13, ఆగస్టు 2022, శనివారం

Laugh at this

 *Laugh at this* :😂😂😂🤣🤣🤣 You cannot beat the Indians


A  Doctor can't find a job in a Hospital  so he opens a clinic and puts a sign outside 'GET TREATMENT FOR $20 - IF NOT CURED GET BACK $100


A lawyer thinks this is a great opportunity to earn $100 and goes to the clinic...


*Lawyer* :  "I have lost my sense of taste"


* doctor* :  "Nurse, bring medicine from box no. 22 and put 3 drops in patient's mouth"


*Lawyer* :  "Ugh..this is kerosene"


* doctor* :  "Congrats, your sense of taste is restored. Give me $20"


The annoyed lawyer goes back after a few days to recover his money...


*Lawyer* :  "I have lost my memory. I cannot remember anything"


* doctor* :  "Nurse, bring medicine from box no. 22 and put 3 drops in his mouth"


*Lawyer (annoyed)* :  "This is kerosene. You gave this to me last time for restoring my taste"


* doctor* : "Congrats. You got your memory back. Give me $20"


The fuming lawyer pays him, and then comes back a week later determined to get back $100.


*Lawyer* :  "My eyesight has become very weak I can't see at all "


* doctor* :  "Well, I don't have any medicine for that, so take this $100"


*Lawyer (staring at the note)* : "But this is $20, not $100"


* doctor* :  "Congrats, your eyesight is restored. Give me $20"

పాట

** !!!!! 😂😂😂😂😂

కర్ణుడి చావుకి బాలీవుడ్ కి చావు

 కర్ణుడి చావుకి వేయి కారణాలు !

ఒక్క అమీర్ ఖాన్ కె కాదు మొత్తం బాలీవుడ్ కి చావు దగ్గరలో ఉంది. గత 6 ఏళ్లుగా బాలీవుడ్ సినిమా రంగం వెనకబాట పట్టడానికి ప్రధాన కారణం ఇంటర్నెట్ అంటే అతిశయోక్తి కాదు!

2014 లో రిలయన్స్ జియో విప్లవాత్మక ధరల తగ్గింపు వల్ల మొబైల్ ఇంటర్నెట్ సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చింది. 

దాంతో ఉత్తరాది ప్రజలకి దక్షిణ భారత సినిమాలని విరివిగా చూడడానికి అవకాశం దొరికింది. అందివచ్చిన అవకాశాన్ని కొంతమంది హిందీ నిర్మాతలు కూడా అందిపుచ్చుకున్నారు. ఏ మాత్రం వివక్ష లేకుండా దొరికిన కాడికి అన్ని తమిళ్,తెలుగు,కన్నడ,మలయాళ చిత్రాల హక్కులు తక్కువ ధరకి కొనడం వాటికి హిందీ సబ్ టైటిల్స్ వేసి డబ్ చేసి విడుదల చేశారు. అప్పటిదాకా ఖాన్ త్రయం నటించిన సినిమాలు వాటి తాలూకు కధ డిమాండ్ చేయకపోయినా సరే విదేశాలలో భారత సంతతి కి చెందిన వారి జీవితాలని ఖరీదయిన శైలిలో చిత్రీకరించి వదలడం చూసిన ఉత్తరాది ప్రేక్షకులకి దక్షిణా పధాన పల్లెటూరిలో జరిగే సంఘటనల మీద తీసిన సినిమాలు బాగా నచ్చాయి. ఎంతలా అంటే డబ్బింగ్ ఖర్చులు కూడా రావేమో అనుకున్న తరుణంలో కాసుల వర్షం కురిపించాయి దక్షిణాది డబ్బింగ్ సినిమాలు. 

ప్రేక్షకులు సబ్ టైటిల్స్ లేకపోయినా సరే నేరుగా దక్షిణాది చిత్రాలని చూడడం మొదలుపెట్టారు. 

ఒక్క ఉత్తర భారత దేశంలో నే దక్షిణాది సినిమాలకి విపరీత ఆదరణ దొరికింది అంటే పప్పులో కాలేసినట్లే !

పాకిస్థాన్ లో కూడా ఉర్దూ సబ్ టైటిల్స్ తో దక్షిణాది సినిమాలు ఇంటర్నెట్ లో విపరీత ఆదరణ లభించింది. ఫలితంగా ప్రకటనల రూపంలో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చింది. 

చివరకి పాకిస్థాన్ ప్రేక్షకులలో కూడా దక్షిణాది హీరోలకి విపరీతమయిన ఆదరణ లభించింది. 

నాలుగేళ్ల క్రితం పాకిస్థాన్ ప్రేక్షకులు తమ స్వంత యూట్యూబ్ ఛానెల్స్ ని ప్రారంభించి భారతీయ సినిమాల మీద మరీ ముఖ్యంగా దక్షిణాది సినిమాల మీద రివ్యూ లు చేయడం మొదలుపెట్టారు ఈ ట్రెండ్ 2017 లో మొదలయ్యి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది పాకిస్థాన్ లో. 

నిజం చెప్పాలి అంటే ఏదన్నా ఒక తెలుగు సినిమాకి సంబంధించి ట్రైలర్ కావొచ్చు లేదా టీజర్ కావొచ్చు రిలీజ్ అవగానే వెంటనే పాకిస్తానీ యూ ట్యూబ్ ఛానెల్స్ దానిమీద కూడా రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టారు. మొదట్లో కొంచెంగా చూసేవాళ్ళ సంఖ్య ఉన్నా రాను రాను అది లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఫలితంగా వాళ్ళకి యూట్యూబ్ ద్వారా నెలకి కనీసం 500 డాలర్ల ఆదాయం రావడం మొదలుపెట్టి కొందరికి ఇప్పుడు అది నెలకి రెండు వేల డాలర్ల ఆదాయం ఇచ్చేంతగా ఎదిగింది. ఆదాయం రావడం మొదలవగానే పాకిస్తానీ యూట్యూబ్ చానెల్ ని నిర్వహించే వాళ్ళు తమ రివ్యూ లలో చాలా స్పష్టంగా ఎలాంటి యాస లేకుండా తెలుగు ని తెలుగు గా , కన్నడ ని కన్నడ గా చాలా స్పష్టంగా పలకడం లో జాగ్రత్త తీసుకోవడం వలన పాకిస్థాన్ తో పాటు భారత్ లో కూడా వీళ్ళ ఛానెల్స్ కి ఆదరణ లభించింది అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 

విశేషం ఏమిటంటే మన దక్షిణాది హీరో లని మనం పెద్దగా పట్టించుకొము కానీ పాకిస్తానీ యూట్యూబర్స్ మాత్రం ఇంటర్నెట్ లో వెతికి మరీ మనకి కూడా తెలియని విషయాలని ప్రస్తావిస్తున్నారు అంటే దక్షిణ సినిమా రంగం వాళ్ళని ఎంతలా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు. 

సంస్కృతి !

పాకిస్తానీయులు కూడా దక్షిణ భారత సంస్కృతి మీద అవగాహన పెంచుకున్నారు. కానీ అదే సమయంలో బాలీవుడ్ హీరోల పాశ్చత్య సంస్కృతి మీద ఉన్న మక్కువని ద్వేషించడం మొదలుపెట్టారు. ఇది మొదట 2017 లో ఉత్తర భారత ప్రేక్షకుల నుండి మెల్లగా పాకిస్థాన్ వరకు పాకింది. ఎవరి సంస్కృతి,సాంప్రదాయాలని వాళ్ళు పాటించడం అనేది ఏ దేశానికి అయినా మామూలే కానీ బాలీవుడ్ మాత్రం భిన్నంగా కనిపించడం మొదలయ్యే సరికి అది కాస్త మరింత ద్వేషానికి కారణం అయ్యింది. దక్షిణ భారత హీరోల ఆచార,వ్యవహారాల మీద నిశితంగా దృష్టి పెట్టడం మొదలయ్యే సరికి అది క్రమేణా బాలీవుడ్ హీరోల పాలిట శాపంగా మారింది. 

సినిమా ముహూర్త సమయంలో చేసే పూజ దగ్గర దక్షిణ భారత హీరోలు చెప్పులు,బూట్లు వదిలేసి మరీ వచ్చి కొబ్బరి కాయ కొట్టడం,హారతి కళ్ళకి అద్దు కోవడం దగ్గర నుండి ఉత్తరాది ప్రేక్షకులు తేడాని చూడడం ప్రారంభించారు మెల్లగా. కొన్ని బ్లాగులలో బాగా చదువుకున్న ఆధునికమయిన జీవన శైలిని గడుపుతున్న ఉత్తరాది విద్యావంతులు దక్షిణ,ఉత్తర భారత సినీ పరిశ్రమలోని తేడాలని స్పష్టంగా వేలెత్తి చూపడం కూడా ఉత్తరాది ప్రేక్షకుల వైఖరిలో మార్పు రావడానికి కారణం అయ్యింది. 

బాహుబలి సిరీస్ రెండూ కూడా ఉత్తరాదిన అఖండ విజయం సాధించడం వెనుక ఇంటర్నెట్ ప్రధాన పాత్ర పోషించింది. గంపగుత్తగా బాలీవుడ్ సినిమాలని అక్కడి ప్రేక్షకులు నిరాకరించడం మొదలయ్యి ఇప్పటికీ 5 ఏళ్లు అవుతున్నది కానీ ప్రేక్షకుల లో వచ్చిన మార్పుని గుర్తించకపోవడం బాలీవుడ్ నిర్మాత,దర్శకులు,హీరోల వైఫల్యం ఆని అనే కంటే డబ్బు తెచ్చిన అహంకారం అనే చెప్పాల్సి ఉంటుంది. 

సత్యం తెలుసుకునే సమయం ప్రేక్షకులు ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేక పోయింది బాలీవుడ్. 

గుర్తింపు తో పాటు డబ్బుని ఇచ్చేదీ సగటు ప్రేక్షకుడు అన్న సంగతి మరిచిపోయిన బాలీవుడ్ కి అదే ప్రేక్షకులు తమ ద్వేషాన్ని వాళ్ళ సినిమాలని చూడకుండా ఉండడం లో విజయం సాధించారు. మరీ ముఖ్యంగా నటన విషయంలో అగ్ర హీరోల బండారం బయటపెట్టింది OTT . దక్షిణాది నటుల తో పోలిస్తే ఉత్తరాది నటుల [అందరూ కాదు ] నటనని పొలుస్తూ ట్రోలింగ్ వీడియొ లు కొ కొల్లలుగా వచ్చేశాయి యూ ట్యూబ్ లలో. ఇదీ మరో కారణం అయ్యింది బాలీవుడ్ విఫలం అవడానికి. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హత్య !

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మీద కొన్ని అగ్ర సినీ హౌస్ లు పగ పట్టాయి. అయితే వీటి వెనుక కారణం మాత్రం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి లభిస్తున్న ఫాలోయింగ్ కొందరు హీరోలకి నిద్ర లేకుండా చేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరులో ఉన్న రాజ్ పుత్ ని తీసేయమని ఒత్తిడి తెచ్చారు కానీ నేను రాజ్ పుత్ ని నా పేరుని నేను మార్చుకోను అంటూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనడం కూడా పరోక్షంగా అతని హత్యకి కారణం అయ్యింది. నిజానికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పాటు రాజ్ కుమార్ రావ్,నావాజుద్దీన్ సిద్దికి లాంటి టాలెంట్ ఉన్న నటులు బాలీవుడ్ లో ఉన్నా వాళ్ళకి తగిన అవకాశాలు ఇవ్వలేదు. ఇక నవాజుద్దీన్ సిద్దికీని  అయితే B గ్రేడ్ సినిమాలకి పరిమితం చేసింది బాలీవుడ్. ప్రేక్షకులు మాత్రం టాలెంట్ కె తమ వోటు అని చెప్తున్నా కపూర్,ఖాన్,సిప్పీ ఇలా కుటుంబ వారసులకే అవకాశాలు ఇవ్వడం మానుకోలేదు. ఇక ముందు అలా జరగదు అని భావిస్తే పప్పులో కాలేసినట్లే. 

మొత్తంగా చూస్తే వరుస పరాజయాలతో బాలీవుడ్ పరిశ్రమ కుప్ప కూలే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఎంత మాఫియా అయినా ఎల్ల కాలం డబ్బుని ఇస్తూ పోలేదు. ఎక్కడో అక్కడ దానికి ఫుల్ స్టాప్ పడక తప్పదు. లేకపోతే ఎలాంటి ప్రోమోషన్ లేకుండానే పుష్ప సినిమా హిందీ బెల్ట్ లో అంత వసూళ్లు ఎలా చేయగలిగింది ? ఇప్పుడు ఉత్తరాదిన అల్లు అర్జున్,రామ్ చరణ్,ప్రభాస్,జూనియర్ ntr లకి ఉన్న ఫాలోయింగ్ ఖాన్ బ్రదర్స్ కి లేదు. ఎంతో వ్యయ ప్రయాసలకి పోయి తీసిన పృధ్వీ రాజ్ చౌహాన్ ఫ్లాప్ అవడానికి కారణం బాహుబలి తో పోల్చి చూడడమే కారణం.  మళ్ళీ రాజమౌళి పృధ్వీరాజ్ మీద సినిమా తీసినా ప్రేక్షకులు చూస్తారు. కధని నడిపించడం ఎలానో దక్షిణాది దర్శకులు బాగానే తెలుసుకున్నారు ఇప్పుడు అదే విజయానికి కారణం అవుతున్నది. పుష్ప సూపర్ హిట్ అవగానే సుకుమార్ తీసిన అన్ని సినిమాలు యూట్యూబ్ లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. 

నిజానికి బాలీవుడ్ పతనానికి పునాది రాయి 20 ఏళ్ల క్రితమే పడ్డది , అది ఖుషీ సినిమాలో పవన్ మీద స్ట్రీట్ ప్లే ఆధారంగా చిత్రీకరించిన  'ఏ మేరే జహ ఏ మేరే ఘర్ మేరే ఆషియ ' అనే పాటని పూర్తిగా హిందీలోనే KK చేత పాడించి విజయం సాధించింది. అప్పట్లో బాలీవుడ్ హీరోలతో పాటు దర్శకులు కూడా ఖుషీ సినిమాని స్పెషల్ షో వేయించుకుని మరీ చూశారు. 

మారిన ప్రేక్షకుల అభిరుచి ఏమిటో తెలుసుకొని తీస్తే హిందీ సినిమాకి పూర్వ వైభవం వస్తుంది కానీ ఆ పని వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేరనే అనిపిస్తున్నది. 

నటుల వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో అనే దానిని కూడా ఇప్పటి ప్రేక్షకులు పరిగణలోకి తీసుకుంటున్నారు అన్న సంగతిని బాలీవుడ్ గుర్తించలేదు. 

గత కొంత కాలంగా ఉత్తరాది సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశం బ్రహ్మానందం తన చేతితో గీసిన వేంకటేశ్వర స్వామి చిత్రాన్ని అల్లు అర్జున్ కి బహుకరించిన ఫోటో. గిన్నీస్ బుక్ లో చోటు చేసుకున్న బ్రహ్మానందం ని కేవలం హాస్య నటుడుగా కాకుండా డౌన్ to ఎర్త్ అంటూ బ్రహ్మానందం సర్ అంటూ సంబోధించడం మొదలుపెట్టారు. ఈ గౌరవం ఖాన్ బ్రదర్స్ కి ఇవ్వడం మానేశారు. అదే ఇప్పటి అమీర్ ఎర్ర చెడ్డీ పరాజయానికి కారణం అయ్యింది. ఏదీ ఒక్క రోజులో జరిగిపోదు. ఎర్ర చెడ్డీ పరాజయం నేరుగా ఖాన్ త్రయం రాబోయే సినిమా బిజినెస్ మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మార్కెట్ ఉంటే ఎంత డబ్బు అయినా పెట్టి తీస్తారు కొంటారు. సినిమా ఫ్లాప్ అయితే బయ్యర్లకి డబ్బు తిరిగి ఇచ్చే సాంప్రదాయం బాలీవుడ్ లో లేదు. ఇదీ ఒక మైనస్ పాయింట్ అక్కడ. 

వోట్లు వేసేది,సినిమా హిట్ చేసేది ఒకళ్ళే అని వీళ్ళు ఎప్పుడు గుర్తిస్తారు ?

నీతి_కథ 🦅

 నీతి_కథ  🦅


తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు.


రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు  మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు. 


"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం  "ప్రభు శ్రీరాముడి" కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి   వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను  కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.


కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు 58 రోజులు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను  చిరునవ్వు నవ్వుతున్నారు!


ఈ దృశ్యం చాలా అలౌకికమైనది.


రామాయణంలో జటాయువు శ్రీరాముడి  ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.


అక్కడ మహాభారతంలో, 


భీష్మ పితామహుడు  ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా?


అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా  అయింది. కాని భీష్మపితామహుడు  చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది!


జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు.  జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు  ఏడుస్తున్నాడు. 


ఇంత తేడా ఎందుకు? 


ఇంతటి తేడా ఏమిటంటే, 


ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో  పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు  చూశాడు. అడ్డుకోలేకపోయాడు!

దుశ్శాసనునికి  ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూ వున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.


దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే  వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.


జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!


ఇతరులుకు తప్పు జరిగిందని చూసి  కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో,  వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు.


 #నిజం అనేది  కలత చెందుతుంది, కానీ ఓడిపోదు. 


" *సత్యమేవ జయతే "*

సేకరణ: వాట్సాప్ పోస్ట్.

12, ఆగస్టు 2022, శుక్రవారం

సాధ్వీమ తల్లులు

 మన అందరికీ పురందరదాసు కథ తెలిసిందే . అందులో సాధ్వీమతల్లి అయిన ఆయన ధర్మపత్ని సరస్వతమ్మ గూర్చి తెలిసిందే . పురందరదాసు అసలు పేరు శీనప్ప . కన్నడ సామ్రాజ్యములో పేరుబడసిన రత్నాల వ్యాపారి . ఆయన పిల్లికి బిక్షం వేసే రకం కాదు . మరి అయన ధర్మపత్ని మాత్రం అడిగినవారికి లేదనకుండా దాన ధర్మాలు అందరికీ వారు వీరు అనిలేకుండా సకల మర్యాదలు చేసే మహా ఇల్లాలు . ఇదంతా గమనించిన శీనప్ప ప్రతీవాటినీ తన ఇంటిలో చెక్క పెట్టెలలో పెట్టించి తాళాలు వేసుకుని తాళాల గుత్తి తన దగ్గరే ఉంచుకునే వారు . ఒక సారి ఓ పేద బ్రాహ్మణుడు శీనప్ప ఇంటికి రాగా ప్రతీ రోజు రేపు రమ్మని తిప్పుకునేవాడు . అలా తిరిగీ తిరిగీ ఆ బ్రాహ్మణుడు అలసిపోయాడు గానీ విత్తం గానీ ఇంత ధాన్యం కానీ దానం చేయలేదు శీనప్ప . ఓ రోజు శీనప్ప ఇంట లేని నాడు ఆ బ్రాహ్మణుడు సరస్వతమ్మను దర్శించి తన పేదరికం బాపమని వేడుకున్నాడు . ఆమె ఇంట ఇపుడు ఏమీ ఆమె స్వాధీనములో లేదు . ఆ పేద బ్రాహ్మణుని పేదరికం చూసి జాలిపడి ఆమె తన ముక్కుకు ఉన్న రత్నం పొదిగిన ముక్కెర ఇచ్చి వేసి అమ్మి వేసి సొమ్ము తీసుకుని జీవించమంది . ఆ బ్రాహ్మణుడు అది అమ్మడానికి నేరుగా శీనప్ప కొలువై యున్న రత్నాల అంగడికి వెళ్లి అమ్మజూపాడు . ఆ ముక్కెర తానే స్వయంగా రత్నం పొదిగి చేయించింది , అత్యంత విలువైనది . అది చూసిన ఆయనకు నమ్మబుద్ధి కాక వెంటనే తన వద్ద ఉన్న నౌకరుని పంపి వెంటనే తన శ్రీమతి వద్ద యున్న రత్నం పొదిగిన ముక్కెర తీసుకురమ్మనమని చెప్పమని వ్రాసి పంపాడు . ఆమె ఆ పత్రం చదివి బెంబేలు పడిపోయి ఇంక తనకు ఇక దిక్కు తాను నిరంతరం కొలిచే పాండురంగడే అని తలచి విషం తీసుకోబోగా ఆపాత్రలో ధగ ధగ మెరిసే ముక్కెర కనబడింది దానిని తీసి శుభ్రం చేసి ఆమె ఆ ముక్కెరను నౌకరు చేత పంపింది . అది గాంచిన తరువాత శీనప్ప ఖరీదు కట్టి ఆ రత్నం పొదిగిన ముక్కెర కొని దానిని ఇంటికి తీసుకు పోయి అసలు విషయం విచారించగా అపుడు సంగతి తెల్సింది . ఆమె ఆ ముక్కెర ఆ బ్రాహ్మణునికి దానం చేసిన విషయం .. విష పాత్రలో ముక్కెర ఉండటం . అంతే అంతవరకూ కాకికి ఎంగిలి చేయి విదల్చని శీనప్పలో మార్పు వచ్చేసింది . మొత్తం తన వద్ద ఉన్న ధనాన్ని అందరికీ దాన ధర్మాలు వినియోగించారు . భక్తితో శ్రీరంగని మీద , వెంకటేశ్వర స్వామి వారి మీద కన్నడములో అనేక కీర్తనలు రచించారు . దాస సంగీతానికి ఆద్యుడు , కర్ణాటకా సంగీత పితామహుడు అయిన పురందర దాసులో మార్పు తెచ్చిన సంఘటన ఇదే . ఇటువంటి సాధ్వీమ తల్లులు పుట్టిన నేల ఈ భారతం .

వర్షాలు

 *దైవ సృష్టిలో ప్రకృతి లీలలు-వర్షాలు.* 

💧💧💧💧💧💧

దైవ సృష్టికార్యక్రమము లలో,ప్రకృతి మానవాళికి, జీవ జంతు జాలములన్ని టికీ ఇచ్చిన,ప్రాణాధారమై నది,ముఖ్యమైనది;నీరు. 

వర్ష రూపములో,జీవజాలా

నికి,ఇచ్చిన వరము.

ఇందులోకూడా పలు రక

ముల వర్షములతో,ఉప యోగకరముగా,ఆనంద

దాయకంగా అందిస్తున్నది.

ఎప్పుడూ ఒకే‌ వాన కాకుండా,రకరకాల విన్యాసాలతో,వర్షాలు వస్తుంటాయి. అవి :-


* గాంధారి వాన = కంటికి ఎదురుగా ఉన్నది,  కనిపించనంత జోరుగా కురిసే వాన.

* మాపుసారి వాన = సాయంత్రం కురిసే వాన.

* మీసరవాన = మృగశిర కార్తెలో కురిసే వాన.

* దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన.

* సానిపి వాన = అలుకు (కళ్లాపి) జల్లినంత కురిసే వాన.

* సూరునీల్ల వాన = ఇంటి చూరు నుండి,ధారగా  పడేంత వాన.

* బట్టదడుపు వాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన.

* తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన.

* సాలు వాన = ఒక నాగలి సాలుకు సరిపడా వాన.

* ఇరువాలు వాన = రెండు సాల్లకు, విత్తనాలకు సరిపడా వాన.

* మడికట్టు వాన = బురద పొలం దున్నేటంత వాన.

* ముంతపోత వాన = ముంత తోటి పోసినంత వాన.

* కుండపోత వాన = కుండ తో కుమ్మరించినంత వాన.

* ముసురు వాన = విడువకుండా కురిసే వాన.

* దరోదరి వాన = ఎడతెగ కుండా కురిసే వాన.

* బొయ్య బొయ్య గొట్టే వాన = హోరుగాలితో కూడిన వాన.

* రాళ్ల వాన = వడగండ్ల వాన.

* కప్పదాటు వాన =అక్కడ క్కడా కొంచెంకురిసే వాన.

* తప్పడ తప్పడ వాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.

* దొంగ వాన = రాత్రంతా కురిసి, తెల్లారి కనిపించని వాన.

*తుఫాన్ వాన = ఈ వాన 

ప్రకృతి సమతుల్యం లేనప్పుడు,సముద్రాలు, నదులు పొంగుతూ,కష్ట, నష్ట దాయకంగా కురిసే అతి భీకరమైన వర్షము. 

* కోపులు నిండే వాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన.

* ఏక్దార వాన = ఏకధారగా కురిసే వాన.

* మొదటివాన = విత్తనా లకు బలమిచ్చే వాన.

* సాలేటి వాన = భూమి తడిసేంత భారీ వాన.

* సాలు పెట్టు వాన = దున్నేందుకు సరిపోయేంత వాన.


సర్వేజనా 

సుఖినో భవంతు. 

💦💦💦💦💦💦

రామాయణానుభవం_ 121*

 🌹 *రామాయణానుభవం_ 121*


*రావణ మందిరం*

రావణాసురునితో సుఖాన్ని అనుభవించిన రమణీమణులు ఆయనకు సమీపంలోనే ఉన్నారు. కొందరు కూచున్నారు. అలసినవారు పడుకొన్నారు.


ఆ రాక్షస స్త్రీలకు దూరంగా ఒంటరిగా ఒక అందమైన శయ్యలో రూప సంపన్నురాలైన మరొక స్త్రీని హనుమ చూచాడు.


ఆమె అద్భుత సౌందర్యవతి, సర్వాభరణ భూషిత, రాజలక్షణ లక్షిత. ఆమె రావణుని పట్టపురాణి మండోదరి.


హనుమ ఆ అతిలోక సుందరిని చూచి సీతాదేవే అనుకొన్నాడు. "ఓహో! నా ప్రయత్నము ఫలించింది! నా అన్వేషణ (వెతుకుట) నెరవేరింది! సీతాదేవి నాకు కనబడింది" అని అత్యంత హర్షాన్ని పొందాడు.


ఆ ఆనందము పట్టలేకపోయాడు. తన భుజాలను, తొడలను చరుచుకొన్నాడు. తన తోకను ముద్దుపెట్టుకొన్నాడు. నవ్వుతున్నాడు. ఆడుతున్నాడు. ఇటు వెళ్లాడు. అటు వెళ్లాడు. " ఆ భవనములోని స్థంభాలపై పాకుతూ ఎక్కాడు. వాటినుండి జారి భూమిపై పడ్డాడు.


*ఆయాస్పోటయామాస చుచుంబ పుచ్చం!*

 *ననంద, చిక్రీడ, జగౌ, స్థంభానరోహత్,* *నివపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం* ॥


హనుమ తన కోతి స్వభావాన్ని ప్రదర్శించాడు అంటాడు వాల్మీకి.


మనుష్యులమైన మనమే కోతి చేష్టలను చేస్తుంటే నిజంగా కోతి అయిన హనుమ సహజమైన కోతి చేష్టలను చేస్తే కోతి బుద్ధిని చూపితే తప్పేమిటి?


"హనుమ నిజంగా కోతి మాత్రమే కాదు. బుద్ధిమతాం వరిష్ఠుడు. అంటే బుద్ధిమంతులలో గొప్పవాడు.


అందువలన హనుమ నిజంగా తన ఆలోచనకు మరొకసారి సిగ్గుపడ్డాడు. "ఛీఛీ ఎంత పాడు ఆలోచన!" అని తనను తానే అసహ్యించుకొన్నాడు.


*న రామేణ వియుక్తాసా స్వప్ను మర్హతి భామినీ। న భోక్తుం న్యాలంకుం। నపానముపసేవితుం।*


శ్రీరాముని ఎడబాసి నిరంతరము దుఃఖించే సీతామతల్లి నిద్రపోతుందా? ఆమెకు తిండి సహిస్తుందా? పానీయాన్ని ఆమె సేవిస్తుందా? ఆమెకు అలంకారాలు ఇష్టమవు తాయా?


*నాన్యం వరముపస్థాతుం। సురాణామపిచేశ్వరం||*


ఆమె అన్యుడైన పురుషుని మహేంద్రుని సైతము సమీపిస్తుందా? 


అందువలన ఈమె సీత కాదు. వేరే ఏ స్త్రీయో? అని నిశ్చయించుకొని పానభూమిలో సంచరించాడు.


**

హనుమకు మరొక విచారము ఆయన మనస్సులో బాధించడం మొదలుపెట్టింది.


"సాధారణంగా స్త్రీలను దగ్గరినుండి చూడకూడదు కదా! అందులో నిద్రిస్తున్న వారిని దగ్గరగా చూడడం మరింత పనికిరాదు కదా! మరి నేనిప్పుడు చేసిన పనేమిటి? బొట్టు చెదిరి, అందెలు తొలిగి, హారాలు, చీరలు జారిన ఆడవాళ్లను నిద్రిస్తుండగా దగ్గరి నుండి చూచానే? ఇది పాపం కాదా?"


హనుమ కొంతసేపటికి ఒక నిశ్చయానికి వచ్చాడు. తనకు తానే సమాధానం చెప్పుకొన్నాడు.

*తదిదం మార్గితం తావచ్ఛుద్ధేన మనసా మయా৷৷*

*రావణాన్తఃపురం సర్వం దృశ్యతే న తు జానకీ.*

“మనము ఏ పనిచేసినా ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామన్నదే ముఖ్యము. 


నేను దురుద్దేశ్యంతో ఈ స్త్రీలను గమనించలేదు. వీరు ఇంత అస్తవ్యస్తంగా పడుకొని ఉన్నా,

వీరిని చూచినప్పుడు నా మనస్సు చెడు ఆలోచనలకు చోటివ్వలేదు. 

*న హి మే పరదారాణాం దృష్టిర్విషయవర్తినీ৷৷*

*అయం చాత్ర మయా దృష్టః పరదారాపరిగ్రహః.*

ఇంద్రియాలు చెడుగా ప్రవర్తించాలన్నా, మంచిగా నడుచుకోవాలన్నా మనస్సే కారణము. వీరిని ఈ స్థితిలో చూచినా నా మనస్సు చక్కగానే ఉంది. అయినా సీతాదేవి కూడ ఒక స్త్రీయే కదా!


ఆమెను స్త్రీల మధ్యలోకాక పోతే ఇంకెక్కడ వెతుకుతాము?


సీత కోసం సముద్రం దాటి లంకకు వచ్చాను. లంకలో ఎక్కడ వెదకాలి? ఏ జాతి జంతువు తప్పిపోతే ఆ జాతి జంతువులలోనే వెదకాలి.


 *న శక్యా ప్రమదా నష్టా మృగీషు పరిమార్గితుమ్.* 

స్త్రీ తప్పిపోతే స్త్రీలలోనే వెదకాలి. ఆడలేళ్ళలో వెదికితే స్త్రీ దొరకదు కదా! 


సీతజాడ తెలుసుకోమన్న ప్రభువు ఆజ్ఞను పాటించి రావణాంతఃపురం అంతా వెదికానే తప్ప స్త్రీలను చూడాలనే ఆసక్తితో కాదు. అందువలన నాకు ధర్మలోపం కలగదు." అనుకున్నాడు.


హనుమంతుడు నిరుత్సాహానికి లోనయ్యాడు. రావణమందిరం నుంచి దూరంగా వెళ్ళి ఆలోచించాడు.

ధాతుపౌష్టిక లేహ్యం

 ధాతుపౌష్టిక  లేహ్యం  ఉపయోగాలు  - 


 *  శరీరమునందలి ధాతువులకు బలం చేకూర్చును . 


 * రక్తము నందలి దోషములను  పోగొట్టి రక్తమును శుభ్రపరచును . 


 *  కండరములు బలాన్ని చేకూర్చును . ఎముకలు గట్టిబడచేయును . 


 *  వాత, కఫ సంబంధ రోగములు నాశనం చేయును . 


 * శరీర నిస్సత్తువ , నరాల దోషములు నివారణ చేయును . 


 *  వృద్దాప్యము నందు కలుగు శారీరక రుగ్మతలు నశింపచేయును . 


 *  ఎదైనా రోగము చేత శరీరము కృశించబడి ఉండువానికి శరీరం కండబట్టి దుర్బలత్వము నుండి బయటపడును . 


 *  రక్తశుద్ధి వలన ముఖవర్చస్సు పెరుగును . 


 *  చిన్నపిల్లల శారీరక ఎదుగుదల మీద అద్బుతముగా పనిచేయును . 


 *  స్త్రీలయందు కలుగు హార్మోనల్ సమస్యలకు చక్కగా పనిచేయును . 


 * మెనోపాజ్ స్ధితికి దగ్గరగా ఉండు స్త్రీలలో కలుగు "ఆస్ట్రియోపోరొసిస్ " అను ఎముకల బలహీనపరిచే వ్యాధిని  దరిచేరనియ్యదు . 


 * పిల్లల ఙ్ఞాపకశక్తి పెరుగును . 


 *  మగవారిలో సంభోగ సంబంధ సమస్యలకు , నరాల బలహీనత పైన పనిచేయును . 


 *  థైరాయిడ్ సమస్యల వలన వచ్చు నీరసం మరియు అసహన సంబంధ సమస్యలకు దీన్ని తప్పక వాడాలి . 


 *  మానసిక సంభంద సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేయును . 


       

పాలుతో

 పాలుతో ఔషదాలు తీసుకొనడం వలన ఉపయోగాలు  - 


 *  లంఘనం ( ఉపవాసం ) చేత బలహీనుడు అయినవాడు క్షీరం పానం చేయడం వలన బలవంతుడు అగును. అట్టివానికి జ్వరం నశించును. 


 *  కాగి చల్లారిన పాలు , కొంచం ఉష్ణంగా ఉన్న పాలు కాలమునెఱిగి జ్వరపీడితుడు సేవించవలెను 

కాచబడినదియు , గోరువెచ్చగా ఉండని పాలను జ్వరపీడితుడు సేవించిన మృత్యుడు అగును.


 *  పాలయందు శొంటి , ఖర్జురపు కాయ , ద్రాక్ష వీటిలో ఏదైనను కాచి అందు చెక్కర  కాని , నెయ్యి గాని , తెనే కాని వేసి చల్లార్చి అనుపానంగా సేవించిన యెడల  దప్పిక , తాపము వీటిని నివర్తింప చేయును . 


 *  పాల యందు ద్రాక్ష , చిట్టాముదపు వేరు , యష్టిమధూకం , సుఘంద పాల వేరు , పిప్పిలి , చందనం వీటిచే కాచబడిన పాలు సేవించిన లేక పాలకు నాలుగింతలు నీరు పోసి పిప్పిలి వేసి నీరంతా ఇగురునటుల కాచి తగినంత వేడిగా ఉన్నప్పుడు లొపలికి తీసుకున్న జ్వరం నశించును. 


 *  జ్వరం గలవాడు పంచమూలములు పాలల్లో వేసి కాచి అనుపానంగా సేవించిన యొడల చిరకాల జ్వరం నశించుటయే కాక కాసాశ్వాస , తలనొప్పి , పార్శ్వపునొప్పి కూడా నశించును.


 *  పాలయందు ఆముదపు వేరు గాని లేక బిల్వపత్రములు గాని వేచి  కాచి అనుపానంగా సేవించిన జ్వరం , మలబద్దకం నశించును. 


 *  పాల యందు శొంటి , చిట్టాముదపు వేరు , వాకుడు , పల్లేరు , బెల్లము వీటిని వేసి కాచి అనుపానంగా సేవించిన రక్తపిత్తము , అతిసారం , దప్పికతో కూడిన నొప్పులు అన్ని నివర్తించును.


  

     

సయాటికా నొప్పి - తీసుకోవలసిన జాగ్రత్తలు .

 సయాటికా నొప్పి - తీసుకోవలసిన జాగ్రత్తలు .


   వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు 

సర్వసాధారణంగా వచ్చే కేసులలో ప్రధానం అయినది సయాటికా . ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు inflamation ని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కాని కనిపించదు. 


              ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజక్షన్ ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మొన నరానికి తగిలి వాపుకి గురికావొచ్చు. దాదాపు ఇలాగే నడుము ప్రాంతంలో వెన్నముక నుంచి బయటకు వచ్చే సయాటికా నరం మీద వత్తిడి ఏర్పడినపుడు అది కాలిలో వెళ్ళినంత మేర సలుపులు , నొప్పి అనుభవం అవుతాయి. 


          ఈ వత్తిడి అనేది వెన్నపుసల మద్యలో ఉండే డిస్క్ లు తొలగడం వలన ఏర్పడవచ్చు చుట్టుపక్కల కండరాలు , లిగమెంట్లు వాపుకి గురికావడం వలన ఏర్పడవచ్చు . లేదా ఈ నిర్మాణాలు గట్టిపడిపోయి ఫైబ్రస్ గా తయారు అవ్వడం కూడా ఏర్పడవచ్చు . కనుక మనం సాధారణంగా చూసే సయాటికాకు , నరాలు వాపు నకు గురికావడం వలన వచ్చే న్యురరైటిస్ కి సంభంధం లేదు . ఈ రెండు స్థితులు ఒకేసమయంలో ఉండొచ్చు.


         సయాటికా నొప్పి నడుము ప్రాంతంలో ఉండే వెన్నపూసలు క్షయానికి ( డీ జనరేషన్ ) లొను కావడం వలన ఏర్పడే పర్యావసన లక్షణం మాత్రమే సయాటికా నొప్పి లక్షణాలు ఆయుర్వేదంలో గృ ధసీవాతం అని పిలుస్తారు .


  లక్షణాలు - 


     నడుమునొప్పి ఉంటుంది. అయితే ఎప్పుడు ఉండాలి అని నియమం లేదు . దీనికంటే కుడికాలిలో నొప్పి ప్రధానంగా ఉంటుంది. పిరుదుల లొపల నుంచి నొప్పి మొదలై నరం వెళ్లే ప్రాంతం అంతా తోడ వెనకపక్కన , పిక్కల లొపల , పాదం వెలుపలి వైపు నొప్పి వ్యాపిస్తుంది.


            ముఖ్యంగా ముందుకు వంగినప్పుడు , దగ్గినప్పుడు , తుమ్మినప్పుడు , నడుములో నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. కొంచం దూరం నడిస్తే కాలులో నొప్పి రావడం అనేది దీనిలో ప్రధాన లక్షణం. కాలులో తిమ్మిరి పట్టినట్లు కాని , సూదులతో గుచ్చినట్టుగా కాని అనిపించవచ్చు. ఈ చివరి లక్షణం వ్యాధి తాలూకు తీవ్రత సూచిస్తుంది .


              సయాటికా నొప్పిని నిర్ధారించడానికి ఒక పద్ధతి ఉంది. బల్లమీద వెల్లికిలా పడుకొని కాలుని నిటారుగా పైకి లేపండి ఇలా చేసేప్పుడు ఒక వేళ మీకు నడుము ప్రాంతంలో నొప్పి అనిపిస్తే సయాటికా ఉన్నట్లు లెక్క . మీరు కాలుని ఎంత ఎత్తు వరకు లేపగలరు అన్నదానిని ఆధారం చేసుకోని వ్యాధి తీవ్రతను అంచనా కట్టవచ్చు.సయాటికా వ్యాధిని గుర్తించడానికి X - ray పరీక్షల కంటే పైన పేర్కొన్న పరీక్ష బాగా ఉపయోగపడుతుంది.


  సలహాలు - సూచనలు - 


    సయాటికానోప్పి ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మాత్రలను యధేచ్చగా కొనుక్కొని వాడటం అంత మంచిది కాదు. అల్లోపతి మందులు నొప్పిని అదిమిపట్టి లక్షణాలు దాచేస్తాయి. విశ్రాంతి తీసుకునే అవసరం మీకు కనిపించదు. 


            వెన్నముకలో అరుగుదల యదావిధిగా కొనసాగి చివరికి వెన్నపూసలు బాగుచేయలేని విధంగా దెబ్బతింటాయి. ఇలా కాకుండా నొప్పి తెలుస్తూ ఉండటమే మంచిది. దీనివలన విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు తప్పనిసరి అవుతుంది. 


         సయాటికా లో ప్రదానమైన చికిత్స విశ్రాంతి. గట్టిబల్లపైన విశ్రాంతి గా వెల్లికిలా పడుకోవాలి. దిండు వాడకుడదు. మెడ వంపులో తువ్వాలను మెత్తగా అముర్చుకోవచ్చు. పక్కకి తిరిగి పడుకోవాలి అనుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకుని రెండు కాళ్ళ మధ్య దిండు ని అమర్చుకోవడం చేయాలి . బల్ల మీద దుప్పటి పరుచుకోవచ్చు.


       

       ఈ వ్యాధి చికిత్సలో నేను రసఔషదాలు మరియు మూలికలు కలిపి ప్రయొగించినప్పుడు అద్బుత ఫలితాలు వచ్చాయి . ఈ వ్యాధి చికిత్స కొరకు నన్ను సంప్రదించగలరు . 


            ఆపరేషన్ చేయించుకొనవలసిన అవసరం లేదు. 


  

గోధుమగడ్డి చూర్ణం

 30 రోజుల్లో రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగేందుకు నేను ప్రయోగించిన సిద్ద యోగం -


    గోధుమగడ్డి చూర్ణం ఒకస్పూన్ ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ లో కలిపి ఉదయం సాయంత్రం ఆహారానికి గంటన్నర ముందు తీసికొనవలెను . అదేవిధంగా ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఉదయం మరియు సాయంత్రం ఒక ఆపిల్ పండు తినవలెను . కేవలం నెలరోజుల్లో మీ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తం అద్బుతంగా వృద్ధి అగును. 


       కొన్ని వందలమందికి ఈ యోగం ప్రయోగించాను . చాలా అద్బుతంగా పనిచేసింది. 


 

     


    

సత్య భామ కృష్ణుడు

 చదివితే ఎంత ఆనందంగా ఉన్నదో ఈ సంభాషణ:

సత్య భామ ః   " అంగుళ్యాః కః కవాటమ్ ప్రహరతి ?  ( వేళ్ళతో తలుపు తట్టినది ఎవరు ? ) 

కృష్ణుడు ; " కుటిలే , మాధవః " ( కొంటె దానా  , నేను మాధవుడిని ) 

సత్య భామ ః " కిం వసంతః ? " ( ఏమిటి వసంతుడా ?  )

(మాధవుడంటే వసంతుడు అనే అర్థం కూడా ఉంది ) 


కృష్ణుడు ;" నో చక్రీ " ( కాదు , చక్రిని  ) 

( చక్రం ధరించేవాడు ) 

సత్య భామ ః " కిం , కులాలో ? " ( కుమ్మరివా ? )

( చక్రి అంటే కుమ్మరి అని కూడా అర్థం ) 


కృష్ణుడు ;" నహి , ధరణీధరః  " ( కాను , ధరణీ ధరుణ్ణి ) 

( ధరణిని ఉద్ధరించు విష్ణువు )

సత్య భామ ః " కిం , ద్విజిహ్వః ఫణీంద్రః ? "  (   రెండు నాలుకల నాగరాజువా ? )

 ( ధరణీ ధరుడు ఆదిశేషుడు కూడా ) 


కృష్ణుడు ;" నాహం , ఘోరాహి మర్దీ "  ( కాదు , ఘోరమైన పామును మర్దించినవాడిని )

( ఆ పాము కాళియుడు ) 

సత్య భామ ః " కిముత ఖగ పతిః ? "  ( గరుత్మంతుడవా ? )

 ( గరుత్మంతుడు పాముకు శత్రువు )


కృష్ణుడు ;" నో , హరిః " ( కాదు , హరి ని ) 

సత్య భామ ః " కిం , కపీంద్రః ? "  ( కోతివా ? )

( హరి అంటే కోతి కూడా ) 


ఇత్యేవం సత్యభామా ప్రతిజిత వచనః  పాతు వ చక్ర పాణిః 

ఇలా సత్యభామ చేత మాటలలో ఓడిపోయిన కృష్ణుడు మిమ్మల్ని రక్షించు గాక !


( పాత చందమామ   ' అమరవాణి ' శీర్షిక నుండి )

విభాత మిత్ర గారి పోస్ట్.

10, ఆగస్టు 2022, బుధవారం

ఆయుఃక్షీణకరములు

 శ్లోకం:

*బాలార్కో ప్రేతధూమశ్చ*

  *వృద్ధా స్త్రీ పల్వలోదకమ్ l*

*రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ*

   *ఆయుఃక్షీణం దినే దినే ll*


భావం: ఉదయపుటెండ, కాటిపొగ, తనకన్నా వయసులో పెద్దయైన స్త్రీని వివాహమాడుట, చిన్నగుంటలో నిలచిన నీరు త్రాగడము, రాత్రులందు పెరుగుతో భోజనము - ఇవన్నీ ఆయుఃక్షీణకరములు.

-------------------------------------

*శుభోదయం* 😊🙏🏼

రాఖి పౌర్ణమి

 🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉

 *ॐ* *ఓం నమః శివాయ* *ॐ*

రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు:


భారతీయ సంప్రదాయములో రాఖి పౌర్ణమి విశిష్టమైన స్థానం కలిగివుంది. ఈ పండుగను రక్షాబంధనం (రాఖీ) పండుగ గానూ, జంద్యాల పూర్ణిమ, వైఖానస మహర్షి జయంతి గాను, హయగ్రీవ జయంతి గాను , వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. అందం, బంధం కలగలసిన పండుగ రాఖీ పౌర్ణమి. ఈ పండుగకు పురా ణాల ప్రకారం ఎన్నో అర్థాలున్నా, అన్నా చెల్లెళ్ల బాంధవ్యానికి, బాధ్యతకు ప్రతీకగానే దీనికి ఎక్కువ గుర్తింపు ఉంది. రాఖి పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, శ్రా వణ పౌర్ణమి, రక్షికా పూర్ణిమ...ఇలా పలు రూపాల్లో ఈ పండుగను జరుపుకోవడం విశేషం. అన్నదమ్ములు నూతన యజ్ఞో పవీతాన్ని ధరిస్తే అక్కాచెల్లెళ్లు వారికి హారతి ఇచ్చి కుంకుమ దిద్ది, తీపిని తినిపిస్తారు. నిండు చంద్రుని పూర్ణిమ శోభల ను పుడమి స్వీకరించే రోజు. రసమయమైన చంద్రకళలు షోడశం గా పూర్ణంగా అందే ఈ దినం ధ్యా నానికి ఆరాధనకీ అనుకూలమైన యోగకాలంపూర్ణిమ నిండు చంద్రుని శోభలను పుడమి స్వీకరించే రోజు. రసమయమైన చంద్రకళలు షోడశంగా, పూర్ణంగా అందే ఈ దినం ధ్యానానికి ఆరాధనకీ అనుకూలమైన యోగకాలం.


దేవతలు అంతా కలిసి తమలో ఎవరు గొప్పవారని పరీక్షలు జరిపి, ఆ పరీక్షలో అందరికన్న శ్రీమహావిష్ణువే గొప్పవాడని నిర్ణయించారట! బ్రహ్మకి కోపం వచ్చి ‘విష్ణుమూర్తి శిరస్సు తెగిపడుగాక’ అని శాపమిచ్చాడట. అలా శిరస్సు కోల్పోయిన విష్ణుమూర్తి దేవతలు చేసిన ఒక యజ్ఞానికి గుర్రపు తలతో వచ్చాడట. తర్వాత ఆయన ధర్మారణ్యానికి వెళ్లి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు ఈశ్వరుడు వచ్చి పూర్వపు శిరస్సును ప్రసాదించాడట. ఇది స్కందపురాణ గాథ. పురాణాల్లో ఎలా వున్నా జ్ఞానదాతగా, గురువుగా, పౌర్ణమినాడు పూజలందుకునే దేవుడాయన.


శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది. ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. మరి


అది లక్ష్మీమయమైన మాసంలో వచ్చినది కనుక సంపదలు ఇచ్చే శక్తి ఉంది. దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని విద్యాప్రదమైన అవతారం హయగ్రీవ అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం. మనిషికి ప్రధానమైనది జ్ఞానం, జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు, శాస్త్రాలకు మూలం వేదం. ఆవేదాన్ని లోకానికి అందించిన అవతారం హయగ్రీవ అవతారం. విద్య చదువుకున్న వారికందరికి కంకణం కడుతారు, వారు రక్షకులు అవుతారు అని. జ్ఞానికి రక్షగా ఉంటారని. ఆ జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికి రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షబంధనం అయ్యింది. వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు. ఆతరువాత వేద అంగములైన శిక్షా, వ్యాకరణం, నిరుక్తం, కల్పకం, చందస్సు మరియూ జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు. విద్యారక్షకుడైన భగవంతుడిని ఉపాసన చేసుకొని మొదలు పెడుతారు. వేదాన్ని కొత్తగా నేర్చే వారే కాక, వేదాన్ని నేర్చినవారు తిరిగి ఇదే రోజునుండి మరచిపోకుండా నవీకరణం చేసుకుంటూ అధ్యయణం మొదలు పెడుతారు. హయగ్రీవుడిగా అవతరించి లోకాన్ని ఉద్దరించిన రోజు.


మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం.


'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,

తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'


దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది. బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి.

పరమాచార్య వైభవమ్

 *శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ - 553*

🙏🌻🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻🙏


🌈 *పూజ సంకల్పం - పరమార్థం* 🌈


💫 పరమాచార్య స్వామివారు చిత్తూరు దగ్గరలో మకాం చేస్తున్నారు. ఆరోజు తెలుగు నూతన సంవత్సరం. మహాస్వామివారి దర్శనానికి చాలామంది భక్తులు వచ్చారు. దర్శనం అలా కొనసాగుతూనే ఉంది. దాదాపు మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది కాని పరమాచార్య స్వామివారు ఇంకా మొదటి కాల పూజ కూడా ప్రారంభించలేదు. స్వామివారి ఆంతరంగిక శ్రీమఠం సేవకులొకరు అప్పటికే పూజకు ఆలస్యమైందని వినయంగా మనవి చేశారు.


💫 వెంటనే మహాస్వామివారు, “మనం ఈ నూతన సంవత్సరాన్ని చంద్రమౌళీశ్వర పూజతో ప్రారంభిద్దాము. పూజని సంకల్పంతో మొదలుపెడదాము” అని చెప్పి పూజకు ఉపక్రమించారు.


💫 అక్కడ కూర్చున్న అంతమంది భక్తులను ఉద్దేశించి ఒక ప్రశ్న వేశారు మహాస్వామివారు. “ప్రతిరోజూ చేసే చంద్రమౌళీశ్వర పూజలో చదివే సంకల్పం యొక్క అర్థం పరమార్థం ఎవరికైనా తెలుసా?” అని.


💫 ఒకరు చెప్పారు అది పరమాచార్య స్వామివారికోసం అని. మరొకరు పరమాచార్య మరియు పుదు పెరియవ కోసం అని చెప్పారు. వేదముల యొక్క సంరక్షణ కోసం అని మూడవ వ్యక్తి అభిప్రాయపడ్డాడు. నాల్గవ వ్యక్తి ప్రముఖ శ్లోకాన్ని అనుసరించి, అది పాలకులు, బ్రాహ్మణులు, గోవుల యొక్క క్షేమం కోసం అని తెలిపాడు. 


💫 అప్పుడు మహాస్వామివారు సంకల్పం చెప్పే శాస్త్రి గారిని పిలిచి సంకల్పం యొక్క అర్థము, ఉద్దేశ్యము అనువదించి అందరికి తెలుపవలసిందిగా ఆజ్ఞాపించారు. అపుడు మేము, అక్కడున్న అందరమూ అర్థం చేసుకున్నాము. 


🙏 *శ్రీమఠంలో రోజూ జరిగే పూజ యొక్క ప్రయోజనం కుల, మత, వర్ణ, లింగ, ధనిక, పేద  వివక్ష లేకుండా సర్వ మానవాళి కోసం.*


--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి


❀┉┅━❀🕉️❀┉┅━❀

*జయ జయ శఙ్కర హర హర శఙ్కర*

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*

🙏🌻🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻🙏

దారి మర్చిపోయాను

 🔻అప్ప్పారావు తన పెంపుడు కుక్క తొ విసిగిపోయి


దూరంగా వొదిలి వచ్చాడు


♦️కుక్క వెంటనే ఇంటికి వెనక్కి వచ్చేసింది.


♦️మర్నాడు అప్పారావు చాలా దూరం తీసుకుపోయి వదలి వొచ్చాడు.


కుక్క గంటలో మళ్లీ ఇంటికి వచ్చేసింది.


♦️కోపం యెక్కువై ఈ సారి ఇంకా దూరం చాలా కష్టమైన

చొట్లొ వదిలేసి బయలుదేరాడు.


♦️సగం దూరం వచ్చి పెళ్ళానికి ఫోన్ చేసాడు కుక్క


వచ్చిందా అని.


ఇంటికి వచ్చేసిందని పెళ్లాం చెప్పినది


♦️అప్పారావు చెప్పాడు "దాన్ని పంపించు.

నెను ఇంటికి దారి మర్చిపోయాను"


🤣🤣🤣🤣🤣