13, ఆగస్టు 2020, గురువారం

*శివం - శవం*

చిరిగి పోయిన సంచిలో బంగారం పెడితే ఆ సంచి చిరిగి వున్నా, సంచి కి విలువ ఉంటుంది.

సంచి నుండి బంగారాన్ని వేరు చేస్తే,

ఆ సంచికి విలువ లేదు.

దాని వలె, మన శరీరమనే చిరిగిన సంచిలో, ఆత్మ అనే భగవంతుడు ఉన్న వరకే  ఈ శరీరానికి విలువ.

శరీరంలోని ఆత్మ బైటికి వెళ్ళాక, ఈ శరీరాన్ని ముట్టటానికి కూడా ఆలోచిస్తారు.

అంటే  బంగారానికి విలువ ఉంది కానీ, సంచికి కాదు.

అలాగే చైతన్య స్వరూపుడైన భగవంతుడికి విలువ వుంది కానీ, మన శరీరానికి కాదు.

శరీరంలో జీవం ఉంటే శివం,

శరీరం నుండి జీవి వెళ్లిపోతే శవం.

ఈ శరీరంలో జీవం వున్నప్పుడే, నలుగురికి ఉపయోగపడాలి.

నిరంతరం భగవన్నామ స్మరణ చేయాలి.

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

కామెంట్‌లు లేవు: