11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

పరమాత్మే శరణాగతి.

పరమాత్ముడు సృష్టిని వ్యక్తపరిచే ఆలోచనతో మానవుని సాధనముగా ఎన్నుకొని వాని యందు అనేక దేవతల అధిష్ఠానముగా షోడశకళా మూర్తిగా తయారుచేసి చైతన్యముగా తానె అంశను అమర్చి"విరాట్పురుషునిగా" వ్యక్త్యమయినాడు.

దేవతల అధిష్ఠానముగా ఉన్న కళామూర్తి "జడ ప్రకృతి" ,
పరమాత్మ అంశ అధిష్ఠానముగా ఉన్న పురుషుడు "చైతన్య ప్రకృతి " .   
ఈ సృష్ఠిని అంతను "అవ్యక్త బ్రహ్మ" విరాట్పురుషుని సాక్షిగా బ్రహ్మ ,విష్ణు శివాత్మకంగా పర్యవేక్షిస్తున్నాడు.

ఈ భూతజాలమంతా విరాట్పురుషుని సంతతే. ఆ పరమ-ఆత్మ ఒక్కడే ఆక్షరుడు. అవ్యయుడు, అప్రమేయుడు.

క్షరముచెందే ఏ పదార్థమైనా భగవంతుని విశేషాంశ అవచ్చుగాని , భగవంతుడు కాలేడు.

దేవతల అధిష్ఠానముగా ఉన్న కళామూర్తి "జడ ప్రకృతి" మరణము సంభవించగానే ఆ ఆ అధిష్ఠానదేవతలలో విలీనమవుతుంది.

చైతన్య ప్రకృతి ఈ మానవుని జనన మరణముల దశ దాటినప్పుడు కాని
లేక సృష్ట్యాoతమునకాని పరమ పురుషుడిలో ఐక్యము చెందుతుంది.

అందువలన ఏ ప్రకృతులైనా పరమాత్ముని అధీనములే. ఆ పరమాత్మే శరణాగతి.

 "ఓం" అని అవ్యక్త బ్రహ్మని ఆశ్రయించినా , నారాయణా లేక చతుర్ముఖ బ్రహ్మ లేక మహేశ్వరా అని "వ్యక్త బ్రహ్మని" ఆశ్రయించినా పరమాత్మునిఆశ్రయించినట్లే.                 
                                                                                ఓం నమో నారాయణాయ !

కామెంట్‌లు లేవు: