24, జనవరి 2021, ఆదివారం

మృత్యు భయం

 *మృత్యు భయం ఎవరికి ఉండదు ...???*

మనిషి అన్నింటిని ఒప్పుకొంటాడు, కానీ ఒక్క మృత్యువు అంటే భయపడతాడు,

నేను దేనికి ఒరవను, భయపడను అన్న వాడు కూడా మృత్యువు అంటే ఆమడ దూరం పరుగెడతాడు...

మరి ఎవరికి ఈ మృత్యువు అంటే భయముండదు???, పురాణాలను చదివిన వారికా, పూజలు సల్పే వారికా, సేవలు చేసే వారికా, భజనలు నిర్వహించే వారికా???, 

         _*ఒకసారి రామావతార సంఘటన చూద్దాం*_

శ్రీ రామ పట్టాభిషేకం సందర్భంగా, అయోధ్యా నగర మంతయూ, వివిధ అలంకరణ లతో, అశేష జన సందోహంతో కళకళలాడింది. ...

'మనువు'  ధరించి న కిరీటం ధరించడం, సూర్యవంశ పురాజుల సాంప్రదాయం. 

ఆ సాంప్రదాయ మును ననుసరించి,  వశిష్ఠుడు, వామదేవుడు,జాబాలి  ముగ్గురూ కూడి రాముని శిరస్సుపై ఆ కిరీటమునుంచారు...


అనేకమంది రాజులు, రారాజు లు, సామంతులును, ఋషులు, ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. 

సింహ ద్వారము వద్ద, పెద్ద పెద్ద అక్షరాలతో, 

*" సత్యధర్మాభియుక్తానాం   నాస్తిమృత్యుభయం"* అని వ్రాయబడిన బోర్డు కనిపించింది. 

_అనగా .... సత్యధర్మాలతో జీవితం గడిపే వారికి, మృత్యు భయం లేదని అర్ధము...._

 

_ఎందుకంటే  -   సత్యధర్మాలను పాటించే వారికి మరే జన్మ ఉండదు. *జన్మించారు అంటేనే కదా, మరణముండేది!*_ 


                        *_🌸శుభమస్తు🌸_*

               🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

కామెంట్‌లు లేవు: