4, సెప్టెంబర్ 2024, బుధవారం

Panchng



 

తెలుగు పెళ్లిళ్లు

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 తెలుగు పెళ్లిళ్లు ఆ రోజుల్లో ఎలా ఉండేవో, పెళ్లి కుమార్తె లకు ఎటువంటి అలంకారాలు చేసేవారో, ఆ ముచ్చట్లు తెలియాలంటే సీతమ్మ పెళ్లి తెలుసుకోవలసిందే. తెలుగు రామాయణాల్లో సీతమ్మ పెళ్లి ముచ్చట్లు వింటే ఆనాటి ఆచారాలన్నీ అర్థమవుతాయి. రంగనాథ రామాయణం లోని విశేషాలు చెప్తూ ప్రముఖ సాహితీవేత్త డా. పుట్టపర్తి నాగ పద్మిని గారు ఈ ఎపిసోడ్ లో

 సీతమ్మ పెళ్లి గురించి ఎంతో చక్కగా వివరించారు. మన సీతమ్మ కథ సీరియల్ లో ఇది 10వ భాగం. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కరువాయను

 కరువాయను యజ్ఞ యాగము              

బరువాయను హవిస్సు అర్పణ                 

మరుపాయను   కర్మాచరణము                                      

చెరువాయను కన్నీటి కడగండ్లు

తురగా నాగేశ్వర రావు

5. " మహా దర్శనము

 5. " మహా దర్శనము "--- ఐదవ భాగము---దర్శనమైనది


5. దర్శనమైనది 



         శ్రావణ శుద్ధ పౌర్ణమి , సోమవారము . దేవరాత దంపతులు పూర్ణమాస యాగమును చేసినారు . యజ్ఞేశ్వరుడు మూడు కుండములలో కూర్చొని ప్రసన్నముగా హవ్యమును స్వీకరించినాడు . దేవరాతునికి ఏదో ఒక విచిత్రమైన ప్రసన్నత వచ్చింది . గడచిన తొమ్మిది పది రోజులనుండీ , దినదినమూ , " ఈ దినము తప్పక సంయమము చేసి గర్భస్థ శిశువును మాటలాడించవలెను " అనుకుంటాడు . కానీ ఏదో దిగులు వంటి భయము . తనకన్నా ఉత్తములు అని మనసు ఒప్పుకొన్న వారి సమక్షమునకు పోవుటకు బెదరునట్లు , దేవరాతుడు ఏవో కుంటి సాకులను ముందుంచుకొని ఊరికే ఉంటాడు . ఈ దినము దృఢముగా నిర్ణయించుకున్నాడు . " ఏమైనా కానీ , ఈ రోజు మాట్లాడించియే తీరవలెను . ఇంకెన్ని దినములు ఊరకే ఉండవలెను ? ఇంకెన్ని దినములు ఊరకే ఉండేది ? ఊరకే ఉంటే , బిడ్డకు ఏమి చెప్పాలన్నది భార్యకు తెలియక ఆమే , ఆమె వలన తానూ , ఇద్దరూ కర్తవ్య భ్రష్ఠులవుతాము . అది సరియైనది కాదు . " అయినా బెదురు పోలేదు . సంయమము చేస్తేనేమి ? చేయకున్ననేమి ? అనే సంశయము ఇంకా ప్రబలముగా నున్ననూ , సంయమము చేసే తీరవలెనన్న సిద్ధాంతమే ప్రబలమైనది . చలితో ఒణుకుతున్ననూ , చన్నీరన్న భయమున్ననూ , స్నానము చేసే తీరవలెనన్న హఠముతో , నీటిలోనికి దిగు వైదీక బ్రాహ్మణుని వలె అతడు కూడా సంయమానికి సిద్ధుడైనాడు . 


        పగలు గడచి సాయంత్రమైనది . స్నానమయినది , సంధ్యాకర్మ కూడా అయినది . అగ్నిహోత్రమయినది , ఫలహారమయినది . అప్పుడు దేవరాతుడు భార్యను పిలచి , " ఈ దినము ఇంటి పనులను వేగిరముగా ముగించుకో , వేరే పనిఉన్నది " అన్నాడు . ఆమె , " అటులనే , నాకు కూడా పొద్దుటి నుంచీ గిలకలా తిరుగుతూ పని చేసి , ఒళ్ళంతా పండినట్లైనది . మీ ఆజ్ఞ నాకు కూడా అనుకూలమే . ఎప్పుడెపుడు శయ్యపై వాలుదామా అన్నట్లుంది , అటులనే " అని , ఆత్రముగా చేతికి దొరికిన పనిని చేస్తున్నది . అంతలోనే దేవరాతుడు మళ్ళీ వచ్చి , ’ ఆతరపడి భోజనము వదిలేస్తావేమో , ఒద్దొద్దు , రెండు ప్రాణాల దానవు , " అంటాడు . ఆమె నవ్వుతూ , " మీ అనుజ్ఞ అయినాక ఇంకేమి ? ఏదో ఫలహారము చేసి రెండు అరటి పళ్ళుతిని , పాలు మాత్రమే తాగాలనుకున్నాను , ఇప్పుడు ఏకంగా భోజనమే చేసి , పళ్ళూ పాలూ స్వీకరించి వస్తాను " అని తన పనిలో తాను నిమగ్నమైంది .  . 


         దేవరాతుడు శయ్యా గృహములో భార్యకై వేచియున్నాడు . ఆమె కూడా వేగిరమే వచ్చినది . ఈ దినము భర్తకు తాంబూలపు ఉపచారము లేదు కాబట్టి , తాను వచ్చేటప్పుడే తాంబూలము వేసుకొనే వచ్చినది . తాను పడుకొనే వరకూ ఆమె పడుకోదని , దేవరాతుడు మంచానికి అడ్డము పడినాడు . " ఆమె పడుకోనీ , నిద్ర పోనీ , సుమారు అర్ధరాత్రికి సంయమము చేయవలెను " అనుకున్న దేవరాతునికి భార్య పరుండినపుడైతే మెలకువ ఉండినది , ఇంకో ఘడియలోపలే ఆమెకన్నా ఎక్కువగా గాఢనిద్రలోకి జారిపోయినాడు . 


        సుమారు మూడవ ఝాము . దానిలో కూడా సగము గడచినది . అప్పుడు దేవరాతునికి ఒక స్వప్నము . ఆ కలలో దేవరాతుడు అగ్నిగృహము నుండీ వచ్చి బచ్చలి ఇంటికి వెళ్ళి కాలూ చెయ్యీ కడుక్కుని వచ్చి శుద్ధాచమనము చేస్తున్నాడు . ఎవరో ముఖద్వారము నుండీ లోపలికి వచ్చి , " ఆచార్యా , అభివాదయే ! " అంటున్నారు . నోటిమాటకు తగ్గట్టుగా అభివాదము కూడా చేసినారు . వారిని  , " ఆయుష్మాన్ భో విధి " అని ఆశీర్వాదము చేయవలెను . అయితే వారి పేరు తెలియదు . కాబట్టి పేరు చెప్పవలసిన చోట ఏదో శక్తి వలన ప్రేరితుడై , తాను ఏమి చేయుచున్నానన్న దానిపై గమనమే లేకుండా , ’ యాజ్ఞవల్క్య విధి ’ అంటాడు . ఇతడు , ’ ఇదేమి నేను ఇలా చేసితిని ’ అనుకొనేలోపలే , ఆ అభివాదకుడు " తమరు చెప్పినది సరిగ్గానే ఉన్నది . అదే నా పేరు కానివ్వండి . నామ రూపములు సత్యము కాదు అని తెలిసినప్పుడు , వ్యవహారమునకు ఏ పేరైతేనేమి ? " అని నవ్వుతాడు . దేవరాతుడికి , ’ ఇతడేనేమో మా కడుపున వచ్చి పుట్టి మా పుత్రుడగువాడు ? ’ అని తోచినది . ఎవరో , ’ అవును , ఇతడే ! మొదట నమస్కారము చేయి . ఆ తేజస్సు చూచినావా ? యజ్ఞేశ్వరుని వలె ప్రకాశిస్తున్నాడు . ’ అంటారు . దేవరాతునికి బుడిలుడు చెప్పినది జ్ఞాపకమునకు వచ్చి , అతనికి మనసా నమస్కరిస్తాడు . ఆగంతకుడు అది తెలుసుకొని , ’ ఎంతైనా నేను మీ కొడుకుని . నాకెందుకు నమస్కారము ? మీ జ్యోతి వలన ప్రయోజనమును పొందుటకు వచ్చినవాడను ’ అంటాడు . దేవరాతుడు , ’ మీరు ఎక్కడి నుండీ వచ్చినారు ? " అని అడగవలె ననుకుంటాడు . మాట నోటి నుండీ వెలువడుట కన్నా ముందే , అతడు దానిని తెలుసుకున్నవాడివలె , ’ నేనే చెప్పవలెనని యుంటిని , మీరే అడిగినది మంచిదే అయినది . ఇకపైన నన్ను ఏకవచనములో యాజ్ఞవల్క్య అనియే సంబోధించండి . తమ బిరుదు ’ యజ్ఞవల్క్య ’ అని ! తమరి పుత్రుడనని నాకు ఆ పేరు కానివ్వండి . నేను తపో లోకమునందు ఉంటిని . అక్కడ ఎవరూ నామ రూపములను అంతగా గౌరవించరు . ఒక దినము , నేను తమ దంపతుల దర్శనము చేసి , గర్భమును చేరితిని కదా , దానికి ముందే దేవతలూ , ఋషులూ , తమరి పితరులూ మా ఆశ్రమమునకు వచ్చి , ’ నువ్వు భూలోకమునకు వెళ్ళి రావలసియున్నది . ’ అన్నారు . ’ నేను అక్కడ ఎన్ని దినములు ఉండవలెను ? ’ అని అడిగితిని . దానికి వారు , ఒక పురుషమానము ఉండవలెను . అక్కడ విశ్వోద్ధారమునకు ఒక సంహిత , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తు యొక్క అవతారము కావలసియున్నది . దానికోసమై నువ్వక్కడికి వెళ్ళవలెను ’ అన్నారు . ’ నేను ఇక్కడ ఒక రూపములోనుండి , అక్కడ ఇంకొక రూపముతో ఉండవచ్చు కదా ? ’ అని నేను అడిగితిని . వారు , " కాదు , మహా విష్ణువు యొక్క ఆజ్ఞ అయిన దేమనగా నీ సంపూర్ణ తేజస్సుతో నువ్వు అక్కడ పుట్టవలెను అని ! అందుకే మేము ముగ్గురమూ వచ్చినాము ." అన్నారు . మహా విష్ణువు యొక్క ఆజ్ఞ అన్న తర్వాత ,నేను మారు మాట్లాడక ఒప్పుకున్నాను . "  


         దేవరాతునికి ఈ వేళకు అతడి సామీప్యము వలన పరిచయము బలమై మాటలాడుటకు ధైర్యము వచ్చినది . " ఆ దినము ఎందుకో ఆత్రాత్రముగా వచ్చుచుంటిరి ? " అని అడిగినాడు . " అవును , దానికీ కారణము ఉన్నది . మొదట మీరు నన్ను బహు వచనములో సంబోధించుట మానవలెను . నేను , ఆరు నెలలు నిండినాయి , గర్భము పెరిగినది , అనుకొని వచ్చినాను . తపోలోకమున మేము పున్నమి నుండీ పున్నమికి లెక్క వేసుకుంటే , మీరు అమావాశ్య నుండీ అమావాశ్యకు లెక్క వేసెదరు . దానివలన పదునైదు దినములు వెనుక ముందు అయినది . దానివలన మీకేమీ ఇబ్బంది కాలేదు కదా ? నేను అటుల అకాలము నందు వచ్చినందు వలన మీతో మాట్లాడుటకు  మరలా తమరింటిలో సీమంతము జరుగు వరకూ వేచి ఉండవలసి వచ్చినది . ఆ దినము  తమరి పితృ పితామహులు నాతో పాటు వచ్చి నన్ను అనుగ్రహించినారు . ఆదినము ఆ వృద్ధులొకరు మమ్ములను చూచినారు . వారు మీ తండ్రిగారి స్నేహితులని తెలుస్తున్నది . వారుకూడా ’ నీపేరేమి ? ’ అని అడుగవలె ననుకొను లోపల మేము అంతర్థానమైతిమి . మీకది తెలిసియే ఉండవలెను . " 


దేవరాతుడు , " ఔను ,ఔను . " అని తలాడించినాడు . 


        యాజ్ఞవల్క్యుడు కొనసాగించి అన్నాడు , " అప్పటినుండీ మీరు నన్ను చూడవలెనని సంయమము చేయుచుండినదీ నాకు తెలుసు . నేనే వచ్చి మిమ్ములను చూచుట విహితము  కానీ అప్పటికింకా గర్భము నందున్న పిండములో ప్రాణము  సరిగ్గా చేతికి దొరకునట్లే లేదు , అక్కడున్న కరణములూ నాడులూ ఇంకా సమాహితముగా లేనందు వలన , నేనే మీకు ఈ గడచిన పది రోజులుగా అవకాశము ఇవ్వలేదు . అది తప్పయినచో మన్నించవలెను . " 


" ఒక వేళ అలాగ సంయమము చేసినచో యేమయ్యెడిది ? " 


" ఈ పిండము సడలి , పడిపోయెడిది . ఇంకొక గర్భ కాలము వరకూ వేచి ఉండవలసి వచ్చేది . " 


         " మంచిది , ఇంకొక సంహిత , బ్రాహ్మణము , ఉపనిషత్తు లను లోకానికి ఇవ్వవలెనని జన్మమెత్తుతున్నావు కదా ! అంటే అప్పుడు వేదములు అయిదు అవుతాయా ? " 


        " లేదు , ఎప్పటికీ వేదములు నాలుగే ! బహుశః నేను తేబోయే వేదము ఇప్పటి యజుర్వేదములో చేరిపోయి ఇంకొక పేరుతో వ్యవహరింప బడవచ్చు . బ్రాహ్మణములోనే ఉపనిషత్తు ఉండటము వలన , వాటివలన ఎట్టి బాధా కలుగునట్లు లేదు . " 


" ఇటుల సంహిత , బ్రాహ్మణోపనిషత్తులను కరుణించు నీకు మేము ఎటువంటి శిక్షణను ఇవ్వవలెను ? " 


          యాజ్ఞవల్క్యుడు నవ్వి అన్నాడు , " ఈ జన్మము దేవకార్యార్థమై కలుగుతున్నది . అటులన్ననేమి ? అని మీ సంశయము !  ఈ జగత్తు , కాల -దేశములకు అంకితమై నడుస్తున్నది . కాలము ఎప్పుడునూ పాకము చేయు స్వభావము కలది . దాని పాకము వలన ప్రతియొక్క చేతనమూ తన తేజస్సులోనూ , సామర్థ్యములోనూ క్షీణతను చూడవచ్చును . వీణను శృతి చేసి వదలితే , మ్రోగించినా , మ్రోగించకున్నా శృతి తగ్గుట లేదూ ? అటుల ! అప్పుడు దేవతలు ఆ క్షీణతను తీసివేసి మరలా మొదటివలె చేయుదురు . ఇప్పుడు జగత్తు అటులనే క్షీణతను పొందియున్నది . అది వక్రమగులోపల దానిని సరితూకము చేయు సాధనము నొకదానిని సిద్ధము చేయవలెనని దేవతలు ఆలోచించి , ఆ పనికి నన్ను దర్విగా చేసుకున్నారు . కాబట్టి ఈ జన్మమును , లేదా కర్మ కరణమును సరిగ్గా ఉంచుకొనుట దేవతల పని . అదీగాక , ’ వయమగ్నేర్హి మానుషాః ’ అంటే మేము అగ్నిని నమ్ముకున్నవారము . అయినా మీరు అడిగినందుకు చెప్పెదను , మా కాబోయే తల్లికి మీరు ’ పూర్ణమదః పూర్ణమిదం ’ అను ఒక మంత్రమును నేర్పండి . ఆమె అదొక్క దానినే ప్రసవమగు వరకూ జపము చేస్తూ ఉండనీ , ఆ తర్వాత నన్ను తొట్లలో వేసినపుడు , దానితో పాటు ’ భద్రం కర్ణేభిః ’ మంత్రమును చెప్పితే చాలు . ఆమె మడి , మైల యను ఆలోచనలే లేకుండా , సర్వ కాలము లందూ ఈ మంత్రములను వీలయినంతగా పారాయణము చేస్తూ ఉండనీ . " 


         దేవరాతుడు తన సంశయము గురించి అడుగవచ్చునో లేదో అని మనసులో ఆలోచించాడు . యాజ్ఞవల్క్యుడు దానికి కూడా ఉత్తరము నిచ్చాడు , " తమరు , ’ నా పుత్రుడు బ్రహ్మవాదియై బ్రహ్మను ఎంచుకొని కర్మలను వదలివేస్తే ఏమి గతి ? ’ అని సంశయము పడ నవసరము లేదు . నేను అప్పుడే చెప్పితిని కదా , సంహిత , బ్రాహ్మణములను జగత్తుకు ఇచ్చుటలో కర్మముల నన్నిటినీ అద్దము వలె స్వచ్ఛ పరుస్తాను . ఈ కురు , పాంచాల , కాశీ , మద్ర దేశము లన్నిటిలోనూ తమరి కీర్తి గర్జించునట్లు చేస్తాను . ఆ పిమ్మట ఇంకా అవకాశమున్న , సన్యాసమును తీసుకొనెదను , సమ్మతమే కదా ? " 


         దేవరాతుడికి ఏమి చెప్పుటకూ మాట రాలేదు . కొడుకు చెప్పిన దాంట్లో అతనికి కొంచము కూడా సందేహము రాలేదు . సూర్యుడిని చూసినపుడు అతడు తేజోరాశి యనుదానికి ప్రమాణాంతరము ఏమీ అవసరము లేనట్టే , అతని మాటలలోనే స్వతహాగా ఏదో ప్రమాణమున్నట్లే అనిపించి , అతడిని అది ఒప్పించినది . 


         యాజ్ఞ వల్క్యుడు లేచి , ’ నేను వెళ్ళి వచ్చెదను , కాలాతీతమగుతున్నది . నేను చెప్పినది నిజము అనుటకు సాక్షిగా కార్తీక శుక్ల సప్తమి దినము నా జననమగును . అప్పుడు తప్పకుండా మేధా జననమును చేయండి . మిగిలినదంతా శాస్త్ర ప్రకారము జరగనివ్వండి . " అని చెప్పి అభివాదనము చేసినాడు . దేవరాతుడు కూడా వేదోక్తముగా కొడుకుకు ఆశీర్వాదము చేస్తుండగా , మంత్రము ముగిసే దానికన్నా ముందుగనే మెలకువ అయినది . మెలకువ అయినా కూడా మంత్రము తానే పలుకుతూ పూర్తి అయినది . 


        ఆలంబినీ దేవి కూడా ఆ మంత్ర శ్రవణము చేత మేలుకొని , ’ ఇదేమి ? పడక పై పరుండియే మంత్రమును చెప్పుతున్నారు , బాగున్నది వరస ! ’ అంది . 


        దేవరాతుడు నవ్వుతూ , " అంతా నీ పుత్రుని ప్రభావము ! " అని కల గురించి చెప్పినాడు . ఆమె , ’ అదేమిటి , కల అంటారు ? మీరు ఎవరితోనో మాట్లాడుచుండుట నాకు అర్థమయింది . అదంతా నేను కూడా విన్నాను కదా ? " అని ఆశ్చర్యపోయింది . 


          దేవరాతుడు , ’ నువ్వే ముఖ్యముగా ధన్యురాలవు . కృతార్థురాలవు . నీ పుణ్యము వలన ఈ ఇంటిలో ఇంకా ఏమేమో విచిత్రములు , నమ్మశక్యము గానివి , జరుగుతాయి . నిన్ను చేపట్టి నేను కూడా ధన్యుడనైనాను  అను కాలము వచ్చినది " అని విచిత్రమైన తృప్తి ధ్వనించు పలుకు పలికాడు . 


       ఆలంబిని , ’ ఆ ? ఇదేమి చమత్కారము ? మీ చేయి పట్టి మీవంటి విద్వాంసుల ఇల్లు చేరి నేను కృతార్థురాల నైనానని రాత్రింబవళ్ళూ అనుకుంటున్నాను . " అంది .


         దేవరాతుడు భార్యపై విశ్వాసముతో ఆమెను ఆలింగనము చేసుకొని ,"  బీజము ఎంత మంచిదైతేనేమి ? దానికి తగ్గట్టు సంపన్నమైన క్షేత్రము కూడా కావలెను ." అని చుంబించాడు . ఆమె కూడా భర్త యొక్క ఆ స్తుతినీ , మోహన కార్యమునూ వద్దనకుండా విశ్వాసముతో  స్వీకరించినది .

పో త న కవి తా వై భ వం

 


పో త న కవి తా వై భ వం!!


*రచన:-శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు:--*


ఎండిన మ్రోడులే కిసలయించెనొ! యేకశిలాపురమ్ములో

బండలు పుల్కరించెనొ ! అపార ముదమ్మున తెల్గుతల్లికిన్‌

గుండెలు పొంగిపోయి కనుగొల్కులు నిండెనొ ! 

పచ్చి పైరులే

పండెనొ ! 

జాలువారిన భవత్‌ కవితామృత భక్తిచారలన్‌ !


 భీష్మునిపైకి కుప్పించి లంఘించు గోపాల కృష్ణుని కుండలాల కాంతి

కరిరాజు మొరవెట్ట పరువెత్తు కరివేల్పు

ముడివీడి మూపు పై పడిన జుట్టు

సమరమ్ము గావించు సత్య కన్నుల నుండి

వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు

కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ సందు మాగాయ పచ్చడి పసందు


ఎటుల కనుగొంటివయ్య ! నీ కెవరు చెప్పి

 రయ్య ! యే రాత్రి కలగంటివయ్య ! రంగు

కుంచెతో దిద్ది తీర్చి చిత్రించినావు !!

సహజ పాండితి కిది నిదర్శనమటయ్య !!


ముద్దులుగార- భాగవతమున్‌ రచియించుచు, పంచదారలో

నద్దితివేమొ గంటము 

మహా కవి శేఖర ! మధ్య మధ్య నట్లద్దక వట్టి గంటమున నట్టిట్టు గీచిన, తాటియాకులో

పద్దెములందు - ఈ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా!

     -జంధ్యాలపాపయ్య శాస్త్రిగారు.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌾🌾🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అష్ట దిక్కుల గాలులు

అష్ట దిక్కుల గాలులు  -  లాభ నష్టాలు . 


  గాలులు లొని రకాలు  - 


     బౌగోళిక పరిస్థితులను బట్టి సూర్య చంద్రుల గమనాలని బట్టి భూమి స్వరూపాన్ని ఎనమిది దిక్కులుగా విభజించారు. అన్ని దిక్కుల నుంచి వీచే గాలులు అన్ని ఒకే రకంగా ఉండవు  . ఆయా దిక్కుల స్వభావాన్ని బట్టి గాలి స్వభావం మారుతుంది . అయితే అన్నివేళలా అన్ని దిక్కుల నుండి గాలులు వీచవు. ఒక్కో రుతువులో ఒక్కో దిక్కునుండి ఒక్కో రకమైన గాలులు వీస్తాయి. వాటివల్ల మానవులు మానవులకు కొంత ఆరోగ్యము , కొంత అనారోగ్యము కలుగుతాయి. ఏ గాలులు అనారోగ్యమో , ఏ గాలులు ఆరోగ్యమో తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం. 


  దక్షిణ దిక్కు గాలులు  - 


    ఏప్రిల్ , మే నెలలలో వచ్చే వసంత మాసంలో దక్షిణ దిక్కు నుంచి గాలులు నెమ్మదిగా వీస్తాయి . ఇవి మలయ పర్వతం మీదగా వీచడం వలన ఆ పర్వతం మీద ఉన్న ఔషధాల సువాసనలు కూడా ఈ గాలులతో కలిసి వస్తాయి. ఈ మలయ పవనాలు తమ చల్లని స్పర్శతో మానవాళిని వేసవితాపం నుంచి కాపాడతాయి. ఈ గాలులని ఆస్వాదించ గలిగితే శరీరంలోని త్రిదోషాలు హరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ గాలిలో తీపి , చేదు , వగరు రుచులు ఉంటాయి. ఈ కాలంలో అదే స్వభావం కలిగిన ఈశాన్య గాలులు కూడా వీస్తాయి 


  నైరుతి గాలులు  - 


      జూన్ , జూలై నెలలలో వచ్చే గ్రీష్మ రుతువు లొ నైరుతి దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఈ గాలుల్లో కారం రుచి ఉంటుంది. ఇవి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ గాలులు వాళ్ళ ఉదర రోగాలు , పైత్య రోగాలు , మేహా రోగాలు పుడతాయి. రక్త పిత్త రోగాలు కూడా పుడతాయి. ఈ నైరుతి గాలులు సకల రోగాలుకు నిలయాలు. 


  పడమర గాలులు  - 


     ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలలో ఉండే వర్ష ఋతువులో పడమర గాలులు వీస్తాయి . ఈ గాలులు వెగటుగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అయినా గ్రీష్మ ఋతువులో నైరుతి గాలుల వలన ఏర్పడిన రక్తపిత్త వ్యాధి హరించి పొతుంది. ఎంతో కాలం నుంచి ఉన్న వివిధ వ్రణాలు మాడిపోతాయి. 


  వాయువ్య దిక్కుల గాలులు  - 


   

     అక్టోబర్, నవంబర్ నెలలలో ఉండే శరత్కాలంలో వాయువ్య దిక్కు నుంచి గాలులు వీస్తాయి . ఈ గాలులలో కారం , చేదు గుణాలు ఉంటాయి. తేమ ఉండదు. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అయితే వాత వ్యాదులు కలిగించడం . వాతవ్యాదులు ఉన్నవారికి ఎక్కువ అవ్వడం ఈ గాలుల స్వభావం . కఫ రోగాలు , పైత్య రోగాలు తగ్గించి వంటిలోని చెడు నీరు తొలగించే గుణం ఈ గాలులలో ఉంది. 


  తూర్పు , ఉత్తర దిక్కుల గాలులు  - 


     డిసెంబర్ , జనవరి నెలలలో ఉండే హేమంత ఋతువులో తూర్పు దిక్కున ఉండి ఉత్తర దిక్కుకు ఈ గాలులు వీస్తాయి . తూర్పు గాలులు చలువ చేస్తాయి. కాని వీటివల్ల వాత రోగాలు , కఫ రోగాలు పైత్య రోగాలు పెరుగుతాయి. వంటి నిండా నీరు పట్టే ఉబ్బు వ్యాధి ని కలిగిస్తాయి. ఉత్తరపు గాలులు కూడా చల్లగా ఉంటాయి. ఇవి కఫాన్ని , కొవ్వుని పెంచుతాయి. 


   ఆగ్నేయ గాలులు   - 


  

       ఫిబ్రవరి , మార్చి నెలలలో ఉండే శిశిర ఋతువులో ఆగ్నేయ దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఇవి కూడా అమిత చల్లగా ఉంటాయి. వాతవ్యాదులని పుట్టిస్తాయి. ఉబ్బు రోగాలు , వ్రణాలు ఉన్నవారిని మరింత పీడిస్తాయి.


 

         మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

బాధ్యతగా ఆలోచించండి.

 ..

నా పేరు శ్రీకాంత్ శర్మ. 

ప్రతి సంవత్సరం వినాయకచవితి ముందు నేను పొందే ఆవేదన మీ ముందు పెడుతున్నాను.

ఓపిగ్గా చదవండి... బాధ్యతగా ఆలోచించండి.


* ఈద్ రోజున మసీదు ముందు ముస్లింలు మద్యం మత్తులో అసభ్యకరమైన పాటలు వేసి, నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా ⁉️ 


* ఏసుక్రీస్తు ముందు సినిమా హీరోల ఐటం సాంగ్స్ కు క్రైస్తవులు నృత్యం చేయడం మీరెప్పుడైనా చూశారా ⁉️


* మరి జైన మతస్థులు, సిక్కులు, బౌద్ధులు తమ దేవుడి ముందు బూతు పాటలు పాడుతూ నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా ⁉️


* చూడలేదు కదూ !!! 


ఈ మతాలన్నీ ఎంతో చిత్తశుద్ధితో తమ మతాన్ని తమ ధర్మాన్ని గౌరవిస్తాయి. ఎందుకంటే వారు తమ సంస్కృతి కోసం తమ మతాన్ని కాపాడుకోవాలి కాబట్టి, కాపాడుకుంటున్నారు కూడా. 


మరి లాంటప్పుడు, మన హిందూ మతానికి చెందిన దేవుళ్ళ ముందు, చిత్తుగా మద్యం తాగి, ఆ మత్తులో అసభ్యకరమైన పాటలకు DJ పెట్టి మరీ ఈ అసభ్య అర్థ నగ్న నృత్యాలు ఎందుకు ⁉️


ఈ కళంకం మన హిందూ సమాజంపై ఎవరు, ఎందుకు విధించారు ❓ లేక మనమే అలా చేస్తున్నామా ⁉️


డీజేలపై అసభ్యకరమైన పాటలు పెట్టి, ..... కాపాడుకోవాల్సిన మన సనాతన సంస్కృతిని మనమే అవమానిస్తున్నాం, అగౌరవపరుస్తున్నాము. 

ఎందుకు ❓❓❓


మన పండుగలు చాలా ఉత్సాహంగా, పెద్ద ఎత్తున జరుపుకోవాలి. కాదనడం లేదు. సంప్రదాయ సంగీత వాయిద్యాలు, సాంప్రదాయ దుస్తులు, మన వైభవాన్ని చాటి చెప్పే తలపాగా వంటి వాటిని ధరించి, ప్రతి హిందువుల పండుగలో మనం కనిపించాలి. అప్పుడే మన సనాతన సంస్కృతి నిలబడుతుంది. 


ఇతర మతస్తులు మనలా తమ మతపరమైన కార్యక్రమంలో ఎలాంటి వికృత చేష్టలు చేయరు.


ఏ ఏడాదిలో హిట్ సినిమా ఉంటే ఆ ఏడాది ఆ హీరో నమూనా తాలూకు వినాయక విగ్రహం పెడుతున్నారు. 

పోయిన ఏడాది క్రితంవరకు, బాహుబలి, గబ్బర్ సింగ్, పుష్ప వినాయకులను చూసాము. ఈ ఏడాది అంతకుమించి వికృత రూపాల వినాయకులు మండపాలలో దర్శనమిస్తే ❓❓


ఎటు పోతుంది సమాజం ❓ 

ఎటుపోతుంది మన సనాతన ధర్మం ❓ 


ఈ విష సంస్కృతి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో మండపాలలో సాంప్రదాయ పురాణ గణపతి కనబడుతారా ❓


ఓ సినిమా హీరోల్లారా ? దర్శక నిర్మతాలరా ? మీకు బాధ్యత లేదా ? మీ అభిమానులను ఇలాంటి వికృత చేష్టలను చేయకుండా ఆపడానికి ❓ 

సినిమా ఈవెంట్లలో అభిమానులను ఉద్దేశించి ఇది తప్పని చెప్పడానికి మీకు నోరు రావడం లేదా ❓ 


ఓ ప్రవచన కర్తలరా ? 

ఓ పీఠాధిపతులారా ? 

ఓ సాదు పుంగవులారా ? 

ఓ రాజకీయ నాయకులారా ? 

ఓ మీడియా ప్రతినిధులారా ? 

ఈ పండుగ సమయాల్లో మీరంతా ఏమైపోతారు ? 

ఎందుకు మీ కంటికి ఇవి దారుణాలుగా కనిపించవు ? 

మనకు మన ఋషులు ధారపోసిన జ్ఞానం ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి.


మండపాల దగ్గర సినిమా పాటలు పెట్టకండి. వీలైతే భజనలు చేయండి లేదా ఏమీ చేయకుండా ఉండండి. బలవంతంగా చందాలు వసూలు చేసి మరీ మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు ఇలా అడగడం. మీకు శక్తి లేకపోతే పెట్టకండి. పక్క వాళ్ళని చూసి మీకు పోటీలు వద్దు. అవన్నీ మూర్ఖపు పనులు. దయచేసి మానండి. 


మోరీల పైన మండపాలు, రోడ్డు మీద మండపాలు, ఒక్క కాలనిలో 100 మండపాలు. విపరీత పోటీ రాజకీయం... అన్నీ వికృత చేష్టలే . 


చాలా జాగ్రత్తగా గమనించండి....ఒక మండపం నుండి ఒక్కో మండపం పెరిగితే మనలో ఐక్యమత్యం తగ్గుతున్నట్లు , 100 మండపాల నుండి ఒక్కొక్క మండపం తగ్గుతూ ఒక కాలనిలో ఒకే మండపం అయితే ఐక్యమత్యo పెరిగినట్లు .


కనీసం ఇప్పటి నుంచైనా, గణేశోత్సవం, నవరాత్రులు మొదలైన పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం. మన సంస్కృతిని కాపాడుకుందాం. ఇతరులకు మార్గదర్శకంగా ఉందాం.


 DJ లకు బదులుగా హిందూ భక్తి పాటలు, సంగీతం ఆధారంగా శ్లోకాలు పెట్టి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుదాం. 


దీన్ని సరిదిద్దడం ఒక్కరితోనే మొదలవ్వాలి. ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు. ధర్మాన్ని కాపాడి దేశ భవిష్యత్తుకు పునాది వేయండి. సంస్కతిని కాపాడే బాధ్యత మననుండే మొదలవ్వాలి.


                               ఇట్లు

               మద్దికుంట శ్రీకాంత్ శర్మ, భాగ్యనగరం. 

                హిందూ ధర్మచక్రం సేవా సమితి 

                             9849485645

https://whatsapp.com/channel/0029VaADSeK9mrGUJvH8io1o

https://www.youtube.com/hindudharmachakram

https://www.facebook.com/hindudharmachakramHDC/

https://twitter.com/HDC108

Whatsapp - 9849485645

సూక్ష్మం లో మోక్షం.*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

        *సూక్ష్మం లో మోక్షం.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఎవరన్నా అన్నం పెట్టమని అడిగినారంటే.. మీకు  పుణ్య కాలం ప్రవేశిస్తున్నది అని అర్ధం.*


*భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి.*


*ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీవిద్యోపాసకుడు, సన్యాసి, వారి కంటే గోమాత , ఇలా ఒక దాని కంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము.*


*నీవు అన్నం పెట్టడం కన్నా.. వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని..చేయి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు.*


*ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది.. నీవు పిలవ కుండానే।వెంటనే దానికి గ్రాసం గాని, అన్నం కాని పెట్ట వలయును.*


*పిలవక పోయినా కాకతాళీయంగా ఒక సన్న్యాసి, ఒక శ్రీవిద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి,  నీ ఇంటికి వచ్చాడు. కొన్ని కోట్ల జన్మల పాపం తరిగి పోతుంది, నీవు గాని అతనికి ఆతిధ్యం ఇస్తే. కనీసంలో కనీసం కాస్త మంచి తీర్ధం.*


*ఏమో ఏ శంకరాచార్యులు మారురూపంలో వస్తాడో. యోగులు, జ్ఞానులు, బాబాలు  అన్నం తిని, ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారు. డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు. మన పాప కర్మ తొలగిపోతుంది.*


*మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు భగవంతుడు నీ కర్మ తొలగించడానికి.  నీ పాప కర్మ తొలగించడానికి.. వారు నీ ఇంటికి వెతుక్కొంటూ వస్తారు. నీవు పెట్టె పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తీస్తారు.*


*నీవు పెట్టె పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయములోనే అంతే. ఒకసారి కాదనుకొన్నావా మరలా తిరిగి రాదు.*


*ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, నీ పాపాలు అన్నీ తీసుకొని వెళుతుంది నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో.*


*జాగ్రత్త. అమ్మా అన్నం పెట్టు తల్లీ అని అడిగినవానికి  లేదనకుండా వున్నది పెట్టండి, మీ తరతరాలను ఆశ్వీరదించి వెళతాడు. తిండి దొరకక రారు ఎవ్వరూ నీ ఇంటికి.*


*కావున తల్లులారా, “అమ్మా అన్నం పెట్టు”... అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి*


*ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది.*


*ఓం నమో నారాయణాయ।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

రోజు (04-09-2024) రాశి ఫలితాలు

 ఈ రోజు (04-09-2024) రాశి ఫలితాలు


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును


మేషం

  04-09-2024 

వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు, సాఫీగా సాగుతాయి.  


వృషభం

  04-09-2024 

 ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది. 


మిధునం

  04-09-2024 

ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయప్రయాసలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.


కర్కాటకం

  04-09-2024 

ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి . 


సింహం

  04-09-2024 

బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులు శ్రమ ఫలించదు.


కన్య

  04-09-2024 

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.


తుల

  04-09-2024 

అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార,ఉద్యోగములు నిరుత్సాహ పరుస్తాయి.


వృశ్చికం

  04-09-2024 

కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.


ధనస్సు

  04-09-2024 

ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధన సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.


మకరం

  04-09-2024 

కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు శిరో బాధను కలిగిస్తాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారానికి అధికారులు సహాయ సహకారాలు అందుతాయి.


కుంభం

  04-09-2024 

చేపట్టిన పనులు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఒప్పందాలలో వాయిదా పడతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు.


మీనం

  04-09-2024 

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

*శ్రీ మూకాంబికా క్షేత్రం*

 🕉 *మన గుడి : నెం 429*






⚜ *కర్నాటక  : కొల్లూరు _ ఉడిపి* 


⚜ *శ్రీ మూకాంబికా క్షేత్రం*



💠 శ్రీ మూకాంబిక ఆలయం భారతదేశంలోని ఆది శక్తిని ఆరాధించే అత్యంత పురాణ ఆలయాలలో ఒకటి మరియు  మహాలక్ష్మి, పార్వతి మరియు సరస్వతి యొక్క స్వరూపంగా నమ్ముతారు. 


💠 ఈ ఆలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కొల్లూరు ప్రాంతంలో ఉంది.  ఇది సౌపర్ణికా నది ఒడ్డున ఉంది.


💠 పరశురాముని సృష్టిలో 7 ముక్తి క్షేత్రాలలో కొల్లూరు ఒకటి. 

మిగిలినవి ఉడిపి, సుబ్రహ్మణ్య, కోడేశ్వర, శంకర నారాయణ, గోకర్ణ క్షేత్రాలు


💠 కేరళ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభువు లింగంతో కలిసి ముగ్గురమ్మల స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తుంది. 

ఇక్కడ అలంకరణలూ పూజలూ అమ్మవారికి జరిపితే అభిషేకాలను మాత్రం లింగానికి చేస్తారు. 


🔆 *స్థలపురాణం* 🔆


💠 శివుని వరం పొందిన కామాసురుడు 

కూడచాద్రి పర్వతం మీద చేరి, దేవతలను మునులను హింసించేవాడు. 

శుక్రాచార్యుడు వాడి చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుంది అని చెప్పాడు. వెంటనే వాడు శివుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.


💠 కామాసురుడికి శివుడు వరం ఇస్తే లోకకంటకుడు అవుతాడని భావించి వాగ్దేవి సరస్వతీ దేవి వాడి నాలుక పై చేరి మాట రాకుండా మూగ వాడిని చేసిందింది.


💠 మూగవాడై పోయినందువల్ల ఆ కామాసురుడు శివుడిని నోటిమాటతో ఏ వరమూ కోరుకోలేక పోయాడు అప్పటి నుంచి వాడిని మూకాసురుడు అన్నారు. 

అప్పుడు కోల ఋషి ఉపాయం మేరకు పార్వతీ దేవి సకలదేవతల శక్తులన్నిటిని కలిపి ఒక తీవ్రశక్తిని సృష్టించింది.


💠 ఈమె మూకాసురునితో యుద్ధం చేసి సంహరించింది. వాడి ప్రార్ధన మన్నించి వాడికి కైవల్యం ప్రసాదించింది.

మూకాసురుడిని దేవి సంహరించిన ప్రదేశాన్ని మారణ కట్టే అంటారు(మరణ గద్దె ). మూకాసురుడు అమ్మవారిని మూకాంబికగా తనపేర విలసిల్లమని కోరుకొన్నాడు.


💠 మూకాసురుడి.. సంహారం తరువాత పార్వతీదేవి అక్కడ మూకాంబికగా వెలసిందనీ, కోల మహర్షి కోరిక మేరకు త్రిమూర్తులు ఈ ప్రాంతంలో తిరుగుతుంటారని ప్రతీతి. పార్వతిదేని కొలువైన ఈ క్షేత్రంలో శివుడు తన కాలి బొటనవేలితో శ్రీచక్రాన్ని గీశారని చెబుతారు


💠 ఈ ఆలయంలో మూకాంబికా దేవి పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శన మిస్తుంది. శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది.


💠 కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మావారు ప్రత్యక్షం అయ్యారట.

ఆదిశంకర్యాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట. 

దేవి శంకరాచార్యుల కోరిక మన్నించి ఆదిశంకరాచాయుల వెంట వస్తానని కానీ వెనక్కి తిరిగి చూడకూడదని,

అలా వెనక్కి తిరిగి చూస్తె చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పారట.


💠 ఆ షరతుకు అంగీకరించిన ఆదిశంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మవారు ఆయన్ని అనుసరించారట.

అలా వెళ్తూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో ఆదిశంకరాచార్యులు వెనక్కు తిరిగి చూశారట.


💠 అలా మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్టించమని చెప్పడంతో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారని ప్రతీతి.

మూకాంబిక ఆలయంలోని పవిత్ర విగ్రహం పంచలోహాలతో అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు సీసం అనే ఐదు లోహాల కలయికతో రూపొందించబడింది.


💠 శ్రీ ఆదిశంకరాచార్యులు లింగం పైన మూకాంబిక విగ్రహాన్ని ప్రతిష్టించి, వారిద్దరినీ పూజించారు.  

చివరికి, ఈ విగ్రహం మరియు జ్యోతిర్లింగం చుట్టూ ప్రస్తుత ఆలయం నిర్మించబడింది.  

శ్రీ శంకరాచార్యులు మూకాంబిక ఆలయంలో "సౌందర్య లహరి" కీర్తనలను రచించారని చెబుతారు.


🔆 *ఆలయ వైశిష్ట్యం* 🔆


💠 శ్రీ కృష్ణుడు రుక్మిణి, సత్యభామ సమేతంగా కొల్లూరు మూకాంబిక ఆలయంలో సాంబవ్రతం ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.  ఇంద్రుడు, సురతుడు, కశ్యపుడు, భార్గవరాముడు, శుక్రాచార్యుడు, ఋషి బ్రహస్పతి ప్రద్యుమ్నుడు, లోకాదిత్య బ్రాహ్మణుడు, సమాధి వైశ్యుడు వంటి ప్రముఖ పురాణ పాత్రలు మూకాంబిక ఆలయంలో తపస్సు చేసి దైవత్వాన్ని పొందారు.


💠 ఈ ఆలయంలో జరుపుకునే అనేక ముఖ్యమైన ఆచారాలలో, నవరాత్రి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది మరియు  బ్రహ్మోత్సవాలు.

 రెండూ గొప్ప వైభవంగా జరుపుకుంటారు.  

🪷నవరాత్రులతోపాటూ, ఏడాదికోసారి అమ్మవారికి చైత్రమాసంలో రధోత్సవాన్ని నిర్వహిస్తారు. 

సౌపర్ణికా నదిలో 84 ఔషధ గుణాలున్నాయనీ, నీటిని తాగితే అనారోగ్యాలు దూరమవుతాయనీ ఇక్కడకు వచ్చే భక్తుల నమ్మకం


💠 ప్రతి రోజు ఉదయం 5.00 గంటలకు "నిర్మల్య పూజ" జరుగుతుంది మరియు ఆ సమయంలో భక్తులకు స్వయంభూ లింగాన్ని దర్శించే అవకాశం ఉంటుంది.  

ఆలయంలో ప్రతిరోజూ త్రికాల పూజలు నిర్వహిస్తారు.  


💠 ప్రతి మంగళ, శుక్రవారాలు మరియు శ్రావణ మాసంలో లేదా ఫాల్గుణ మాసాల్లోని మూలా నక్షత్రం రోజున (ఇది శ్రీ దేవి జన్మదినం) వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు శ్రీ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. 


💠మంగళూరుకి  140 కి.మీ ,ఉడిపి 80 కి.మీ దూరం.

3, సెప్టెంబర్ 2024, మంగళవారం

శ్రీ ఆది శంకారాచార్య

 *శ్రీ ఆది శంకారాచార్య చరిత్రము.* 

*1 వ భాగము*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


*రచన : శ్రీ యర్రా ప్రగడ వెంకట సూర్యనారాయణ మూర్తిగారు* 


*సదాశివ సమారంభాం*

*శంకరాచార్య మధ్యమామ్*

*అస్మదాచార్య పర్యంతామ్

*వందే గురు పరంపరామ్.*


కాలడి కేరళ ప్రాంతము


అది ఒకమనోహర దృశ్యం. చూడముచ్చట గొలిపే కొబ్బరి తోపులు ఒక వంక, విమలజల ధారలతో జల జలపారే జల పాతాలొక వంక, కన్నుల పండువై విందు గొల్పగా, విప్ర వర్యుల వేదఘోషలతో ఆ గిరిసానువులు మార్మ్రోగు తాయి. హాయినిచ్చే పైరు గాలి విహరించే ఆ వనం నందనోద్యానవనాన్నిమరపిస్తుంది. సముద్ర తరంగాల తాకిడికి రక్షణయో అన్నట్లు పడమటి కొండల అండ. పరమ పావనమని పేరు గన్న వృషాచలమచ్చటే ఉంది. పూర్ణానది కూడా అక్కడే ప్రవహిస్తుంది. దేశాన్ని పాలించే రాజుపేరు రాజశేఖరుడు. ధార్మికుడైన ఆ రాజు పాలనలో ప్రజలు అన్నివిధాలా సుఖసంతోష ములతో ఉండేవారు.


ఒకనాడు రాజుగారి కలలో పరమేశ్వరుడు కనిపించి తాను వెలసిన జ్యోతిర్లింగ స్థలంచూపించి అక్కడ ఆలయం కట్టించమని ఆదేశించాడు. రాజు పరమానంద భరితుడై గొప్ప శివాలయాన్ని అచట నిర్మించి నిత్యదీప ధూప నైవేద్యాది కైంకర్యాలుచిరస్థాయిగా ఉండే ఏర్పాట్లు చేసి ఆ గుడిని సుప్రభమనే పేరుతో సేవించు చుండేవాడు. జగదీశ్వరుని అనుగ్రహ ప్రభావంతో ఎటు చూచినా నూరు మైళ్ళ పర్యంతం ఆ ప్రాంతం సర్వసంపదలతో తులతూగుతుండేది. 


దగ్గరలోనే ఉన్నది కాలడి అనే అగ్రహారం. యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, పరిగ్రహం అనే ఆరు వైదిక కర్మలకూ ఆలవాలం ఆ పేటలోని భూసురగృహాలు. బ్రహ్మణ్యులైన బ్రాహ్మణులందరూ వేదవాక్కులతో ముప్పిరిగొన్న భక్తితో విశ్వేశ్వరుణ్ణి భజించే నంబూద్రి శాఖవారు.ఆంధ్ర ప్రాంతమైన గోదావరీ మండలము లోని పిఠాపుర సమీపంలో హంసవరము నందుండి వెడలిన వంశం అట్లు విలసిల్లినదని పెద్దలు పలుకుదురు.


*శివగురుని జననము:*

కాలడి అగ్రహారంలో ఎన్నదగిన మేటి విద్యాధి రాజు అనే పేరుగల బ్రాహ్మణుడు. ఆకుటుంబం వారు శివ భక్తులు. ఎంత సంపదలున్నా వారికి సంతానము లేక ఎన్నో వ్రతములు తపములు చేశారు. తుదకు వారి పూజలు ఫలించి చక్కటి పుత్రుడు కలుగగా శివగురుడని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకొంటు న్నారు. దినదిన ప్రవర్ధ మానుడగు చున్న ఆ బాలునికి ఉపనయనము చేయు వయస్సు వచ్చింది. యోగ్య మగు ముహూర్తం నిర్ణయించి యధావిధిగా ద్విజకర్మ చేశారు. పిమ్మట విద్యా భ్యాసం కోసం సద్గురువుల కప్పగించారు.


*శివగురుని విద్యాభ్యాసము:*


పూర్వం గురువుల కడ విద్య నేర్వాలన్న, ఎన్నో నియమాలను పాటించాలి. బ్రహ్మచర్య వ్రతం ఆచరించాలి. త్రికాలముల యందు సంధ్యావందనం, అగ్ని హోత్రం చేయాలి. కౌపీన ధారి కావాలి. గురువును పరమదైవంగా భావించాలి. మధుకరవృత్తి నవలంబించి తాను తెచ్చినది గురువుకు సమర్పించి గురువు తినగా మిగిలినది తినాలి. చాప మీదనే పరుండాలి. పుష్పం ముట్ట రాదు. అద్దం చూడ రాదు. తాంబూలం సేవించ కూడదు. ఇలాంటి కఠోర నియమాలు పాటిస్తూ శివగురుడు కుశాగ్రబుద్ధి కాబట్టి స్వల్పకాలంలోనే వేద వేదాంగాలు కంఠగతం చేసి కొన్నాడు. ఒకనాడు ప్రశాంత సమయం చూచి గురువు శివగురువును ఆప్యాయంగా పిలిచాడు. శివగురువుతో 'బిడ్డా! నీ చదువు పూర్తి అయ్యింది. ఇంటికి పోయి గృహస్థ ఆశ్రమం చేపట్టు' అన్నాడు. ఆ పలుకులు శివగురువు నకు ములుకులుగా తోచినవి. ఆందోళన, భయము, దుఃఖము పుట్టుకొచ్చినవి.అయినా ధైర్యం తెచ్చుకొని గురువు గారితో ఇట్లా విన్నవించు కొన్నాడు:


'గురుదేవా! రోతను పుట్టించే సంసారకూపము లోనికి పొమ్మంటున్నారు. సంసారం ముముక్షువులకు అడ్డం కదా! తీవ్రవిరాగి అయినవానికి గృహస్థ ఆశ్రమం ఎందుకు? నేరుగా సన్న్యాసాశ్రమం లోనికి పోవచ్చు గదా! ఎందరెందరో అలా వెళ్ళిన వారున్నారు కదా! ఈ దీనుని కరుణించి గురుసేవాభాగ్యం కలుగ జేయండి. నన్ను ఇంటికి పంపకండి' అని వేడుకొన్నాడు. కాని గురువు కరుణించ లేదు.మౌనమే వహించాడు. లేక లేక కలిగిన కుమారుడు. తల్లిదండ్రులకు బిడ్డను చూడాలని ఉంటుంది కదా! మంచిరోజు చూచుకొని తండ్రి విద్యాధి రాజు గురువుల ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు. అడుగకనే గురువుగారు శివగురుని విద్యాభ్యాసం పూర్తయిందని, కొడుకును తీసికొని వెళ్ళి వివాహము చేయమని సెలవిచ్చారు. అందుకు విద్యాధిరాజు చాలా సంతోషించి, గురుకట్నం సమర్పించి శివగురువును తోడ్కొని ఇంటికి బయలు దేరాడు. చేసేది లేక విధి బలీయ మని నిశ్చయించు కొన్నాడు శివగురువు. 


ఇంటికి చేరడానికి కొన్ని రోజులు పట్టింది. చూడవచ్చిన బంధుజను లతో ఇల్లు పండగలా అందరూ ఆనందంలో గడిపారు. తండ్రికి అందరి ఎదుటా కొడుకు నేర్చిన విద్యలను ప్రశ్నించాలని కోరిక పుట్టింది. అన్ని శాస్త్రాల మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. శివగురువు తడబడకుండా చెప్పిన జవాబులకు అంతా సంతోషించి పిల్లవాని మేధను కొనియాడారు.


*శివగురువు వివాహము:*


ఎనలేని ధనధాన్య కనకవస్తు వాహన సంపత్తి, నలుదెసల వ్యాపించిన విద్యావికాస వైభవము. వరుడు విశిష్టుడైన యోగ్యుడు. కన్యాదాతలు తహతహలాడుతూ స్వయంగానో మధ్యవర్తుల ద్వారానో వర్త మానాలు పంపుతున్నారు.


కట్నాలు ఒకరినిమించి ఒకరు వెయ్యి, రెండు వేలు, మూడు వేలు అంటూ విద్యాధిరాజుకు ఇవ్వ జూపుతున్నారు వరుని తండ్రికి కట్నాలతో నిమిత్తం లేదని తెలియక. ఆయన చూచేవి ఆచార సంపత్తి, గౌరవమర్యాదలు, సద్గుణ గణాలు. నూరేళ్ళ పంటకు కావలసినది అనుకూలదాంపత్యం. చివరికి ‘నా కుమార్తె ఆర్యాంబను మీ కుమారుడైన శివగురునకు ఇచ్చి వివాహం చేయాలని ఉంది. దయయుంచి నా కోరికను మన్నించండి' అని అడిగిన మఖపండితునితో వియ్యమంద నిశ్చయించిన విద్యాధిరాజు ఒక షరతు పెట్టాడు. అది వివాహం తన ఇంటనే జరగాలని. మఖ పండితుడు ఒప్పుకోక తప్ప లేదు.


దైవజ్ఞులు శుభకరమైనముహూర్తం నిర్ణయించారు. తగినంత వ్యవధి ఉండడంతో ఇరు వైపులా సందడికి లోటు లేదు.బంధువులకు, స్నేహితులకూ శుభలేఖలు వ్రాయించి పంపుకొన్నారు. రకరకాల మంగళవాద్యకారులను కుదుర్చుకొన్నారు. ఆకాశాన్నంటే పందిళ్ళు వేశారు. వాటికి పచ్చని మామిడి తోరణాలు, స్తంభాలకు రంభాఫల వృక్షాలుకట్టారు. పలురకాల అలంకారాలతో కల్యాణ మంటపం చూడ ముచ్చటగా తయారైనది. వివాహం చాలా వైభవంగా జరిగింది. శివగురుడు గృహస్థుడయ్యాడు. ఆర్యాంబ అతనికి సహధర్మచారిణి అయినది. పతివ్రతలకు మించిన వ్రత మాచరిస్తూ ఆర్యాంబ పతికి తలలో నాలుకగా మసలుతూ అత్తమామ లకు బాసటగా ఉండి పేరు తెచ్చుకొంటోంది.


కొంతకాలానికి విద్యాధి రాజ దంపతులు పెద్దవారై పుణ్య లోకాలకు ప్రయాణమై ఇల్లు, వాకిలి, ధాన్యాది సంపత్తి యావత్తు కొడుకు చేతిలోను, కోడలి చేతిలోనుపెట్టి వెళ్ళిపో యారు. స్వధర్మానుష్ఠానం చేస్తూ అతిథి అభ్యాగతు లను గౌరవిస్తూ బీదసాద లను కనిపెడుతూ పండితులతో పండిత గోష్ఠులతో జ్ఞానామృతాన్ని ఆస్వాదిస్తూ శివగురు దంపతులు చీకూ చింతా లేని గార్హస్థజీవనాన్నిసాగిస్తున్నారు. ఆర్యాంబకు చిన్న పిల్లలంటే ముద్దు. ఇరుగు పొరుగు వారి చిన్ని పిల్లలను మచ్చిక చేసికొని సరదా తీర్చుకొనేది. తలలు దువ్వి బొట్టు పెట్టి, ఆడపిల్ల అయితే కాటుకలు అద్ది జడలు వేసేది.


వాళ్ళకోసం చేసిన తినుబండారాలను అందించేది. దానితో సంతోషంగా పిలవ కుండానే వచ్చే వారు పిల్లలు. మరీ చిన్నపిల్ల లైతే ఉయ్యాలలో పరుండబెట్టి జోలపాటలతో జోకొట్టేది. ఒకప్పుడు పసిపాప ఏం చేసినా ఏడ్పు మానకుండా ఉంటే ఆ పాప తల్లి పరుగు పరుగున వచ్చి ఆదుకొనేది. అట్టి భాగ్యం తనకు లేకపోయిందే అని మనస్సు చివుక్కుమనేది. తన దగ్గఱకు వచ్చిన పాపలకే కాక ఊళ్ళోని పిల్లలందరికీ మహా ఔదార్యంతో ఆవుపాలు అందేలా ఏర్పాటు చేసింది ఆర్యాంబ. పండుగలకు ఆ పిల్లలందరికీ కావలసిన చొక్కాలూ, లాగులూ, ఆడపిల్లకు పరికిణీలు, జాకెట్లు తయారు చేయించి స్వయానా తానే వారికి తొడిగి మురిసి పోయేది. ఇంత చేసినా పిల్లలు ఏదో సమయంలో తమ తమ ఇళ్ళకు తుఱ్ఱుమని పారి పోయేవారు.అంతే కదా! ఎంతయినా ఎవరి పిల్లలు ఎవరికి అవుతారు? ఈ సత్యం ఆర్యాంబకు క్రమేణా తెలిసివస్తూ మనసులో దిగులు ఆరంభమయ్యింది.


*శ్రీ ఆది శంకరాచార్యచరిత్ర 1 వ భాగము సమాప్తము*

 🌺🍀🌺🍀🌺🍀

గణపతుల పంపిణీ*

 *మట్టి గణపతుల పంపిణీ*


శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ (TUWJH143) అధ్యక్షులు సుధీర్ మంకాల గారి సౌజన్యంతో శ్రీ విజయదుర్గ దేవాలయం, మార్కెట్ రోడ్ లో మట్టి గణపతుల ను ఉచితంగా పంపిణీ చేయబడును.


కావున కావలసిన వారు ఉదయం పదకొండు గంటలకు గుడి వద్దకు వచ్చి మట్టి గణపతిని పొందగోరుచున్నాము..


ఇట్లు

*శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం*

బుధవారం* 🌷 *సెప్టెంబర్, 04, 2024*🌷

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

🪷 *బుధవారం*

🌷 *సెప్టెంబర్, 04, 2024*🌷

     *దృగ్గణిత పంచాంగం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - శుక్లపక్షం*


*తిథి: పాడ్యమి* ఉ 09.46 వరకు ఉపరి *విదియ*

*వారం: బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం : ఉత్తర* పూర్తిగా రోజంతా రాత్రితో సహా


*యోగం  : సాధ్య* రా 08.03 వరకు ఉపరి *శుభ*

*కరణం : బవ ఉ 09.46 బాలువ* రా 11.02 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  :*రా 10.07 - 11.55*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*


*వర్జ్యం : ఉ 11.17 - 01.06*

*దుర్ముహూర్తం : ప 11.41 - 12.31*

*రాహు కాలం : మ 12.06 - 01.39*

గుళికకాళం : *ఉ 10.33 - 12.06*

యమగండం : *ఉ 07.27 - 09.00*

సూర్యరాశి : *సింహం* 

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 05.54*

సూర్యాస్తమయం :*సా 06.18*

*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.54 - 08.23*

సంగవ కాలం    :*08.23 - 10.52*

మధ్యాహ్న కాలం :*10.52 - 01.21*

అపరాహ్న కాలం:*మ 01.21 - 03.49*

*ఆబ్ధికం తిధి  : భాద్రపద శుద్ధ విదియ*

సాయంకాలం :  *సా 03.49 - 06.18*

ప్రదోష కాలం   :  *సా 06.18 - 08.37*

రాత్రి కాలం : *రా 08.37 - 11.43*

నిశీధి కాలం       :*రా 11.43 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.08*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*#శ్రీసరస్వతీద్వాదశనామస్తోత్రం*


శ్రీ సరస్వతి త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ |

హంసవాహ సమాయుక్తా విద్యాదానకరి మమ ||


ప్రధమం భారతీనామ 

ద్వితీయం చ సరస్వతీ |

తృతీయం శారదాదేవి 

చతుర్ధం హంసవాహనా ||

పంచమం జగతీ ఖ్యాతం 

షష్టం వాగీశ్వరీ తధా |కౌమారీ 

సప్తమం ప్రోక్త 

మష్టమం బ్రహ్మచారిణి ||

నవమం బుద్ధిధాత్రీ చ 

దశమం వరదాయినీ |

ఏకాదశం క్షుద్రఘంటా 

ద్వాదశం భువనేశ్వరీ ||


బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠే నరః

సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ

సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ!!

           

🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷    


🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!* 

<><><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌷🌷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

🌹🌷🪷🌷🌷🪷🌷🌹

మహా_దర్శనము_నాలుగవ_తరంగము_4

 #మహా_దర్శనము_నాలుగవ_తరంగము_4

నక్క తోక తొక్కినవాడు

శ్రావణ శుద్ధ సప్తమి రోజు ఆచార్య దేవరాతుని ఇంట్లో సీమంతోన్నయనము . రాజ పురోహితుడు మొదలుకొని , రాజధానిలోని బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ దయ చేసినారు . ఆశ్రమవాసులలో ముఖ్యులను మాత్రము పిలిచినారు . వారిలో కూడా అతి ముఖ్యులు ఉద్ధాలకుడు , వైశంపాయనుడు . 

సంస్కారము సకాలములో నెరవేరింది . రాజభవనపు వైణికుడు పురోహితుల మంత్రముతో పాటు వీణావాదనము గావించినాడు . సామగానమయినది . ఋక్కులను పఠించి బ్రాహ్మణులు దంపతులను దీవించినారు . బయటినుండీ ఎవరో వచ్చినట్టూ , వారి సన్నిధి తమకెంతో ప్రీతి పాత్రమైనట్టూ అందరికీ అదేదో భావన . ఎవరొచ్చినారు ? ఏమిటీ అని వివరాలడిగితే ఎవరూ చెప్పలేరు . అలాగని , తమకు స్పష్టముగా అనుభవమైన భావనను ఎవరూ కాదనలేరు . 

కర్మాంతములో బ్రహ్మణాశీర్వాదము జరుగుతుండగా బ్రాహ్మణ ముత్తైదువలు స్వరమెత్తి పాటలు పాడినారు . కొత్త చీరకట్టుకొని పెళ్ళికూతురి కళతో మెరుస్తున్న ఆలంబినీ దేవికీ , గర్భ దీక్షతో ప్రకాశిస్తున్న ఆచార్యునికీ హారతి యెత్తి , దిష్టి తీసి మనస్ఫూర్తిగా దీవెనలందించినారు . అంతా సాంగముగా నడిచింది . అతిథులంతా భోజన తాంబూలాది ఉపచారముల నన్నిటినీ స్వీకరించి తమ ఇళ్ళకు మరలినారు . 

దేవరాతునికి యజ్ఞేశ్వరుడు చెప్పినది జ్ఞాపకము ఉంది. సీమంతోన్నయనము కానీ అని వేచియున్నాడు . ఈ దినము వరకూ , ఈ కర్మ ముగియు వరకూ గర్భములో నున్న వాడి పైన తనకు అధికారము లేదు . సీమంతమయినాక గర్భస్థ జీవుడు తన వంశానికి చేరి తన వాడయ్యాడు . ఆ తరువాతనే తాను అడగ దలచుకొన్నదంతా అడిగే అధికారము తనకి వస్తుంది . అంతవరకూ తాను ఆ జీవుడిని మాట్లాడించుటకు కూడా లేదు . 

" ఇప్పుడు ఆ జీవుడు తన కొడుకైనాడు , నేను వాడిని మాట్లాడించేదా , లేక వాడే నన్ను మాట్లాడించవలెనా ? మాలో ఎవరు జ్ఞాన వృద్ధులో వారిని ఇతరులు మాట్లాడించవలెను . ఈ వ్యవస్థ తెలిసేదెలాగు ? పిండము చిన్నదయినంత మాత్రాన , అందులో ఉన్నవాడు చిన్నవాడు అనుట యెలా ? దేహ దృష్టితో అలాగ అనవచ్చునేమో కానీ , దేహములో, దేహముకాని ఇంకొకడు ఉండగా , ఈ చిన్నా పెద్దా తారతమ్యము తెలిసేదెలా ? ఎవరు తెలుపగలరు ? " అని ఆచార్యునికి ఈ దినము కూడా పెద్ద ఆలోచన . 

దానితోపాటూ ఇంకో యోచన . కొడుకు అంటే ’ మాత్రా శిష్యుడు’ . ఉపనయనము అయ్యే వరకు వాడికి తల్లే గురువు . కాబట్టి , తల్లినుండి ఏమేమి నేర్వవలెనో అవన్నీ నేర్వాలంటే ఆమె వాడికి బ్రహ్మవిద్యను కూడా నేర్పవలెను . ఇంతవరకూ తాను భార్యను కర్మ కాండలో తనకు కావలసినట్లు మలచు కొన్నాడే తప్ప బ్రహ్మ విద్యను ఆమెకు చెప్పించ లేదు . బ్రహ్మవిద్య అంటే అదొక కొత్త అనుభవము . దానిని నేర్చితే ఆమె సంసారానికి అయోగ్యురాలవుతుందని తనకు బెదురు . ఇప్పుడిక , ఆ బెదురు వల్ల ముందరి తరము కుంఠితమవుతుందంటే అది న్యాయము కాదు . జరగ వలసిన దంతా జరిగియే తీరవలెను . దీనికి విశ్వమంతా కట్టుబడియే యున్నది . ఈ విశ్వములో ఏదైనా ఒక మూలలో ఏదైనా ఒకటి మంచో , చెడో జరిగితే , అది విశ్వమునంతా వ్యాపించును . ఒక పాత్రలో నీరు తీసుకొని , దానిలో ఒక ముద్ద చెక్కెర గానీ , ఉప్పుగానీ వేస్తే అది కరగి నీరంతా వ్యాపిస్తుంది . అది ఎక్కువగా ఉంటే నీటికి తన రుచిని ఇస్తుంది . అదలా చేయుటకు చాలినంత లేకున్నా , నీటి రుచిని కొంచమైనా మార్చును . అదే విధముగా , వ్యక్తి వ్యక్తి యొక్క కార్య కలాపములన్నీ కూడా విశ్వ వ్యవహారమును రూపించును అను నమ్మకము ఉన్న ఆచార్యుడు , పుత్రుడు గర్భములో ఉండగానే తల్లి వాడికి శిక్షణను ప్రారంభించ వలెను అనుదాన్ని ఎలా మరవగలడు ? దాన్ని ఎలా తిరస్కరించగలడు ? 

అదీకాక , సాక్షాత్తూ యజ్ఞేశ్వరుడే చెప్పినాడు కదా , " దేవ , ఋషి , పితరులు ఆ జీవుడు మరలా భూమిలో పుట్టుటకు నిన్ను ఎంచుకున్నారు " అని ! అలాంటపుడు తాను ఎలా నడచుకొనవలెను ! అది చాలదన్నట్టు , " ఇపుడు గర్భములో పుట్టబోయే కొడుకు మీ వంశమును మాత్రమే కాదు , లోకాన్నే ఉద్ధరించును " అన్నపుడు , తాను ఆ శిశువు శిక్షణను ఎటుల కుంఠితము చేయగలడు ? ఇక తప్పదు , తల్లియే బిడ్డకు శిక్షణ నిచ్చుటకు కావలసిన సామర్థ్యమును తల్లికి కల్పించి ఇవ్వవలెను . లేకున్న , తాను కర్తవ్య లోపము చేసినవాడవుతాడు . అది సర్వథా కూడదు . " 

" ఈ విషయము సరే , మరి నా భయము లేదా , సంశయము తీరుటెలా ? గర్భమున నున్న జీవుడితో మాట్లాడువరకూ సంశయము తీరదు . కాబట్టి , ఇప్పటికి , సంశయమే లేనప్పుడు ఎలా నడచుకొనెదనో , అలా నడచుకొనవలెను . మొత్తానికి , ఎవరో విశ్వోద్ధారము చేయుటకు సామర్థ్యమున్న జీవుడు మా కడుపున పుట్టబోతున్నాడు . వాడు పుట్టి పెరిగిన తరువాత అతడి సామర్థ్యములో ఏ లోపమూ కనబడకుండా చూసుకొను భారము నాది . ఇప్పుడు తానేమి లోపము చేసిననూ అది ముందు ముందు వాడి సామర్థ్యమును కుంఠితము చేయవచ్చు . కాబట్టి , నేను దీనిని నా పత్ని ద్వారా నెరవేర్చవలెను . నెరవేర్చుట మాత్రమే కాదు , ఆ కార్యము మొత్తము సంతృప్తిగా జరుగునట్లు సర్వభారమును వహించవలెను . "

" సరే , అట్లే , ఆ జీవుడు వచ్చినపుడు మాట్లాడుటకు మొదట నేను పిలవరాదు . వాడే వచ్చి మాట్లాడించనీ . ఔను , అదే మంచిది , జ్ఞాన వృద్ధులు ఎవరో తెలియనపుడు ఇంకేమి చేయవలెను ? యజ్ఞేశ్వరుని మాటల వలన , వాడే జ్ఞాన వృద్ధుడు యని అనిపిస్తున్ననూ , అది నేరుగా ధృవము కాలేదు . కాబట్టి , వాడే వచ్చువరకూ వేచియుండవలెను . వాడు వచ్చినపుడు , నీకు తల్లివలన ఏమేమి , ఎటువంటి శిక్షణ కావలెను ? అని వాడినే అడగవచ్చును . విశ్వోద్ధారము చేయుటకు వచ్చువాడికి ఆత్మోద్ధారపు దారి తెలియకుండునా ? ఒకటయితేనే కదా ఇంకోటి అయ్యేది ? " 

ఆ దినమంతా వచ్చినవారితో నవ్వుతూ మాట్లాడుచున్ననూ బ్రాహ్మణ భోజన సమయములోను , భోజనోత్తర తాంబూల సేవన వేళ లోను , అనుక్షణమూ అతడికి అదే యోచన . ఏమైతేనేమి , అందరూ వెళ్ళిపోయినాక , సాయంత్రము వేళకి తప్పో ఒప్పో ,ఒక నిర్ధారణకు వచ్చి , మనసు తేలికైనది . 

ఇంకేమి చీకట్లు ముసుర బోతున్నాయి , దేవరాతుడు స్నానానికి లేవవలెను , అప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆచార్యుని పిలుస్తూ లోపలికి వచ్చినాడు . అప్పటికే తేలిక మనసుతో ఉన్న ఆచార్యుడు తనను పిలిచిన గొంతు ఎవ్వరిదో , వచ్చినదెవరో వెంటనే గుర్తించి , " దయ చేయండి , బుడిలులు మరలా వచ్చి నన్ను పావనము చేసినారు " అని లేచి అభిముఖముగా వచ్చినాడు . వచ్చిన వాడు బుడిలుడు . రాజ పురోహితుడు భార్గవుని దగ్గర బంధువు . అధ్యయన , అధ్యాపనములలో పేరు ప్రతిష్టలు పొందినవాడైననూ , రాజాశ్రయము వద్దని , అంతంత మాత్రముగా ఉన్నా , ఏదో ఉన్నంతలో గుట్టుగా ఉన్నవాడు . అయినా , బ్రాహ్మణ మండలములో సర్వుల గౌరవానికీ పాత్రుడైనవాడతడు . 

బుడిలుడు , " దేవరాతా, నిజం చెప్పు , నువ్వు నక్క తోక తొక్కి వచ్చినవాడివా కాదా ? " అంటూ లోపలికి వచ్చినాడు . 

దేవరాతుడు అతనికి పాదోదకమునిచ్చి , పిలుచుకొని పోయి నడిమింట్లో వేత్రాసనముపై కూర్చోబెట్టి , " మీ మాట నిజమే అయిఉండాలి , కాకుంటే మీరు మరలా వచ్చేవారా ? " అని నవ్వాడు . 

" నేనెందుకు మళ్ళీ వచ్చినానో తెలుసా ? నేను ఈ వేళకే స్నానము చేసి ముక్కు పట్టుకొని కూర్చొని ఉండవలసినది . కానీ , నిన్ను చూచి , నీకొక సంగతి చెప్పి ఇంటికి వెళదామని వచ్చినాను . అప్పుడే చెప్పి ఉండవచ్చు గదా అంటావేమో , అది అలాగ పదిమందిలో చెప్పే మాట కాదు . అదొక రహస్యము కూడా, అందుకే చెప్పలేదు . ఈ దినము నువ్వు దర్భాసనము మీద కూర్చొనియున్నపుడు నేను నిన్ను చూస్తూ ఉన్నవాడిని , అటులే ఊరికే చూస్తూ ఉండాలా లేదా ? ఊహూ , ఊరికే ఉండకుండా కర్మ జరుగుతున్నపుడు సంయమము చేసినాను . లేదంటే , ఏదో ఒక ప్రబలమైన శక్తి నాతో సంయమము చేయించినది అంటావా , సరే అటులే అనుకుందాం . ఎవరో ఒక మహా తపస్వి ఇక్కడికి వచ్చినాడు . నీ తండ్రి , తాతలు అందరూ అతని వెనకాలే చేతులు కట్టుకొని , శిష్యులు గురువుగారి వెనకాల ఎలాగ వస్తారో , అలాగ వస్తున్నారు . ఇదేమిటా అని నేను ఆశ్చర్య పడుతున్నాను . అప్పుడే ఆ వచ్చినవాడి తేజస్సు చూసి , ఇంతటి తేజస్విని నేను ఇంతవరకూ చూసి యుండలేదే అనుకొంటూ లేచి నిలుచున్నాను . మీ తండ్రి గారిని చూసి , " వీరెవరు ? " అంటున్నాను . ’ దేవతలూ , ఋషులూ ఇతడిని లోకోద్ధారమునకై పంపించినారు . మా అదృష్టము . మా ఇంటిలో పుడతాడు . మా దేవరాతుని అదృష్టమే అదృష్టము " అని మాయమైనారు . నేనూ సరేనని తలాడించినాను . అప్పటినుండీ నీకు ఈ సంగతి చెప్పాలని కాచుకొనియున్నాను . సమయము దొరకక , వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాను . నీకు చెప్పిన తరువాతే స్నానానికి వెళదామని వచ్చినాను . ముఖ్యముగా నీ కొడుకు తండ్రికే కాదు , తాత ముత్తాతలకూ కీర్తి తెచ్చువాడు అవుతాడు . అతిపిత , అతి పితామహుడు ( తండ్రినే కాదు , తాత ముత్తాతలనూ మించువాడు ) అవుతాడు . అందులో సందేహము లేదు . ఇప్పుడు చెప్పు , నువ్వు నక్క తోక తొక్కినావా లేదా ? తండ్రిని మించిన తనయుడవబోయే వాడిని ఎత్తుకొనే నువ్వు భాగ్యవంతుడివా కాదా ? " 

" బుడిలుల వంటి మహనీయుల ఆశీర్వాదము వలన అలాగయిన , అది ఆశీర్వాదపు మహత్యము కాదా ? " 

" నీ మహత్యాన్ని నాతో పంచుకోవాలనున్నావా , బాగుంది , సరే , నేనిక వెళ్ళి రానా ? " 

దేవరాతుడు బుడిలునికి నమస్కారము చేసి , తన భార్యను పిలచి , ఆమె చేత కూడా నమస్కారము చేయించినాడు . అతని ఆశీర్వాదమును ఇద్దరూ పొందినారు . బుడిలుడు బయలుదేరాడు .

దేవరాతుడు " మాట " అన్నాడు . 

బయలుదేరిన బుడిలుడు నిలచి , " త్వరగా ముగించు , ఇంకా నేను వెళ్ళి , స్నానము , సంధ్యావందనము , అగ్ని హోత్రమూ చేయవలెను " అన్నాడు . 

" అటులే , బ్రాహ్మణ సమాజములో జ్ఞానము చేతనే కదా వృద్ధత్వము ? " 

" దానిలో సందేహమా ? బ్రాహ్మణులలో జ్ఞాన వృద్ధులకు అగ్ర తాంబూలము . క్షత్రియులలో పరాక్రమము . వైశ్యులలో ఐశ్వర్యము . ఇతరులలో వయో వృద్ధత్వము " 

" సరే , ఒకవేళ మీరు చెప్పినట్లే తండ్రిని మించువాడొకడు , తండ్రి ఎదురుగా వచ్చినాడనుకుందాం . అప్పుడు తండ్రి అతనికి నమస్కారమెలా చేస్తాడు ? తండ్రి యైనందువలన పెద్దవాడిని కదా , మరి సత్కారము చేయుటెలా ? " 

" అటువంటి సమయము వస్తే కొడుకు దేహముతో నమస్కారము చేయవలెను , తండ్రి మనస్సుతో నమస్కారము చేయవలెను . "

" ఓహో , సరే , నాకిది అర్థమే అయి ఉండలేదు " 

" ఇకమీదట అంతా అర్థమవుతుంది . మీ ఇంటిలో నైతే ఇలాగే జరగబోతున్నది . నేనిక వస్తా ... పొద్దు వాలేపోయింది ..." అని బుడిలుడు త్వరత్వరగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు . దేవరాతుడు అతడిని వీడ్కొలిపి తాను కూడా స్నానానికి వెళ్ళినాడు .

త్రేతాగ్నులు

 3. " మహా దర్శనము "--- మూడవ భాగము-- త్రేతాగ్నులు


3. త్రేతాగ్నులు


          దేవరాతునికి భార్యతో మాట్లాడుటకు ఆ పగలంతా అవకాశమే కలుగలేదు . భార్గవుడు వెళ్ళిన తరువాత , స్నానము , సంధ్య , అగ్నిహోత్రములు , రాత్రి భోజనము ... ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ , ఇంక దేనికీ సమయమే దొరక్కుండా అయింది . 


          ఆలంబినీ దేవి కూడా , పెనిమిటి స్నానాదులకు సర్వమూ సిద్ధము చేస్తూ ఆతడు తనకేదో చెబుతాడు అన్నది పూర్తిగా మరచేపోయింది . స్నానానికి నీరు అందించినపుడు గుర్తొచ్చింది . కానీ రుద్రము చెప్పుకుంటూ స్నానము చేస్తున్న భర్తను అడుగుటెలాగా అని ఊరికే ఉండిపోయింది . మరలా అగ్నిహోత్రమయిన తర్వాత , భోజనానికి ముందు భర్తకు గుర్తు చేసింది . అతడు , " మధ్యాహ్నము సమయమే దొరకలేదు , ఈ రాత్రి నిద్ర పోవుటకు వేగిరము వచ్చేయి , అంతా చెబుతాను " అని తన భోజనమును ముగించుకొని వెళ్ళినాడు . ఆమె మడితోనే అగ్నులకు మూఢములనిచ్చి ( పేడతో చేసిన ఎండిన ఉండలు ) వారి పరిచర్యలను ముగించుకొని తన భోజనము అయిందనిపించుకొని , పాలు తోడు పెట్టి , తాంబూలము తీసుకొని వడి వడిగా శయ్యా గృహమును చేరినది . శయ్యాగృహానికి ఆనుకొనే నడిమిల్లు , అక్కడే దేవరాతుడు తనను చూచుటకు వచ్చే గృహస్థులను ఆహ్వానించి కూర్చోబెట్టేది , ఉదయం పూట తన దగ్గరున్న పదహారు మంది శిష్యులకు పాఠ ప్రవచనములను చెప్పేది . ఇలాగ , పొద్దునా సాయంత్రమూ తనవంతు పని తాను చేసిన తర్వాత నడిమిల్లు , పెద్ద మనుషుల ఇంటి ఇంతుల వలె నిర్లిప్తమౌతుండినది . ఒక్కొక్క రోజు దేవరాతుడు రాత్రి భోజనమైన పిదప అక్కడున్న వేత్రాసనములలో సుఖంగా కూర్చొని తన పాటికి తాను ఆలోచనలలో మునిగిపోయేవాడు . 


         శయ్యాగృహానికి మరలిన పడతి , మూలలో ఒక ఆసనములో కూర్చొని , పైకి వస్తున్న చంద్రుణ్ణి తదేకంగా చూస్తున్న కాంతుని చూడలేదు . అతడు కూడా అన్యమనస్కుడై యుండి భార్య అటుగా వెళ్ళడము గమనించలేదు . అదీకాక , నడిమింట్లో ఉన్న చిరు దీపము అక్కడున్న దాని నంతటినీ తెచ్చి కన్నులకు పట్టించ గలంత ప్రకాశముగా కూడా లేదు . 


         ఆమె , భర్త శయ్యాగృహములో ఉన్నాడనుకొన్నది , అతని శయ్య శూన్యముగా ఉండుటను చూసి వెనక్కు తిరిగి చూసింది . అప్పుడు , మూలకూర్చున్న భర్తను చూసి , తాను వచ్చినది సూచించుటకు చిన్నగా దగ్గింది . ఆ దగ్గు , భర్త గమనాన్ని ఆమె వైపుకు మరల్చింది . అతడు తిరిగి చూసి , " నువ్వు ఇంత త్వరగా వస్తావనుకోలేదు, అందుకే ఈ ఉదయిస్తున్న చంద్రుడి సొగసు చూస్తూ కూచున్నాను . ఇప్పుడు చూడు , ఈ చంద్రుడు ఎర్రగా పగడపు రాశి వలె ఉన్నాడు . వీడే ఇంక కొంత సేపైతే ఇంకా పైకి వచ్చి వెండి వర్ణానికి వస్తాడు . అదెందుకో మనసులోకి వచ్చింది . నీ గర్భములోనున్న శిశువు కూడా ఇలాంటివాడే . పుట్టినపుడు దుర్బలమైన శిశువుగా ఉండి , పెరిగి పెద్దయినాక ఏమవుతాడోనని సంశయ పడుతున్నాను " అన్నాడు . 


" మన కడుపున పుట్టేవాడు మన మాట వినకపోతే ఇంకెవరి మాట వింటాడు ? కాబట్టి మీరు ఆ సంశయాన్ని వదలండి " 


         " నాకిక సంశయమేదీ లేదు . నాకన్నా ప్రబలుడగు పుత్రుడు పుట్టుటలో నాకే సందేహమూ లేదు . అయితే , పుత్రుడు బ్రహ్మ పరాయణుడై కర్మత్యాగము చేసి , కర్మ భ్రష్టుడైతే ఏమి చేయుట ? అదొకటే సంశయము " 


" మధ్యాహ్నము మీ స్నేహితులు ఏదో చెప్పినట్లుంది ? " 


        " నువ్వు నిలుచున్నావు , నేను కూర్చున్నాను . ఈ మాటలు ఇక్కడ వద్దు , అదంతా విస్తారంగా చెపుతాను పదవే , " అని దేవరాతుడు భార్యతో పాటూ శయ్యాగృహానికి వచ్చినాడు . అక్కడ ఆకులు వక్కలు వేసుకుంటూ మళ్ళీ మాటలు మొదలయ్యాయి . భార్గవుడు తన సంశయ నివారణ కోసము అన్నదంతా చెప్పి , " చూడు , ఆలంబీ , నిన్న రాత్రి చూసినది ఎందుకో భీతి గొలుపుతున్నది . వచ్చి నీ గర్భాన్ని చేరినవాడు శ్వేత వస్త్ర ధారి యైననూ నా మనస్సుకు అతడు సన్యాసి అయి ఉండవచ్చును అనిపించినది . కాబట్టి నీ గర్భములో పుట్టువాడు సన్యాసియయితే ఏమి గతి అని దిగులు . " అన్నాడు


         ఆమె , నోటిలో తాంబూలము ఉన్నదని కూడా మరచి గొల్లున నవ్వింది . నోటిలోని ఎర్రటి తాంబూలపు ద్రవము చింది ఉండాలి . దేవరాతుడు ఉత్తరీయము పైన పడిన ఎర్రటి చుక్కలను భార్యకు ఆ చీకటిరాత్రి ముసినవ్వుతో చూపించాడు . ఆమె నమస్కారము చేసి ," అగ్నిహోత్రములో నిప్పు రవ్వలు ఎగసినట్లైంది . తప్పు మన్నించవలెను " అని దానిని తుడిచింది . 


     " ఇది ముఖ్యముగా నీ రాజ్యము . ఇక్కడ నువ్వేమి చేసినా చేయించుకోవలసినదే " అధికారము కోల్పోయినవాడిలా అన్నాడు భర్త .


         " కావాలని చేసి ఉంటే మీ ఆక్షేపణ సరిగ్గానే ఉండేది . కానీ ఇది హఠాత్తుగా జరిగింది . అదీగాక , దానికి కారణము మీరే . దేనికీ భయపడని మీరు , ’ గర్భములో మగ పిల్లవాడే పుడతాడు , వాడు సన్యాసియే అవుతాడు ’ అంటూ దిగులు పడుతుంటే నాకు నవ్వు వచ్చింది . ఏమైతేనేమి , మీ కోపము నమస్కారము తో సరి . సరే , ఒకవేళ పుట్టే బిడ్డ ఆడపిల్లయితే ? " 


       " ఇందుకే మిమ్మల్ని , ఆడవారు , అయోగ్యులు అనేది . పుంసవనము అయిన పిమ్మట ఆడపిల్ల ఎలాగవుతుంది ? నీ గర్భములో మగ పిల్లవాడే పుడతాడు . ఆ విషయములో ఆవగింజంత కూడా అనుమానము లేదు . సంస్కారమునకు బలము లేదా ? మీ ఆడవారు , తల తీసి ముందు పెట్టినా నమ్మరు , దూడ ఎదురుగ్గా నిలుచున్నా , దీనికి మూడే కాళ్ళేమో అని సందేహపడే జాతి . అదంతా సరి కాదు , సంస్కార విహితమైనది జరిపినాక , గర్భస్థమైన పిండము మగపిల్లవాడే అవుతాడు . అంతే కాదు , నాకన్నా ప్రబలుడు కూడా అవుతాడు . నా సందేహమల్లా , వాడు ఒకవేళ కర్మ త్యాగము చేసి సన్యాసియయితే ఎలాగా అని మాత్రమే . " 


" కర్మలలో , సంస్కారములలో ఇంత శ్రద్ధ ఉన్నవారు , కొడుకు సన్యాసి కాకుండా మీరొక హోమాన్ని చేయండి " 


       " అది అంత సులభము కాదు . అయినా , ఆలంబీ , నువ్వు చెప్పేది నిజము . నాకు యజ్ఞవల్క్యుడు--అంటే కొత్త యజ్ఞములను నేర్పించువాడు అని బిరుదు . సన్యాసి కాకుండా చేయుటకు ఒక యజ్ఞమును రచించవచ్చు . కానీ , సన్యాసమంటే ఏమిటనుకున్నావు ? కర్మఠ బ్రాహ్మణుల సంస్కృతీ సర్వస్వపు గోపుర కలశమది . కానీ అక్కడ చెప్పినది కర్మ త్యాగము . దాన్ని నా మనసు ఒప్పుకోదు . అలాగని స్వతంత్రించి ఏమైనా చేద్దామా అంటే , సన్యాసము అనేది శాస్త్రము ఒప్పుకున్నదే , నిషిద్ధమేమీ కాదు . నా ధర్మ సంకటము అక్కడే . " 


      " అలాగైతే నేను చెప్పినట్టు చేయండి , వాడికి గర్భ పంచమములోనే ఉపనయనము చేయండి . ఒక వేదమైనా సాంగముగా అధ్యయనము చేయగానే సమావర్తనము చేయించి పెళ్ళి చేసెయ్యండి . మీ కొడుకైన తర్వాత , వాడు ధర్మాన్ని మీరడు . గృహస్థుడై పడిఉంటాడు . " 


         దేవరాతుడు అది సాధ్యము కాదని తల అడ్డముగా ఊపుతూ అన్నాడు , " ఒక వేదము చదవగానే అయిపోయిందనుకున్నావా ? నీ గర్భములో ఉన్నవాడు స్వంతముగా వేరొక వేదాన్నే పొందగలవాడు కావలెను . అదీ కాక , ఆలంబీ , యజ్ఞేశ్వరుడి వలె , .....నా మాట జాగ్రత్తగా విను , కర్మ కాండ , బ్రహ్మ కాండలు రెండింటిలోనూ ఉపపాద్యుడైన యజ్ఞేశ్వరుడి వలె జాత వేదుడు కాకపోయినా అతడికి సమానముగా సర్వజ్ఞ కల్పుడు కావలెను . అంతటి కొడుకును పొందలేకపోతే నేను యజ్ఞవల్క్యుడనై ఏమి సార్థకత ? అలాగని , ఏదో నోటిమాటగా బ్రహ్మవాది యగుట హితము కూడా కాదు . ఆడిన మాట , అనుభవపు బలముతో శృతియంతటి దృఢమతి కావలెను . అలాగ కావలెనంటే , పరిపూర్ణమైన బ్రహ్మమును సాక్షాత్కరించుకోవలెను . అంటే , దానికి కర్మ త్యాగము ఒకటే గతి . నా సందిగ్ధము అర్థమైందా ? నేను చెప్పుతున్నది అదే . అలాగయినప్పుడు , నేను ’ కర్మ శౌండ శౌండీరుడు ’ అని పొందిన ఈ ప్రసిద్ధి , ఈ ప్రఖ్యాతి , నాతోనే ముగిసిపోతుంది . అదే నా దిగులు . ఇప్పుడు నా దిగులు ఎటువంటిదో , దాని రూపమేదో చూచినావా ? అర్థమైందా ? "


         ఆలంబిని దీర్ఘంగా నిట్టూర్చింది . పొడినవ్వు నవ్వుతూ అంది , " మీ దిగులు అర్థమైంది . అయితే , ఇది కూడా , ఆడ పిల్లలను కన్న వారి దిగులు వంటిదే , ఏనాటికైనా కూతురిని మగని వెంట పంపించియే తీరవలెను , ఇంటిలోనే ఉంచుకొనుటకు లేదు , అని ఆలోచించినట్లే . పోనివ్వండి , కన్యాదానము చేయునపుడు ’ ఈమెకు పుట్టు కొడుకు మన ఇద్దరికీ కొడుకు కానీ , ద్వాముష్యాయణుడు కానీ ’ అని సంకల్పము చేసినట్లే , మీ కొడుకు కూడా కర్మ కాండ , జ్ఞాన కాండ రెండింటిలోనూ నైపుణ్యమును పొందువాడు అగునట్లు చేయండి ." 


     " కర్మ త్యాగము చేసే ’ విద్వత్తు యొక్క సన్యాసపు ’ అర్థము నీకింకా పూర్తిగా విశదము కాలేదు. దానివలన , నీకు తోచిన ఉపాయమును సూచిస్తున్నావు . కానిమ్ము , దీనికి దేవతా శరణము తప్ప వేరే ఏ దారీ లేనట్లుంది . దేవుడు ఎలాగు చేస్తే అలాగే అవుతుంది . నాకేమో ఇది భారీ శల్యమైపోయింది " అని అతడు పెద్ద నిట్టూర్పు వదిలాడు . 


      నిట్టూర్పులాగానే దేహముకూడా దీర్ఘముగా శయ్యను పరచుకుంది . కాలాతీతమవుతున్నదని గమనించి ఇద్దరూ త్వరగా నిద్ర పోవలెనని దుప్పటిని పైకి లాగుకున్నారు . కానీ నిద్రాదేవి అనుగ్రహము ఒకరికైతే ఇంకొకరికి కాలేదు . 


      అతడు ఇంకొంచము సేపు ఎటూకాని ఆలోచనలతో పెనుగులాడి , చివరికి కేవలము ఆయాసముతో మాత్రము వచ్చు నిశ్చేష్టారూపమైన మగతలోని జారిపోయాడు . 


        సుమారు ఒక జాము గడచి ఉంటుంది . ఇద్దరూ చల్లటి నిద్రలో మునిగియున్నారు . లోకవ్యాపారమంతా మరపు వచ్చింది . అపుడతడికి ఒక కల . కలలో ముగ్గురు బ్రాహ్మణులు వచ్చినారు . ఒకరికన్నా ఒకరు తేజస్వులు . ముఖమును చూడగానే వారు ఎవరన్నది తెలుసుకొనుటకు వీలు కాకున్ననూ , మనసుకు , బాగా పరిచయమున్న వారిలాగానే అనిపిస్తున్నది . కానీ ఎంత ప్రయత్నించినా , వారెవరు ? ఎక్కడ చూచినాను ? అన్నది జ్ఞాపకమే రావడము లేదు . అయినా , దేవరాతుడు తన గృహస్థ ధర్మానికి తగినట్టు వారికి అర్ఘ్య పాద్యాదులన్నిటినీ ఇచ్చినాడు . మధుపర్కమును ఇవ్వవలెనని ఆత్రపడుతున్నాడు . ఆలంబి వంటింట్లో ఎక్కడో ఏదో సిద్ధము చేస్తూ ఉన్నట్లుంది . తనకవసరమని , ఆమెను పిలిచి ఆమె పనులకు ఆటంకము కలిగించుట ఇష్టము లేదు . ఇలాగ సతమతమగుచుండగా , వారిలో జ్యేష్ఠుడు నవ్వుతూ అన్నాడు , " మేము మీ ఇంటి వారమే . మాకు మధుపర్కము వద్దు . మేమిప్పుడు నీకు ఏదో చెప్పాలని ఈ రూపములో వచ్చినాము . ఇలా రా " అని పిలచి , తమతో పాటు అతడినీ కూర్చోబెట్టుకున్నారు . అలాగే , కొంటెతనపు నవ్వొకటి నవ్వి , ’ మేమెవ్వరమో గుర్తు తెలిసిందా ? " అంటాడు . 


        ఆచార్యుడు లేదనలేడు , పరిచయపు జ్ఞాపకమూ రాదు . ఇలాగే అతడు సంకట పడుతుండగా " సరే , నీ సంకటము మాకు అర్థమైనది . మేము ఎప్పటికీ పరోక్షప్రియులము . కాబట్టి ఇలాగ తెలిసీ తెలియకుండా ఉండటములో విచిత్రమేమీ లేదు . మేమే చెప్పెదము , విను . మీ దంపతులు నిత్యమూ సేవించు అగ్నులు మేమే . నేను గార్హపత్యాగ్నిని . ఇతడు దక్షిణాగ్ని . అతడు ఆహవనీయాగ్ని . మేము మీరు ఉంచిన కుండములలో మాత్రమే ఉన్నామని భావించవద్దు . మీ దేహములోనూ ఉన్నాము . మా అనుగ్రహము వల్లనే మీ దంపతులకు నిన్నటి దినము మీ గర్భమునకు వచ్చిన మహానుభావుడి దర్శనమైనది . " 


        ఆచార్యులు లేచి నిలుచున్నారు . ప్రవర చెప్పి వారందరికి కలిపి ఒకసారి నమస్కారము చేసినాడు . ప్రత్యేకముగా కూడా ఒక్కొక్కరికీ నమస్కారము చేసినాడు . " మీ అనుజ్ఞ కావలెను , మీరు చెప్పుదానిని వినుటకన్నా ముందే , ఇదే ఎక్కువన్నట్లు నమస్కారములు చేయుట అపరాధమైతే క్షమించవలెను . " అని నమస్కరించి అన్నాడు . 


          ముగ్గురూ నవ్వినారు . పెద్దవాడు అన్నాడు , " మాకూ మీకూ సామరస్యము ఉన్నది . నువ్వేమి చేసినా అది మాకు అపరాధముగా తోచదు . అదలా ఉండనీ , విను, నిన్నటి దినము నీకు మా అనుగ్రహము వల్లనే ఆ దర్శనము అయినది . అయితే , దానిని సుఖముగా తీసుకొనుటకు బదులు , నువ్వు దానిని ప్రమాదపు కారణము చేసుకున్నావు . నువ్వు ఈ దినము ఉదయము నుండీ పడుతున్న సంకటము నీ దేహములోనున్న మమ్ములను కూడా బలముగా దుఃఖింపజేస్తున్నది . కాబట్టి అది వద్దు అని చెప్పుటకు మేమే వచ్చినాము ... హా! హా! , ’ మీరే నాకు తెలియ కుండానే దానిని నివారించ వచ్చును కదా..అనబోతున్నావు , ఔను , అది మాకు సాధ్యమే . నీ ఎదురుగా రాకుండానే నీ మనసును తిప్పుటకు మాకు సాధ్యమే , కానీ నువ్వు భక్తుడవు , కావలసిన వాడవు , సఖుడవు అని నీకు ప్రత్యక్షముగా ముఖతః చెప్పి నిన్ను సంతోష పరచవలెనని వచ్చినాము . నువ్వు సంతోషముగా ఉంటే మాకు సంతోషము . నువ్వు దుఃఖ పడుతూ ఉంటే మాకూ దుఃఖము . కాబట్టి మేము చేయుపని బహుశః స్వార్థమన్నా అనవచ్చు . స్వార్థము లేని లోక వ్యవహారము ఉంటుందా ? స్వార్థము , పరార్థము అని మనసులో ఉన్నంత వరకూ అది కర్మ కాండ. ఆ భేదము చెరగిపోతే అదే జ్ఞాన కాండ . అర్థమైనదా ? " 


        దేవరాతునికి మహాశ్చర్యమైనది. వీరు కూడా కర్మ కాండ , జ్ఞాన కాండలను గురించి మాట్లాడుతూ నా భయాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారే ? కానీ వీరు త్రేతాగ్నులు . " నీ సంతోషమే మా సంతోషము , నీ దుఃఖమే మా దుఃఖము " అంటున్నారు . కాబట్టి మారు మాట్లాడక , తాను చెప్పాలనుకున్నది ఒక ’ సరే ’ తో ముగించాడు . 


       మాట్లాడుతున్న ఆ జ్యేష్టుడు చిరునవ్వు నవ్వుతూ తాను చెప్పాలనుకున్న దానిని కొనసాగించినాడు . :" రెండు నదులు వచ్చి చేరుతాయి . రెండూ ఒకటగు వరకూ ఆ నీరు , ఈ నీరు అనవచ్చు . రెండూ ఒకటైన తర్వాత వాటిలో ఏది తాను కరగి పోయానని ఏడవాలి ? " 


      దేవరాతుడు మనసులోనే గుణకారము చేసినాడు . " నేను ఏదో చెబుతున్నారు అనుకున్నాను , వీరు చెప్పేది కర్మ కాండ , జ్ఞాన కాండ లకు సంబంధించినదేనా ? అలాగైతే రెంటికీ భేదము లేదా ? "


        జ్యేష్టుడు ఇతడి మనసులో ఉన్నది తెలిసినట్లే అన్నాడు , " ఔను , రెంటికీ భేదము లేదు . భేదమున్నదని నువ్వు భావించుకొని పొద్దుటినుండీ దుఃఖ పడుతున్నావు . జాతవేదుడనని ప్రఖ్యాతి పొందిన నన్ను ( అలా అనేటప్పటికి మిగిలిన ఇద్దరూ అంతర్థానమై అతడొక్కడే ఉన్నాడు ) ’ కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే ’ అని అహర్నిశలూ నమస్కారము చేయు నువ్వు దాని అర్థమునెందుకు గమనించలేదు ? నీకున్న సంశయాన్ని వదలు . ఎలాగా ? ఇంకా పరిహారము కాలేదే అంటావా ? సీమంతమగు వరకూ తాళు . సీమంతమైన తర్వాత గర్భస్థుడై యున్న జీవుడిని మాట్లాడించు . అతడు నీకు తృప్తి యగునట్లు సమాధాన మిచ్చును . మా దేవతలము , కర్మ కాండపు ఋషులు , నీ వంశపు పితృ దేవతలు అందరూ కలిసి నీ వంశమును మాత్రమే కాదు , లోకమునే ఉద్ధరించ గల మహా పురుషుడిని నీకు కొడుకగునట్లు అనుగ్రహిస్తాము చూడు , నీకు నిదర్శనము కావాలని చెపుతున్నాను , రేపు నీకు రాజ భవనము నుండీ సోపస్కరములు ( సంభారములు ) వస్తాయి కదా , వాటితో పాటు కుండెడు పాలనిచ్చు రెండు ఆవులు కూడా వస్తాయి . ఒకటి ఎర్రది , ఇంకోటి నల్లది . నీకు రాజ పురోహితుడు చెప్పినవాటిలో ఆవులు లేవు , నిజమా కాదా ? " 


" ఔను , ఆవులున్నట్లు చెప్పలేదు " 


      " నేనే నీకు అంతటినీ చెప్పగలను , కానీ నీకు నేను చెప్పుటకన్నా , గర్భస్థ శిశువే చెప్పిన , ఎక్కువ నమ్మకము కాగలదని అతని ద్వారానే చెప్పిస్తాను . ఇకనైనా దుఃఖమును వదలి స్వస్థుడవు కమ్ము . నువ్వు సంకట పడినంతా మాకది జ్వరమని మరవద్దు . " 


    దేవరాతుడికి ఏదో ఒక తెర తనపైనుండి జారి కింద పడినట్లాయెను . వాక్కు అతని ప్రయత్నము లేకనే " అనుజ్ఞ , దుఃఖాన్ని వదలినాను " అన్నది . 


      యజ్ఞేశ్వరుడు , " చూడు , నువ్వు ఎంత దుఃఖ పడుతుంటివో చూడు " అని తన చేతిని బార్లా చాచినాడు . అక్కడ ఒక నల్లటి గుట్ట ఉంది . అది సుమారు ఒకటిన్నర మనిషి ఎత్తు . అది అంటుకొని మండుతున్నది . 


       ఇంకొకసారి చెవిలో మోగింది , " ఆచార్యా , మరవద్దు , ఈ దేహము నీది కాదు . నీకు దాన్ని ఇచ్చిన మేము అందులో ఉన్నాము . నువ్వు నీవియని అనుభవించు సుఖ దుఃఖములన్నీ మాకు కూడా కలుగుతాయి . కాబట్టి నువ్వు ఎల్లపుడూ సంతోషముగానే ఉండవలెను . " 


      ఆచార్యుడు అదివిని సిగ్గు పడ్డాడు . తమ ఆజ్ఞ అని తిరిగి చూసే వేళకు అక్కడ ఎవరూ లేరు . మనసు , " అట్లయిన , మేము సుఖ దుఃఖముల అనుభవములో కూడా స్వతంత్రులము కామా ? వాటిలో కూడా మేము దేవతలకు అంకితులై ఉండవలెనేమి ? అని పుంఖాను పుంఖములుగా ప్రశ్నలు వస్తుండగానే మెలకువ అయ్యింది .