13, ఆగస్టు 2020, గురువారం

శంబరాసురుడనే రాక్షసుడు

శంబరాసురుడనే రాక్షసుడు తెలుసుకదా. ఆతనికి ఇంకో పేరు *తిమిధ్వజుడు*.  అతనితో దేవతలు యుద్ధం చేసేటపుడు దశరధమహారాజు దేవతల కోరిక మీద సాయం కోసం వెళ్ళినప్పుడు ... ఆ యుద్దం లో గాయాలపాలై మూర్ఛిల్లిన దశరథుని కి(సారధిగా కైకమ్మ నడిపించింది ట) దూరంగా తీసుకెళ్ళి ఉపచారాలతో స్వస్థత కలిగించింది ఆమె. అందుకు కృతజ్ఞతగా (సత్త్వగుణ వంతులకు కృతజ్ఞత సహజ లక్షణం కదా) ఆమెను వరం కోరుకోమన్నాడు. అవే *అయోధ్యా కాండము* లో శ్రీరామ పట్టాభిషేకం సమయంలో ఆవిడ మంధర ప్రోద్బలంతో కోరింది. ఇంకా విశేషం ఏమిటంటే ఆ తిమిధ్వజ రాక్షస కుమారుని శ్రీరాముడు మట్టుబెట్టేడు. అందుకు చతుర్ముఖ బ్రహ్మ గారు శ్రీరామునికి దివ్యాస్త్రాలు ఇచ్చేరు. ఈ విషయం అయోధ్యా కాండము లో సుమిత్రా దేవి కౌసల్యాదేవి ని ఓదార్చతూ ఆమెకు గుర్తుచేసి శ్రీరాముడు వనవాసం విజయవంతంగా పూర్తి చేసుకున్న వస్తాడని తెలుపుతుంది.

ఈ కైకమ్మ కు పుట్టిన ఇంటి నుంచి అరణం గా వచ్చిన దాసి *మంథర* పూర్వ జనలో *దుందుభి* యనే పేరున్న గంధర్వ కాంత. ఇక రావణ వధ కోసం శ్రీమహావిష్ణువు శ్రీరాముని గా అవతారం ఎత్తే వేళ అనేక మంది నర, వానరు లను దేవతాంశలతో  .. కిన్నెర, కింపురుష, యక్ష, గంధర్వాది జాతుల స్త్రీల తో (కుమారసంభవ సమయం లో పార్వతీదేవి శాపం వల్ల దేవతలకెవరికీ తమ పత్నుల వల్ల సంతానం కలుగదని కదా)  అనేక మందిని భూలోకంలో సృష్టి చేశారు కదా. అలా దేవలోకం నుంచి రావణ వధార్ధమై *కుబ్జ*  మంధరగా ఆ గంధర్వకాంత దుందుభి వచ్చింది.

కామెంట్‌లు లేవు: