3, ఫిబ్రవరి 2021, బుధవారం

అసాధ్యమైనదేమీ లేదు

 🌼 ..... ఒక కథ చెబుతా విను..... 🌼


💐 భగవంతుడికి అసాధ్యమైనదేమీ లేదు 💐


🍂 నానక్‌ సంప్రదాయానికి చెందిన సాధువులు దక్షిణేశ్వరానికి వచ్చి గురుదేవుని గదిలో ప్రవేశించి, గౌరవసూచకంగా 'నమో నారాయణ” అని సంబోధించారు. గురుదేవులు వారిని కూర్చోమని చెప్పి, ఈ కథను చెప్పారు.


🍂 ఒక ప్రదేశంలో ఇద్దరు యోగులు తపస్సు చేసుకుంటున్నారు. ఒకరోజు నారదమహర్షి ఆ వైపుగా వెళ్ళడం సంభవించింది. ఆ యోగులు ఆయనను

గుర్తించారు. వారిలో ఒక యోగి ఆ మహర్షిని ఇలా ప్రశ్నించాడు: “స్వామీ! మీరు ఇప్పుడు భగవంతుని దగ్గర నుండే వస్తున్నారు కదా! ఆయన ఏం చేస్తున్నారండీ?”


🍂 నారదమహర్షి. “భగవంతుడు ఒక సూదిని పట్టుకుని, దాని బెజ్జం ద్వారా ఇటునుంచి అటు, అటునుంచి ఇటు ఏనుగులను, ఒంటెలను దూరుస్తున్నాడు!”


🍂 అది విన్న మొదటి యోగికి నారదుని మాటలు మీద నమ్మకం కలగలేదు. ఆయన నారద మహర్షితో: “ఏమిటి! భగవంతుడు సూది బెజ్జం లో నుంచి ఏనుగులను ఒంటెలను దూరుస్తున్నాడా.? ఇది సాధ్యమయ్యే పనేనా.? మీరు వైకుంఠానికి వెళ్ళను లేదు. భగవంతుడు చేస్తున్న పనిని చూడనూ లేదు." అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు.


🍂 రెండవ యోగి: “అయ్యా, ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏముంది?

భగవంతుడికి అన్నీ సాధ్యమే!”


   అవును.


 🍂 "భగవంతుడికి అసాధ్యమైనదేమీ లేదు. ఆయనకు సర్వం సాధ్యమే!" అని గురుదేవులు పై కథను చెప్పి ముగించారు.

మురుగ


*⚜️ప్ర: సుబ్రహ్మణ్యస్వామిని 'మురుగ' అంటారు కదా. తమిళులు పెట్టుకున్న ఈ పేరుకి అర్థమేమై ఉంటుంది?⚜️*



*జ:*

'మురుగన్' అనే పేరు తమిళ భాషలో 'అందగాడు' అనే అర్ధం. అయితే,సుబ్రహ్మణ్యుని నామాలు సంస్కృతంలో అనేకం ఉన్నాయి. అందులో 'మురుక' అనేది ఒకటి. దీనికి అర్థం 'స్కాంద పురాణం' ఇలా చెప్తోంది.


'ము' కారాస్తు 

ముకుందః స్యాత్

'రు' కారో రుద్రవాచకం౹

'క' కారో బ్రహ్మవాదీచ ' 

'మురుకో' గుహ వాచకః౹౹


'ము' అనేది విష్ణువునీ, 'రు'- రుద్రునీ, 'క'- బ్రహ్మనీ తెలియజేస్తుంది. బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరబ్రహ్మగా సుబ్రహ్మణ్యుని (గుహుని) 

ఉపాసిస్తూ 'మురుక' అని స్వామిని పిలుస్తారు. అని ఒక నిర్వచనం. తమిళ భాషలో 'క' కారానికీ, 'గ' కారానికీ తేడా లేదు కనుక 'మురుగ' అని వారంటారు అంతే.⚜️

'ఆడ' కూతురు

 మన ఇంటి 'ఆడ' కూతురు...


ఓ చిన్న కధ .

చాలా బాగుంటుంది ...

తన కూతురును ప్రేమించే ప్రతి తండ్రి చదవాల్సిన  అధ్బత కధనం తప్పకుండా చదవండి..


అమ్మాయి పెళ్ళికై నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు ఆరోజున..!!


అది గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబం ఎంతో సంతోషించింది.

తండ్రి శర్మగారు ఎంతగనో ఆనందించారు.

పిల్లవాడు, అతని తల్లిదండ్రులు చాల మంచివారు. దాంతో శర్మగారికి ఎంతో భారం తగ్గినట్లనిపించింది. 


పెళ్ళికిముందు ఒకరోజు  పెళ్ళికూతురు తండ్రి శర్మగారు,వియ్యంకుడు వాళ్ళింటికి వెళ్ళలసివస్తుంది. 


అయితే ఆరోజు శర్మగారి ఆరోగ్యం బాగాలేదు. మొదటిసారి కావడం తో కాదనలేకపోయాడు. వరుని తరపువాళ్ళు ఎంతో సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు. 


కొద్దిసేపు వచ్చినపని విషయమై మాట్లాడుతుండగానే తేనీరు వచ్చింది.

శర్మగారికి మధుమేహం ఉండడంతో చక్కెర పదార్ధాలకు దూరంగా ఉంటున్నారాయన.


అయితే మగపెళ్ళి వారింటిలో శర్మగారు మొహమాటంతో ఇచ్చిన టీ కప్పును చేతిలోనికి తీసుకున్నారు తాగడానికై.


మొదటిగుటక వేస్తూనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.


అందులో పంచదార లేదు సరికదా,

తనకిష్టమైన యాలకులపొడి వేశారు.


మాఇంటి పధ్ధతిలోనే చేసిన టీ వీరింటిలోనూ తాగుతున్నారే అని అనుకున్నారాయన.


మధ్యాహ్నం భోజనం చేశారు,

అదీ అచ్చు తమ ఇంటివంట లాగానేఉంది.


వెంటనే ఏం బయలు దేరుతారు,

కొంచెం విశ్రాంతి తీసుకోండి అంటూ పడకగదికి తీసుకెళ్ళారు.

అచ్చటి దుప్పటి తను కప్పుకునే దుప్పటి లాగ పలచటిది.

కునుకుతీసి లేచేటపపటికి రాగిచెంబులో నీరిచ్చారు తాగడానికి.


బయలుదేరేముందు ఇక అడగకుండా ఉండలేకపోయేరు శర్మగారు...

'నేను ఏం తింటాను,

ఎలా తాగుతాను,

నా ఆరోగ్యానికి ఏది మంచిది ...

ఇవన్నీ మీకెలాతెలుసు..?' అని.


అమ్మాయి అత్త గారు ఇలా అంది....

'నిన్నరాత్రి మీఅమ్మాయి ఫోన్ చేసి మీగురించి అన్నీ చెప్పింది.

మానాన్నగారు మొహమాట పడతారు.

వారి గురించి మీరే శ్రధ్ధ తీసుకోవాలని కోరింది.'


శర్మగారి కళ్ళల్లో నీరు తిరిగింది.


శర్మగారు ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు...

'లలితా, మా అమ్మ చనిపోలేదు.'


'ఏమిటండీ మీరు మాటాడుతున్నది'


'అవును లలితా,

నన్ను కంటికి రెప్పలా చూసుకొనే నా తల్లి బతికేఉంది..

నాకూతురు రూపంలో' అని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు శర్మగారు కన్నీరు

నిండిన కళ్ళతో.


అమ్మాయి 'ఆడ'పిల్ల అనుకొంటాము,

మన ఇల్లు వదిలి పోతుందని.

తను ఎక్కడికీ పోదు,తలిదండ్రుల హృదయాలలోనే ఉంటుంది.

తన మనస్సులో తనవారి జ్ఞాపకాలను నింపుకొని.


*ఆడ పిల్లను బతకనిస్తే .....

అమ్మను గౌరవించినట్లే.....*


           🙏సర్వ సృష్టి సఖినో భవత్🙏

అమరఫలం

 *అమరఫలం -- చందమామ కథలు*


*పూర్వం ఒక ముని సర్వసంగపరిత్యాగి అయి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండగా, ఒకనాడు ఒక దేవత ప్రత్యక్షమై, మునికి ఒక ఫలాన్ని ఇచ్చి, ‘‘నీ తపస్సుకు మెచ్చాను. ఈ అమరఫలాన్ని చేతిలో ఉంచుకుని నువ్వు ఏది కోరుకున్నా సిద్ధిస్తుంది,'' అని చెప్పి అంతర్థానమయింది.*

*మునికి కోరిక ఏదీ లేదు. అయితే దేవత తనకు ఒక పరీక్ష కింద ఈ ఫలాన్ని ఇచ్చి ఉంటుందని ఆయన భావించాడు. దాన్ని ప్రజలకు ఉపకరించే విధంగా ఒక ఏర్పాటు చేయ నిశ్చయించి, ఆయన ఆ ఫలాన్ని తీసుకుని రాజు వద్దకు వెళ్ళాడు.*


*రాజు మునికి తగిన మర్యాదలు చేసి, ఆయన వచ్చిన పని అడిగాడు.*


*"రాజా, ఇదొక అమరఫలం. దీన్ని వెలఇచ్చి కొన్నవారికి ఒక్క కోరిక సిద్ధిస్తుంది. ఆ తరవాత దాన్ని ఇతరులకు తక్కువ వెలకు విక్రయించాలి. కోరిక తీరిన అనంతరం ఈ ఫలాన్ని ఎవరూ ఒక వారంరోజుల కన్న ఎక్కువకాలం దగ్గిర ఉంచుకోరాదు. ఉంచుకోవటం చాలా అపాయం. దీన్ని ముందుగా నీకిస్తున్నాను. దీనికెంత వెల ఇస్తావో చెప్పు,'' అని ముని అన్నాడు. రాజుకు అగత్యంగా తీరవలసిన కోరిక ఒకటి ఉన్నది.*


*ఆయనకూ, పొరుగురాజుకూ చాలాకాలంగా యుద్ధం సాగుతూ ఉన్నది. నిష్కర్షగా ఎవరికీ విజయం చేకూరటం లేదు. ఇరుపక్షాలకూ బోలెడంత నష్టం మాత్రం అవుతున్నది. అందుచేత రాజు ఈ అమరఫలం ద్వారా పొరుగురాజుపై విజయం సాధించాలనుకుని, ఆ పండును లక్షవరహాలకు కొన నిశ్చయించాడు. ముని ఆ పండును రాజుకిస్తూ, ‘‘నీ కోరిక తీరిన వారం రోజుల లోపల, కొన్న ధర కంటె తక్కువ ధరకు దీన్ని ఎవరికైనా అమ్మాలి.*


*నీ నుంచి కొనేవాడికి కూడా ఈ మాట చెప్పాలి,'' అని లక్షవరహాలూ రాజు నుంచి పుచ్చుకుని, వాటిని తీసుకుపోయి పేదసాదలకు దానం చేసేసి, తన దారిన తాను అరణ్యానికి తిరిగి వెళ్ళి, ఎప్పటిలాగే దీక్షగా తపస్సు చేసుకోసాగాడు.*


*అమరఫలం వల్ల రాజుకు అతి త్వరలోనే సునాయాసంగా కోరిక సిద్ధించింది. మళ్ళీ యుద్ధం వచ్చినప్పుడు పొరుగురాజు చిత్తుగా ఓడిపోయాడు. ఆ రాజ్యం కూడా ఈ రాజుదే అయింది. విజయం లభించిననాడే రాజు నిండు కొలువులో పరమానందంతో అమరఫలాన్ని అందరికీ చూపి, దాని మహిమ గురించి వివరించి, కావలిసిన వారికి దాన్ని విక్రయిస్తానన్నాడు*


*దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న సామంతుడొకడు దాన్ని అమితాసక్తితో తొంభైవేల వరహాలిచ్చి కొని, తన దీర్ఘ వ్యాధి నివారణ చేసుకున్నాడు.*


*వెంటనే అమరఫలం చేతులు మారింది. దాని ప్రభావంతో అనేకమందికి అనేక రకాల కోరికలు తీరాయి. కొందరికి వాణిజ్యం కలిసివచ్చింది, కొందరు విద్యావంతులయ్యారు, అనేకమంది వ్యాధుల నుంచి విముక్తులయ్యారు. కోరికలు తీర్చుతున్నకొద్దీ అమరఫలం విలువ కూడా క్రమేణా తగ్గుతూ వచ్చింది.*


*చాలాకాలం గడిచింది. పుష్యార్కుడనే వాడికి పక్షవాతం వచ్చింది. అతను ఒకప్పుడు అమరఫలాన్ని కొని తన భార్యను మృత్యు ముఖం నుంచి తప్పించాడు. ఆ అమర ఫలం ఇప్పు డెంత వెలలో ఉన్నదని విచారించగా రెండు కాసులని తెలిసింది. రెండుకాసులిచ్చి దాన్ని కొంటే తన వ్యాధి నయమయ్యాక దాన్ని మరొకరికి ఒకకాసుకే అమ్మాలి.*


*ఇక ఆ మనిషి దాన్ని ఇంకెవరికీ విక్రయించలేక ప్రమాదంలో పడతాడు. ఇలా అనుకుని పుష్యార్కుడు వ్యాధి నివారణకు అమరఫలాన్ని కొనక, వైద్యుణ్ణే నమ్ముకుందామనుకున్నాడు*


*కాని అతని భార్య మాలిని తన భర్తకు తెలియకుండా రెండుకాసు లిచ్చి, తమ నౌకరు ద్వారా ఆ ఫలాన్ని తెప్పించి,తన భర్త వ్యాధి నయం కావాలని కోరుకున్నది. పుష్యార్కుడి వ్యాధి తీసేసినట్టు నయమయింది. తాను తీసుకున్న మందులే పనిచేశాయినుకున్నా డతను.*


*ఇప్పుడు మాలిని అమరఫలాన్ని ఎవరి కన్నా ఒక కాసుకు అమ్మాలి. కాని ఎవరికని అమ్మటం? అమ్మితే ఆతరవాత కొన్నవాళ్ళ గతేమిటి? బాగా ఆలోచించి అమరఫలాన్ని అమ్మకుండా తన దగ్గిరే ఉంచుకుని ఏ అపాయం వచ్చినా భరించటానికే ఆమె నిశ్చయించుకున్నది. తనకు ప్రమాదం ఏ రూపంలో వస్తుందో నన్న బెదురుతో మాలిని రోగిష్ఠిదానిలాగా అయిపోసాగింది.*


*నౌకరు ఒకనాడు, ‘‘ఏమండి, అమ్మగారూ? వంట్లో బాగా లేదా?'' అని అడిగాడు.*


*"ఇక నేను ఎంతోకాలం బతకనురా!'' అని మాలిని చాలా విచారంతో అమరఫలం గురించి చెప్పింది.*


*"ఎందుకండీ అమ్మగారూ, మీరు చావటం?'' అన్నాడు నౌకరు. ‘‘దాన్ని ఎవరికి అమ్మనురా? ఎవరు కొన్నా ఇదే చిక్కులో పడతారు. చూస్తూ చూస్తూ ఇంకొకర్ని చంపటం దేనికి? నేనే చస్తాను,'' అన్నది మాలిని.*


*నౌకరు నవ్వి, ‘‘ఎవరూ చావొద్దు! ఒక కాసుకు ఆ అమరఫలాన్ని నాకు అమ్మెయ్యండి,'' అన్నాడు. ‘‘ఇంకానయం! నీ కోరిక తీరినాక దాన్ని ఇతరులకు ఎలా అమ్ముతావు?'' అన్నది మాలిని.*


*"నే నసలు కోరిక కోరితేగద! దాన్ని పెట్టెలో దాస్తాను,'' అంటూ నౌకరు ఒక కాసు తీసి మాలిని కిచ్చి, అమరఫలాన్ని తీసుకుపోయి, తన ఇంట్లో కొయ్యపెట్టె అడుగున భద్రంగా దాచాడు.*


*అటుతరవాత అది ఏమైనదీ తెలీదు. కొంతకాలమయ్యాక చూస్తే దాని జాడ కనిపించలేదు.*

మారిన మనసు*

 *✍🏼 నేటి కథ ✍🏼*



*మారిన మనసు*



అనగా అనగా ఒక ఊరు . ఆ ఊరి పేరు ఒంటికొండ. ఆ ఊళ్ళో ఒక బడి ఉంది. ఒక రోజున ఆ బడిలో పాటల కార్యక్రమం జరుగుతున్నది. ఆ పాటల్ని వినేందుకు చాలా మంది వచ్చి ఉన్నారు. పాటలు పాడటానికి పిల్లలంతా పోటీ పడుతున్నారు. అయితే, ఆ బడిలో చదివే భీమరాజు 'అమ్మ' గురించి పాడిన పాట విని, అందరూ పరవశించిపోయారు. ఎప్పటిలాగే ఈసారి కూడా భీమరాజుకే మొదటి బహుమతి వచ్చింది. ఆ బహుమతిని పట్టుకొని భీమరాజు సంతోషంగా ఇంటికి పరుగెత్తాడు.


భీమరాజు వాళ్ళది చాలా పేద కుటుంబం. అతను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. అప్పటినుండీ వాళ్ళ అమ్మ కూలిపని చేసుకుంటూ అతన్నీ, వాళ్ల అన్ననీ పెంచి పెద్ద చేసింది. అన్నకు పెళ్ళైంది; చిన్న ఉద్యోగం దొరికింది- గానీ అతని సంపాదన అతని కుటుంబానికే సరిపోతుంది. భీమరాజు చదువు పూర్తయేంత వరకూ వాళ్ళమ్మకు చాకిరీ తప్పదు.


సంతోషంగా ఇల్లు చేరుకున్న భీమరాజు వాళ్ళమ్మకు తన బహుమతిని చూపించి- 'నువ్వు నేర్పిన పాటకేనమ్మా, ఈ బహుమతి వచ్చింది!' అని చెబితే, వాళ్ళమ్మ గర్వంతో పొంగిపోయింది. 'సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసి, రా! ఇవాళ్ల నీ పుట్టిన రోజు కదా, కొత్త అంగీ కుడుతున్నాను. నీ స్నానం అవ్వగానే ముందు కొంచెం పాయసం తిందువు ' అన్నది. అయితే, ఆమెకు చాలా కాలంగా కాన్సర్ వ్యాధి ఉన్నది. అదే రోజు సాయంత్రం ఆమె చనిపోయింది!


ఇప్పుడు ఇక భీమరాజును చూసుకునే బాధ్యత వాళ్ల అన్నమీద పడింది. అన్న మంచివాడే, కానీ ఒదిన గంగమ్మకు మాత్రం భీమరాజంటే ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎప్పుడూ అతన్ని సాధిస్తూ ఉండేది. భీమరాజు మాత్రం నోరు మెదపకుండా ఇంటి పనులన్నీ‌చకచకా చేసేసి బడికి వెళ్ళి శ్రద్ధగా చదువుకొనేవాడు. బడినుండి ఇంటికి వచ్చాక కూడా అతనికోసం ఇంటినిండా పనులు సిద్ధంగా ఉండేవి. అన్ని పనులూ చేసేసి, అందరూ భోజనాలు కానిచ్చి పడుకున్నాక, భీమరాజు తన హోం-వర్కు చేసుకునేవాడు. ఎంత చేసినా వదిన చేతిలో అతనికి తిట్లు తినక తప్పేది కాదు.


చూస్తూండగానే సంవత్సరం గడిచి-పోయింది. బడిలో పాటల పోటీలు జరుగుతున్నై, మళ్ళీ. ఆ పోటీని చూసేందుకు భీమరాజు అన్నావదినలు కూడా వచ్చారు. 'ఈసారి భీమరాజు ఏం పాట పాడతాడా ' అని అందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 'అన్నా వదినల ఆప్యాయత' అని తీయగా పాడాడు భీమరాజు. పాట ఎంత చక్కగా పాడాడంటే, న్యాయనిర్ణేతలుకూడా అతన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు.

ఒకాయన వాడిని దగ్గరకు తీసుకొని, ప్రేమగా 'బాబూ, నీకు ఈ పాటను ఎవరు నేర్పారు? ఇంత చక్కగా పాడేందుకు నీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు?' అని అడిగాడు. 'మా ఒదినమ్మ' అని చెప్పాడు భీమరాజు. న్యాయనిర్ణేతలు భీమరాజు ఒదినమ్మను వేదిక మీదికి పిలిచి, అభినందించి, ప్రత్యేకంగా సత్కరించారు. 'ఇంత చక్కని గాయకుడిని తయారుచేసిన మీరు ధన్యులు' అని వచ్చినవాళ్ళంతా ప్రశంసిస్తుంటే ఒదినమ్మ సిగ్గుతో‌ముడుచుకు పోయింది.


అటు తర్వాత గంగమ్మ మారిపోయింది. భీమరాజును చక్కగా చూసుకున్నది!


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

ఇతిహాసాలు

 *📖 మన ఇతిహాసాలు 📓*



*మాయా సీత*



*రామాయణం యొక్క అసలు కథాంశం*


వాల్మీకి రామాయణంలో (క్రీ.పూ. 5 నుండి 4 వ శతాబ్దం) మాయ సీత గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. మిథిలా యువరాణి సీత అయోధ్య యువరాజు రాముడిని వివాహం చేసుకుంది. రాముడు 14 సంవత్సరాల వనవాసానికి సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో వెళ్ళవలసి వస్తుంది. రాక్షస రాజైన రావణుడు సీతను అపహరించడానికి ఒక పథకం రచిస్తాడు. ఇందులో భాగంగా బంగారు లేడి (మాయామృగం) గా మారి సీతను ఆకర్షించిడానికి మారీచుడు అనే రాక్షసుని సహాయం తీసుకుంటాడు. దండక అరణ్యంలో ప్రవాసంలో ఉన్నప్పుడు, రాముడు మాయాజింకను వెంబడించి చంపేస్తాడు. మాయా జింక రాముడి గొంతులో సహాయం కోరుతుంది. సీత లక్ష్మణుడిని బలవంతంగా వెళ్లి రాముడికి సహాయం చేయమని రాముని వద్దకు పంపుతుంది. రావణుడు సన్యాసి వేషంలో వచ్చి ఆమెను అపహరించాడు. రావణుడిని యుద్ధంలో చంపి రాముడు ఆమెను రక్షించే వరకు రావణుడు ఆమెను లంకలోని అశోక వాటిక తోటలో బంధిస్తాడు. అసభ్యకరమైన మహిళల ప్రవర్తన ద్వారా ప్రజలకి మొత్తం స్త్రీ జాతిపై అపనమ్మకం కలుగుతుందని, ఇకపై తప్పుడు నిందలతో జీవించాలని ఆమె కోరుకోలేదని, ఆమె పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని (అగ్ని పరిక్ష) ద్వారా విచారణకు గురవుతుందని సీత భావించింది . సీత మండుతున్న అగ్నిలోకి ప్రవేశిస్తుంది. ఆమె రాముడికి విశ్వాసపాత్రంగా ఉంటే, అగ్ని తనకు హాని కలిగించనివ్వదని ఆమె భావిస్తుంది. ఆమె తన స్వచ్ఛతకు నిదర్శనంగా అగ్ని దేవుడితో పాటు ఎటువంటి గాయాలు లేకుండా మంటల నుండి బయటకి వస్తుంది . రాముడు సీతను తిరిగి అంగీకరించి, అయోధ్యకు తిరిగి వస్తాడు. అక్కడ వారు సీతారాములను రాజు మరియు రాణిగా పట్టాభిషేకం చేస్తారు. 


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

తెలంగాణ ఘన కీర్తి*

 *జైశ్రీమన్నారాయణ*  🌴🦜 *తెలంగాణ ఘన కీర్తి*  

నరనారాయణులు ఉన్నది రెండే క్షేత్రాలలో.... 

1). బద్రినాథ్ మరియు  *లింబాద్రి గుట్ట*, భీంగల్, నిజామాబాద్ జిల్లా. ఇది బ్రహ్మ దేవుడే తపస్సు చేసి నృసింహ స్వామిని మెప్పించిన క్షేత్రం.

2) సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

శ్రీనగర్.... *బాసరా (తెలంగాణ)..*

3) బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో... 

పుష్కర్ (రాజస్థాన్).. *ధర్మపురి (తెలంగాణ)..* 

4) త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. 

అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. *కాళేేశ్వరం (తెలంగాణ)*

5) ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. 

నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)

*గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)*

*లింబాద్రిగుట్ట*

తెలంగాణ లోని నిజామాబాదు జిల్లాలో లింబాద్రిగుట్ట కు ప్రత్యేక స్థానం వుంది. ఉత్తరఖండ్, బద్రీనాథ్ తర్వాత ఆంతటి విశిష్ఠత కలిగిన క్షేత్రం లింబాద్రిగుట్ట.

యావత్ భారత దేశంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి మరియు *నర నారాయణులు*  ఓకే గర్బలయంలో స్వయంభువు  గా కొలువుదీరిన మహపుణ్యక్షేత్రం.  

*ధర్మపురి:-*

యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. 

(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా) బ్రహ్మదేవుడు (సృష్టి) నరసింహుడు, (స్థితి) శివుడు, (లయం) యముడు, (కాలం)

అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది

*కాళేశ్వరం:-*

ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే.. 

*వేములవాడ:-*

అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)

*మెదక్:-*

సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది.. 

*యాదగిరి:-*

అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం.. 

*కొండగట్టు:-*

శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం.. 

*బాసర (వ్యాసపురి):-*

వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం.. 

*భద్రాచలం:-*

శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం. 

*చెన్నూర్:-*

గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం. 

*మంథని:-*

మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే. 

*బోదన్:-*

బోధనపురి అసలు పేరు. మంథనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే. 

 *మన తెలంగాణ ఘన కీర్తి గల తెలుగు నేల మనదైనందుకు తెలుగు వారిగా గర్వ పడదాం*  *శుభాభినందనలతో*  *ప్రేమతో* *మీ* *కర్పూరం* *గోపిధర్* 🦜🌴🦜🌴🦜

కఠిన సాధన

 ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు.


రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి సంతోషంతో ఆయన దగ్గరకు వెళ్ళి పలకరించి , ఏదైనా చిన్న పేయింటింగ్ గీసి ఇవ్వమని అభ్యర్థించింది.


బజారులో పేయింటింగ్ ఎలా చిత్రిస్తారు ? మరోసారి కలిసినపుడు తప్పక చిత్రాన్ని వేసి ఇస్తాను అన్నా కూడా ఆ యునతి మొండిగా మారాం చేసే సరికి ఒక పేపర్ పై అప్పటికప్పుడు చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు. ఇస్తూ ఇస్తూ ....నవ్వుతూ అన్నాడు దీని విలువ కోటి రూపాయలు.జాగ్రత్తగా కాపాడుకో.


ఆ యువతి ఆశ్చర్యంగా పేయింటింగ్ వంక చూస్తూ ఉండి పోయింది.


మరుసటి రోజు ప్రముఖ చిత్రకారుల చిత్రాలు అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుందని వాకబు చేసింది.


ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పేసరికి నోటమాట రాక మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి వెళ్ళింది.

 

రవివర్మని కలిసి ఇలా అంది ...మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు.


నాకు కూడా చిత్రకళలోని మెళకువలు నేర్పండి. మీలా పది నిమిసాలలో కాక పౌయినా....పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను.


రవివర్మ నవ్వుతూ అన్నాడు అమ్మాయీ...! నీకు పది నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను. నిజమే. దీని వెనకాల నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది.  


నవ్వూ నీ 30 సంవత్సరాలు ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే నాలా తయారవగలవు.


ఆ యువతి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది.


  _*ఒక టీచర్ చెప్పే 45 నిమిషాల పాఠం వెనుక కూడా అతని జీవితం లోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది.*_


*తల్లి తండ్రులు నీకు చెప్పే మాటల వెనుక కూడా, నీ ఊహకు కూడా అందని ప్రేమ, త్యాగాలు అనుభవాలు ఉంటాయి.*


*అలాగే ఒక బ్రహ్మ జ్ఞాని ఎదురుగా నీవు కొన్ని నిముషాలు కూర్చుంటే, నీ జీవితమే మారిపోతుంది....*

     _*ఉపాధ్యాయుల పాఠాలు, తల్లి తండ్రుల మంచిమాటలు, గురువుల జ్ఞాన బోధలు కూడా రవివర్మ చిత్రాల్లా నీ ఊహకు కూడా అందని విలువైనవి*🌹


*ఈ విలువైన సందేశాన్ని మీ మిత్రులతో కూడా పంచుకోండి...*🙏🙏


🌹*ఓం నమో వెంకటేశాయ*🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 🌹🌹💐💐

2, ఫిబ్రవరి 2021, మంగళవారం

కాగితం పడవలు*

 *📖 మన ఇతిహాసాలు 📓*



*కాగితం పడవలు*



రామయ్యది వెంకటాపురం. భూస్వామి భూపతి దగ్గర పాలేరుగా పని చేస్తున్నాడు. మంచి పనిమంతుడు. నమ్మకస్తుడు. అందుకే అతనంటే భూపతికి ప్రత్యేకమైన అభిమానం.


నమ్మకంగా వుంటూ, ఇంటిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే మనిషి వుంటే పంపించమని పట్నంలో వ్యాపారం చేస్తున్న భూపతి కొడుకు మహేష్ ఉత్తరం రాశాడు. ఆ పనికి రామయ్యే సరైనవాడని భూపతికి తెలుసు. అదే మాట రామయ్యతో అన్నాడు. ముందూ వెనుక ఎవరూ లేకపోవడంతో రామయ్య కూడా అంగీకరించాడు. అలా రామయ్య వెంకటాపురం వదిలి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ప్రశాంతమైన పల్లె వాతావరణానికి అలవాటుపడిన రామయ్యకు రణగొణ ధ్వనుల మధ్య జీవించడం కొంచెం కష్టంగానే ఉంది. అయినా అలాగే సర్దుకుపోతున్నాడు.


భూపతి కొడుకు రాహుల్, కోడలు రమ్య, వాళ్లిద్దరూ వారి వారి పనుల్లో బిజీగా ఉంటారు. పిల్లలు వంశీ, వసుధ. వంశీ ఆరవ తరగతి చదువుతున్నాడు. వసుధ నాలుగవ తరగతి. పొద్దున్నే తొమ్మిది గంటలకల్లా ఎటు వాళ్లు అటు వెళ్లిపోతారు.


రమ్యకు ఇంటి పనుల్లో సాయం చేయడం, బజారుకెళ్లి కావాల్సిన సరుకులు తీసుకురావడం, పిల్లలకు కావాల్సినవి అమర్చడం, ఇంటిని కనిపెట్టుకొని వుండడం.. ఇది రామయ్య దినచర్య. రామయ్యకు వెంకటాపురంలోకంటే ఇక్కడే పని తక్కువగా ఉంది. కాకపోతే ఒక్కటే చిక్కు. కాయకష్టానికి అలవాటుపడిన మనిషిని ఖాళీగా వుండమంటే ఉండలేడు. ఇప్పుడు రామయ్య పరిస్ధితీ అదే.


ఓ రోజు ఏ కారణం చేతనో ట్యూషన్ మాష్టారు రాలేదు. పిల్లలకు కావాల్సినంత తీరుబడి దొరికింది. ఆ బజారులోని తోటి పిల్లలందర్నీ పోగు చేశారు. వాళ్లతో ఇంట్లోనే ఆటలు మొదలుపెట్టారు. రామయ్య కూడా వాళ్లతో కలిసిపోయాడు. కాసేపటికి వర్షం మొదలయ్యింది. డాబా మీద కురిసిన వాన నీళ్లు కాలువలా పెరట్లో నుండి పోతున్నాయి. రామయ్యకు ఓ ఆలోచన వచ్చింది.

"వంశీ బాబూ! నీకి కాగితాలతో పడవలు తయారుచేయడం వచ్చా?" అడిగాడు రామయ్య .

"రాదు. ఏం?"

"మేం చిన్నప్పుడు కాగితాలతో పడవలు తయారుచేసి వాన నీళ్లల్లో వదిలేవాళ్లం. మునగకుండా ఎవరి పడవ ఎక్కువ దూరం వెళ్తుందో వాళ్లు గెలిచినట్టు. ఆ ఆట భలే సరదాగా ఉంటుంది" చెప్పాడు రామయ్య.

"అయితే త్వరగా వెళ్లి కాగితాలు తీసుకురా తాతా..." అంది వసుధ.

"కాగితాలు నాన్నగారి గదిలో ఉంటాయి" వెంటనే అందుకున్నాడు వంశీ.


రామయ్య రాహుల్ గదిలోకి వెళ్లాడు. అక్కడ తెల్ల కాగితాలు, రాసిన కాగితాలు విడివిడిగా ఉన్నాయి. తెల్ల కాగితాలైతే రాసుకోవచ్చు. అదే వాడిన కాగితాలు తీసుకున్నా ఫర్వాలేదు ' అనుకున్నాడు రామయ్య రాసిన కాగితాలు తీసుకొని పిల్లల దగ్గరకొచ్చాడు. వాటితో పడవలు తయారుచేసి, పిల్లలకిచ్చాడు. వాళ్లు వాటిని నీళ్లల్లో వదులుతూ ఆనందించారు. కాసేపటి తర్వాత వర్షం ఆగిపోయింది. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. పిల్లలు అన్నం తిని, నిద్రపోయారు. రాత్రి తొమ్మిది గంటలకు భార్యాభర్తలిద్దరూ ఇంటికొచ్చారు. వచ్చీరాగానే రాహుల్ తన గదిలోకి వెళ్లాడు. ఏవో ముఖ్యమైన కాగితాల కోసం చాలాసేపు వెతికాడు. ఎంత వెతికినా అవి కనిపించలేదు.

రామయ్యను పిలిచి, "టేబుల్ మీద నేను కొన్ని ముఖ్యమైన కాగితాలు పెట్టాను. అవేమైనా చూశావా?" అని అడిగాడు రాహుల్.

"నల్ల సిరాతో ఏదో రాసి ఉంది. అవేనా బాబుగారూ?" అడిగాడు రామయ్య.

"అవును. అవే...ఎక్కడ పెట్టావు?" ఆతృతగా అడిగాడు రాహుల్.

"అవి పనికిరాని కాగితాలు అనుకొని..."

"అనుకొని... నీళ్లు నమలడం మాని ఏం చేశావో చెప్పు" కోపంగా అన్నాడు రాహుల్.

"ఇందాక పిల్లలకు పడవలు చేసిచ్చాను" భయం భయంగా చెప్పాడు రామయ్య.


"అసలు వాటి జోలికెందుకువెళ్లావు? పక్కన అన్ని తెల్లకాగితాలు ఉన్నాయి. అవి తీసుకోవచ్చుగా. అయినా పాత న్యూస్ పేపర్లతో పడవలు చెయ్యోచ్చు కదా. అసలు ఆ పేపర్ల విలువేంటో తెలుసా నీకు?" ఆవేశంగా అన్నాడు రాహుల్.


రామయ్య దిగాలుగా ముఖం పెట్టి. "అయ్యా! నాకు చదువురాదు. అందుకే వాటి మీద ఏం రాసి వుందో తెలీలేదు. తెలిస్తే... వాటితో పడవలు చేసేవాణ్ణే కాదు. క్షమించండి" అన్నాడు.


"ఎలా క్షమించమంటావు? అవేమైనా పాతిక రూపాయలు పెడ్తే వచ్చే కాగితాలనుకున్నావా? కొత్తగా తీసుకున్న ఉద్యోగులతో కుదుర్చుకున్న ఒప్పందం కాగితాలు" అరిచాడు రాహుల్. రాహుల్ అరుపుల విన్న రమ్య ఆ గదిలోకి వచ్చింది.


విషయాన్ని గ్రహించి, "ఊరుకో రాహుల్. అంత ముఖ్యమైన కాగితాలను నిర్లక్ష్యంగా టేబుల్ మీద పడేసి వెళ్లిపోవడం నీ తప్పు. అవి మామూలు కాగితాలు అనుకొని రామయ్య పడవలు చేసి ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది. మళ్లీ వాళ్లతో అగ్రిమెంట్ రాయించుకుంటే సరిపోతుంది" అంటూ సర్ధిచెప్పింది.

రామయ్యవైపు తిరిగి, "రామయ్య... నువ్వు వెళ్లి భోం చేసి పడుకో" అని చెప్పింది. రామయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు.

మర్నాడు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు రామయ్య కోసం ఓ ప్యాకెట్ తీసుకొచ్చింది రమ్య. అందులో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిని అయోమయంగా చూశాడు రామయ్య.

"ఇవి నీ కోసమే రామయ్య రేపటి నుండి నువ్వు కూడా చదువుకోవాలి. పిల్లలతోపాటు నీక్కూడా ట్యూషన్ మాష్టారే చదువు చెప్తారు. మరి శ్రద్ధగా చదువుకుంటావు కదూ" అంది రమ్య.

రామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తాను చేసిన తప్పు గుర్తొచ్చింది. ఇకమీదట అలాంటి తప్పు చేయకుండా వుండాలంటే చదువుకోవడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నాడు.

*వాలి

 *📖 మన ఇతిహాసాలు 📓*



*వాలి*

(రామాయణం లో పాత్ర)



రామాయణం కావ్యంలో వాలి (Vali) ఒక వానర రాజు. సుగ్రీవునకు అన్న. మహా బలవంతుడు. కిష్కింధ కాండలో వాలి కథ వస్తుంది.


*వాలి సుగ్రీవుల జననం*


వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు (ఋక్షరజుడు?) అనే గొప్ప వానర రాజుకి పుట్టిన ఔరస సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలో స్నానం చేస్తాడు, ఆ తటాకంకి ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరసగా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశంలో సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితుడై వాలభాగం లోను, కంఠభాగం లోను వీర్యాన్ని విడిచి పెడతారు. దానికి వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయములో బ్రహ్మ వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు. వాల భాగములో వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగం లలో వదిలిన వీర్యం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు.


*వాలి పరాక్రమం*


వాలి పరాక్రమాన్ని గురించి సుగ్రీవుడు రామునితో ఇలా చెప్పాడు - వాలి మహా బలవంతుడు. పెద్ద పెద్ద కొండ శిఖరాలను బంతుల్లాగా విసిరేయడం అతనికి ఆటగా ఉండేది. దృఢమైన చెట్లను ఇష్టమొచ్చినట్లు పీకి పారేశేవాడు. ఒకమారు దుందుభి అనే రాక్షసుడు సముద్రుడు, వాయువు వంటి వారితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. వారు అతనితో పోరాడలేమని చెప్పి వాలిదగ్గరకు వెళ్ళమన్నారు. తన రణ కండూతి తీర్చుకోవడానికి పెద్ద దున్నపోతు ఆకారంలో కిష్కింధకు వచ్చి పెడబొబ్బలు పెట్ట సాగాడు. అనవుసరంగా ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని ఆ రాక్షసునికి వాలి నచ్చచెప్పబోయాడు గాని వాడు వినిపించుకోలేదు. దాంతో వాలి కోపించి ఆ రాక్షసుడి కొమ్మలు పట్టి మెలిద్రిప్పి విసిరేశాడు. రక్తం కారుతూ ఆ రాక్షసుడు మరణించాడు. అయితే ఆ రక్తం ఋష్యమూక పర్వతంపై తపస్సు చేసికొనే మతంగముని ఆశ్రమంలో చెల్లా చెదురుగా పడింది. దానితో కోపించిన ముని వాలిని శపించాడు - ఆ పర్వతం మీదకు వస్తే తల పగిలి చస్తాడని. అందువలన వాలి ఆ పర్వతం పరిసరాలకు వెళ్ళడు.


తనను మించిన వీరుడు లేడని విర్రవీగే రావణుడు కూడా వాలితో యుద్ధానికి తలపడి, వాలి చేతిలో ఓడిపోయి అతనికి మిత్రునిగా సంధి చేసుకొన్నాడు. ఇంద్రుడిచ్చిన కాంచనమాల వర ప్రభావం వలన వాలికి ఎదురుగా పోరాడే వారి బలంలోంచి సగం వాలికి సంక్రమిస్తుంది.


*వాలి, సుగ్రీవుల మధ్య వైరం*


సుగ్రీవుడు అన్నకు విధేయుడైన సేవకుడు. ఒకమారు మాయావి అనే రాక్షసుడు (దుందుభి కొడుకు) వాలిపై యుద్ధానికి వచ్చాడు. వాలి, మాయావి యుద్ధం చేస్తూ ఒక కొండ గుహలోకి వెళ్ళారు. సుగ్రీవుడిని బయటే కాపలా ఉండమని వాలి చెప్పాడు. నెల కాలం గడచినా వారు బయటకు రాలేదు. పెడ బొబ్బలు ఆగిపోయాయి. వాలి మరణించి ఉంటాడని సుగ్రీవుడు భయపడ్డాడు. రాక్షసుడు బయటకు రాకుండా గుహకు పెద్ద బండరాయి అడ్డంగా పెట్టి, దుఃఖిస్తూ కిష్కింధకు తిరిగి వచ్చాడు. మంత్రుల కోరికపై రాజ్యానికి రాజుగా అభిషిక్తుడయ్యాడు.


అయితే కొంత కాలానికి వాలి తిరిగి వచ్చాడు. దుర్బుద్ధితో సుగ్రీవుడు కొండ బిలాన్ని మూసివేశాడని దూషించి అతన్ని రాజ్యంలోంచి తరిమేశాడు. తన అనుచరులైన హనుమంతుడు, మరి కొద్ది మంది పరివారంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తల దాచుకొన్నాడు.


*శ్రీరాముడు, సుగ్రీవుల మైత్రి*


శ్రీరాముడు, సుగ్రీవుల మైత్రి

సీతాన్వేషణలో శ్రీరాముడు, లక్ష్మణుడు ఋష్యశృంగ పర్వత ప్రాంతానికి వచ్చారు. మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయం చెందాడు. వారిని గురించి తెలిసికోమని హనుమంతుని పంపాడు.


హనుమంతుడు తన మృదువైన మాటలతో వారిని గురించి తెలిసికొన్నాడు. లక్ష్మణుడు తమ రాకకు కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్ధులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు. హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిన బూనాడు.


రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకూ తన అన్నకూ వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.


*సుగ్రీవుడు, వాలి పోరాటం*


రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీకొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు.


అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య తార వారింప ప్రయత్నించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి రావడానికి అయోధ్యా రాకుమారుల అండయే కారణం కావచ్చు అని హితం పలికింది. కాని వాలి వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక ఆ ధర్మపరులు తనకు హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.


అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.


*శ్రీరాముని వాలి దూషించుట*



కొంత సేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ కనుపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు.--


రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చేసిన ఈ నీచమైన పని వలన నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, వీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా న్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. నీవు క్షుద్రుడవు, మహాపాపివి.


నా చర్మం, గోళ్ళు, రోమాలు, రక్తమాంసాలు నీకు నిరుపయోగం కనుక నన్ను మృగయావినోదం కోసం చంపావనే సాకు కూడా నీకు చెల్లదు. నీ కపటత్వం గ్రహించే నా ఇల్లాలు తార నన్ను ఎన్నో విధాలుగా వారించింది. కాని పోగాలం దాపురించిన నేను ఆమె హితవాక్యాలను పెడచెవినబెట్టాను.


నా యెదుటపడి యుద్ధం చేసే లావు నీకు లేదు. మద్యపాన మత్తుడై నిద్రపోయేవాడిని పాము కాటు వేసినట్లుగా చెట్టుమాటునుండి నాపై బాణం వేశావు. ఇందుకు నీకు సిగ్గు కలగడంలేదా! నా సహాయమే కోరి వుంటే క్షణాలమీద రావణుడిని నీ కాళ్ళవద్ద పడవేసి నీ భార్యను నీకు అప్పగించేవాడిని.


నేను చావుకు భయపడేవాడిని కాను. సుగ్రీవుడు నా అనంతరం రాజ్యార్హుడే. కాని ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు. నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు? నా గొంతు ఎండుకు పోతోంది. ఈ బాణం నా ప్రాణాలు హరిస్తున్నది. నిస్సత్తువలో ఎక్కువ మాట్లాడలేను. కాని నీ సమాధానాన్ని వినగలను. – అని వాలి అన్నాడు.


*రాముని సమాధానం*


వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.


నేను వేట మిష మీద నిన్ను చంపలేదు కనుక భష్యాభక్ష్య విచికిత్స అనవుసరం. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు రాజైన నీకు తెలుసు.


ఇక చెట్టుమాటునుండి చంపడం గురించి. నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మ పరాఙ్ముఖుడైన వధ్యుని వధించడానికి యుద్ధ ధర్మాలు వర్తించవు. ఇక నీవు శిక్షార్హుడవు గనుక నీతో నేను నా కార్యాలు సాధించుకో దగదు. అన్యుల సహాయం పైని ఆధారపడేవాడిని కానని నా చరిత్రే చెబుతుంది. కనుక స్వలాభం కోసం నిన్ను వధించాననుకోవడం అవివేకం.


నీ వధకు మరొక అలౌకిక పరమార్ధ కారణం ఉంది. నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టి కర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. కాని నీవు రావణుడి మిత్రుడవయ్యావు. కనుక నీవు నాకు సహాయ పడితే మిత్ర ద్రోహివవుతావు. రావణుడి పక్షాన ఉంటే పితృద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలిసికొని చిత్త క్షోభను వర్జించి శాంతిని పొందు.


*వాలి చివరి కోరికలు*


వాలి ఇలా అన్నాడు– రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు.


తరువాత వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.


పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని, నోరు తెరచియే మరణించాడు.


అందరూ గొల్లుమన్నారు. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయి తాను కూడా మరణిస్తానన్నాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు కిష్కింధకు వెళ్ళలేదు.


9⃣4⃣4⃣1⃣7⃣6⃣4⃣4⃣7⃣7⃣

జయమంత్రాన్ని

 ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామికి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది!!  మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి! 


 ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది!!


జయత్యతి బలో రామః 

లక్ష్మణస్య మహా బలః !

రాజా జయతి సుగ్రీవో 

రాఘవేణాభి పాలితః !!


దాసోహం కౌసలేంద్రస్య 

రామస్యా క్లిష్ఠ కర్మణః !

హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!


నరావణ సహస్రం మే 

యుధ్ధే ప్రతిబలం భవేత్ !

శిలాభిస్తు ప్రహారతః

పాదపైశ్చ సహస్రశః !!


అర్ధయిత్వాం పురీం లంకాం 

మభివాద్యచ మైథిలీం !

సమృధ్ధార్థ్యో గమిష్యామి 

మిషతాం సర్వ రక్షసాం !!


అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.


శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుధ్ధ రంగమున రంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశన మొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.


ఇది పఠించిన వారికి జయం తధ్యం !!

 జయశ్రీ రామ!!  శుభమ్ భూయాత్!!!!

(సేకరణ)

సప్తపది

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                      *సప్తపది!*

                     ➖➖➖✍️


మూడు ముళ్ల బంధానికి, ఏడు అడుగులకు ఉన్న సంబంధమేంటి ?


సాధారణంగా హిందు వివాహ సాంప్రదాయంలో వివాహ సమయంలో దంపతుల చేత ఏడు అడుగులు వేయిస్తారు. హోమం చుట్టూ వేసే ఆ ఏడు అడుగులనే సప్తపది అంటారు. సప్తపదిలో వేసే ప్రతి అడుగుకు ఒక్కో అర్థముందంటారు మన పెద్దలు.

ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటిగా చేస్తుంది వివాహం. పెండ్లి కుమారుడు కళ్యాణమండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ దీక్షా కంకణం కడతారు పురోహితులు. అమ్మాయి తల్లితండ్రులు వరునికి కాళ్లు కడిగి , తమ కన్నబిడ్డను ధర్మార్ధ, కామ, మోక్షాలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేయించి కన్యాదానం చేస్తారు. వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టి , పిమ్మట మాంగల్యధారణ జరుగుతుంది.


వివాహ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వధువరుల కొంగు ముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికిన వేలును వరుడు పట్టుకునీ అగ్ని హోత్రం చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్నే సప్తపది అంటారు. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. 

పురోహితుడు వధూవరులిద్దరిని అగ్నిసాక్షిగా జీవితాంతం ఒక్కటిగా కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామనే ప్రమాణాలు చేయిస్తాడు.


"సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం!"


ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే మిత్రబంధం ఏర్పడుతుందని భావం. అందుకే పెద్దలు వివాహబంధం ఏడడుగుల బంధం అని అంటారు. మరి ఏడు అడుగుల వెనుక దాగున్న పరమార్థాలేంటో తెలుసుకుందాం...


మొదటి అడుగు:

*"ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు"*


ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక!"


రెండవ అడుగు..

*"ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు"*


ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక


మూడవ అడుగు:

*త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక.


నాలుగవ అడుగు:

*"చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక.


ఐదవ అడుగు:

*"పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక.


ఆరవ అడుగు:

*"షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు"* 

ఈ ఆరవ అడుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.


ఏడవ అడుగు:

*"సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక. 

మొత్తం జీవితానికి అవసరమయిన అంశాలన్నింటిని ఈ ఏడు అడుగుల్లోకి ఇమిడ్చి ప్రామాణికంగా రూపొందించడాన్నే సప్తపది అని అంటారు.✍️


                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఏది శాశ్వతం

 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘


      _*👌*మనిషి జీవితంలో ఏది శాశ్వతం. నీవు సంపాదించిన ఆస్తి పాస్తుల, ధనధాన్యాల, సిరిసంపదల, నీ ఇల్లా, చివరికి నీ శరీరమా? మరి ఏది శాశ్వతము. ఒకసారి పరిశీలిద్దామా..*_👌


     _**సమయం ఉదయం ఎనిమిది గంటలు, సుబ్బారావు తన ఇంటిముందు వసారాలో కూర్చొని ప్రస్తుతం వాడి వేడిగా నడుస్తున్న రాజకీయ ఎత్తుగడల గురించి న్యూస్ పేపర్ లోని వార్తలను ఆసక్తిగా చదువుతున్నాడు. ఇంతలో గేటు దగ్గర ఒక బిచ్చగాడు నిలబడి, "భవతీ భిక్షాందేహి " అంటూ కేక వేశాడు. వార్తలు చదవడంలో మునిగి తేలుతున్న సుబ్బారావు ఆ కేక విని చిరాకు పడుతూ, "ఇదేమైనా సత్రం అనుకున్నావా ! పొద్దున్నే తగలడ్డావ్, నీకింకేమ్ పని పాట లేవా.. వెళ్ళవయ్యా వెళ్ళు ..ఛీ.. ఛీ.. ఏదైనా పని చేసుకొని చావొచ్చు కదా అవతలికి పో..పో.." అంటూ చిరాకు పడ్డాడు.*_


     _**అప్పుడా బిచ్చగాడు చాలా శాంతంగా సుబ్బారావుతో అయ్యా కొంచెం మీతో మాట్లాడొచ్చా అని అడుగగా సుబ్బారావు ఏ విషయం గురించి అన్నాడు. అయ్యా "ఈ ఇంటిని ఎవరు కట్టించారు స్వామీ !" అని అడిగాడు బిచ్చగాడు. సుబ్బారావు "ఇది నా ముత్తాతల ఇల్లు. నా తాత తరువాత మా నాయన, ఇప్పుడు నేను నివసిస్తున్న ఇల్లు ఇది. ఇప్పుడు మాత్రం ఇది నా ఇల్లే " ఇప్పుడు ఇది నాకు శాశ్వతం అని చాలా గర్వంగా అన్నాడు.*_


     _**అప్పుడు బిచ్చగాడు.. "మీ తాత తానున్నంతకాలం ఈ ఇల్లు నాది నాది అన్నాడు. తరువాత మీ నాన్న తానున్నంతకాలం ఈ ఇల్లు నాది నాది అన్నాడు. ఇప్పుడు నీవు ఈ ఇల్లు నాది నాది అంటున్నావు. మీ వారందరూ కొంతకాలము ఇది నా ఇల్లు నా ఇల్లు " అని చెప్పుకొని, తరువాత ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయారు కదా.. రేపు నువ్వు పోతే కూడా నీ కొడుకు ఇది నా ఇల్లు నా ఇల్లు అంటాడు కదా.. మరి ఈ ఇంట్లో ఎవరు కూడా శాశ్వతంగా ఉండలేరు కదా.. చివరికి ఎవరు శాశ్వతం, ఏది శాశ్వతం. ఏది శాశ్వతం కాదు. రేపు నీవు చనిపోతే నీ శరీరం కూడా నీది కాదు, ఈ నీ ఇల్లు, నీ శరీరం, నీ భార్య, పిల్లలు ఎవరూ కూడా నీ వెంట రారే. అటువంటప్పుడు ఈ కట్టడము నీకెలా శాశ్వతం అవుతుంది. ఇప్పుడు ఇది కూడా ఒక 'సత్రం' కాక మరేమిటి " అని ప్రశ్నించాడు.*_


      _**ఈ జగత్తులో ఏది శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతంగా ఉండరు. మన కంటికి కనపడే ఈ జగత్సంబధమైన విషయములు అన్నీ కూడా తాత్కాలికములే.. శాశ్వతమైనది ఒక్కటే.. అదే "భగవంతుని సాన్నిధ్యం". అందుకే ఆయన సన్నిధికి చేరుకొనే మార్గాన్ని మనం తెలుసుకొని దాన్నే ఎంచుకొని అనుసరించాలి. ఆ మార్గమే "మానవ సేవే మాధవ సేవ ". చివరికి నిన్ను ఆ భగవంతుడి సన్నిధికి చేరవేసేది ఇతరులకు నీవు చేసిన మేలు, సహాయమే. అందుకే ఆకలై నీ ఇంటి ముందుకొచ్చిన అన్నార్తుల ఆకలిని తీర్చాలి. సహాయం కోరి నీ ఇంటి ముందుకొచ్చిన వారికి నీ చేతనైనంత సహాయం చేయాలి. చేయూతనిచ్చి వారికి ఉపశమనం కలిగించాలి.*_


      _**చూడండి మనిషి జీవితాన్ని కన్నీళ్లతో భాగిస్తే, మిగిలేవి బాధలు భయాలే. భవిష్యత్తును ఊహలతో కూడితే, వచ్చేది మొత్తం కలతలే. ఆఖరికి కొస ప్రాణాలను చివరి కోరికతో గుణిస్తే, దక్కేది శ్మశానమే. అందుకే జీవించే కొద్దికాలం సేవాభావంతో ఇతరులకు నీ చేతనైన సహాయం చేస్తూ జీవించాలి. భగవంతుడు మనిషికి ప్రత్యేకంగా తెలివిని, మంచి బుద్ధిని, ప్రేమను పంచే హృదయాన్ని ఇచ్చాడు. వీటికి విజ్ఞత, విద్య, వినయం, సేవాతత్పరత తోడైతే వాళ్ళ జీవితం కళ్యాణమయమే. పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది. కానీ, విలువలు, వ్యక్తిత్వం, సేవా దృక్పథం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు దయామయుడుగా ఉండడమే నీవు నీ జీవితంలో సాధించ గలిగే గొప్ప విజయం.*_


    _**కాబట్టి ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేస్తున్న బిచ్చగాడిని చులకనగా చూడకండి. ఎందుకంటే.. ఆ బిచ్చగాడు మనకు ఒక హెచ్చరికను చేస్తూనే ఉంటాడు. అదేమిటంటే, "నేను పూర్వజన్మమున ఎవరికీ బిచ్చము పెట్టక, ఈ జన్మమున ఇటుల భిక్షగాడినయ్యాను. నా వలెనే మీరూ అవకండి అని.. కాబట్టి అందరూ దానధర్మాలు చేయండి " అని అంటూ గృహస్థులను మేలు కొలుపు తుంటాను అన్నాడు ఆ బిచ్చగాడు..*_

 

     _**ఇదంతా నోరెళ్ళబెట్టి వింటున్న సుబ్బారావు వెంటనే లోపలి కెళ్ళి దోసిటితో బియ్యాన్ని తెచ్చి ఆ బిచ్చగాడి జోలెలో వేసి అతడికి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. కాబట్టి మిత్రులారా ! అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే "మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నీవు సంపాదించిన ధనధాన్యాలు, సిరిసంపదలు, ఆస్తి పాస్తులు, నీ ఇల్లు, నీ శరీరం ఇవేవీ శాశ్వతం కాదు. ఇతరులకు నీవు చేసే మేలు, సహాయం, సేవలు ఇవి మాత్రమే శాశ్వతం అని తెలుసుకొన్నారు కదా.. కాబట్టి మీరందరూ కూడా సేవా దృక్పథంతో, మీకు చేతనైనంత దానధర్మాలు చేస్తూ ఆ భగవంతుడి కృపకు పాత్రులై ఆయన సన్నిధికి చేరుకొంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్..*_👌


_*🤘*లోకాసమస్తాసుఖినోభవన్తు**_🤘


_*🤘*సర్వే జనా సుఖినోభవంతు**_🤘


       _*👌*ధర్మో రక్షతి రక్షతః **_👌


      

                   


                                         _

జ్ఞాపక శక్తి పెరగాలంటే

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



         *జ్ఞాపక శక్తి పెరగాలంటే*

                 ➖➖➖✍️


*మతి మరపు సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూంటారు.*


*అలాగే విద్యార్థులు జ్ఞాపకశక్తి లేకపోవడం వల్ల విద్యలో తీవ్రంగా నష్టపోతుంటారు.*


*ఇలాంటి వారు ఈ  శ్లోకాన్ని నిత్యం ఉదయం సాయంత్రం మీకు వీలైనన్ని సార్లు పఠించడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది.*


*ముఖ్యంగా విద్యార్థులు ఈ శ్లోకం ప్రతి రోజూ పఠించడం ఎంతో మంచిది.*


*శ్రీదత్తో నారదో వ్యాసః శుకశ్చ పవనాత్మజః కార్తవీర్యశ్చ గోరక్షో సప్తైతే స్మృతిగామినః*


                        🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

పురుష ప్రయత్నం!*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


          *పురుష ప్రయత్నం!*

               ➖➖➖✍️


*జీవితంలో  పురుషప్రయత్నం ప్రాధాన్యం గురించి రామకృష్ణ పరమహంస చక్కని దృష్టాంతాన్ని చెబుతారు.*


* మైదానంలో తాడుతో కట్టేసిన ఆవును ఉదాహరణగా చూపుతూ వివరిస్తారు. *


*మెడకు కట్టిన తాడు ఆ గోవు స్వేచ్చకు ప్రతిబంధకమే! దాని కదలికలకు అది పరిమితిని విధిస్తుంది.*


 *తొలుత అంత వరకే తన స్వతంత్రేచ్ఛ (ఫ్రీవిల్‌) అనుకొని ఆ గంగిగోవు కూడా తనను తాను సమాధాన పరుచుకుంటుంది.* 


*అందుకే తన పరిధి మేరకు గడ్డి మేస్తూ కాలం గడిపేస్తుంది. *అక్కడ ఇక తనకు గ్రాసం లభించదని రూఢి అయ్యాక దూరంగా ఉన్న గడ్డిపైకి దృష్టి మళ్లిస్తుంది. మెడకు కట్టిన తాడును విదిలించుకొని ఆ పచ్చిక వైపు పరుగులు తీసేందుకు పరిపరివిధాలా ప్రయత్నిస్తుంది.*


* అప్పుడు ఆ మూగజీవి తపనను యజమాని గమనిస్తాడు. అది తాడును వదిలించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు అతడు గుర్తిస్తాడు.*


* ఆ ఆవు ఆరాటాన్ని అర్థం చేసుకొని దాని మెడకు కట్టిన తాడును విప్పేసి మైదానంలోకి వదులుతాడు.*


* ఆ గోవుకు కట్టిన బంధనం లాంటిదే మన తలరాత. తెంచుకోవాలని ప్రయత్నించడమే పురుషార్థం. ఆ యజమానే భగవంతుడు.*


* విధికి దీటుగా మనిషి ఎంత తీవ్రంగా పోరాడితే, అంత త్వరగా ఆ శృంఖలాల నుంచి బయటపడగలడు.*✍️


                        🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀