21, సెప్టెంబర్ 2023, గురువారం

బసవ పురాణం - 35 వ భాగము..

 🎻🌹🙏బసవ పురాణం - 35 వ భాగము....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸బిజ్జలునికి అది తెలిసి దిగ్భ్రాంతి చెంది బాచయ్యకు శరణు చేసి ఆ లింగానికి సోమేశ్వరుడని పేరు పెట్టి సువర్ణ మందిరం కట్టించాడు.


🌷అరియమ కథ


🌿అన్యదైవముల పేరు వినకపోవడం అరియమ అనే భక్తుని నియమం. ఒకానొడక బ్రాహ్మణుడు రుద్రం చదువుతూ వచ్చి అరియమ ఇంటిముందు నిలిచి అన్యదైవనామం ఉచ్ఛరించాడు. 


🌸అది విని అరియమ బ్రాహ్మణుణ్ణి చంపాడు. రాజుకిది తెలిసి కోపించి ఉరిశిక్ష వేశాడు. అరియమ పోతూ పోతూ దారిలోని శివాలయంలోని శివలింగంలో లీనమైనాడు. 


🌿అందుకు చిహ్నంగా నేటికీ లింగం నుండి అరియమ కట్టుకున్న మూరెడు వస్త్రం బయటికి వచ్చి మిగిలిపోయింది కనిపిస్తూ ఉంటుంది.


🌷వీర శంకరుని కథ


🌸పరదైవములను చూడననే నియమం కల దీక్షతో వీరశంకరుడనే శివభక్తుడు ఉండేవాడు. ఒకనాడు కలలో బౌద్ధుడొకడు కనిపించగా కలయో? 


🌿ఇలయో పరమతస్థుడు కనిపించాడని దుఃఖించి వీర శంకరుడు శ్రీశైలం పోయి హాటకేశ్వరుని ముందు మండే పెనంపై కూర్చొని ప్రాణత్యాగం చేసి సాయుజ్యం పొందాడు.


🌷శివలెంక మంచయ్యగారి కథ


🌸శివలెంక మంచయ్య అనే భక్తుడు కాశిలో శివునికి ప్రతిదినమూ తన చేతివేళ్ళు పదీ అర్పించి పూజించి తిరిగి వేళ్ళు పొందేవాడు. ఒకనాడు అన్యమతస్థులు వచ్చి వాదింపగా మంచయ్య గెలిచాడు. 


🌿మాకు వాదాలు కాదు. దృష్టాంతం చూపించాలి అని వారు కోరగా మంచయ్య రమ్మని పిలువగానే విష్ణువు వచ్చి విశే్వశ్వరునకు ప్రణామం చేశాడు.


🌷కల్లిదేవయ్యగారి కథ


🌸బ్రాహ్మణులొకసారి వాదానికి వస్తే కల్లి దేవయ్య శివుడే పరదైవమని వాదించి ‘మీ మీ వేదాలు మా ఇంటి కుక్కలు కూడా చదువుతాయి’అని కుక్కతో నాలుగు వేదాలూ చదివించాడు.


🌷బిబ్బ బాచయ్య గారి కథ


🌿గొబ్బూరు అగ్రహారంలో బిబ్బ బాచయ్య అనే శివభక్తుడు ఉండేవాడు. అతడు భక్తుల ప్రసాదం బండ్లకెత్తించి ఆడుతూ పాడుతూ ఆరగింపు చేసేవాడు. 


🌸ఒకనాడు ప్రసాదపు బండి ఎదురు వస్తుంటే బ్రాహ్మణులు ఆపి ‘అవి ఏమిటి ఎంగిలి కూడు అగ్రహారంలో బండి కదలడానికి వీలులేదు’ అని నిందించారు. బాచయ్య నవ్వాడు. 


🌿బండిలోని అన్నం అగ్నిగా మారి అగ్రహారం అంటుకుంది. బ్రాహ్మణులు ఏడుస్తూ బాచయ్యకు శరణు చేశారు. బాచయ్య అనుగ్రహించాడు. అగ్ని శాంతించి గృహాలు ఎప్పటివలెనే ఉన్నాయి.


మాదర దూడయ్యగారి కథ


🌸మాదర దూడయ్యగారనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన మజ్జనం చేసిన జలముతో పొర్లితే ఒక బ్రాహ్మణునికి ఎక్కడా నయంకాని కుష్ఠువు నయమైంది.


🌷బాసన భీమయ్య కథ


🌿రోగులైన బ్రాహ్మణులందరికీ శరీరాలు బాగుచేసిన మహాభక్తుడు.


🌷శ్వపచయ్య కథ


🌸శ్వపచయ్య అనే శివభక్తుడు ప్రసాదాన్ని భుజిస్తూ సామవేది అనే బ్రాహ్మణుని కండ్లబడగా మూసివేశాడు. ‘ఓరోరి! మాంసం తింటూ దాచుకున్నావా?’ 


🌿అని సామవేది నిందింపబోగా ఆయన గుడ్డలు శ్వపచయ్య ముందు పడిపోయాయి. సామవేది శ్వపచయ్యకు మొక్కి శివదీక్ష స్వీకరించాడు.


🌷ఉద్భటుని కథ


🌸బల్లకి అనే పురంలో ఉద్భటుడనే భక్తుడు ఉండేవాడు. ఆయన నగర ప్రభులైన భోజునికి గురువు. ఉద్భటుడు లింగైక్యం చెందగా శరీరాన్ని దహనానికి తీసుకొనిపోయారు. 


🌿ఆ దహన ధూమం సోకి చెట్టుపైనున్న ఏడువందల భూతాలు విముక్తి చెందాయి.ఆహారానికి పోయిన ఒక భూతం ఆలస్యంగా వచ్చి ‘అయ్యో! నా గతి ఏమిటి? 


🌸పనె్నండు వేల సంవత్సరాలనంచి రుూ ఉద్భటుని కోసం ఎదురు చూస్తున్నాము శాపగ్రస్తులమై’ అని దుఃఖిస్తే గంధపు చెక్కలు వేసి నేతిలో గుడ్డలు మంచివేసి మళ్లీ ఉద్భటుని చితిపై పొగను రప్పించగా అది సోకి 


🌿ఆ భూతం శాపవిముక్తి చెంది మర్రి చెట్టును కూడా పీక్కొని బంధుమిత్ర సహితంగా కైలాసానికి పోయింది.

కక్కయ్య కథ శివనింద చేసిన విప్రుని సంహరించాడు...సశేషం...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

కామెంట్‌లు లేవు: