13, ఆగస్టు 2020, గురువారం

ద్రౌపది గురించి

మహాభారతం లోని కొన్ని ఆదర్శ పాత్రలు వాటిలో ద్రౌపది గురించి
            ద్రౌపది దేవి పాంచాల రాజైన ద్రుపదుని కుమార్తె. ఈమె అయోనిజ యఙ్ఞకుండము నుండి ఈమె ఆవిర్భవించింది. ఈమె రూప లావణ్యాలు అనుప మానములు అయినవి. ఈమె వంటి సౌందర్య రాశి ఆ కాలంలో భూమి మీద మరెవ్వరునూ లేరు. ఈమె శరీరము నుండి తత్కాలమందు వికసించిన తామరపువ్వు యొక్క పరిమళము వంటి పరిమళం వెలువడి ఒక క్రోసు దూరం దాక విస్తరించేది. ఈమె జననకాలంలో ఆకాశవాణి _ఈమె దేవతా కార్యసిద్ధి కై క్షత్రియ లోక సంహారం లక్ష్యంగా చేసుకుని ఆవిర్భవించింది అని, ఈమె మూలంగా కౌరవ వర్గానికి భయం కలుగుతుంది అని పలికింది. ఈమె శరీరచ్ఛాయ నల్లనిది అయిన కారణంగా ఎల్లరూ ఈమెను క్రుష్ణ అని పిలిచేవారు. పూర్వ జన్మ లో పరమ శివుడు ఒసగిన వరం కారణంగా ఈమెకు ఈ జన్మ లో అయిదుగురు భర్తలు ప్రాప్తించారు. ఈమె ను స్వయంవరంలో అర్జునుడు ఒక్కడే గెలుచుకున్నాడు. అయినా కుంతీదేవి ఆదేశానుసారం ఆమె తనయులు అయిదుగురు నూ కూడి పెండ్లి చేసుకున్నారు.
        ద్రౌపది ఉత్తమ శ్రేణి కి చెందిన పతివ్రామతల్లి. భగవద్బక్తురాలు, ఈమెకు శ్రీకృష్ణ భగవానుని పాదారవిందముల మీద అచంచలమైన ప్రీతి ఉండేది. ఈమె ఆయన్ని తన హితైషి యని, పరమాత్మీయుడని భావించు కునేది. ఆయన సర్వవ్యాపకుడు, సర్వశక్తియుక్తులు కలవాడు అని ఈమె ద్రుఢంగా విశ్వసించేది. కౌరవుల సభలో దుష్టుడైన దుశ్శాసనుడు ఈమె శరీరంపై ఉన్న వలువలను ఒలిచివేయ పూనుకున్నపుడు సభాసదులు ఎవ్వరూ అతని అత్యాచారాన్ని నిరోధించే ప్రయత్నం చేయలేకపోయారు. అప్పుడు ఆమె ఈమె తన లజ్జ ను కాపాడుకోవడానికి మార్గము ఏదీ కానక ఎంతో ఆర్తితోను, ఆరాటంతోను శ్రీకృష్ణ భగవానుని ఈ విధంగా ప్రార్థించింది-
పురాణపురుష ప్రాణమనోవ్రత్యాద్యగోచర!
సర్వాధ్యక్చ పరాధ్యక్చ త్వా మహం శరణం గతా!!
పాహి మాం క్రుపయా దేవ శరణాగతవత్సల!
నీలోత్పలదళశ్యామ పద్మగర్భారుణేక్చణ!!
పీతాంబరపరీధాన  లసత్కౌస్తుభభూషణ! త్వమాది రంతో భూతానాం చ పరాయణమ్!!
పరాత్పరతరం జ్యోతి రిశ్వాత్మా సర్వతోముఖహ!!
త్వామేవాహు పరం బీజం నిధానం సర్వసంపదామ్!! త్వయా నాధేన
సర్వపద్భ్యోభయం న హి!!
దుశ్శాసనా దహం పూర్వం సభాయాం మోచితా యథా! తథైవ సంకటాడస్మాన్మాముద్దర్తు మిహర్హసి!! (సశేషం)

కామెంట్‌లు లేవు: