24, జనవరి 2021, ఆదివారం

మధుమేహం

 మధుమేహం  -  ఆహారనియమాలు .


    మధుమేహం వంశపారంపర్యమైన వ్యాధి . తల్లితండ్రులిద్దరిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటే పిల్లలలో ఈ వ్యాధి రావడానికి 50 శాతం అవకాశం ఉంటుంది.  తల్లితండ్రులు ఇద్దరికి ఉంటే నూటికినూరుపాళ్లు పిల్లలకు వస్తుంది.  కావున కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నచో మధుమేహం ముప్పు నుంచి కొంత తప్పించుకోవచ్చు.  అవి 


 *  తీపి పదార్దాలు తినకూడదు.


 *  మితాహార నియమాలు విధిగా పాటించాలి .


 *  శరీరం బరువు , లావు పరిమితికి మించకుండా చూసుకోవాలి .


 *  ప్రతినిత్యం వ్యాయాయం చేయాలి .


 *  మానసిక ఒత్తిడిని దూరం పెట్టాలి.


 *  కార్టిజోన్స్ , స్టెరాయిడ్స్ వాడరాదు.


 *  తరచుగా వైద్యుడి వద్ద పరీక్షలు చేయించుకుని సలహాలు తీసుకోవాలి .


         పైన విషయాలలో తగిన జాగ్రత్త తీసుకుంటే ఈ రోగాన్ని దూరంగా ఉంచవచ్చు. 


  పాటించవలసిన ఆహారనియమాలు  - 


         అన్నింటిలో మొదటిది క్రమబద్ధమైన నియమిత ఆహార సమయం . వరిఅన్నం తినేవారు గోధుమకు మారవలసిన అగత్యం లేదు . అన్నిరకాల తృణధాన్యాలలో 70 శాతం పిండిపదార్థాలు ఉండటం వలన ఈ మార్పిడి వలన ప్రయోజనం ఏమి లేదు . ఎవరి అలవాట్లకు వారు అణుగుణంగా వారు ఆహారం తీసుకోవచ్చు  అయితే రోగి ఇంతకు పూర్వం తీసుకునే ఆహారపదార్థాల పరిమాణం మాత్రం ఈ వ్యాధి కారణంగా మార్చుకోవలసి ఉంటుంది. 


           ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే గింజ ధాన్యాలతో అనగా మినుములు , పెసలు, శనగలు , కందులతో చేయబడిన ఆహారపదార్థాలు , పిండిపదార్థాలు ఎక్కువుగా తీసుకోవాలి . వీటిలో తాలింపు పెట్టిన పెసలు , శనగలు లేక నానబెట్టి వాడేసిన పచ్చిశనగలు , పెసలు ఎక్కువుగా తీసుకోవాలి . రోజూ కనీసం ఒక్కసారైనా తీసుకోవటం మంచిది . పీచు ఎక్కువుగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మధుమేహం ఉపశమించటమే రక్తంలో కొవ్వు కూడా బాగా తగ్గుతుంది . గింజధాన్యాలు , కాయగూరలు , ఆకుకూరలు పీచు బాగా కలిగి ఉంటాయి. శనగలు , పెసలు పైతొక్కతో సహా తినటం వలన ఈ విషయంలో మరింత సత్ఫలితం కలుగుతుంది . కాయగూరలు పరిమితి లేకుండా కాయగూరలు .


              కాకరకాయ, చిక్కుడు, ఆనప , బీర, వంకాయ, క్యాబేజీ , కాలిఫ్లవర్ , గుమ్మడి , బూడిదగుమ్మడి , సిమ్లా మిరప, తెల్లముల్లంగి, పోట్ల, మునగ , తొటకూర, గొంగూర, చుక్కకూర , కొత్తిమీర , మునగాకు కూర, పాలకూర మొదలగు అన్ని రకాల ఆకుకూరలు , నీరుల్లి, టొమాటో , దొండ , బెండ, అరటిపువ్వు , అరటిదూట .


           కొవ్వు పదార్దాలు ఎక్కువుగా ఉన్న నెయ్యి , వెన్న , కొబ్బరి నూనె , పామాయిల్ వాడరాదు. కొవ్వు తక్కువ ఉన్న పొద్దుతిరుగుడు గింజల నూనె , నువ్వులనూనె మితంగా వాడవచ్చు . ఆహారం తక్కువ పరిమాణంలో రోజుకి ఎక్కువసార్లు తీసుకోవాలి . లావుగా ఉన్నవారు రోజువారి కేలరీలను కూడా తగ్గించాలి. దుంపకూరలు వాడరాదు. 


         ఎట్టి పరిస్థితులలో చక్కెర , తేనె , గ్లూకోజ్ , బెల్లం , స్వీట్స్ , జీడిపప్పు , బాదం , లేతకొబ్బరి , మత్తుపానీయాలు , శీతలపానీయాలు , హార్లిక్స్ , బూస్ట్ వంటి పోషక విలువలు కలిగిన పానీయాలు అరటి , మామిడి, పనస , సపోటా మొదలగు పండ్లు తీసుకోరాదు . ఉపవాసాలు , నిరాహారదీక్షలు చేయరాదు . రక్తంలో చక్కెర స్థాయి పూర్తిగా అదుపులో ఉంటే అవసరాన్ని బట్టి బత్తాయి, ఆపిల్ , పుచ్చకాయ, జామ  , బొప్పాయి , ఉసిరి , కమలాఫలం తినవచ్చు .


 ఆహార సమయాలు  -


 అల్పాహారం - ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. 


    టొమాటో జ్యూస్ ఒక కప్పు , మొలకెత్తుచున్న గింజలు , రొట్టె లేక చపాతి , పలుచని పాలు పంచదార లేకుండా లేక రాగిమాల్ట్  .


 మధ్యాహ్న భోజనం  -


      12 నుండి 1 గంట వరకు.


 రాత్రి భోజనం  -


   6 గంటల నుండి 9 గంటల వరకు .


   కలగూర, దోసకాయ, టొమాటో , ముల్లంగి , కాకరకాయ, చిక్కుడు మొదలయిన కూరగాయలు , ఉప్పు , మిరియపు పొడి , నిమ్మకాయ చాలా మంచిది . కూరగాయలు ఉడకపెట్టిన నీరు , గోధుమ అన్నం , గోధుమ రొట్టె , ఆకుకూరలు ముఖ్యంగా ములగ , అవిశ , మెంతికూరలు .


 సాయంత్రం అల్పాహారం  - 


    3 గంటల నుండి 5 గంటల వరకు 


     బొప్పాయి ముక్కలు లేక జామపండు, సాల్ట్ బిస్కేట్స్ , పలచని పాలు లేక రాగిమాల్ట్ పంచదార కలపకుండా వాడవచ్చు . 


     మామిడి, అరటి, పిండిపదార్థాలు , ఎక్కువ ఒకేసారి కడుపు నిండగా తినవద్దు.


   

     గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: