస్త్రాయ చ సుఖాయ చ’. వేదాలు, శాస్త్రాలు మంచినే బోధిస్తాయి. జగదాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఇదే చెప్పాడు. 


దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః 

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ


మనం యజ్ఞ యాగాదులను చేసి దేవతలను సంతృప్తి పరిస్తే, దేవతలు మనకు సకాల వర్షమును మంచి జీవితాన్ని ఇస్తారు. కాబట్టి వైదిక యజ్ఞములలో చేసే జీవహింస సరిఅయినదే. దాని వల్ల పాపము లేదు. అంతేకాదు. సనాతన ధర్మంలో యజ్ఞము చేయిట హింస, పాపము అని కూడా చెప్పబడింది కాబట్టి చేయకూడదు. కాని ఎవరు చేయుకూడదు అనే విషయం మనం తెలుసుకొని ఉండాలి. 


వ్యాస భగవానుడు రచించిన భాగవతంలో దీనికి సంబంధించిన ఒక ఉపాఖ్యానము ఉంది. ‘ప్రాచీన బర్హి’ అను ఒక రాజు ఉండేవాడు. అతనికి ఆచార్యకాండ యందు విపరీతమైన అభిమానం మక్కువ. కాబట్టి లోకక్షేమం కోసం తరచుగా యజ్ఞయాగాదులు చేసేవాడు. తరువాత అతనికి జ్ఞానం కలిగి అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయాడు. అటువంటి స్థితి పొందిన వాడు ఆ స్థాయిలో ఉన్న సన్యాసి యజ్ఞయాగాదులు చెయ్యరాదు. కాని అతనికి వాటిపైన ఉన్న ఇష్టం వల్ల చేస్తున్నాడు. నారదమహర్షి వచ్చి అతనికి అతనికి జ్ఞానోదయం కలిగించాడు. అప్పటినుండి అతను యజ్ఞయాగాదులు మానేసాడు. 


కాబట్టి, “ఏది హింస, ఏది కాదు, ఎవరు ఏమి చెయ్యాలి?, ఏమి చెయ్యకూడదు” అని చెప్పవలసినవి వేదాలు మాత్రమే నువ్వు నేను కాదు. మనకు వేదమే ప్రమాణం. చట్లకు కూడా ప్రాణం ఉందని ఈరోజు అందరికి తెలుసు. విత్తనం నుండి మొలకెత్తి చెట్టుగా మారి మళ్ళా ఎన్నో విత్తనాలను ఇస్తుంది. కాబట్టి విత్తనాలు తినడం కూడా హింసే. కాయగూరలు, ఆకుకూరలు కూడా జీవహింస కదా. అందుకే సన్యాసులు కూరగాయలు కూడా తీసుకోరు. జ్ఞానులు ఎండుటాకులు, నీరు, గాలి తీసుకుని బ్రతికేవారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. 


కాబట్టి వీటన్నిటి వల్ల మనకు తెలిసేదేమంటే కేవలం ఋషులు, సాధకులు తప్ప పూర్తి అహింస ఎవరూ పాటించలేరు. కాబట్టి అహింస అనేది వారి వారి ఆశ్రమాన్ని బట్టి పాటించాలి. కాబట్టి గృహస్తు చేసే యజ్ఞయాగాదుల వల్ల జరిగే హింస పాపం కాదు. ఇది వేదప్రమాణం. కాబట్టి ఈ నియమాలను మనం ఉల్లంఘించరాదు. 


--- థిల్లైనాథన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 4

అతడు డ్రైవరు 

అతడు డ్రైవరు 

ఒక కారు నడిపే చోదకుడిని కారు డ్రైవరు అని, ఒక లారీ నడిపే చోదకుడిని లారీ డ్రైవరు అని, అదే జీపుని నడిపే డ్రైవరుని జీపు డ్రైవరు అని పిలవటం మనం సాధారణంగా చూస్తూవుంటాము. అంతేకాదు మారుతి కారు, మహేన్ద్ర కారు, టాటా కారు అని ఇంకా కారుకు ముందు పెట్టి డ్రైవరు అని పిలుస్తారు. మారుతి కారు డ్రైవరు, మహేంద్ర కారు డ్రైవరు ఆలా ఇంకా కొన్ని సందర్భాలలో యజమాని పేరుతొ అంటే రామారావు కారు డ్రైవరు, కృష్ణారావు కారు డ్రైవరు ఇలా.  అతని ఎలా పిలిచినకాని నిజానికి ఆటను మాత్రం డ్రైవరు. 

ఒక డ్రైవరు చక్కగా తాను విధినిర్వహణ చేస్తున్న కారును చక్కగా నడిపి యజమాని అవసరానుకూలంగా అతనిని సరైన సమయానికి అతను కోరుకున్న ప్రదేశాలకు చేర్చుతూ, కారును మంచిగా చూసుకుంటూ ఉంటే ఆ డ్రైవరు ఆ యజమాని మెప్పుని పొంది అతని జీతంలో వృద్ధి మరియు ఇతర ఎలావన్సులు యజమాని నుండి పొందగలడు, అదేవిధంగా కారుని సరిగా చూసుకోక కారుకు ప్రమాదాలను కలగచేస్తూ, యజమానికి కారు ఎక్కాలంటేనే భయం వేసే విధంగా కారును నడిపితే ఆ కారు డ్రైవరు యజమాని కోపానికి గురి అయి వెంటనే ఉద్యోగంనుండి తొలగించటమే కాకుండా యజమాని అతని నుండి నష్టపరిహారం కారే విధంగాకూడా పరిస్థితులు  ఏర్పడవచ్చు. వీటన్నిటికీ కారణం డ్రైవరు తన విధులను నిర్వహించే విధానం మీద ఆధార పడివున్నదని వేరే చెప్పనవసరం లేదు.  మనం ఉపయోగించే ఏ వస్తువు అయినా మనం దానిని వాడే విధానం మీద ఆధార పడివుంటుందని వేరే చెప్పనవసరం లేదు. 

ఇద్దరు మిత్రులు ఒకే రోజు చెరొక కారు వకే మాడలుది కొన్నారనుకోండి ఆ ఇద్దరు కారులు వకే విధంగా పనిచేయాలని లేదు.  ఒకని కారు ఎలాంటి లోపంలేకుండా చక్కగా నడవ వచ్చు ఇంకొకని కారు కొన్న మరుసటి రోజే చెడిపోయి షడ్డుకు వేళ్ళ వచ్చు. కాబట్టి దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే తయారుచేసే వాడు రెండు ఒకేమాదిరిగా చేసినా కూడా దేని మన్నిక దానిది. మానవుడు ఎంతో నయపుణ్యంతో తయారుచేసిన వస్తువు ఎలా పనిచేస్తుందో చెప్పలేము, కానీ సరిగా పనిచేయటానికి తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు నిపుణులు తీసుకుంటారు. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మిత్రమా నీవు నేను అని దేనిని అంటున్నావో అది నీ శరీరంలో అందులో వున్న నీవే నీవు అంటే అర్ధం కాలేదు కదా అదేమిటంటే నేను అనుకునే శరీరాన్ని నియంత్రించే దివ్య చెతన్యం మాత్రమే నీవు కానీ ఏరకంగా ఐతే ఒక కారు డ్రైవరు ఆ కారుతో కలిపి తన ఉనికిని చెపుతాడో అదేరకంగా నీవు నీ శరీరంతో కలిపి నీ ఉనికిని చెపుతున్నావు.  అంతవరకూ అయితే పరవాలేదు చాలామంది తమ ఉనికే శరీరం అని భావించి శరీరంలోని నిఘాడమైన దివ్యమైన, సుద్ద చేతన్యాన్ని మారుస్తున్నారు.  దానితో వారి శరీరానికి అనేక విధాలుగా బంధాలను, సుఖాలను, పొందాలని ప్రయత్నిస్తూ ఒక అసమర్ధపు కారు డ్రైవరు తానూ కారుని సరిగా నడపలేక ప్రమాదాలకు గురుచేసినట్లుగా శరీరంతో అనేక పాపకృత్యాలను  సలుపుతున్నారు. దాని ఫలితంగా బాధలను, కష్ఠాలను, ఇబ్బదులను, అనుభవిస్తున్నారు.  అదే సత్యాన్ని తెలుసుకున్న సాధకుడు తన శరీరం కేవలం శుద్ధ చెతన్యమైన తనకు ఆశ్రయమిచ్చిన ఒక కారు లాగా భావించి ఏరకంగా ఒక సమర్థుడైన కారు డ్రైవరు లాగా శరీరాన్ని నియంత్రించి పుణ్య కార్యాలు చేసి పుణ్య ఫలితాన్ని పొంది దాని వల్ల సుఖాలను, ఆనందాలను అనుభవించి చివరకు మోక్షపదాన్ని చేరుతున్నాడు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ