శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము
మోక్షసన్న్యాసయోగం:శ్రీ భగవానువాచ
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ (54)
భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ (55)
అర్జునా.. అలా బ్రహ్మస్వరూపం పొందినవాడు ప్రశాంతమైన మనసుతో దేనినీ ఆశించడు; దేనికీ దుఃఖించడు. సమస్త భూతాలనూ సమభావంతో చూస్తూ నాపట్ల పరమభక్తి కలిగివుంటాడు.భక్తివల్ల అతను నేను ఎంతటివాడినో, ఎలాంటివాడినో యథార్థంగా తెలుసుకుంటాడు. నా స్వరూపస్వభావాలను గ్రహించిన అనంతరం నాలో ప్రవేశిస్తాడు.
కృష్ణం వందే జగద్గురుమ్..🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి