29, ఆగస్టు 2021, ఆదివారం

ప్రశ్న పత్రం సంఖ్య: 23

  ప్రశ్న పత్రం సంఖ్య: 23 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  


భారత సంబంధ క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి  


  1) సవ్యసాచి అనే పేరు అర్జనునికి ఎలా వచ్చింది 


2) లక్క ఇంట్లో పాండవులు, కుంతీదేవి చనిపోయారు అని అనుకోవటానికి కారణం ఏమిటి.  


3) లక్క ఇంటి గూర్చిన వివరాలు పాండవులకు ఎవరు తెలిపారు.  


 4) శ్రీ కృష్ణ భగవానుల అన్నగారు ఎవరు. 


 5) పాండవులు, కౌరవులు తమ విద్య నైపుణ్యం చూపే సమయంలో తన ప్రతిభను చాటిన ధనుర్ధారి ఎవరు.   

6) దృతరాష్టుడు ఎవరి వలన జన్మించారు చెప్పండి. 


7) ధర్మరాజుతో జూదములో తన్ను ఓడడా లేక తన ధర్మ పత్నిని ఓడడా 


8) అడవిలో పాండవులు వున్న గ్రామము పేరు ఏమిటి.  


9) శ్రీ కృష్ణ భగవానులు జరాసంధుని చంపటానికి భీమునికి ఏరకంగా సౌజ్ఞ చేశారు. 


10) ఉత్తరకు నాట్యం నేర్పిన గురువు గారి పేరు, అసలు పేరు ఏమిటి. 


 11) అర్జనుడు ఇప్పటి విజయవాడలో తపస్సు చేసినట్లు చెపుతారు. దేని గూర్చి తాను తపస్సు చేసారు.  


12) ధర్మరాజు ఇంకొక పేరు ఏమిటి. 


 13) శిశుపాలుని తల్లిదండ్రులు ఎవరు ఏదేశము ? 


14) నకుల సహదేవులకు గల ప్రత్యేక విద్యలు ఏమిటి 


15) కృష్ణ భగవానుల తండ్రిగారుఎవ్వరి చెల్లెలి భర్త 


16) భారతంలో కురుక్షేత్ర యుద్దము ఎన్ని రోజులు జరిగింది 


17) రధికునిగా అర్జనుడు మరి సారధిగా ఎవరు ఉండి కురుక్షేత్ర యుద్ధం చేశారు . 


 18) పాండవులలో "కాగల కార్యం గంధర్వులే చేశారు" అని ఎవరు అన్నారు, ఏ సందర్భంలో  


19) శకునికి కౌరవులమీద ప్రేమ ఉన్నదా లేక ద్వేషం ఉన్నదా ఎందుకు తెలపండి  


 20) భారతంలో మీకు నచ్చిన వీరుడు ఎవరు ఎందుకు

కామెంట్‌లు లేవు: