24, జనవరి 2021, ఆదివారం

మధుమేహం

 మధుమేహం  -  ఆహారనియమాలు .


    మధుమేహం వంశపారంపర్యమైన వ్యాధి . తల్లితండ్రులిద్దరిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటే పిల్లలలో ఈ వ్యాధి రావడానికి 50 శాతం అవకాశం ఉంటుంది.  తల్లితండ్రులు ఇద్దరికి ఉంటే నూటికినూరుపాళ్లు పిల్లలకు వస్తుంది.  కావున కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నచో మధుమేహం ముప్పు నుంచి కొంత తప్పించుకోవచ్చు.  అవి 


 *  తీపి పదార్దాలు తినకూడదు.


 *  మితాహార నియమాలు విధిగా పాటించాలి .


 *  శరీరం బరువు , లావు పరిమితికి మించకుండా చూసుకోవాలి .


 *  ప్రతినిత్యం వ్యాయాయం చేయాలి .


 *  మానసిక ఒత్తిడిని దూరం పెట్టాలి.


 *  కార్టిజోన్స్ , స్టెరాయిడ్స్ వాడరాదు.


 *  తరచుగా వైద్యుడి వద్ద పరీక్షలు చేయించుకుని సలహాలు తీసుకోవాలి .


         పైన విషయాలలో తగిన జాగ్రత్త తీసుకుంటే ఈ రోగాన్ని దూరంగా ఉంచవచ్చు. 


  పాటించవలసిన ఆహారనియమాలు  - 


         అన్నింటిలో మొదటిది క్రమబద్ధమైన నియమిత ఆహార సమయం . వరిఅన్నం తినేవారు గోధుమకు మారవలసిన అగత్యం లేదు . అన్నిరకాల తృణధాన్యాలలో 70 శాతం పిండిపదార్థాలు ఉండటం వలన ఈ మార్పిడి వలన ప్రయోజనం ఏమి లేదు . ఎవరి అలవాట్లకు వారు అణుగుణంగా వారు ఆహారం తీసుకోవచ్చు  అయితే రోగి ఇంతకు పూర్వం తీసుకునే ఆహారపదార్థాల పరిమాణం మాత్రం ఈ వ్యాధి కారణంగా మార్చుకోవలసి ఉంటుంది. 


           ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే గింజ ధాన్యాలతో అనగా మినుములు , పెసలు, శనగలు , కందులతో చేయబడిన ఆహారపదార్థాలు , పిండిపదార్థాలు ఎక్కువుగా తీసుకోవాలి . వీటిలో తాలింపు పెట్టిన పెసలు , శనగలు లేక నానబెట్టి వాడేసిన పచ్చిశనగలు , పెసలు ఎక్కువుగా తీసుకోవాలి . రోజూ కనీసం ఒక్కసారైనా తీసుకోవటం మంచిది . పీచు ఎక్కువుగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మధుమేహం ఉపశమించటమే రక్తంలో కొవ్వు కూడా బాగా తగ్గుతుంది . గింజధాన్యాలు , కాయగూరలు , ఆకుకూరలు పీచు బాగా కలిగి ఉంటాయి. శనగలు , పెసలు పైతొక్కతో సహా తినటం వలన ఈ విషయంలో మరింత సత్ఫలితం కలుగుతుంది . కాయగూరలు పరిమితి లేకుండా కాయగూరలు .


              కాకరకాయ, చిక్కుడు, ఆనప , బీర, వంకాయ, క్యాబేజీ , కాలిఫ్లవర్ , గుమ్మడి , బూడిదగుమ్మడి , సిమ్లా మిరప, తెల్లముల్లంగి, పోట్ల, మునగ , తొటకూర, గొంగూర, చుక్కకూర , కొత్తిమీర , మునగాకు కూర, పాలకూర మొదలగు అన్ని రకాల ఆకుకూరలు , నీరుల్లి, టొమాటో , దొండ , బెండ, అరటిపువ్వు , అరటిదూట .


           కొవ్వు పదార్దాలు ఎక్కువుగా ఉన్న నెయ్యి , వెన్న , కొబ్బరి నూనె , పామాయిల్ వాడరాదు. కొవ్వు తక్కువ ఉన్న పొద్దుతిరుగుడు గింజల నూనె , నువ్వులనూనె మితంగా వాడవచ్చు . ఆహారం తక్కువ పరిమాణంలో రోజుకి ఎక్కువసార్లు తీసుకోవాలి . లావుగా ఉన్నవారు రోజువారి కేలరీలను కూడా తగ్గించాలి. దుంపకూరలు వాడరాదు. 


         ఎట్టి పరిస్థితులలో చక్కెర , తేనె , గ్లూకోజ్ , బెల్లం , స్వీట్స్ , జీడిపప్పు , బాదం , లేతకొబ్బరి , మత్తుపానీయాలు , శీతలపానీయాలు , హార్లిక్స్ , బూస్ట్ వంటి పోషక విలువలు కలిగిన పానీయాలు అరటి , మామిడి, పనస , సపోటా మొదలగు పండ్లు తీసుకోరాదు . ఉపవాసాలు , నిరాహారదీక్షలు చేయరాదు . రక్తంలో చక్కెర స్థాయి పూర్తిగా అదుపులో ఉంటే అవసరాన్ని బట్టి బత్తాయి, ఆపిల్ , పుచ్చకాయ, జామ  , బొప్పాయి , ఉసిరి , కమలాఫలం తినవచ్చు .


 ఆహార సమయాలు  -


 అల్పాహారం - ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. 


    టొమాటో జ్యూస్ ఒక కప్పు , మొలకెత్తుచున్న గింజలు , రొట్టె లేక చపాతి , పలుచని పాలు పంచదార లేకుండా లేక రాగిమాల్ట్  .


 మధ్యాహ్న భోజనం  -


      12 నుండి 1 గంట వరకు.


 రాత్రి భోజనం  -


   6 గంటల నుండి 9 గంటల వరకు .


   కలగూర, దోసకాయ, టొమాటో , ముల్లంగి , కాకరకాయ, చిక్కుడు మొదలయిన కూరగాయలు , ఉప్పు , మిరియపు పొడి , నిమ్మకాయ చాలా మంచిది . కూరగాయలు ఉడకపెట్టిన నీరు , గోధుమ అన్నం , గోధుమ రొట్టె , ఆకుకూరలు ముఖ్యంగా ములగ , అవిశ , మెంతికూరలు .


 సాయంత్రం అల్పాహారం  - 


    3 గంటల నుండి 5 గంటల వరకు 


     బొప్పాయి ముక్కలు లేక జామపండు, సాల్ట్ బిస్కేట్స్ , పలచని పాలు లేక రాగిమాల్ట్ పంచదార కలపకుండా వాడవచ్చు . 


     మామిడి, అరటి, పిండిపదార్థాలు , ఎక్కువ ఒకేసారి కడుపు నిండగా తినవద్దు.


   

     గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

అస్తిత్వానికి

 శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


పరస్యాప్యస్తిత్వే ప్రబలతరమానం జగదిదం

తదీయై ర్దివ్యాంశైః ప్రకటితవిశేషై ర్గుణనుతైః౹

తతో యావత్తస్య స్థితి రిహ పరస్య స్థితిరపి

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


ప్రకటింపబడిన గుణనుతములైన  దివ్యాంశాలతో 

కూడిన ఈ జగత్తే పరుడి యొక్క అస్తిత్వానికి 

కూడా ప్రబలతర ప్రమాణం. కాబట్టి ఈ జగత్తు ఎంత 

కాలముంటుందో ఆ పరుడి స్థితి కూడా అంతకాలం 

ఉంటుంది.(మేము ఈ జగత్తే మిథ్య అంటుంటాం).

విధాతా ! సృష్టిగతిని ఇలా కొనసాగిస్తూ నువ్వెందుకు 

విఫలుడవవుతున్నావు?

విగ్రహం ఎందుకు

 దైవం అంతటా ఉన్నప్పుడు విగ్రహం ఎందుకు, ఆలయాలు ఎందుకు


శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి అమృత భాషణ నుండి..


విశ్వంలో గాలి అంతటా ఉన్నప్పుడు, మనకు గాలి పంఖా ఎందుకు అవసరం అవుతుంది.....? అంటే సర్వవ్యాప్తమైన గాలి మనకు సరిపోవడం లేదని అర్థం, అలాగే దైవం విశ్వం అంతటా ఉంటాడు. అయినా, నీవు దానిని అధికంగా భావించాలి, వ్యక్తిగతంగా చూడాలి, ప్రత్యేకంగా పూజచేయాలి అని అనిపించినప్పుడు, నీ కోసం ఒక వ్యవస్థ కావాలి. అంతటా ఉండే దేవుడు, అంతటా ఉండే గాలి కానీ నీకు అది చాలటం లేదు.  నీకు గాలి కొంచెం ఎక్కువ కావాలి కనుక, విసనకర్రతోనైనా విసురుకుంటావు, లేదా పంఖా ఐనా ఉపయోగించుకుంటావు. 


అదే విధంగా అంతటా ఉండే దైవాన్ని నీ కండ్లతో చూడాలి అని కానీ, చేతులతో మ్రొక్కాలి అని కానీ, నోరారా కీర్తించాలని అని కానీ అనిపించినప్పుడు, నీ కోసం ఆ దేవుడు ఆంగీరకరించిన రూపమే విగ్రహము. అయితే నీకు పంఖాలో నుండి గాలి రావాలి అంటే ఊరికే రాదు. దానికి ఒక వ్యవస్థ కావాలి. ఒక ఫ్రేములో కొన్ని రేకు ముక్కలు పెట్టాలి. మధ్యలో ఒక మోటారు కావాలి దానికో హబ్ తయారు చేయాలి. మధ్యలో మెషిన్ పెట్టాలి. దానికి కొన్ని మీటలు పెట్టాలి. దానికి విద్యుత్తు ప్రసరణ కోసం తీగలు తగిలించాలి. ఎక్కడో ఒకచోట విద్యుత్తు నియంత్రణకు స్విచ్ పెట్టాలి. ఇన్ని చేసినా పంఖా తిరగదు, దానిని కదిలించేందుకు విద్యుత్ ప్రవాహం ఉండాలి. ఇవన్ని సమకూరితే నీవు కోరుకున్న రీతిలో గాలి నీకు వస్తుంది. ఈ పరిక్రమణ లో ఎక్కడ చిన్న లోపమున్నా అది పనిచేయదు, పైగా మనం అస్తవ్యస్తంగా ఉపయోగిస్తే విద్యుదాఘాతం లాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది, కాబట్టి ఎంతో నియమంగా ఏమరుపాటు లేకుండా ప్రతిదీ సవ్యంగా ఉండేలా చూసుకోవాలి,


ఇదే క్రమంలో మనం కోరుకున్నప్పుడు మన కోసమని ఒక రాతి తోనో, లోహం తోనో, చెక్క  తోనో, వస్త్రం మీదనో ఒక రూపాన్ని మనం తయారు చేసి దానికి ఫ్రేమ్ లాగ ఒక ఆలయాన్ని నిర్మాణం చేసి దానికి ఒక మంత్రం అనే కనెక్షన్ ఇస్తే, నిత్యం స్మరిస్తూ శరణాగతి వేడితే అక్కడ దేవుడు నీ కోసం తన యొక్క అనుగ్రహాన్ని గాలి ఇఛ్చినట్లుగా ప్రసరింపచేస్తాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. 


మనకి ఆలయం మన రక్షణ కోసం. సమాజ రక్షణ కోసం. వేడి తాపం పెరిగితే, మనకు గాలి ఎట్లా అవసరమో, సమాజంలో కూడా క్లేశాలు పెరిగితే, కష్టాలు పెరిగితే, దుఃఖాలు కలిగితే, నష్టాలు కలిగితే, వీటిని తగ్గించి, మనకు సుఖాన్ని ఇవ్వడం అనేది, విగ్రహం యొక్క లక్ష్యం, ఆలయం యొక్క లక్ష్యం. దాన్ని మనం రక్షించుకుంటే అది మనకు లాభం, దాన్ని భక్షిస్తే మనకే నష్టం, అందుచేత మనం దాన్ని కాపాడుకోవాలి. ఇది మనందరి బాధ్యత.


శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి అమృత భాషణ నుండి.....

మృత్యు భయం

 *మృత్యు భయం ఎవరికి ఉండదు ...???*

మనిషి అన్నింటిని ఒప్పుకొంటాడు, కానీ ఒక్క మృత్యువు అంటే భయపడతాడు,

నేను దేనికి ఒరవను, భయపడను అన్న వాడు కూడా మృత్యువు అంటే ఆమడ దూరం పరుగెడతాడు...

మరి ఎవరికి ఈ మృత్యువు అంటే భయముండదు???, పురాణాలను చదివిన వారికా, పూజలు సల్పే వారికా, సేవలు చేసే వారికా, భజనలు నిర్వహించే వారికా???, 

         _*ఒకసారి రామావతార సంఘటన చూద్దాం*_

శ్రీ రామ పట్టాభిషేకం సందర్భంగా, అయోధ్యా నగర మంతయూ, వివిధ అలంకరణ లతో, అశేష జన సందోహంతో కళకళలాడింది. ...

'మనువు'  ధరించి న కిరీటం ధరించడం, సూర్యవంశ పురాజుల సాంప్రదాయం. 

ఆ సాంప్రదాయ మును ననుసరించి,  వశిష్ఠుడు, వామదేవుడు,జాబాలి  ముగ్గురూ కూడి రాముని శిరస్సుపై ఆ కిరీటమునుంచారు...


అనేకమంది రాజులు, రారాజు లు, సామంతులును, ఋషులు, ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. 

సింహ ద్వారము వద్ద, పెద్ద పెద్ద అక్షరాలతో, 

*" సత్యధర్మాభియుక్తానాం   నాస్తిమృత్యుభయం"* అని వ్రాయబడిన బోర్డు కనిపించింది. 

_అనగా .... సత్యధర్మాలతో జీవితం గడిపే వారికి, మృత్యు భయం లేదని అర్ధము...._

 

_ఎందుకంటే  -   సత్యధర్మాలను పాటించే వారికి మరే జన్మ ఉండదు. *జన్మించారు అంటేనే కదా, మరణముండేది!*_ 


                        *_🌸శుభమస్తు🌸_*

               🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

అద్వైత దర్శనమే

 శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


పరాద్భిన్నో జీవో జడమపి చ జీవా జ్జడమపి

తథా జీవాజ్జీవో జడమపి జడాద్ భిన్న మథవా౹

సమస్తేప్యద్వైతా దృగిహ తు భవేన్మోక్షసరణిః

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


పరుడి కంటే జీవుడు,  జడమూ భిన్నాలే. జీవుడి 

కంటే జడం భిన్నం.  జీవుడికంటే  జీవుడు, జడం 

కంటే జడం భిన్నాలు. కానీ భిన్నములైన ఈ  

సమస్తములయందు (పరుడు, జీవుడు, జడము ) 

అద్వైత దర్శనమే మోక్షం. విధాతా ! సృష్టిగతిని 

ఇలా కొనసాగిస్తూ నువ్వెందుకు విఫలుడ

వవుతున్నావు?

పండితవర్యులకు వినమ్రాంజలి!

1. అగ్నిపంచకముగా

   శ్రోత్రము, చక్షువు, జిహ్వ, త్వక్కు, ఘ్రాణము చెప్పబడినవి. వీనినే జ్ఞానేంద్రియా లన్నారు.

2. అగ్ని వలన ఆకలి, దాహము, నిద్ర, సంగమము, నిధానము కలుగుచున్నవని చెప్పబడినది. వీనిలో గల అగ్నితత్త్వమును సమన్వయము చేసి చెప్పగలరని ఆర్యులకు సవినయ విన్నపము.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

జగత్తు

 శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


జగన్మిథ్యా భ్రాన్తి శ్చల మచల మిత్యాదివిశయః

భవేద్వా జ్ఞానాంశః భవతి న ఫలం తేన కిమపి౹

న యావద్దృష్టం తత్ వ్యవహృతిపదే నిత్యగమనే

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


జగత్తు మిథ్య, భ్రాంతి, చలం, అచలం ఇవన్నీ 

కూడా జ్ఞాన విషయాలైతే కావొచ్చు. కానీ ఆ 

జ్ఞానం,  వ్యవహార స్థానంలో నిత్యజీవితంలో 

కనిపించనంతకాలం దాని వలన వచ్చే ఫలమేమీ 

లేదు.(మేమలా జ్ఞానాన్ని వినియోగించటం లేదు)

విధాతా ! సృష్టిగతిని ఇలా కొనసాగిస్తూ నువ్వెందుకు 

విఫలుడవవుతున్నావు?

మహాపురుషులు

 *మహాపురుషులు*

🕉️🌞🌎🏵️🌼🚩

✍️నారంశెట్టి  ఉమామహేశ్వరరావు 

 🍁🍁🍁🍁🍁🍁


మనసులోని యోచన, మాటలోని  సూచన, క్రియలోని ఆచరణ ఒక్కటై  ముందడుగేసేవారే  మహాపురుషులు. నూటికో కోటికో ఒక్కరై  జన్మించి చిరకీర్తితో  చిరస్మరణీయులవుతారు. 

 

‘ప్రళయకాలంలో మేరుపర్వతమే కదలవచ్చునని,  సప్తసాగరాలు చెలియలి కట్టను దాటొచ్చునని,  సత్పురుషుడు ఇచ్చిన వాగ్దానానికి మాత్రం తిరుగుండదన్న”  చాణక్యుని వచనాలను యథార్థమని నిరూపించిన మహాపురుషులను   పురాణాలు ఆదర్శంగా వర్ణించాయి. 

సత్యవాక్య పాలనకై విశ్వామిత్రుని పరీక్షలో రాజ్యభ్రష్టుడై , కష్ట నష్టాలను, కుమారుని మరణాన్ని దిగమింగి,  అర్ధాంగిని సైతం మరుభూమికి అర్పణ గావించేందుకు ఉద్యుక్తుడయిన హరిశ్చంద్రుడి చరితను మార్కండేయ పురాణం వివరించగా,  యంత్ర విజ్ఞానంలో సనత్కుమారులకు  సాటియై, బుద్ధిలో బ్రహస్పతికి ధీటుయై, సత్యవతిని వివాహమాడాలన్న తండ్రి కోరిక తీర్చేందుకు ఆజన్మ బ్రహ్మచర్యం గడిపిన భీష్ముడి గాథను భారతం వివరించింది.  

 

“ఉత్తమశీల స్వభావం కలవారు సర్వులను జయిస్తారని”  విదురనీతి వచించినట్టుగా   సూర్యుని శిష్యుడిగా  విద్యల్లో పారంగతుడై,      సముద్రాన్ని లంఘించి సీతాన్వేషణ జరిపిన అసమాన సాహసి,  లంకా దహనంతో రావణుని హెచ్చరించిన ధైర్యశాలి,  సంజీవనీ పర్వతంతో లక్ష్మణ  తేజస్సు  నిలిపిన అంజనీసుతుడి ఘనతను రామాయణం వివరించింది.   

“బంగారానికి  రుద్దడం , కత్తిరించడం , నిప్పులో  వేయడం, సుత్తితో కొట్టడమనే పరీక్షలున్నట్టే మానవ నైజంలోని  త్యాగం, శీలం, గుణం,  కర్మలే మహాత్ములను నిర్ణయిస్తాయని”  శాస్త్రాలు చెప్పిన 

ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. "రామో విగ్రహవాన్ ధర్మః సాధుస్సత్యపరాక్రమః యని” శత్రువుచే కీర్తించబడిన  ధర్మచరితుడు,  వనవాసానికి కారకురాలైన కైకేయిని మునుపటి ప్రేమతో ఆదరించిన పితృవాక్య పాలకుడు, శరణన్న శత్రువును క్షమించే ఉదాత్త స్వభావుడు, వాలి, రావణాది రాక్షసవీరులను జయించిన జగదేకవీరుడని రామాయణం వర్ణించింది.  

 

‘శక్త్యనుసారం కృషి చేస్తూ, కోల్పోయిన వాటికి శోకించక,  విపత్తులతో ధైర్యం వీడక, ఆరంభించిన కార్యాలను కొనసాగిస్తూ మనస్సును వశపరచుకుని చరించువారు పండితులని” గ్రంథాలన్నట్టు  పట్టుదలకు, కార్యసాధనకు మారుపేరుగా నిలిచి,  దివి నుండి భువికి గంగను తెచ్చి,   సగరపుత్రులు అరవై వేల మందికి మోక్ష ప్రాప్తి కలిగించిన భగీరథుని గొప్పతనాన్ని భాగవతం వివరించింది.    

 “వినయంతో ప్రారంభించి, సహనంతో కొనసాగిస్తే మహాకార్యాలు సాధ్యమవుతాయన్నట్టు” నేటి కాలంలోనూ కొందరు మహాపురుషులు నిరూపించారు.  బానిసత్వంలో మ్రగ్గుతున్న భారతావనికి  స్వేచ్ఛను ప్రసాదించిన  మహాత్మా గాంధీ,  విశాలభారత చిత్రపటావిష్కరణకై  సంస్థానాలను విలీనం  చేయించిన  సర్దార్  వల్లభాయి పటేల్ జాతికి ఆరాధ్య దైవాలయ్యారు. ​

​మహాపురుషుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని జాతి గర్వించే మేటి పౌరులుగా కొందరైనా తయారైన రోజున వారి ఆదర్శాలకు,  త్యాగాలకు  అర్ధం పరమార్ధం చేకూర్చిన వారిమవుతాం.


🕉️🌞🌎🏵️🌼🚩

అంత రంగ సాధన

 *అంత రంగ సాధన*

మనము ఈరోజు చేస్తున్న పూజలు, భజనలు, ఎంతవరకు మనలను భగవంతుని వద్దకు చేరుస్తాయో ఎవరికి తెలియదు,

ఎవరో ఈ దీపం పెట్టండి, ఈ వ్రతం నోమండి, ఈ జపం చేయండి, అని చెప్పగానే ఎగబడి చేస్తాము ... 

కానీ ఎవరైనా సాధన చేయండి, ఈ విధంగా జీవించడం మంచిది, ఈ విధంగా ఆలోచించండి అని చెప్పగానే, వారిపై కస్సు బస్సులు ఆడి, చిందులేస్తాము...

ఈ పూజలు, భజనలు, సాధనలో భగవంతున్నీ తెలుసుకోనేంతవరకే, అటు తరువాత ఆయనను చేరాలి అంటే ... అంతరంగ సాధన సల్పాలి...


   సముద్రము ముత్యాలాది నిధులకు నిలయం, ముత్యాలు కావాలనుకునేవారు సముద్రం లోతులకు పోవాలే తప్ప ఒడ్డున నిలబడి వెతికితే దొరుకుతాయా?! 

అదే విధముగా ఆత్మానందము కావలెనన్నా మన హృదయాంతరములోకి పోయి అందు కొలువైయున్న పరమాత్మను పట్టుకోవాలెను, 

తప్ప బాహ్యమైన, అల్పమైన పూజలతో సరిపెట్టుకోకూడదు. 

సముద్రపు ఒడ్డున నిలబడి వెతికితే దొరుకేవి కేవలం రాళ్లురప్పలే! 

అలానే బాహ్యమైన పూజల వలన కూడా రాళ్ల మాదిరి ఆనందమే కలుగుతుంది....

 రాయికి, ముత్యానికి పోలిక చెప్పలేము, అలానే సాధారణ ఆనందానికి, ఆత్మానందానికి కూడా పోలిక చెప్పలేము....


 ఆత్మానందము విలువ కట్టలేనిది, విశిష్టత కలది. ఇది మానవుని సహజ సంపద.

 కనుక ప్రతీ ఒక్కరూ బాహ్యమైన పూజలు తగ్గించుకుని అంతరంగమునందు భగవంతుని ఆరాధించుచూ ఆత్మానందము పొందుటకు సాధన చేయాలి.

ఆనందానుభవం

 శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


న వాదా దద్వైతా ద్భవతి జనుషో మోక్షపదవీ

వినా తద్విజ్ఞానా త్ప్రియతదనుభవా త్తస్య ఫలనాత్౹

వయం వాక్యై ర్వాదై ర్మధుఘృతరసం జ్ఞాతుమనసః

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹



తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


అద్వైత జ్ఞానం లేకుండా, తనకిష్టమైన ఆ 

ఆనందానుభవం లేకుండా, దాని ఫలం 

కనిపించకుండా, అద్వైత వాదం వలన జనులకు 

మోక్షం రాదు. కానీ,  మేమేమో వాక్యాలతో, 

వాదాలతో తేనె, నెయ్యి మొదలైన వాటి రసాన్ని 

తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటాం.  విధాతా !

సృష్టిగతిని ఇలా కొనసాగిస్తూ నువ్వెందుకు 

విఫలుడవవుతున్నావు?

శ్లోకం:- డా౹౹ సూరం శ్రీనివాసులు


తిరస్కుర్మో న త్వం త్వదభిలషితం నాపి విపులాం

త్వదాత్మీయాం సృష్టిం పర మిహ వయం వచ్మ నితరామ్౹

పరాత్మానం నిత్యం జగదిద మనిత్యం భ్రాన్తి మథవా

కుతో వా ధాతస్త్వం భవసి విఫలస్సర్జనగతౌ౹౹


తాత్పర్యం : సూరం చంద్రశేఖరం 


నిన్ను తిరస్కరించట్లేదు, నీ కోరికనూ  

తిరస్కరించట్లేదు, నీ స్వరూపమైన ఈ సృష్టినీ 

తిరస్కరించట్లేదు. కానీ, మేము ఆ పరమాత్మ 

నిత్యమని, జగత్తు అనిత్యమని లేదా భ్రాంతియని 

చెబుతుంటాం. విధాతా ! సృష్టిగతిని ఇలా కొనసాగిస్తూ 

నువ్వెందుకు విఫలుడవవుతున్నావు?

సాష్టాంగ నమస్కారం

 *సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత*


_అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.._

_సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము..._


ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...


అష్టాంగాలు అంటే...


"ఉరసా" అంటే తొడలు,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా పాదములు,

"కరాభ్యాం" అనగా చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.


ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.


మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..


_ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి._


_1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి._


_2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి._


_3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి._


_4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి._


_5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి._


*అంటే  " నమః శివాయ" అని అంటూ నమస్కారం చేయాలి.*


_6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి._


_7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి._


_8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి..._


*స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు.* ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. 

అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.


పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. 

దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.


*_నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం..._*

మానవీయ లక్షణం

 మనిషి శారీరకంగా ఆర్ధికంగా బలహీనమైనపుడు.. ఆ మనిషి ఎన్ని తప్పులు చేసినా అంతకుముందు మన మననును బాధ పెట్టినా అవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా.. వారిని ఆదరించి నీకు మేమున్నాం అని భరోసా కల్గించడం మానవీయ లక్షణం. రోగాన్ని రోగ గ్రస్త శరీరాన్ని మనం నయంచేయలేకపోయినా అప్పటి వారి మానసిక స్థితి శరీర దౌర్భల్యానికి ఆదరణతో కూడిన సేవ సాంత్వన కల్గించే మాటలను తప్పకుండా అందించాలి. మనుషుల హృదయాలు రాతి హృదయాలు కరగనివయితే కాదు.. కదా!

మంచిమనుషులకు కోపం తాటాకు మంటలాంటిదంటారు.. కదా.. అలా వుండగల్గాలి. ఎవరూ తప్పులు చేయనివారు లోపాలు లేని వారు వుండరు. క్షమ మనిషిని మహోన్నత శిఖరాల మీద కూర్చుండబెడుతుంది అంటారు కదా.. నిజానికి చాలామంది డబ్బు లేక సరైన వైద్యం లేక పోరాడి అలసి అలసి నిస్సహాయస్థితిలో మరణిస్తారు. కొంతమంది అహంకారంతో అన్నీ వుండి కూడా ఆత్మీయులు లేక అలమటిస్తారు.

మనం భగవంతుని ముందు క్షమసత్వం చెప్పుకున్నట్టే మనవారి ముందు చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రేమ వాత్సల్యం ఎరిగినవారు వారే గ్రహిస్తారు. ఎన్ని కన్నీళ్ళు కుమ్మరించిన మాట చేసిన గాయం మానదు.. అయినా వారినీ క్షమించాలి.


ఉమర్ ఖయ్యామ్ రుబాయీ కి చలం తెలుగు అనువాదం చూడండి. 


“భరించే నీక్షమ నాకండగా వుండగా

నా పాపభారాన్ని చూసి నాకేం భయంలేదు.

నా చరిత్ర ఎంత నల్లనిదైనా

నీ కరుణ నన్ను కడిగి శుభ్రంచేస్తే

నీ సమక్షంలో నిలవడానికి నేను జంకను”.

ఇలా అని మనం భగవంతుని ముందే కాదు మన వారి వద్ద అన్నాము అనిపించుకోవడానికి అభిజాత్యం ప్రదర్శించవద్దు. గంగ లాగ పొంగి వచ్చి యమునలా సంగమించేదే ప్రేమ. ప్రేమించడానికి ఒక సాప్ట్ కార్నర్ వుంటుంది ప్రతి ఒక్కరిలో. దాన్ని వాడండి శత్రువుల హృదయాన్ని కుడా గెలుచుకొండి. ఎందుకంటే ఈ భూమి మీద ఇంకా ఎంతకాలం ఉంటామో మరలా మానవులు గా ఈ విచక్షణతో పుడతామో లేదో తెలియదు. కాబట్టి ఈ చిన్ని జన్మలో ఇన్ని కల్మషాలు మనకు ఎందుకు? ఆలోచించండి? *కుదిరితే ఒక పులకరింపు... లేకపోతే ఒక పలకరింపు* ....🙏

అసలైనతోడు



*నీ ఈజీవితంలో అసలైనతోడు ఎవరు?*

అమ్మనా?

నాన్ననా?

భార్యనా?

భర్తనా?

కొడుకా?

కూతురా?

స్నేహితులా?

బంధువులా ?


లేదు.ఎవరూ కాదు.!


నీ నిజమైన తోడు 

*నీ శరీరమే!* 

ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!!

నువ్వు అవునన్నా,కాదన్నా,ఇది కఠిన నిజం.!!!

*నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.* నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు. 

 ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.

*నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని  చూసుకుంటావో,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా  చూసుకుంటుంది.*

నీవేమి తినాలి?

నీవేమి చేయాలి?

ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?

నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?

అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.

గుర్తించుకో !

నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!

నీ శరీరమే నీ ఆస్థి,సంపద.

వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.

నీ శరీరం నీ బాధ్యత...


డబ్బు వస్తుంది.వెళ్తుంది.

బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.

గుర్తుంచుకో.!

నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.

ఒక్క నీవు తప్ప...!


ఊపిరితిత్తులకు- *ప్రాణాయామం.*

మనసుకు- *ధ్యానము*

శరీరానికి- *యోగా.*

గుండెకు- *నడక.*

ప్రేగులకు- *మంచి ఆహారం.*

ఆత్మకు- *మంచి ఆలోచనలు.*

ప్రపంచానికి- *మంచి పనులు.*


👆ఒకటికి రెండు పర్యాయాలు చదవండి. మీ  chakravarthy 🙏

సుభాషితమ్

 🙏 *శుభోదయమ్*🙏

🌸 *సుభాషితమ్* 🌸


శ్లో|| అత్యార్యమతిదాతారం అతిశూరమతివ్రతమ్|

ప్రఙ్ఞాభిమానినం చైవ శ్రీర్భయాన్నోపసర్పతి||


*…. మహాభారతమ్ - ఉద్యోగపర్వం ….*


తా|| "అతి మంచితనం కలవాడి దగ్గరకు, అతిగా దానం చేసేవాడి దగ్గరకు, అతి పరాక్రమవంతుడి దగ్గరకు, తన తెలివిమీద అభిమానం కలవాడి దగ్గరకు లక్ష్మి భయంతో చేరదు...... 

🙏💖🌷

23, జనవరి 2021, శనివారం

మహర్షులు - 2

 మన మహర్షులు - 2


 *అత్రి మహర్షి* 


🍁🍁🍁🍁🍁


అత్రి మహర్షి సప్తమహర్షులలో ఒకరు.


అత్రి మహర్షి బ్రహ్మదేవుడి మనస్సులోంచి పుట్టాడు. 


అంటే బ్రహ్మమానస పుత్రుడన్నమాట. అలా పుట్టిన అత్రి మహర్షిని బ్రహ్మదేవుఁడు “లోక రక్షణ కోసం నేను కొంతమందిని సృష్టిస్తున్నాను, నువ్వు గొప్ప తపశ్చక్తిని పొంది నాకు ఈ సృష్టికార్యంలో సాయపడాలి" అని అడిగాడు


అందుకు అత్రి మహర్షి సరే! అలాగే సాయపడతానని చెప్పి ఒక మంచి అనుకూలమయిన ప్రదేశాన్ని చూసుకుని తపస్సు ప్రారంభించాడు


ఈ మహర్షి చేసిన ఘోరతపస్సుకి ఆయన కళ్ళల్లోంచి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చి భూమి, ఆకాశం అన్ని దిక్కులా వ్యాపించి పోయింది. ఆ తేజస్సుని భూమ్యాకాశాలు కూడా భరించలేక పోవడం వల్ల అది సముద్రంలో పడిపోయింది


ఇది బ్రహ్మదేవుడికి తెలిసి ఆయన ఆ తేజస్సుని అత్రిమహర్షికి తేజస్సు యొక్క కొంత అంశతో చంద్రుడు కుమారుడుగా పుడతాడని, క్షీరసాగర మథన సమయంలో మిగిలిన అంశ వచ్చి చంద్రుడిని కలుస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు.


 కొంతకాలం తర్వాత, అత్రి మహర్షికి అనసూయాదేవితో వివాహం జరిగింది. 

. అనసూయాదేవి గొప్ప

పతివ్రతగా వినుతికెక్కింది.


 ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనసూయాదేవిని పరీక్షిద్దామని బయలుదేరి అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చారు. 


అత్రి మహర్షి అనసూయాదేవి వారికి ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు త్రిమూర్తులు మహర్షితో మాకు వడ్డించే స్త్రీ నగ్నంగా వడ్డించాలి

అన్నారు. అనసూయాదేవి అంగీకారంతో అత్రిమహర్షి మీ కోరిక ప్రకారమే అన్నాడు.



త్రిమూర్తులు స్నానం చేసి కూర్చున్నాక అనసూయ వారిమీద మంత్రజలం చల్లి చంటి పిల్లల్లా చేసి నగ్నంగా వడ్డించింది. మళ్ళీ దుస్తులు ధరించి వాళ్ళ ముగ్గుర్ని మంత్రజలంతో మామూలుగా చేసి తినండి అంది. భోజనం తర్వాత మళ్ళీ చంటి పిల్లల్ని చేసి ఉయ్యాలలో వేసింది.


త్రిమూర్తుల్ని వెతుక్కుంటూ సరస్వతి, లక్ష్మి, పార్వతి వచ్చి అనసూయ దగ్గర చంటి పిల్లల్ని చూసి మా భర్తల్ని మాకియ్యమని అడిగి అత్రి అనసూయలను మా ముగ్గురి అంశలతో ముగ్గురు పిల్లలు కలుగుతారని దీవించి తమ భర్తల్ని తీసుకుని వెళ్ళిపోయారు.


ఒకసారి కౌశికుడి భార్య, సూర్యుడు ఉదయించగానే తన భర్త చనిపోతాడని తెలిసి సూర్యుడు ఉదయించకుండా చేసింది. అనసూయాదేవి సూర్యుడు ఉదయించేటట్లు చేసి కౌశికుణ్ణి కూడా బ్రతికించింది.


అత్రి మహర్షి సంతానం కోసం వంద సంవత్సరాలు భార్యతో కలిసి తపస్సు చేశాడు.


అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై పిల్లలు కలిగేలా వాళ్ళని ఆశీర్వదించారు.


 కొన్నాళ్ళయ్యాక అత్రి మహర్షి  

 అనసూయా దేవికి చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు అనే పేర్లతో ముగ్గురు పిల్లలు పుట్టారు.


సంసారపోషణార్ధం పృథు చక్రవర్తి దగ్గరకు ధనం కోసం వెళ్ళాడు అత్రి మహర్షి.


ఆ సమయంలో పృథుచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఆ యాగాశ్వాన్ని రక్షించడానికి తన కుమారుడితో వెళ్ళమని పృథు చక్రవర్తి అత్రి మహర్షిని అడిగాడు. అత్రి మహర్షి సరేనని బయల్దేరాడు.


పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచేశాడు. 


అత్రి మహర్షి తన దివ్యదృష్టితో చూసి ఆ విషయం పృథు చక్రవర్తి కుమారుడికి చెప్పాడు.


 అతడు ఇంద్రుణ్ణి జయించి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చాడు.


అశ్వమేధయాగం పూర్తయ్యాక పృథు చక్రవర్తి ఇచ్చిన ధనం, వస్తువులు మొదలయిన వాటిని తీసుకువెళ్ళి పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయా దేవితో కలిసి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు.


 ఒప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల్లో వెలుగు తగ్గిపోయి లోకమంతా చీకటయిపోయింది. అప్పుడు

అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందర్ని చంపేశాడు.


అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జపతపాలు రహస్య పాయశ్చిత్తాలు మొదలయిన వాటి గురించి తెలియచేయబడ్డాయి.


. అలాగే అత్రి సంహితలు అనే గ్రంథాల్లో ఆచారాలు, గురుప్రశంస, చాతుర్వర్ణ ధర్మాలు, జపమాలాపవిత్రత, పుత్రులు దత్తపుత్రులు మొదలయినవాటి గురించి తెలియచేయబడ్డాయి.


దత్తపుత్రుణ్ణి స్వీకరించవచ్చు అనే దాన్ని గురించి మొట్టమొదట ప్రవేశపెట్టింది.

అత్రిమహర్షి......!


చదివారు కదా !... సప్తమహర్షుల్లో ఒకడయిన అత్రి మహర్షి గురించి...


రేపు మరో మహర్షి గురించి తెలుసుకొందాం...


జై శ్రీమన్నారాయణ🙏


🍁🍁🍁🍁

సాధన - 8*

 *సాధన - 8* 


*ఓం పూతాత్మనే నమః* 


అద్భుతమైన శ్రీమహావిష్ణువు మంత్రం ఇది. ఇది అత్యద్భుతమైన కార్యసిద్ధి మంత్రం . "పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణా బాధతే". పూర్వజన్మలో చేసిన పాపం రోగం రూపంలో పీడిస్తుంది. రోగం పోతే కాని కార్యసిద్ధి అవ్వదు. సంపదలు రావు. కాబట్టి, రోగం పోవాలంటే కార్యసిద్ధి అవ్వాలంటే పాపం తొలగాలి. పాపం తొలగితే పుణ్యాత్ముడు  అవుతాడు.

           'పూత ఆత్మ' అంటే పవిత్రమైన ఆత్మ కలవాడు విష్ణువు.శ్రీమన్నారాయణుడు పరమాత్మ, పవిత్ర ఆత్మ స్వరూపుడు.


*మంత్ర ప్రయోగం ఫలితం :* 

ఈ మంత్రాన్ని ప్రతి శనివారం 1000 సార్లు అనుష్ఠానం చేస్తే మీరు చేసిన ఏడు జన్మల పాపాలు పోతాయి. "సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి".  పాపాలు పోతే మీరు అనుకున్నవి అన్ని కార్యాలు సిద్ధి అవుతాయి, సంపదలు వస్తాయి.


           కాబట్టి మీరు 40 శనివారాలు కానీ లేదా 27 శనివారాలు కానీ నియమం పెట్టుకోండి. వీలుంటే 40 శనివారాలు  చేయటం చాలా మంచిది. అంత  ఓపిక లేని వాళ్ళు కనీసం  27 శనివారాలు నియమం పెట్టుకుని, ప్రతి  శనివారం నాడు, ఆడవాళ్ళు అయితే బయట ఉన్నప్పుడు మానేయండి, మగవాళ్ళు మైలు వచ్చినప్పుడు మానేయండి

ఆడవాళ్ళైనా ,మగవాళ్ళైనా అశుచిగా ఉన్నప్పుడు చేయకూడదు.

           శనివారం ఉదయం స్నానం చేసి శనిహోర అని ఉంటుంది 6 గంటల నుంచి ఇంచుమించుగా సూర్యోదయం నుంచి ఒక గంట కాలం శనిహోర ఉంటుంది.  మీకు పంచాంగం లో సూర్యోదయం అని ఉంటుంది 5.30 కి కానీ 6 గంటలకి కానీ అక్కడ నుంచి మొదలు పెట్టి 1000 సార్లు జపం చేయవచ్చు.

           ప్రతి శనివారం ఈ " ఓం పూతాత్మనే నమః" అనే మంత్రాన్ని అనుష్ఠానము చేస్తూ తులసి పత్రాలు లేక మారేడు ఆకులతో శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని పూజించండి. ఆ విగ్రహం రాగిది అయినా వెండిది అయినా ఇత్తడిది అయినా అవ్వచ్చు. చిన్ని విగ్రహాన్ని పూజించండి. 27 శనివారాలు లేదా 40 శనివారాలు ఇలా పూజ చేశాక  ఈ విగ్రహాన్ని ఎవరైనా ఒక మంచి పండితుడికి దానం చేయండి. మీకు తోచిన దక్షిణ  ఇవ్వండి. ఇంత అని నియమం లేదు. దీని వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. కార్యసిద్ధి అవుతుంది అని స్వయంగా దుర్వాస మహర్షి ఇంద్రుడికి చెప్పాడు. 

             ఇంద్రుడు అది చేశాక సామ్రాజ్యం వచ్చింది. అనుకున్న పనులు నెరవేరాలంటే ఎంత క్లిష్టమైన పనైనా సరే ఎంత కష్టమైన ఉద్యోగం రావాలనుకున్నా ఇలా మీరు 40 వారాలు చేసినా లేదా మీరు 27 వారాలు చేసినా మీ భక్తిశ్రద్ధలను బట్టి మీరు అనుకున్న పనులు నెరవేరి తీరుతాయి.అందువల్ల కార్యసిద్ధి శ్రీవిష్ణు మహామంత్రం అని దీనిని దుర్వాసుడు చెప్పాడు. తద్వారా కార్యసిద్ధిని పొందండి.


*సూచన:*

గురువుల ద్వారా మంత్రోపదేశం ఉన్నవారు ఓంకారం చేర్చుకుని,లేనివారు ఓంకారం లేకుం.డా జపం చేసుకోవచ్చు.


https://srivaddipartipadmakar.org/