21, సెప్టెంబర్ 2023, గురువారం

అక్టోబర్ 2023 "శ్రీ గాయత్రి" సంచికలో

 అక్టోబర్ 2023 "శ్రీ గాయత్రి" సంచికలో రెండు ప్రత్యేక వ్యాసాలు "సనాతన ధర్మం (శ్రీ గాయత్రి డెస్క్) "; " కిడాంబి వేణుగోపాలన్ గారి సనాతన ధర్మం-అత్యంత పురాతనం" అనేవి ప్రచురించబడుతున్నాయి. సనాతన ధర్మం అంటే ఏమిటో అవగాహన అవుతుంది. మన హైదవం లో సనాతనం అంటే నిత్య జీవితమే. మనం ఆచరించే ఆచార వ్యవహారాలు అన్నీ అందులోనివే. ఈ విషయంలో అనుమానం ఉండకూడదు. పత్రిక రాగానే తప్పనిసరిగా చదవాలి. పై వ్యాసాలె కాకుండా ఇంకా తెలుసుకోవాలసింది ఎంతయినా ఉండవచ్చు. మన శ్రీ గాయత్రి రైటర్స్ నుంచి సనాతన ధర్మం మీద వ్యాసాలు ఆపేక్షితం. పూర్తి వ్యాసం కాకపోతే బాక్స్ అయిటమ్స్ కూడా పంపవచ్చు. ప్రతీ నెలా 10 వ తారీఖు లోగా పంపగలరు.                                                                                                                                                                      మన సర్వే (Survey) ప్రకారం, పెద్ద పెద్ద వ్యాసాలు ఎవరూ చదవక విడిచి (skip) పెడుతున్నారు. WhatsApp లో కూడా ఇదే పరిస్థితి. ఇదివరలో చాలా సార్లు చెప్పడం జరిగింది. పూర్తి వ్యాసం 5-6 పేజీలు దాటకుండా పంపండి. ప్రత్యేక పరిస్తితులలో  8 పేజీలు ఉండవచ్చు. 8 పేజీలు దాటితే, రెండు భాగాలుగా వేయవలసి ఉంటుంది. గమనించ గలరు. ఆధ్యాత్మిక - జ్యోతిష విషయాలలో బాక్స్ అయిటమ్స్ కూడా మీ నుంచి ఆపేక్షితం. ఒక పేజీలో 3/4,  1/2, 1/4 వంతు బాక్స్ అయిటంగా వేస్తాము. అందరూ పత్రిక చదివిన వెంటనే స్పందన కూడా పంపితే మీ పేరు, ఫోన్ నంబర్ తో ప్రచురిస్తాము. అక్టోబర్ 2023 సంచిక విషయ సూచిక (Index) ఈ నెల 28 న తెలిగియ చేస్తాము. 30 న పత్రిక విడుదల. .. .. ..  మీ,     డా. వి. యన్. శాస్త్రి - మానేజింగ్ ఎడిటర్.

కామెంట్‌లు లేవు: