13, ఆగస్టు 2020, గురువారం

సత్యభామ సందేహం

ఒకప్పుడు శ్రీ క్రుష్ణుడు సత్యభామా సమేతుడై వనంలో నివసిస్తున్న పాండవులను కలుసుకోవడానికి వచ్చేరు. ఆ సమయంలో మాటల సందర్భంలో అంటే ఆడవారు చీరలు దగ్గర నుంచి నగలు అలాగే కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా! అలాంటి సమయంలో సత్యభామ కు ఒక సందేహం వచ్చింది. ఆ విషయాన్నే ద్రౌపది తో ఇలా అడిగింది అట. నిన్ను ఒక విషయం అడుగుతాను చెబుతావా! అని ఆ చెప్పు అక్కా దానిదేముంది అందట ద్రౌపది. శూరులు, వీరులు, మహాబలశాలు లూ అయి ఉండి కూడా నీ భర్తలు నీకు లోబడి ఉండడాన్ని నేను చూస్తున్నాను. ఏమిటి కారణము? నీవు ఏమైనా మంత్రతంత్రాలు, తాయెత్తు లు, ఓషధీప్రయోగాలు ఏమైనా చేసావా? లేక పోతే నీవు ఏమైనా జపాలు, వ్రతాలు, హోమాలు, వశీకరణ విద్యావిధానాలు ఆచరించి నీ భర్త లను లోబరచుకున్నావా! అలాంటి ఉపాయాలు, విధానాలు ఏమైనా ఉంటే నాకూ చెప్పు. నేను నా శ్యామసుందరుని వశీకరించుకొనుటకు ప్రయత్నిస్తాను. అని అడిగిందట. దానికి ద్రౌపది ఆమెకు ఇలా బదులు ఇచ్చింది. సోదరీ! నీవు శ్యామసుందరుని పట్టమహిషివి, ప్రియతమురాలవూ అయి ఉండి కూడా ఏమి మాట అంటున్నావు. పాతివ్రత్య నిష్ఠ గల సాధ్వీమ తల్లులు తేళ్ళకు, సర్పాలకూ ఎంత దూరంగా ఉంటారో మంత్ర తంత్రాదులకు కూడా అంతే దూరంగా ఉంటారు. మంత్రతంత్రాలు తో భర్త ను వశీకరించుకొనుటకు సాధ్యమవుతుందా? అమాయకంగా ఉండే స్త్రీలూ, దురాచారపరాయణులైన స్త్రీలు మాత్రమే నీవు అనుకున్న విధంగా మంత్రతంత్రాదులను ప్రయోగిస్తారు. అలా చేసి వారు తమకు, తమ భర్తలు కు కూడా అనర్థాన్ని కల్పించుకున్నవారు అవుతారు. అలాంటి స్త్రీ ల చెంత కు మనం చేరరాదు. మన చెంతకు వారిని చేరనీయరాదు. సేకరణ దీనివలన ద్రౌపది ఎంత పతివ్రతో ఎంత ఉన్నతురాలో తెలుస్తోంది. (సశేషం)
*******************

కామెంట్‌లు లేవు: