11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

తల్లి మాటలోని మహత్తు



అనగనగా ఒక బాలుడికి జట్కాబండిలో ప్రయాణించడం చాలా ఇష్టం. రోజూ బడికి జట్కాలోనే వెళ్లేవాడు.

పెద్దయ్యాక ఏం కావాలనుకున్నారని స్కూల్లో టీచరు అడిగారునప్పుడు...

ఒకరు డాక్టరని,
ఇంకొకరు ఇంజినీరని,
మరొకరు లాయరని
అన్నారు....

ఈ బాలుడు మాత్రం జట్కావాలా అవుతానన్నాడు🤔

టీచరు, పిల్లలు ఘొల్లున నవ్వారు😆😆😆

ఇంటికెళ్లేలోపే ఇది బాలుడి తల్లికి తెలిసి, ప్రశాంతవదనంతో...

బాబూ! పెద్దయ్యాక ఏమవుతావని అడిగింది.

ఆ బాలుడు, స్కూళ్లో చెప్పిందే చెప్పాడు..

అప్పుడు ఆ తల్లి:..

"అలాగే అవుదువుగానీ, ఇలా రా"
అంటూ పూజామందిరం తలుపులు తెరిచి,
"ఒక్క గుర్రంతో నడిపే బండి కాదు! నాలుగు గుర్రాలు తో నడిపే బండీకి నువ్వు జట్కావాలావి కావాలి, అదిగో ఆ శ్రీకృష్ణుడి లాగా" అని బోధించింది ఆ తల్లి..

ఆ నాలుగు గుర్రాల పేర్లె...

ధర్మ,
అర్థ,
కామ,
మోక్షాలనీ..🙏🙏

ఆ బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడనీ చెప్పింది...👏

నువ్వు కూడా జగత్తుకి ఈ నాలుగింటిని బోధించే గురువువి కావాలి, సరేనా!" అంటూ అతడిఆలోచనను మలుపు తిప్పింది.

ఆ బిడ్డడే పెద్దయ్యాక *వివేకానందుడయ్యాడు*👌

పెంపకం అంటే అదీ... పిల్లలు తెలియక తప్పు చేసినా, తప్పు మాట్లాడినా, దానిని సరిదిద్దాల్సింది తల్లే...

*🙏అందుకే అమ్మని తొలి గురువు, తొలి దైవం అంటారు...🙏*

కామెంట్‌లు లేవు: