6, ఆగస్టు 2022, శనివారం

గాయత్రి మాత

 గాయత్రి మాత అనగా ఎవరు.



ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు.


నా నుండి అగ్ని.

అగ్ని నుం…డి వాయువు,

వాయువు నుండి ఓంకారం,

ఓంకారంతో హృతి,

హ్రుతితో వ్యాహృతి,

వ్యాహృతితో గాయత్రి,

గాయత్రితో సావిత్రి,

సావిత్రితో వేదాలు,

వేదాలలో సమస్త క్రియలు

ప్రవర్తిమవుతున్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.

గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.


గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు.

వారి చైతన్య శక్తులు:.


1. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.


2. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.


3. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.


4. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.


5. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.


6. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.


7. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.


8. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.


9. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు


10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.


11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.


12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.


13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.


14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.


15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.


16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.


17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.


18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.


19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.


20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.


21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.


22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.


23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.


24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.


శ్రీ గాయత్రీ మాత మహాత్యం..

వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.


ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్

భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.


త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం.


హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు.


ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు.


గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది


బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం.


ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.


గాయత్రి మంత్రాక్షరాలు.


సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం

సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే

‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’


గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘


గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది.


పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి.


వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.



సాధన సాధ్య తే సర్వం..

బర్బరీకుడి కథ...

 *🎻🌹🙏 మహాభారతం లోని బర్బరీకుడి కథ...!!*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


*🌿మహాభారతంలో మహా మహులను అందరినీ ఒక్క నిముషంలో చంపి  యుద్ధం మొత్తం*


*🌸ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి  కథ.....!!*


*🌿ఎన్ని రకాల తత్వాలు. మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి.*


*🌸కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భమలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే. మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన పాత్ర ఒకటి ఉంది.*


*🌿తన పేరు బర్బరీకుడు. బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో. కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి.*


*🌸నిజానికి మహాభారతం అంటేనే శ్రీకృష్ణుడి చరిత్ర అనుకుంటాం. నిజానికి మహాభారతం నిండా కూడా శ్రీకృష్ణుడే. తను లేనిదే మహాభారతం లేదు.*


*🌿 ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా. తను ఘటోత్కచుడి కొడుకు. లక్క ఇల్లు తగులబడ్డాక, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో హిడింబి అనే ఓ రాక్షస యువతిని పెళ్లిచేసుకుంటాడు భీముడు.* 


*🌸వాళ్ల కొడుకే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఓ యాదవ రాజు మురు బిడ్డ మౌర్విని (అహిలావతి) పెళ్లాడతాడు. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు.*


*🌿నిజానికి తను ఓ యక్షుడు. ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు. రాజస్థాన్లో ఖటుశ్యామ్జీ పేరిట, గుజరాత్లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని.*


*🌸అక్కడి జానపదాలు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్లాయి. తను చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకుంటాడు. దేవీ ఉపాసకుడు కూడా. దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది.*


*🌿ఆ మూడు బాణాల్నే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను త్రిబాణధారి అంటారు. పాండవులు, కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిశాక, భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకూ చేరుతున్న వేళ, బర్బరీకుడు ఆ యుద్దాన్ని చూడాలని కోరుకుంటాడు.*


*🌸వెళ్లే ముందు తల్లికి ఓ మాట ఇస్తాడు. ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను. ఓడిపోయేవారిని గెలిపిస్తాను అని.*


*🌿 తర్వాత తన ధనుస్సు, నీలి గుర్రం, తన మూడు బాణాలు తీసుకుని బయల్దేరతాడు. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ప్రతి యోధుడినీ శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. నీకే బాధ్యతలు ఇస్తే యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు? ఇదీ ప్రశ్న.*


*🌸 20 రోజులు చాలునని భీష్ముడు అంటే, 25 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు. 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 రోజులు పడుతుందని అర్జునుడు. ఇలా తలా ఓ రకంగా చెబుతారు.* 


*🌿దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు శ్రీకృష్ణుడు. ఒంటరిగా తనను ఓ బ్రాహ్మణవేషంలో సమీపించి శ్రీకృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకూ ఆ ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా? అని అడుగుతాడు.*


*🌸నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఒక్కక్షణం దిగ్భాంతికి గురై, అదెలా సాధ్యం అనడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు. వాటి శక్తి వివరిస్తాడు.*


*🌿 నేను మొదటి బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని, వాళ్లందరినీ గుర్తించి పెడుతుంది.* 


*🌸 రెండో బాణాన్ని వేస్తే ఎవరెవరిని రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది. మూడో బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్లను విడిచిపెట్టి,*


*🌿మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్నీ ధ్వంసం చేస్తుంది. ఆ బాణాలు మళ్లీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు.*


*🌸నేను నమ్మను, నేనే కాదు, ఈ సృష్టిలో ఎవరూ దీన్ని నమ్మరు, నమ్మలేరు అంటాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది. ఏదీ, ఆ రావిచెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు శ్రీకృష్ణుడు.*


*🌿 చాలా సులభం అంటాడు బర్బరీకుడు. చేసి చూపించు అంటాడు శ్రీకృష్ణుడు. బాణం వదిలేముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్లు మూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు.*


*🌸 ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది. చివరకు శ్రీకృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది. ఇదేమిటి అనడుగుతాడు అమాయకంగా శ్రీకృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది.*


*🌿అందుకే అదక్కడకు వచ్చింది. నీ పాదం తీసివేయి. లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్లి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అది అంటాడు బర్బరీకుడు. తప్పనిసరై పాదం తీసేస్తాడు.*


*🌸మరో బాణం వెళ్లి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది. (రక్షింపబడాల్సినవి). తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి, ఒక్క దగ్గర మోపు కట్టేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీకృష్ణుడు.* 


*🌿ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమనీ, కాపాడలేమనీ అర్థమవుతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పుందని, గందరగోళం ఉందనీ గమనిస్తాడు.*


*🌸బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవపక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేననీ గుర్తించి కలవరపడతాడు.* 


*🌿ఒకవేళ భీముడిు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది? అందుకే దివ్యదృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకుని ఇలా  సంభాషణ ఆరంభిస్తాడు.*


*🌸 ఏమోయీ, నువ్వు ఎవరు? నువ్వు కూడా యుద్ధం చేస్తావా? అని అడుగుతాడు. నేను ఘటోత్కచుడి కుమారుడిని. యుద్ధం చూడాలని వచ్చాను. యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను.* 


*🌿పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణులు. అంటే పాండవులే బలహీనులు కదా.*


*🌸అవును, అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది. అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు.*


*🌿కౌరవులు బలహీనులు అవుతారు కదా. అవునవును. తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది. కానీ దాని వల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులు అవుతారు కదా.* 


*🌸మరేం చేయుట? ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది.*


*🌿తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేనని అటూఇటూ మారితే చివరకు ఇరుపక్షాలూ సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అనీ.*


*🌸విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది. శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ఎవరు మహాశయా మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా.*


*🌿ముందు నాకు ఓ వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు శ్రీకృష్ణుడు. అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు.*


*🌸అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు.*


*🌿 సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు. యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా.*


*🌸 ఇంత భారీ జనహనన యుద్దాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ. నిన్నెవరూ హతమార్చలేరు.* 


*🌿అందుకే నువ్వే నీ తలను తీసి నాకివ్వు అంటాడు శ్రీకృష్ణుడు. నన్నే ఎందుకు బలి ఇవ్వాలి?*


*🌸 ఇంతమంది యోధులు ఉండగా. పైగా వాళ్లంతా ప్రాణాలకు తెగించి వచ్చినవాళ్లు కదా అని ప్రశ్నిస్తాడు.* 


*🌿అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు. బర్బరీకా నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి భూమి మీద అధర్మం పెరిగిపోయింది*


*🌸నువ్వే కాపాడాలి శ్రీమహావిష్ణు అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు.*


*🌿దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు*


*🌸ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకింత పొగరుగా మాట్లాడావు.*


*🌿దానికి నోచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు.*


*🌸 అందుకే నీ బలి. అంతేకాదు నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ నాకు యుద్దాన్ని చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు.*


*🌿ముందు నీ తలను ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు.*


*🌸 శ్రీకృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు.*


*🌿యుద్ధం ముగిసింది. విజయ గర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు.*


*🌸వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు శ్రీకృష్ణుడు. తన కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తరువాత శ్రీకృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు.*


*🌿వత్సా! ఈ మొత్తం యుద్దంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే, నువ్వు చెప్పు ఏం గమనించావో?*


*🌸స్వామీ! ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను. మహాకాళి వేల నాలుకలతో పాపులను బలితీసుకోవటాన్ని చూశాను.*


*🌿ఆ మహాశక్తి నువ్వు మాత్రమే. యుద్ద కారకులు, యుద్ధకర్తలు, మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే*


*🌸అని సమాధానమిచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి యక్ష రూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోతాడు. ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ....🚩🌞🙏🌹🎻*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿https://chat.whatsapp.com/GKrn3Hn3E7KIe2nULT6Fa2


(సేకరణ)

పంచాంగాలు

శ్రీ శర్మదాగారు చక్కని వివరణ ఇచ్చారు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా కొంచం అధికంగా విస్తర్ణగా పేర్కొన ప్రయత్నిస్తాను. 

మూడు రకాల పంచాంగాలు వున్నాయి అది నిజం కానీ ఈ మూడు రకాల పంచాంగాలలో కూడా అన్ని గ్రహగతులను గణిస్తారు, పరిగణలో తీసుకుంటారు.  కాకపొతే మన చాంద్రమానంలో చంద్రుని ఆధారంగా తిదులను, వారలను, నేలలను గణిస్తారు.అమావాస్యతో నెల అయిపోతుంది.  పాడ్యమినుండి కొత్త నెల మొదలవుతుంది.  అందుకే మన సంవత్సరం చేత్రశుద్ధ పాడ్యమి నుండి మొదలొవుతుంది. ఫాల్గుణ అమావాస్యతో ముగుస్తుంది. 

ఒక చాంద్రమానం నెలలో 14 తిధులు తరువాత అమావాస్య లేక పౌర్ణమి ఉంటుంది. అవి 1)పాడ్యమి, 2) విదియ 3) తదియ, 4) చవితి, 5)పంచమి, 6) శ్రష్టి 7) సప్తమి, 8) అష్టమి, 9) నవమి, 10) దశమి, 11) ఏకాదశి, 12) ద్వాదశి, 13) త్ర్యయోదశి 14) చతుర్దశి 15) అమావాస్య లేక పౌర్ణమి. 

ఇందులో సాధారణంగా 4,6,8,9,13.14 తిధులను శుభ తిధులుగా పరిగణించారు. 

నిజానికి చాంద్రమానం పంచాంగం చెంద్రుని గతిని ఆధారంగా చేసుకొని నిర్మించినది కాబట్టి నెలకు 30 రోజులు వుండవు.  కేవలం 27.32 రోజులు మాత్రమే ఉంటాయి.  అందుకే మనకు కండతిధులు, తిదిద్వయాలు వస్తూవుంటాయి.  అంటే ఒక సూర్యోదయానినుంచి మరొక రోజు సూర్యోదయసమయంలో పూర్తిగా ఒకే తిధి వుండదనుమాట. కాబట్టి మనం జరుపుకునే శుభాశుభ కార్యాలను ఒక్కొక్కరు ఒక్కొకరీతినో ఆయా తిథిని అవలంబించి జరుపుకుంటారు. 

కొన్ని పండగలను స్మార్తులు ఒకరోజు, శ్రీవైష్ణవులు ఒకరోజు జరుపుకోవటం మనకు నిత్యానుభవమే. వీరిరువులు చాంద్రమానం పంచాంగం ను అనుసరించినా కూడా స్మార్తులు తిధి ఆరంభంను శ్రీవైష్ణవులు తిధి అంతాన్ని పరిగణలో తీసుకుంటారని నాకు ఉన్న  పరిజ్ఞనం. జ్యోతిష్య పండితులు దీనిని సవరించ గలరు.  కాగా కొన్ని సందర్భాలలో సూర్యోదయ కాలంలో ఉన్నతిధిని పరిగణలో తీసుకోవటం కద్దు. 

మనం సమత్సరం అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే భ్రమణ కాలంగా పరిగణిస్తాము అంటే అది 365.26రోజులు కానీ మన చంద్రమానంలోని 12 నేలలను గణిస్తే వచ్చేది 327/32 రోజులు.  అనగా 37.42 రోజులు ఒక సారి భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం కన్నా తక్కువ మరి ఈ కాలాన్ని ఎలా సర్దాలి అని మన మహర్షులు యోచించి మనకు అధిక మాసాలను ఏర్పాటు చేశారు.  అధిక మాసం అంటే ఒక ఏడులో ఒక నెల రెండు పర్యాయాలు వస్తుంది అనిఅర్ధం. ఈ అధిక మాసాగూర్చి మనందరికీ విదితమే. 

మనం జరుపుకునే అన్ని పండగలను చాంద్రమానం ప్రకారం జరుపుకున్నాకూడా ఒక్క మకర సంక్రాంతిని మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాం అన్నమాట అందుకే సంక్రాతి పండగ ప్రతి ఏడు జనవరి 14 వ తారీకు నాడే వస్తుంది. కానీ కొన్ని ప్రత్యేక కారణాలవల్ల జనవరి 15న కూడా రావచ్చు (స్థలాభావం వలన ఇక్కడ వివరణ ఇవ్వటంలేదు) 


ప్రశ్నకు

 ప్ర. దేవి జగన్మాత, కరుణామయి - అంటారు కదా! జగములన్నిటికీ తల్లి అయిన దయామయి అయితే, జగతిలో భాగమైన రాక్షసులకు కూడా తల్లే కదా! మరి వారిని సంహరించడం న్యాయమా?

జ. ఈ ప్రశ్నకు కూడా మన శాస్త్రాల్లో స్పష్టమైన సమాధానముంది. జగతికి కారణమైన ఈశ్వర భక్తి కనుక 'జగన్మాత ' అన్నారు. అయితే పాపపుణ్యాలకు, మంచిచెడులకు  ఆ శక్తి కారణం కాదు. ఆయా జీవుల సంస్కారాలు. అయితే దుష్టులైన రాక్షసులు మొదలైన లోకకంటకులను సంహరించి, వారి పాపాలను  తొలగించి సద్గతులనే  ప్రసాదిస్తుంది. ఇది శిక్షారూపంగా కారుణ్యం, శిష్టులైన వారి పట్ల రక్షణ రూపంగా దయ - రెండూ జగన్మాత కృపారూపాలే.

అంతే కాదు- ఆ తల్లి జగజ్జనని మాత్రమే కాదు- జగదీశ్వరి కూడా. జగతిని పాలించేటప్పుడు దుష్టత్వాన్ని నిగ్రహించి, శిష్టత్వాన్ని రక్షిస్తుంది. రెండూ మాతృకృపలే.

ధర్మాకృతి : పూర్వీకులు

 ధర్మాకృతి : పూర్వీకులు 


తంజావూరు మహారాష్ట్ర ప్రభువుల పాలనలోనికి రాకముందు కర్ణాటక నాయక రాజుల పరిపాలనలో ఉండేది. నాయక రాజులలో ప్రసిద్ధులైన సేవప్ప నాయకుని కాలంలో శ్రీ గోవింద దీక్షితుల వారు నాయకరాజుల కుల గురువుగా ఉండేవారు. వారు బహుశాస్త్ర కోవిదులు. యజ్ఞదీక్షితులు, అనుష్ఠానపరులు. రాజుగారి కోరికపై ప్రధాని మంత్రిపదవిని స్వీకరించారు. అనతికాలంలో మంచి పరిపాలనాదక్షులుగా విఖ్యాతి సాధించారు. వీరి కాలంలో తంజావూరు సీమ అన్ని రంగాలలోనూ ముందంజ వేసింది. అనేక ప్రజోపకరములైన కార్యములు చేపట్టబడినవి. అయ్యన్ అనేది దీక్షితుల వారి గౌరవ నామము. వీరి కాలంలోనే వీరి పేరుతో తంజావూరి సీమకంతటికీ సేద్యపునీటినందించు అయ్యన్ కాలువ, అయ్యన్ కోనేరు త్రవ్వబడినాయి. వీరు కుంభకోణములో రాజా వేదపాఠశాలను ఆరంభించారు. ఈనాటికి కూడా ఆ పాఠశాలలో నూరుకు పైగా విద్యార్థులు వేదశాస్త్రములు అధ్యయనం చేస్తున్నారు. చతుర్దండి ప్రకాశిక అనే పుస్తకాన్ని రచించిన ప్రసిద్ధ స్వరమేళకర్త శ్రీ వేంకటమఖి వీరి పుత్రులు.


దీక్షితుల వారు హోయసల కర్ణాటక బ్రాహ్మణులు. వీరిని ఆశ్రయించుకొని అనేక కర్ణాటక బ్రాహ్మణ కుటుంబాలు తంజావూరి సీమకు తరలివచ్చాయి. నాయకరాజులు కూడా కన్నడిగులే కదా! ఇలా స్థిరపడిన కుటుంబాల వారందరూ వేదశాస్త్రములలో మహత్తరమైన కృషి చేశారు. తంజావూరి సీమకే గర్వకారణమయినారు. పేష్వాల చేత అపరిమితమైన గౌరవాన్ని పొందిన పొందిన మణికుట్టి ఈ వంశములోని వారే. మణికుట్టి చివరి పేష్వాకు అత్యంత అంతరంగీకులయ్యారు. చివరికి ఆ పేష్వాను తెల్లవారు బంధించి తీసుకొని వెళుతున్నప్పుడు కూడా దారిలో బిచ్చమెత్తుకుని జీవిస్తూ బహుకాలం వారికి శాస్త్ర విజ్ఞానపు విందు చేశారు. తరువాత మైసూరు మహారాజు చేత విశేష సత్కారాలను పొందారు.


కంచి కామకోటి పీఠపరంపరలో 59వ ఆచార్యుల వారయిన శ్రీ భగవన్నామ భోదేంద్ర సరస్వతీ స్వామివారు రామేశ్వర యాత్ర ముగించుకొని కంచి తిరిగి వస్తూ పవిత్ర కావేరీ తీరంలో ప్రకృతి రమణీయమైన గోవిందపురంలో బహుకాలం ఉండి అక్కడే సిద్ధి పొందారు. వారి శిష్యులయిన శ్రీ ఆధ్యాత్మిక ప్రకాశేంద్రులు కూడా చాలా కాలం గురువుగారి అధిష్ఠానం వద్దనే ఉండిపోయారు. వారు తమ వారసుని మహాపండితులయిన ఈ హోయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబం నుంచే ఎన్నుకొన్నారు. అప్పటి నుంచి మన మహాస్వామి వారి వరకు వచ్చిన పీఠాధిపతులందరూ ఈ కుటుంబాల నుంచి వచ్చిన వారే. 


17వ శతాబ్దంలో కర్ణాటక యుద్ధం కారణంగా కాంచీపురంలో అశాంతి నెలకొన్నది. అప్పటి కామకోటపీఠ ఆచార్యులయిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు బంగారు కామాక్షీ విగ్రహాన్ని తీసుకొని ఒడయార్ పాళెం చేరారు. ఒడయార్ పాళెం జమీందారులు శ్రీచరణుల యెడ అపరిమితమైన భక్తిప్రపత్తులున్నవారు. అప్పటి తంజావూరు పాలకులైన శ్రీ ప్రతాప సింహ రాజా స్వామి వారిని తంజావూరు విచ్చేసి ఉండవలసినదిగానూ, బంగారు కామాక్షిని తంజావూరులో ప్రతిష్ఠించవలసినదిగానూ కూరారు. రాజాగారి వినతిని అనుసరించి స్వామివారు తంజావూరు విచ్చేసి, కామాక్షీ విగ్రహ ప్రతిష్ఠ చేయించి, శంకర మఠంలో కొంతకాలం బసచేశారు. స్వామివారు ముఖ్యపట్టణానికి కొంచెం దూరంగా నదీ తీరంలో ఉండడానికి సంకల్పించడంతో అప్పటి తంజావూరు ప్రధాని శ్రీదాబిర్ పంత్ శ్రీ మఠానికి కుంభకోణం కావేరీ తీరంలో ఆదికుంభేశ్వర మంగళాంబాదేవి సమక్షంలో మఠనిర్మాణం చేసి ఇచ్చారు. శ్రీమఠ ప్రధాన కార్యాలయం కుంభకోణానికి మార్చబడింది. కంచిలో నామమాత్రంగా శాఖా కార్యాలయం నిర్వహించబడుతూ వచ్చింది. 


శ్రీమఠం కుంభకోణానికి వచ్చినది ఆదిగా అపప్తికే ఉద్దండ పండితులుగా ప్రఖ్యాతి గాంచిన హోయసల కర్ణాటక బ్రాహ్మణులు పీఠమునకు యధోచితమైన సేవ చేస్తూ స్వామి వారలను ఆశ్రయించి ఉన్నారు. మన మహాస్వామి వారి మాతామహా స్థానము గోవింద దీక్షితుల వారి పరంపరలోని వారు. వారి ప్రపితామహులైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తిరువిడైమరుదూరు మహాలింగస్వామి ఆలయ వీధిలో ఉన్న శంకరమఠంలో పూజ చేస్తూ శ్రీమఠ ముద్రాధికారిగా ఉన్నారు. వారికి ఇద్దరు కుమారులు శ్రీ శేషాద్రి శాస్త్రి, శ్రీ గణపతి శాస్త్రి. శేషాద్రి శాస్త్రి గారు ఋగ్వేదాధ్యయనం పూర్తిచేసి తండ్రిగారి ముద్రాధికారిత్వం చేపట్టి శంకరమఠంలో పూజ చేస్తూ తిరువిడై మరుదూరులో స్థిరపడ్డారు. శ్రీ గణపతి శాస్త్రి ఋగ్వేదము సాంగోపాంగంగా అధ్యయనం చేశారు. మంచి శాస్త్ర పండితులు. మాతృభాష కన్నడం, తెలుగు, తమిళం, మరాఠీ భాషలలో మంచి ప్రవేశం ఉన్నది.  50సంవత్సరములు శ్రీమఠంసర్వాధికారిగా తమ యావచ్ఛక్తి యుక్తులు ధారపోశారు. ఈ హోయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబములలో తిరువిసైనల్లూరులో స్థిరబడిన కుట్టకవి మనుమడు మహా పండితుడు అయిన “మణికుట్టి” గురించి, శ్రీ గణపతి శాస్త్రిగారి గురించి మహాస్వామి వారు ఇష్టాగోష్ఠిలో చెప్పిన రసస్ఫోరకమైన విషయాలు శ్రీ రా. గణపతి గారిచే తమిళ భాషలో కల్కిలో ప్రచురించబడినవి. ఇందు చెప్పబడిన విషయములు శ్రీమఠ ఆచార్యుల చరిత్రతోనూ, శ్రీవారి పూర్వీకులతోనూ ముడిపడి ఉన్నందున, వీని స్వేచ్ఛానువాదములు ఇక్కడ పొందుపరచబడినవి. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

5, ఆగస్టు 2022, శుక్రవారం

 చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరును ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని


బునే మేల్కాంచి స్నానాదుల జేసి చిత్ర గట్టుకొని చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి RO


మంటపం బేర్పరచి యందొక ఆసనంబువైచి దానిపై కొత్తబియ్యం బోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచేత కలశంబేర్పరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వ స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే " నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!" అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన జేసి ప్రదక్షిణము జేసిరి. ఇట్లొక ప్రదక్షిణము జేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళకు జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఓహో! వరలక్ష్మీ దేవి కటాక్షం వలన గల్గినవని పరమానందంబు నొంది మరియొక్క ప్రదక్షిణంబు జేయగా హస్తములందు దగద్ధగాయమానంబుగా మెరయుచుండ నవరత్న ఖచితంబులైన నాభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేల మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి యిండ్లనుండి గుర్రములు, ఏనుగులు, రథములు బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తప్రకారముగా పూజచేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరను భుజించి తమకొరకు వచ్చి కాచుకొని యుండు వాహనములపై యిండ్లకు బోవుచు ఒకరితో నొకరు ఓహో! చారుమతీదేవి భాగ్యంబేమని చేసి వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం, సంపత్తులు గలిగెనని చారుమతీ దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ


యిండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి గలిగి, ధనకనక వస్తు


వాహనములతోడ గూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతీ! యీ యుత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యంబులను గలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను వినువారలకును, చదువు వారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును.

ఎంత మంది VIP లు వున్నారు?

 హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.


[  *సేకరణ : from -> Rama*]


♦️ *భారత దేశంలో ఎంత మంది VIP లు వున్నారు? వాళ్లకు అయ్యే ఖర్చెంత*♦️


▪️బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు!*


▪️ *ఫ్రాన్స్‌లో 109 మంది వీఐపీలు ఉన్నారు!*


▪️ *జపాన్‌లో 125 మంది వీఐపీలు ఉన్నారు!*


మరియు :


▪️ *జర్మనీలో 142 ఉన్నాయి!*


▪️ *USAలో మొత్తం VIPల సంఖ్య 252!*


▪️ *రష్యా 312!*


మరియు :


▪️ *చైనాలో మొత్తం వీఐపీల సంఖ్య 435!*, కానీ 


♦️ *భారతదేశంలో మొత్తం 5,79,092 VIPలు ఉన్నారు!!*


▪️ఈ VIP లకు కల్పించే : 


▪️ *సెక్యూరిటీ, ఫ్లైట్ బిల్లులు, విదేశీ ప్రయాణం & వెకేషన్, రవాణా, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, క్యాంటీన్లు & ఇతర పెర్క్‌లలో-  రాయితీతో కూడిన అధిక నాణ్యత గల-  ఆహారం యొక్క  బిల్లులను- వాటికి అయ్యే ఖర్చులను ఊహించు కోండి!*


♦️ *బాధగా ఉంది కదూ !*


▪️ *ఈ సంఖ్యను వెంటనే 300 కంటే తక్కువకు తగ్గించడం అత్యవసరం, అంతే కాకుండా ఇది మన దేశానికి కావలసిన ఉత్తమమైన సంస్కరణ!*


▪️ *ఈ దేశంలోని సామాన్య ప్రజల కోసం ఉద్దేశించవలసిన  విలువైన జాతీయ వనరులను- యిలా వృథా చేస్తున్న రాజకీయ VIPల భారీ సైన్యాన్ని- ఒక్కసారి గుర్తుంచుకోండి!*


▪️ *ఈ హాస్యాస్పదమైన అసంబద్ధతకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని రూపొందించ డానికి - ఈ విషయాలు అందరికీ షేర్ చేయండి!*


♦️▪️ఈ వాస్తవాన్ని దేశమంతా వ్యాప్తి చేసి మీ నైతిక బాధ్యతను నిర్వర్తించండి ?


▪️ఈ సందేశాన్ని మీ అన్ని సమూహాలు మరియు పరిచయాలకు షేర్ చేయండి.


▪️ఈ మార్పు తప్పకుండా జరిగేలా, ఆమార్పును చేయగల దేశం యొక్క-  నిర్దిష్ట అధికారులకు ఈ సందేశం చేరనివ్వండి/ చేరవేయండి.


♦️అనవసరపు విషయాలు మాత్రమే ప్రస్తావించే పత్రికలు, ప్రచార మాధ్యమాలు - ఈ దేశ సంక్షేమం ఎప్పుడో వదిలి వేసాయి. కాబట్టి, ఆబాధ్యత మనమే తీసుకుందాం. *Please share to maximum people*.


హరిః ఓమ్. హరిః ఓమ్.

రాముని గుణగణాల వర్ణన

 శ్లోకం:☝️

*స చ నిత్యం ప్రశాంతాత్మా*

   *మృదు పూర్వంతు భాషతే |*

*ఉచ్య మానోపి పరుషం*

   *నోత్తరం ప్రతిపద్యతే ||*


భావం:  అయోధ్యాకాండ తొలి సర్గలో రాముని గుణగణాల వర్ణన. శ్రీరాముడు మానవుడుగా జన్మించి మానవులలో తప్పక ఉండవలసిన కొన్ని గుణములను ప్రదర్శించినాడు. 

    అతడు నిత్యమూ ప్రశాంతమగు మనసు కలవాడు. ఆతని మనసులో ఎన్నడునూ కామముగాని , క్రోధము గాని , లోభము గాని చోటు చేసుకొనవు. అందుకే నిశ్చలముగా ఉండును. మనసున ప్రశాంత స్థితి కలిగి ఉండుట మానవునకు ప్రధానముగా ఉండవలెను. 

    రెండవది శ్రీరాముడు ఎల్లప్పుడూ ఎదుటివారి మనసునొప్పించకుండ వినుటకు ఇంపుగా సుకుమారముగా , మధురముగా మాట్లాడేవాడు. ఎవరైనా తనను గూర్చి పరుషముగ మాటలాడినా కూడా దానికి బదులు చెప్పేవాడు కాదు. బదులు చెప్పక పోవుట సమాధానము చెప్పే శక్తి లేక కాదు. ప్రశాంతమైన మనసు కలవాడు అగుటచే ఎదుటివారు మాట్లాడిన మాటకు ఆతని మనసున కోపము కలిగేదికాదు. కోపము కలిగిన నాడు మాట పరుషముగా వచ్చును. ఆతనికి కోపమే రాకపోవుటచే పరుషమైన మాట వచ్చేదికాదు. ఎవరైనా పరుషమైన మాటలు ఆడిననూ వారితో మృదువుగా మాట్లాడేవాడు గాని పరుషముగా మాట్లాడేవాడుకాదు.

    ఈస్థితిని మానవులు అలవరచుకోవలెను అని భావం.🙏

*ఫల ప్రదో భవేత్ కాలే....*

 ఇది కథా…నిజమా…?


          *ఫల ప్రదో భవేత్ కాలే....*


*"విశాఖపట్టణం నుండి పలాసపోవు ప్యాసింజర్ మరి కొద్ది సేపట్లో 5వ నెంబర్ ప్లాట్‌ఫాం నుండి బయలు దేరుటకు సిద్ధంగా ఉంది" అని మైకులో వినబడుతుంటే రామనాథం మాస్టారు గబగబా పరుగెత్తి వెళ్ళి రైల్లో కూర్చున్నారు.


*రామనాధంగారు రిటైర్ అయిన సంస్కృత ఉపాధ్యాయుడు. విజయనగరం మహారాజా వారి సంస్కృత కళాశాలలో పనిచేసారు; ఎందరో విద్యార్థులకు విద్య గరపారు. మంచికి మారుపేరుగా అందరూ చెప్పుకుంటారు ఆయన్ని గురించి. ఎందరో పేద విద్యార్థులకు చేయూత నందించిన వ్యక్తిత్వం ఆయనది.


*రైలు వేగం మెల్లమెల్లగా పెరుగుతుంటే ఆయన మనసు గతం లోకి పరుగులు పెడుతోంది. చాలా రోజుల తరువాత తన పుట్టినూరికి వెళ్తున్నాడు. తమ ఊరి పొలాలు, చెరువు గట్టు, శివుడి కోవెల, తను చదివిన బడి.. అన్నీ గుర్తొస్తున్నాయి. తన చిన్ననాటి తెలుగు మాస్టారు చెప్పిన "చేసిన మేలు ఊరకన్ పోదు" అనే మాట ఇప్పటికీ చెవుల్లో వినబడుతోంది. ఆ మాటే తనని ఉన్నతమైన వ్యక్తిగా సమాజంలో నిలబెట్టింది.


*రైలు విజయనగరం చేరుతోంది. ఎవరో భిక్షగాడు "జీవము నీవే కదా..దేవా" అని పాడుకుంటూ వస్తున్నాడు. రాంనాథం గారు ఒక ఐదు రూపాయల బిళ్ళ అతని చేతిలో పెట్టారు.


*రైలు విజయనగరంలో ఆగింది. రామనాథం గారు ఓమాటు రైలు దిగారు. ఆ రోజు దినపత్రిక కొని, మళ్లీ రైలెక్కారు. పేపరు చదువుతుండగా వినబడింది.. "టికెట్ టికెట్" అని! తల త్రిప్పి చూశారు. ఎదురుగా రెండు మూడు వరసల ముందునించి టికెట్‌లు తనిఖీ చేస్తూ వస్తున్న అధికారి కనబడ్డాడు. రాంనాథం గారు లేచి నిల్చున్నారు. టికెట్ తీసుకుందామని తన లాల్చీ జేబులో చెయ్యిపెట్టారు. జేబు ఖాళీగా చేతికి తగిలింది!


*మాస్టారుగారికి దిక్కు తోచలేదు. "పర్సు ఏమైంది?! తన పర్సులోనే పెట్టుకున్నాడే, డబ్బులు టికెట్ కూడానూ?! పర్సు జేబులో లేదు!" రెండు జేబులూ తడుముకొని చూసుకున్నాడు. రెండూ ఖాళీనే! దేవుడా, ఏం చేసేది?.. టికెట్ లేదు; డబ్బులు లేవు. వెళ్లేది అమ్మాయి పెండ్లికి!.


*రామనాధం గారికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. టికెట్.. టికెట్..' శబ్దం ముందు ముందుకు వస్తోంది.


*'నాకు ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితిరాలేదు: ఈ వయస్సులో ఇంతమంది ముందు దోషిగా నిలబడతానే, ఏం చేసేది?" రామనాథం గారి మనసు పరిపరివిధాల పోతోంది.. "విజయనగరంలో దిగి పేపరు కొన్నాను. గాబరాగా పర్సు జేబులో పెట్టుకొని రైలెక్కేసాను.. బహుశా అప్పుడే అది బయట పడిపోయి ఉంటుంది. ఇప్పుడెలాగ?" రామనాధంగారి కళ్ళు మూసుకుపోయాయి.


*"టికెట్..టికెట్..." శబ్దం మరింత దగ్గరకు వచ్చింది.. తన ఎదురుగా ఉన్నవాళ్లని ప్రశ్నిస్తోంది. రామనాథం గారికి చెమటపడుతోంది.


*"ఇప్పుడు ఏం చేయాలి? చేతిలో నయాపైసా అయినా లేదు.. తెలిసిన వాళ్ళుకూడా ఎవరూ లేరు ఈ రైల్లో.." రాంనాథం గారు తలవంచుకుని కూర్చున్నారు. "టికెట్.. టికెట్.." శబ్దం తన పక్క వారిని ప్రశ్నిస్తోంది.......'పరీక్షలో‌ జవాబులు తెలియని ప్రశ్నలకు సమాధానాలు రాసే విద్యార్థిలాగా ఉంది రాంనాధం గారి పరిస్థితి. "జీవితంలో ప్రతివాడూ ఎల్లప్పుడూ విద్యార్థే......" తాను పిల్లలకు చెప్పిన మాటలు తనకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. "తనూ ఇప్పుడో 'అర్థే'.." రామనాధం గారు ముడుచుకు పోతున్నారు.


*"ఏమండీ.. మీ టికెట్ చూపిస్తారా?" ఆ గొంతు తననే ప్రశ్నిస్తోంది.. రాంనాథం గారు తటాలున లేచి నిల్చున్నారు. అతని వేపు చూసారు.. ఒక్క క్షణం నిశ్శబ్దం…


*ఏం చెప్పాలో పాలుపోలేదు..

"ఏమని చెప్పను?.. టికెట్ లేదనేదా?.. నన్ను జైల్లో పెట్టమనేదా?.."


*రైల్వే అధికారి ఏదో అంటున్నారు. రాంనాధం గారికి అది సగం సగమే వినబడుతున్నది.. "నమస్కారం మాస్టారూ, నేను మీ దగ్గర చదువుకున్న గోపాల్‌ని. గుర్తున్నానో లేదో.. నాకు మీరు చాలా సార్లు సాయం చేసారు. విజయనగరంలో రైలు ఎక్కబోతుంటే నాకు ఒక పర్సు దొరికింది. 'ఎవరిదా' అని చూస్తే దానిలో మీ ఫోటో ఉంది.. అక్కడినుండీ నేను మీ కోసమే వెతుక్కుంటూ వస్తున్నాను.


*ప్రస్తుతం రైల్వేలో టి.టి.యీ. గా పనిచేస్తున్నాను మాస్టారూ. ఇంతకాలం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది....ఇదిగోండి, మీ పర్సు తీసుకోండి.. ఇందులో టికెట్ కూడా ఉంది" అని పర్సు అందించి, రాంనాథం గారికి గౌరవంగా నమస్కరించాడు గోపాల్.


*రాంనాథం గారి సంతోషానికి అవధులు లేవు. తన పర్సు దొరకడం ఒక వంతు అయితే, తన విద్యార్థి ప్రయోజకుడై తన ముందు నిలబడి ఉండటం మరొకటి. రాంనాధం గారు ఆలోచనల్లో ఉండగానే గోపాల్ చెబుతున్నాడు.. "మీరు మాకు ఎన్నో నీతి శ్లోకాలు చెప్పారు, అందులో ఒకటి ఇప్పటికీ గుర్తుంది:


*యథా బీజాంకుర: సూక్ష్మ: ప్రయత్నేన అభిరక్షిత:।

ఫలప్రదో భవేత్ కాలే-తద్యల్లోకో సురక్షిత:॥


*విత్తనం‌ నుండి వచ్చిన మొలక చాలా చిన్నది. అయినా దానిని మనం నీరుపోసి జాగ్రత్తగా రక్షిస్తే, అది పెరిగి పెద్దదై, సరైన సమయంలో మనకు ఫలాలను అందిస్తుంది. ఈ లోకం కూడా అలాంటిదే. మనం తోటి వారికి చేసిన సాయం వృధా పోదు. ఏదో ఒకనాడు అది మనకు సహాయమై తిరిగి వస్తుంది.' అని మీరు ఎన్నోసార్లు చెప్పారు. మేము మీ దగ్గర పెరిగిన పూల మొక్కల లాంటి వాళ్లమే. నమస్కారం. నేను వెళ్ళొస్తాను, అని వెళ్లి పోయాడు.


*"పుస్తక జ్ఞానాన్ని, జీవిత పాఠాలు చెప్పిన గురువులు అందరికీ శుభ నమస్సులు"

                                               

            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

సేకరణ.

ఏక శ్లోకి -

 ----శ్రీమాత్రేనమః ---

   ------ఏక శ్లోకి -----

************************

కిం  జ్యోతిస్తవ భానుమానహని మే  రాత్రౌ ప్రదీపాదికం 


స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే 


చక్షుస్తస్య నిమీలనాదిసమయే కిం  దీర్దియో దర్శనే 


కిం తత్రాహమతో భవాన్పరమకిం జ్యోతిస్తదస్మిప్రభో 


( జగద్గురువు ఆదిశంకర భగవత్పాదులు ) 

ప్ర :- తవకింజ్యోతి: ? = నీకు జ్యోతిస్సు ఏది ? 

స :- మే అహని భానుమాన్ , రాత్రౌ ప్రదీపాదికమ్ = నాకు పగలు సూర్యుడు , రాత్రి దీపాదులు. జ్యోతిస్సు 

ప్ర ;- స్యాదేవం ----- మే = అదిసరియే సూర్య దీపాదులగూర్చి తెలుసుకొనడానికి నీకు ఏది జ్యోతిస్సో చెప్పుము. 

స :- చక్షు : = అందుకు నేత్రమే జ్యోతిస్సు. 

ప్ర :- తస్య నిమీలిత సమయే కిమ్ = అది మూసుకోవడం వంటి పరిస్థితుల్లో నీకు జ్యోతిస్సుయేది ? 

 స:- ధీ : = బుద్ది తేజస్సు. 

ప్ర :- ధియో దర్శనే కిమ్ ? = బుద్ధినిగూర్చి తెలుసుకోవడానికి ఏది ? 

స :- తత్ర అహం = అందుకు నేనే జ్యోతిస్సును. 

గురువు :- అతోభవాన్ పరమకం జ్యోతి : = అందుచేత నీవే ( అనగా ఆత్మయే ) పరమమైన తేజస్సు అని తెలిసికొనుము. 

శిష్యుడు :- ప్రభో ! తత్ అస్మి = ఓ గురూత్తమా ! తెలిసినది. ఆ పరమ తేజస్సు నేనే. 

           ఈ శ్లోకంలో అద్వైత సిద్ధాంతాన్నంతటిని ఎలా సంగ్రహించి బోధించారో అది సహృదయైక వేద్యమైన విషయం.

4, ఆగస్టు 2022, గురువారం

ప్రపంచంలోని ఉత్తమ గీతం

 సంతోషకరమైన వార్త, మన జాతీయ గీతం "జన గణ మన... "ని యునెస్కో "ప్రపంచంలోని ఉత్తమ గీతం"గా ప్రకటించింది.  కొద్ది నిమిషాల క్రితం.


 దయచేసి దీన్ని షేర్ చేయండి.

 భారతీయుడిగా చాలా గర్వంగా ఉంది.


 మన జాతీయ గీతం యొక్క అర్థం

 చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు స్పష్టంగా ఉచ్చరించండి.


 *”పదం పదం లోని అర్థం*


 జన            = ప్రజలు

 గణ            = సమూహం

 మన           = మనసు

 అధినాయక = నాయకుడు

 జయహే       = విజయం

 భారత      = భారతదేశం

 భాగ్య       = విధి

 విధాత      = డిస్పోజర్

 పంజాబ     = పంజాబ్

 సింధు       = సింధు

 గుజరాత   = గుజరాత్

 మరాఠా    = మరాఠీ (మహారాష్ట్ర)

 ద్రావిడ    = దక్షిణ

 ఉత్కల        = ఒరిస్సా

 వంగా       = బెంగాల్

 వింధ్య     =వింధ్యాలుl

 హిమాచల   =హిమాలయ్

 యమునా     = యమునా

 గంగా         = గంగ

 ఉచ్ఛల = కదులుతున్న

 జలధి =మహాసముద్రము 

 తరంగ = అలలు

 తవ= మీ

 శుభ=మంచిది

 నామే= పేరు

 జాగే     = మేల్కొలపండి

 తవ   = మీ

 శుభ      = శుభప్రదమైనది

 ఆశిష = దీవెనలు

 మాగే     = అడగండి

 గాహే      = పాడండి

 తవ       = మీ

 జయ= విజయం

 గాథ      = పాట

 జన       = ప్రజలు

 గణ      = సమూహం

 మంగళ = అదృష్టము

 దాయక   = ఇచ్చేవాడ

 జైయహే    = విక్టరీ బీ

 భారత = భారతదేశం

 భాగ్య = విధి

 విధాత = పంచేవాడు

 జైయహే, జైయహే, జై యహే, జైయ జైయ జైయ   జయహే = విజయం విజయం,విజయం, విజయం,  ఎప్పటికీ...


 దయచేసి దీన్ని షేర్చేయండి మరి మన జాతీయ గీతం యొక్క అర్థాన్ని ప్రజలందరికీ తెలియజేయండి..

2, ఆగస్టు 2022, మంగళవారం

 అష్టస్వరూపధారిణి

కష్టనివారణి మధురిపు గాదిలిరాణీ

దుష్టదనుజ సంహారిణి

తుష్టి విధాయిని మముకృపతోడను కనుమా!

ఉసిరికాయతో వైద్యం

 ఉసిరికాయతో వైద్యం - 


 * ఉసిరి , తాని , కరక్కాయ ( త్రిఫల ) చూర్ణాన్ని ఆవునెయ్యితో కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మధుమేహ వ్యాధి తగ్గుతుంది . 


 * ఉసిరిక మురబ్బాను లేదా పూటకు రెండు లేదా మూడు ఉసిరికాయల చొప్పున తీసుకుంటే అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి.


 * ఉసిరికాయ రసం 1 టీ స్పూన్ , క్యారెట్ రసం 1 గ్లాస్ , తేనే 1 టీ స్పూన్ కలిపి రోజుకు ఒకటి రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తీసుకున్నట్లు అయితే క్యాన్సర్ వ్యాధికి , కోబాల్ట్ చికిత్స తీసుకున్న వారికి నీరసం తగ్గి ఉత్సాహం గా కూడా ఉంటారు. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.


 * ఉసిరిక రసము ఒక టీ స్పూన్ , కొబ్బరి పాలు ఒక కప్పు కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే జీర్ణకోశంలో గల నులిపురుగులు , బద్దెపురుగులు , కొంకి పాములు , ఎలిక పాములు వంటివి నశిస్తాయి. 


 * ఉసిరిక రసము 1 టీ స్పూన్ , తేనే 1 టీ స్పూన్ కలిపి ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే ఉబ్బసం , స్కర్వీ వ్యాధి , రక్తహీనత ( ఎనిమియా ) వంటివి తగ్గుతాయి . 


 * సాధారణ జలుబు , జ్వరం ఉన్నవారు కూడా ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే వాటిని తగ్గించవచ్చు. 


 * ఉసిరికాయలు , పెద్ద ఉల్లిగడ్డలను సమానంగా తీసుకుని వాటిని నూరి రసమును తీసి ఆ రసాన్ని ప్రతిరోజు తాగుతూ ఉంటే రక్తం అభివృద్ధి చెంది శుద్ది చేయబడుతుంది.


 * ఉసిరిక వగరు , ద్రాక్షాపళ్లు ఈ రెండింటిని సమభాగాలుగా శొంఠిని కూడ కలిపి నూరి దానిని తేనెతో కలిపి తీసుకుంటే నోటి అరుచి తగ్గుతుంది .


 * ప్రతిరోజు ఒక ఉసిరికాయని తిన్నట్లైతే అన్నిరకాల పైత్యాలు తగ్గుతాయి . 


 * ప్రతిరోజు ఉసిరికాయని తింటూ ఉంటే కఫము తగ్గును . మేధస్సు పెరుగుతుంది. నేత్రవ్యాధులు తగ్గుతాయి . 


 * పాత ఉసిరికాయల పచ్చడిని తింటూ ఉంటే గర్భిణి స్త్రీలకూ ఎంతో మంచిది. 


 * ఉసిరికాయ చెట్టు వేరుతో కషాయాన్ని కాచి త్రాగుతూ ఉంటే అతిదాహం తగ్గుతుంది . 


 * పచ్చి ఉసిరికాయలు దొరకనప్పుడు ఎండు ఉసిరికాయలు వాడవచ్చు. 


 * ప్రతిరోజు ఉసిరికాయను తింటూ ఉంటే మూలవ్యాధులు తగ్గిపోతాయి . ఆయుష్షు పెరుగును .


 * జీర్ణశక్తి పెరుగుతుంది. 


 * పాత ఉసిరిక పచ్చడిని తినడం వలన విరేచనాలు నివారించ వచ్చు. వాతవ్యాధులు ను తగ్గిస్తుంది.

 

 * ఉసిరిక వగరు తినడం వలన మెదడు నందు చేరిన చెడు నీరు తగ్గిపొతుంది.


 * కడుపులో తిప్పడం ఉన్నవారు ఉసిరిక ని ఆహారంలో బాగం చేసుకొండి. 


 * ఎండిన ఉసిరికాయల రసాన్ని కాచి దానిని చర్మం మీద పొక్కులు , చర్మవ్యాదులు , వాపులు ఉన్న ప్రదేశంలో రాసినట్లైతే మంచి ప్రభావం కనిపిస్తుంది.


 * పండు ఉసిరికాయల రసాన్ని తీసుకుంటూ ఉంటే ఉబ్బువ్యాధులు తగ్గుతాయి . 


 * ఉసిరికాయలోని గింజలను నీటితో కలిపి నూరి దానికి తగినంత చక్కర కలిపి తీసుకుంటూ ఉంటే కుసుమవ్యాధులు తగ్గుతాయి . 


 * ఉసిరిక లేహ్యాన్ని తీసుకుంటే భయంకరమైన దగ్గులు నివారించబడతాయి. క్షయ వ్యాధిలో వచ్చే దగ్గు కూడా నివారించబడుతుంది. 

Sadguru ADVICE TO 60-YEARS OLD

 *Sadguru  ADVICE TO 60-YEARS OLD & OLDER* Must read ...


*Because none of us have many years to live, and we can't take along anything when we go, so we don't have to be too thrifty.* 


*Spend the money that should be spent, enjoy what should be enjoyed, donate what you are able to donate*


*DON'T WORRY about what will happen after we are gone, because when we return to dust, we will feel nothing about praises or criticisms. The time to enjoy the worldly life and your hard earned wealth will be over!*


*DON'T WORRY too much about your children, for children will have their own destiny and should find their own way.  Care for them, love them, give them gifts but also enjoy your money or what is left of it, while you can. Life should have more to it than working from the cradle to the grave!!*


*60-year olds, don't trade in - your health for wealth, by working yourself to an early grave anymore. Because your money may not be able to buy your health.*


*When to stop making money, and how much is enough*              


*Out  of thousand hectares of good farm land, you can consume only three quarts (of rice) daily; out of a thousand mansions, you only need eight square meters of  space to rest at night.*


*So, as long as you have enough food and enough money to spend, that is good enough. You should live happily. Every family has its own problems.*


*Just DO NOT COMPARE with others for fame and social status and see whose children are doing better etc., but challenge others for happiness, health, enjoyment, quality of  life and longevity.*


*DON'T WORRY about things that you can't change because it doesn't help and it may spoil your health.*


*You have to create your own well-being and find your own place of happiness. As long  as you are in good mood and good health, think about happy things, do happy things daily and have fun in doing, then you will pass your time happily every day.*


*One day passes WITHOUT happiness*, *you will lose one day.*

*One day passes WITH happiness and then you gain one day.*


*In good spirit, sickness will cure*;

*In a happy spirit, sickness will cure faster;*

*in high and happy spirits, sickness will never come.*


*With good mood, exercise, sun, variety of foods, good amount of vitamin and mineral intake, hopefully you will live another 20 or 30 years of  healthy life*


*ABOVE ALL* -

Learn to cherish the goodness around... *like your spouse , she’s not called the better half for nothing and FRIENDS*........... *They all make you feel young and "wanted"... without them you are sure to feel lost !!*


Wishing you all the best for the years to come.  💐🙏🔔


Please share this with all your friends who are 60 plus  and those who will be 60 plus  after some time.

బ్రాహ్మణుడు

 210222B0602.  220222-7.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



          *ఒంటి బ్రాహ్మణుడు*

               ➖➖➖✍️


*ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే అది మంచి శకునం కాదా ?*


*చాలా మంది ఆఖరికి బ్రాహ్మణులకి తో సహా ఈ అపోహ ఉంది.*


*అసలు తోటి బ్రాహ్మడు [అతను వేద పండితుడే కానక్కరలేదు, అసలు అతడు  బ్రాహ్మణుడు అయితే చాలు చుట్టమైనా పక్కమైనా] ఎదురు వచ్చినా సరే వెంటనే అపశకునం అంటూ వెనక్కి వెళ్ళి పోతారు.*


*ఈ అపోహ చాలా తప్పు అని వాళ్ళు గ్రహించరు.*


*నిజానికి అది ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దాన్ని అపశకునంగా భావించి అలా వెనక్కి వెళ్ళమని కాదు అర్ధం.*


*పూర్వం గురుకులాల్లో  ప్రతీ రోజూ గురువుగారు తనవద్ద విద్యని అభ్యసిస్తున్న బ్రహ్మచారులని  బిక్షాటనకు ఊరిలోకి పంపేవారు.*


*ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోకి వెళ్లి గృహస్తుల నుంచి వాళ్ళు ఇచ్చిన బిక్ష సేకరించి తెచ్చేవారు.*


*ఆ కాలంలో ఎవరైనా గృహస్తు తన ఇంట్లో నుంచి బయటకి వెళ్లే సమయంలో, అలా భిక్షకి వస్తున్న ఆ బ్రాహ్మణ  బ్రహ్మచారి గానీ ఎదురయితే, వెంటనే వెనక్కి ఇంట్లోకి వెళ్లి అతన్ని సాదరంగా ఆహ్వానించి తగిన బిక్షవేసి పంపించే వారు.*


*అలా ఒంటి బ్రాహ్మణ బ్రహ్మచారి ఎదురయి నప్పుడు అతన్ని చూసి, అతను దేనికి వస్తున్నాడో తెలిసి కూడా నిర్లక్ష్యంచేసి బిక్ష వెయ్యకుండా వెళ్లడం అతన్ని అవమానపరచి నట్టు ఉంటుందని, అలా ఆ విధంగా బిక్ష కోసం వచ్చే ఒంటి బ్రహ్మచారి, లేదా బ్రాహ్మణుడు ఎదురు వస్తే అతన్ని పట్టించు కోకుండా వెళ్లడం దోషం.*


*అందుకే అలా [బిక్ష వేయకుండా] వెళ్ళకూడదు అంటారు.*


*అంతే తప్ప అది అపశకునం కాదు.* 


*ఒక వేద పండితుడు, జ్ఞాని ఎదురవ్వడం వలన మంచిదే తప్ప అది చెడు శకునం ఎప్పటికీ కాదు.*


*ఒక్కో సారి అలా ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వాళ్ళు ఏదో సమావేశానికో, వేద పారాయణానికో, చర్చలకో, లేక ఏ జప హోమాలకో వెళ్తూన్నారని అర్ధం.*


*ఈ రోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు [ ఒకవేళ ఉన్నా అక్కడడక్కడా ఉండచ్చు గాక ]. అలా రోజు వారి విద్యార్థుల చేత బిక్షాటన చేయించే గురుకులాలు అంతకన్నా లేవు.*


*కాబట్టి ఏ కాలంలో అయినా సరే, ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంత మంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంత మాత్రమూ కాదు అని గ్రహించాలి*.  


*అయితే  ఇక్కడ ఒక్క విషయం ప్రతి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి.*


*మనం బయటకి వెళ్తున్నప్పుడు ధర్మము అంటూ ఎవరయినా ఎదురయితే  అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడే కానీయండి వీలయితే అతనికి మీకు చేతనైన సహాయము నిష్కామకర్మతో చేసి కదలండి.*


*అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.*


*మీరనుకున్న కార్యం, మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది.*


*సాటి మానవుడి ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన మెంత? మన కున్న జ్ఞానమెంత? ఒక్కసారి ఆలోచించండి!*


*అందువలన ఇటువంటి అపోహలను సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀