13, ఆగస్టు 2020, గురువారం

పరమేశ్వరుని కి ఇష్టమైన పుష్పాలు ఏమిటి?


శివపురాణంలో విశ్వేశ్వర సంహితలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. చంపకం(సంపంగి) కేతకం(మొగిలి పువ్వు) ఈ రెండూ తప్ప భక్తి తో ఏది సమర్పించినా తనకు ఆనందమే అన్నాడు పరమేశ్వరుడు. పరిమళ పుష్పాలతో పరమేశ్వరుని పూజిస్తే ఋణాలు తీరతాయి అంటారు పెద్దలు. తెల్లతామర పూలతో పూజిస్తే ఙ్ఞానం లభిస్తుంది. అలాగే ఐశ్వర్యం కావాలంటే బిల్వపత్రాలతో
పూజించాలి. మందార పుష్పాలతో పూజిస్తే దాంపత్య సౌఖ్యం లభిస్తుంది. ఏ రంగు గన్నేరు పూలతో పూజించినా కుటుంబం వ్రుద్ధి, ధనధాన్యములు వ్రుద్ధి కలుగుతాయి. పుష్ప పూజ వలన మనిషికి వికాసం కలుగుతుంది. పరమేశ్వరుని కి గరిక కూడా ఇష్టమే. శంకరభగవానులు చెప్పినట్లు గా ఎక్కడెక్కడి అరుదైన పుష్పాలతో పరమేశ్వరుని పూజించాలి అని భక్తులు తాపత్రయపడతారు. నిజం చెప్పాలంటే పరమేశ్వరుని కి ఇన్ని పుష్పాలు కంటే హ్రదయ పుష్పాన్ని సమర్పించేవారినే ఆయన ఎక్కువ ఇష్టపడతారు. ముందుగా మనస్సు అనే కుసుమాన్ని మహాదేవునికి సమర్పించాలని పూజ్యులు చెబుతారు. అందుకే భక్తకన్నప్ప అంటాడు. ఏ పూలు తేవాలి నీ పూజకు అని. ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర అందరికీ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషయాలు సేకరణ మాత్రమే
****************

కామెంట్‌లు లేవు: