12, ఆగస్టు 2022, శుక్రవారం

పాలుతో

 పాలుతో ఔషదాలు తీసుకొనడం వలన ఉపయోగాలు  - 


 *  లంఘనం ( ఉపవాసం ) చేత బలహీనుడు అయినవాడు క్షీరం పానం చేయడం వలన బలవంతుడు అగును. అట్టివానికి జ్వరం నశించును. 


 *  కాగి చల్లారిన పాలు , కొంచం ఉష్ణంగా ఉన్న పాలు కాలమునెఱిగి జ్వరపీడితుడు సేవించవలెను 

కాచబడినదియు , గోరువెచ్చగా ఉండని పాలను జ్వరపీడితుడు సేవించిన మృత్యుడు అగును.


 *  పాలయందు శొంటి , ఖర్జురపు కాయ , ద్రాక్ష వీటిలో ఏదైనను కాచి అందు చెక్కర  కాని , నెయ్యి గాని , తెనే కాని వేసి చల్లార్చి అనుపానంగా సేవించిన యెడల  దప్పిక , తాపము వీటిని నివర్తింప చేయును . 


 *  పాల యందు ద్రాక్ష , చిట్టాముదపు వేరు , యష్టిమధూకం , సుఘంద పాల వేరు , పిప్పిలి , చందనం వీటిచే కాచబడిన పాలు సేవించిన లేక పాలకు నాలుగింతలు నీరు పోసి పిప్పిలి వేసి నీరంతా ఇగురునటుల కాచి తగినంత వేడిగా ఉన్నప్పుడు లొపలికి తీసుకున్న జ్వరం నశించును. 


 *  జ్వరం గలవాడు పంచమూలములు పాలల్లో వేసి కాచి అనుపానంగా సేవించిన యొడల చిరకాల జ్వరం నశించుటయే కాక కాసాశ్వాస , తలనొప్పి , పార్శ్వపునొప్పి కూడా నశించును.


 *  పాలయందు ఆముదపు వేరు గాని లేక బిల్వపత్రములు గాని వేచి  కాచి అనుపానంగా సేవించిన జ్వరం , మలబద్దకం నశించును. 


 *  పాల యందు శొంటి , చిట్టాముదపు వేరు , వాకుడు , పల్లేరు , బెల్లము వీటిని వేసి కాచి అనుపానంగా సేవించిన రక్తపిత్తము , అతిసారం , దప్పికతో కూడిన నొప్పులు అన్ని నివర్తించును.


  

     

కామెంట్‌లు లేవు: