7, జనవరి 2021, గురువారం

శ్రీమద్రామాయణావతరణము

 🌹శ్రీమద్రామాయణావతరణము 🌹 


ఆశ్రమము జేరి వాల్మీకి  యాగమోక్త

నిష్ఠ పూరిత కార్యముల్  నిర్వ హించి

క్రౌoచ పక్షుల విషయమే కదల మదిని

ధ్యాన మందున గూర్చునె  తన్మయమున.   23 


సృష్టికర్త యజుడు శ్రీవాణినాథుండు 

          సత్యలోక ము నుండి స్వయము గాను 

తపసి వాల్మీకిని  దర్శించ దలచియు 

         రాయంచ పై వచ్చె రాగమునను 

వచ్చిన నలువను వాల్మీకి గాంచియు

         ముకుళిత హస్తాల ముందు కొచ్చె

ఆర్ఘ్యంబు నిచ్చియు నంజలి ఘటియించి 

          వేధను పూజించె వినయ ముగను

అంత బ్రహ్మ దేవు డర్హాస నంబున

కూర్మి తోడ నచట కూరు చుండె

యజుని యాజ్ఞ తోడ నచటనే వాల్మీకి

వేరు చోట నుండె వినయ ముగను           24 


పులుగులు రెండు శాఖ పయి

         పొందుచు సౌఖ్యము హాయి నుండగన్

యలుగును క్రూరత న్నొదలి

         నందలి పెంటిని గొట్ట నేలపై

గిలగిల లాడుచున్ పడియె ,

         కీడొన రించిన లుబ్ధకుండు యీ

యిల పయి నుండగన్ తగిన

         హేతువు నుండదు చింత సేయగన్

        

క్రౌంచమును బట్టు తలపున క్రౌర్యమునను

కామకేళిలొ మునిగిన ఖగము నొకటి

కోల తోడను నేలకు  కూల గొట్టె

నెంత పనిజేసె దుర్మార్గు డెఱిగి యెఱిగి !    25 


మౌని వాల్మీయి యారీతి మనము నందు

యలుగు పాటున పడినట్టి పులుగు గతిని

బాధ లోనుండి  వచ్చిన పలుకు రీతి

మననమొనరించు చుండెను మఱియుమఱియు 26 



బ్రహ్మ దేవు డంత పరికించి మౌనిని

యమిత కరుణ తోడ నభయ మిచ్చె 

కలవరమున నుండ గమనించి యతనితో 

పరమ కరుణ తోడ పలికె నిట్లు                   27 


గోపాలుని మధుసూదనరావు 🙏

పోతన గారి భాగవతం లోని పద్యాలు

 కంజాక్షునకు గాని కాయంబు కాయమే? 

పవన గుంభిత చర్మభస్త్రి గాక, 

వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? 

ఢమ ఢమ ధ్వనితోడి ఢక్క గాక, 


హరి పూజనము లేని హస్తంబు హస్తమే? 

తరుశాఖ నిర్మిత దర్వి గాక, 

కమలేశు జూడని కన్నులు కన్నులే? 

తను కుడ్య జాల రంధ్రములు గాక, 


చక్రిచింత లేని జన్మంబు జన్మమే? 

తరళ సలిల బుద్బుదంబు గాక, 

విష్ణుభక్తి లేని విబుధుండు విబుధు( డే? 

పాదయుగముతోడి పశువు గాక.''


తాత్పర్యం :

పద్మాక్షుడైన విష్ణుమూర్తికి సేవ చేయని శరీరం శరీరం కాదు. గాలితో నిండిన తోలు తిత్తి మాత్రమే.

వైకుంఠ వాసుడైన విష్ణుమూర్తిని స్త్రోత్రం చేయని నోరు నోరు కాదు,కేవలం ఢమ ఢమ అని శబ్దం చేసే చర్మపుఢక్క మాత్రమే.


హరిని పూజించని చెయ్యి చెయ్యే కాదు, కేవలం చెట్ల కొమ్మతో చేసిన తెడ్డు మాత్రమే.


ఇందిరాపతిని చూడని కన్నులు కన్నులే కావు,,

శరీరమనే కిటికీ రంధ్రాలు మాత్రమే.

సుదర్శనాయుధుని చింతించని జన్మము జన్మమే కాదు, నీటిపైని కదిలే బుడగ మాత్రమే.

విష్ణుభక్తి లేని పండితుడు పండితుడు కాదు,రెండు పాదాలతో నడిచే పశువు మాత్రమే.


భగవంతుడు మనిషికి కరచరణాది అవయవాలు ప్రసాదించాడు. ఆ కారణంవల్ల మనిషి దేవుని పట్ల కృతజ్ఞతతో ఉండటం ఒక రకమైతే ఆ అవయవాలను విష్ణు సేవకుఅర్పితం కావాలని చెపుతున్నారు.

_భగవంతున్ని - ఏమి కోరుకోవాలి

 *_భగవంతున్ని - ఏమి కోరుకోవాలి??? - మన కోరికలు ఎలా ఉండాలి???_*

       మానవ జీవితానికి కోరికలు అనంతం, జీవితం నీటి బుడగ వంటిదని తెలిసీ కలకాలం బతకాలనుకొంటాడు. 

    నిరంతరం సుఖాల్లో తేలియాడాలని  తపిస్తాడు, తేలికగా తన కోరికలు తీరే మార్గాలు అన్వేషిస్తాడు. 

    భగవంతుడి దయ ఉంటే తన  కోరికలు తీరతాయన్న స్వార్థంతో పూజిస్తాడు...

 భగవంతుడు దయామయుడు, అందరి ప్రార్థనలు వింటాడు, ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహిస్తాడు. 

నిస్వార్థంగా భగవంతుని నమ్ముకున్నవారికి అడగకపోయినా అనుగ్రహిస్తాడు...


కైకసి పుత్రులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుణ్ని సంతోషపెట్టి వరాలు పొందాలని ఘోరమైన తపస్సు ప్రారంభిస్తారు, రావణుడు వెయ్యి సంవత్సరాల తపస్సు పూర్తికాగానే ఒక తలను పూర్ణాహుతి కావిస్తూ పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తన పదో తలను కూడా ఆహుతి చేయబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు, తనకు మరణం లేని వరం ప్రసాదించమంటాడు. 

అలాంటి వరం ప్రసాదించడం అసాధ్యమంటూ మరేమైనా కోరుకొమ్మంటాడు బ్రహ్మ...

మానవులు తనకు గడ్డిపరకల వంటివారని, కనుక దేవతలు, గరుడ, గంధర్వ, పన్నగ, యక్షుల చేతిలో చావు లేకుండా వరం కోరుకుంటాడు రావణుడు. 

అలాగేనని అనుగ్రహించిన బ్రహ్మ రావణుడు బలి ఇచ్చిన తొమ్మిది తలలు తిరిగి పుట్టేలా కూడా వరం ఇస్తాడు.

కుంభకర్ణుడు గ్రీష్మ రుతువులో అగ్ని మధ్య నిలబడి, వర్షరుతువులో వానలో తడుస్తూ, శిశిరరుతువులో నీటి నడుమ నిలబడి పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు.

      అతడి తపస్సుకు మెచ్చి పరమేష్టి వరమీయ సంకల్పించగానే - అతడికి వరాలు ప్రసాదించవద్దని దేవతలు అడ్డుపడతారు. 

సరస్వతీదేవిని కుంభకర్ణుడి నాలుకపై ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే - నిర్దయ బదులు సరస్వతీదేవి ప్రేరణతో నిద్దుర కావాలంటాడు కుంభకర్ణుడు, తథాస్తు అంటాడు కమలాసనుడు....


విభీషణుడు ఒంటికాలిపై నిలబడి అయిదు వేల సంవత్సరాలు, సూర్యుడి గతిని అనుసరించి తిరుగుతూ మరో అయిదువేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. 

అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం  కోరుకొమ్మంటే విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనూ తన బుద్ధి ధర్మమందే నిలిచి ఉండాలని, సర్వకాల సర్వావస్థల్లో తన బుద్ధి ధర్మమార్గాన్ని వీడిపోకుండా ఉండేలా అనుగ్రహించమని కోరతాడు...

ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా వారి బుద్ధులను బట్టి వరాలు పొందగలిగారు.

 లోకాలను జయించి చిరంజీవి  కావాలనుకున్న రావణుడి కోరిక నెరవేరలేదు. 

కోరకుండానే చిరంజీవి కాగలిగాడు విభీషణుడు...

కుంభకర్ణుడు శయన మందిరంలో నిద్రావస్థలో ఉండిపోయాడు...


_భగవంతుడి శరణు వేడుతున్నవారు పరమేశ్వరుడి ప్రీతి కొరకు వేచి ఉండాలి_

   _తమ ఇచ్ఛానుసారం ఈశ్వరుణ్ని జరిపించమని కోరడమంటే ఆయనను శాసించినట్లవుతుంది._

 *ఆయనను ఒప్పించడం ఎవరికీ సాధ్యం కాదు, ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో భగవంతుడికి తెలుసు* ఇది అర్థం చేసుకున్నవారికి- భగవంతుణ్ని కోరికలు లేని శరణాగతి వేడుకోవాలని అవగతమవుతుంది....


_తృప్తిని మించిన సంపద లేదు, అంతులేని కోరికలు కోరుకుంటూ తీరడం లేదని ఆవేదన చెందేవారికి  జీవితమంతా ముళ్లబాటే, భగవంతుడు ప్రసాదించిన శక్తియుక్తులను వినియోగించుకుంటూ తృప్తితో జీవనం సాగించేవారికి ఆనందం వెన్నంటే ఉంటుంది...-

        *_🥀శుభమస్తు🥀_*

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

దేవాలయముల యందు


దేవాలయముల యందు భక్తులు చేయకూడని పనులు దేవాలయాల్లో ఇతరులకు నమ స్కారంచేయకూడదు!? 

ఎందుకో తెలుసా?

                                                                                                        ఆలయాల్లోఇతరులకునమస్కా రము చేయకూడదు. ఎందుకంటే భగవంతుని ముందు-అందరూ సమానులే అని భావించాలి.


దేవాలయాలుపంచ(ఐదు)రకములుగా ఉంటాయి.

స్వయంవ్యక్త స్థలాలు:- భగవంతుడే స్వయంగా వెలసినవి.


దివ్యస్థలాలు:- దేవతలచేప్రతిష్టిం పబడినవి.


సిద్ధ స్థలాలు:- మహర్షులు, తప స్సుచేసి సిద్ధి పొందినవి, స్వాములు ప్రతిష్టించినవి.


పౌరాణిక స్థలాలు:-పురాణాలలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి.


మానుష స్థలాలు:- రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ట చేయబడి ఉం టాయి.


దేవాలయ గోపురాలు:-

హిందూ దేవాలయాల్లో ఎక్కువగా గాలి గోపురాలు ఉంటాయి. గాలిగోపురం, ప్రధాన ద్వారం,వైకుం ఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల తదిత ర విభాగాలు ఉంటాయి.


ఈ పనులు చేయకండి:-

దేవాలయాల్లో ఆగమశాస్త్రం ప్రకా రము పూజారులు, భక్తులు, అధికా రులు ఏవిధంగా వ్యవహరించకూడదంటే ముఖ్యంగా ఆలయంలోపలి కి ఎవ్వరూ కూడా వాహనాలలో రా వడం చెప్పులు,బూట్లు,పాదరక్షలు వంటి వాటితో తిరగడంచేయరాదు.


దేవాలయమునకు ప్రదక్షణలు చేసేఅప్పుడే లోపలికి ప్రవేశించాలి.

ఆలయం లోపలికి తలపాగా, టోపిధరించి వెళ్లకూడదు. అలాగే చేతుల్లో ఏవైనా ఆయుధాలను పెట్టుకుని అస్సలు ప్రవేశించకూడదు.


మనముతినే,తినుబండారాలను తీసుకుని వేళ్ళరాదు.          ఆలయంలో దైవసన్నిధికి ఒట్టి చేతు లతోగాని, కుంకుమ పెట్టుకోకుండా గాని, తాంబూలచర్వణం చేస్తూగాని, తినుబండారాలేవైనా తింటూ గాని దేవాలయంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరాదు.


దేవాలయము తీసిఉన్న సమయమున నిద్రపోరాదు


దేవాలయంలో అడుగుపెట్టినతర్వా త పగలు,నిద్రపోవడం, కాళ్లు చాపు కుని కూర్చోవడం వంటి పనులను కూడా చేయరాదు. అలాగే ఆలయ ప్రాంగణంలో మల, మూత్ర విసర్జన, ఉమ్మివేయుట,వంటి పనులు చేయ కూడదు.


దేవాలయమునదైవసన్నిధిలోనవివాదాలు పెట్టుకోరాదు.


ఆలయాల్లో ఎవ్వరితోనూ. ఎప్పటి కీ వివాదం అనేదే పెట్టుకోరాదు. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఏ జీవికీ హాని కలిగించడం లేదా హింసిం చడం వంటివి అస్సలు చేయరాదు.


ఇతరులతోదేవాలయముపైవిమర్శలు,దైవదూషణ,పరనింద చేయకూడదు.


దేవాలయ ప్రాంగణంలో అహంకారం, గర్వంతో, అధికార దర్పంతో అస్సలు ఉండకూడదు. దేవుని ఎదుట పరస్తుతిని, పరనింద వంటి పనులను చేయరాదు.                                  ఒకే చేతితో నమస్కారం చేయరాదు. అధికార గర్వంతో దేవాలయమున కూడని సమయాన అకాలమందున దైవప్రాకారంలో ప్రవేశించి అకాల 

సేవలను చేయించరాదు. అలాగే, దేవుని ఎదుట ప్రుష్ఠభాగం చూపిస్తూ కూర్చోకూడదు.                                            అధికాదర్పము చూపించి తనఉనికి మరచి ప్రవర్తించరాదు.                              తనకుభక్తి శ్రద్దలేకుండా తన ద్రవ్యం,  తాను సంపాదించని పూజా ద్రవ్యములతో పూజలు చేయించుకొనరాదు. దాన, దక్షణలులేని పూజలు నిరర్దకములు .ఫలితము నివ్వజాలవు. అశుభహేతువులు.                     దేవాలయములందు ఆగమవిధులను అనుసరించి నడచుకొనవలెను. దేవాలయ పరిపాలనకు సహకరించి దేవాలయ నిత్యసేవాదులు నడచుటకై ధనమును దానమిచ్చుట. భగవానుని  కి ధనము(హుండిలో) నిక్షిప్తముచేయుట, (వేయుట) ఆర్జిత సేవలయందు దేవాలయమున సహస్రనామ, అష్టోత్తరశతనామ, ,అభిషేకము,హోమములకు, వివిధపూజాసేవలకై, తప్పనిసరిగా అందరుటిక్కేట్టు తీసుకొనుట, విధిగా చేయవలసిన పనియని, టిక్కేట్టును తీసుకొనుట అవమానమని భావించి టిక్కేట్టును తీసుకొనక చేయించుకొను పూజలు దైవాపరాధములు,దైవ ద్రోహముగా ఆగమమున చెప్ప బడినది. అట్టిపుాజ ఫలసూన్యము. అశుభముగా తెలియనగును.

                

పత్రం,పుష్పం,ఫలం,తోయం,యో మేభక్త్యా ప్రయచ్చతి,అని శాస్ర్తవచనము.                               కావునమనము భక్తి శ్రద్దతోదేవాల యమందు మెలగ వలసి ఉన్నది. ఆలయ నియమానుసార విధు లను అనుసరించి దైవదర్శనము అ ర్చనలు,సేవలు, కైంకర్యములు చేయవలసిన అవుసరం ఉన్నది, అన్న విషయము అందరము గ్రహించి పాటించాలి. 

స్వస్తి🙏🙏🙏🙏

భయమే మరణం


భయమే మరణం:- భయపడుతూ జీవించేవారు అనుక్షణం మరణిస్తూ ఉంటారు. అలాగే వీరికి తరుచూ అనారోగ్యాలు వస్తాయి. 

ఎవరో ఏదో తీసుకెళ్లిపోతారనీ, మన నుండి లాగేసుకుంటారనీ, మనల్ని తొక్కేస్తారనీ కుంచించుకుపోయి భయంభయంగా బ్రతకడం మంచిది కాదు.


జీవితం నుండి శాశ్వతంగా తీసుకెళ్లగలిగేది ఏదీ ఉండదు. వేరే వాళ్లు లాక్కునేది ఏదీ ఉండదు. నిరంతరం మొహంపై వెలిగే కల్మషం ఎరుగని చిరునవ్వు మాత్రమే ఉన్నన్నాళ్లూ జీవితాన్ని వెలిగిస్తుంది. మన సంకుచితాలు అన్నీ మన మనస్సుని బంధీఖానా చేసి ఒరిపిడికి గురిచేసే ఛెయిన్స్ మాత్రమే. వాటిని ఎంత త్వరగా తొలగించుకుంటే అంత మంచిది.


స్వార్థాలూ, కుట్రలూ, గాసిప్స్, పక్కోడి గురించి చెడ్డగా మాట్లాడడాలూ, అనవసరమైన క్యూరియాసిటీలూ, కుల, మత, ప్రాంతీయాభిమానాలూ, ఇతర సంకుచిత స్వభావాలను అధిగమించినప్పుడు మాత్రమే నిజమైన హృదయం వికసిస్తుంది. లేదంటే ఉండేది బానిస బ్రతుకే. జైల్లో ఖైదు చేసిన నేరస్థుడు, స్థంభానికి కట్టేసిన జంతువు ఎలాగైతే అటూ ఇటూ ఓ ఛట్రంలో తిరుగాడుతూ సంఘర్షణ పడుతుందో అలాంటి నీ మానసిక సంఘర్షణే నీ శాపాలూ, నీ దురదృష్టం అనే పదాలూ! వాటిని అధిగమించు. ఆత్మ విశ్వాసం , భగవాన్ పై విశ్వాసం, ధర్మ ఆచరణ , ఇదే ఉత్తమ స్థితి ని శాంతి ని అందిస్తుంది. 

స్వస్తి🙏🙏🙏🙏

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర

 బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, తత్వమూలమైన శక్తిని పరబ్రహ్మ తత్వ మని, ఆ పరబ్రహ్మ తత్వము శ్రీ రూపంలో కలదని అదియే ఓంకారమని యిది తెలుసుకొనుట పరబ్రహ్మ తత్వము. ఎలా తెలియాలి శ్రీగురు అనగా అది ఏమి? శ ర ఈ అనే పదం శబ్ద మూలం శ్రీ యని దాని శక్తి యెుక్క మూలం వ్యాప్తమైనది జీవులుగా తెలియును. శ్రీ అనే జీవుడు దేహమును ఆశ్రయించి ఆ దేహము ద్వారా తన లక్షణము యిది యని తెలియుట ఆహం బ్రహ్మాశ్మి. నేనే బ్రహ్మమును అనే పరతత్వమే తప్ప వేరు కాదు పరబ్రహ్మమును తెలియుట కష్టం.అది పదార్ధరూపము లేనిది. పదార్ధరూపం దేహం వలెనే. వేరు మార్గం లేదు పరబ్రహ్మ తత్వమును దర్శించుటకు. చతుర్ముఖ తత్వమైన నాలుగు వేదముల విభజన పూర్వక శక్తి లక్షణము జీవమని తెలియును. వేద వాక్యం వకటే కాని వాటిని సాంకేతికంగా సూత్ర ప్రాయంగా విభజించుట చతుర్ముఖ బ్రహ్మ తత్వం. అది రూపం కాదు. విష్ణు రూపం మానవ రూపంగా వామనావతార నామమును ద్వారా మాత్రమే జీవం పూర్ణ మని ఆకారమని తెలిసినది.అంతకు పూర్వం మృగ జంతు లక్షణములు. అవి పూర్ణం కావు ఙ్ఞానం తెలియుటకు. వామనుని వలన మాత్రమే ఆ విషయం తెలిసినది. అవతార మూల శక్తి ఈశ్వర శక్తి రూపమే మానవ రూపం. బ్రహ్మ రూపం మానవ రూపం కాదు. అది వేద పరమైన శక్తియెుక్కమూల లక్షణమే కాని నాలుగు ముఖముల రూపములో దృశ్యం ప్రకృతి రూపము నకు విరుధ్దం. అనగా పరబ్రహ్మ తత్వము అనగా చతుర్ముఖ పరబ్రహ్మ తత్వమే శ్రీ గురు రూపములో గల మానవ జీవన రూప లక్షణమని తెలియుచున్నది. ఈ అనే ఈశ్వర శక్తి రజో రూప లక్షణము విష్ణువుని దాని విభజన పదార్ధరూపమైన జీవ లక్షణము పరబ్రహ్మ తత్వమని పరబ్రహ్మ తత్వమే శంకరుల వారి అహం బ్రహ్మ అశ్మి.అశ్మి లో గల శం రజోగుణ మైన అనగా చైతన్యమైన అశ్మి. అనగాదీనికి ర అనే రుద్ర తత్వంతో చైతన్యమై రశ్మి,అనగా శక్తియని తెలియుచున్నది. అనగా అగ్ని మూలము. దాని చైతన్యం విషుః కిరణరూపంలో గల విష్ణు వ్యాప్తమైన రూపం. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

కైలాస పర్వతం"

 "కైలాస పర్వతం"

ఈ రోజు వరకు ఎవరూ కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేదు?


హిందూ మతంలో కైలాస పర్వతం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది, ఎందుకంటే ఇది శివుని నివాసంగా పరిగణించబడుతుంది. అయితే దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటివరకు 7000 మందికి పైగా ప్రజలు అధిరోహించారు, ఇది 8848 మీటర్ల ఎత్తులో ఉంది, కానీ, ఈ రోజు వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు, దాని ఎత్తు దాదాపు ఎవరెస్ట్ కంటే 2000 మీటర్లు తక్కువ అంటే 6638 మీటర్లు. ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది.


మీడియా నివేదికల ప్రకారం, ఒక పర్వతారోహకుడు తన పుస్తకంలో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడని వ్రాశాడు, కాని ఈ పర్వతం మీద ఉండడం అసాధ్యం, ఎందుకంటే అక్కడ శరీర జుట్టు మరియు గోర్లు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఇది కాకుండా, కైలాస పర్వతం కూడా చాలా రేడియోధార్మికత కలిగి ఉంది.


కైలాస పర్వతం ఎక్కలేకపోవడం వెనుక చాలా కథలు ఉన్నాయి. శివుడు కైలాస పర్వతం మీద నివసిస్తున్నాడని, అందువల్ల జీవించే వ్యక్తి అక్కడికి చేరుకోలేడని కొంతమంది నమ్ముతారు. కైలాస శిఖరాన్ని మరణం తరువాత మాత్రమే లేదా ఎప్పుడూ పాపం చేయని వ్యక్తి మాత్రమే అధిరోహించగలడు.


కైలాష్ పర్వతం మీదుగా కొంచెం ఎక్కిన వెంటనే ఆ వ్యక్తి దిక్కులేనివాడు అవుతాడని కూడా నమ్ముతారు. దిశ లేకుండా ఎక్కడం అంటే మరణం మీద విందు చేయడం, అందుకే ఇప్పటివరకు ఏ మానవుడు కైలాస పర్వతం ఎక్కలేదు.


1999 లో, రష్యన్ శాస్త్రవేత్తల బృందం కైలాస పర్వతం క్రింద ఒక నెల పాటు ఉండి దాని పరిమాణం గురించి పరిశోధించింది. ఈ పర్వతం యొక్క త్రిభుజాకార ఆకారం సహజమైనది కాదని, మంచుతో కప్పబడిన పిరమిడ్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. కైలాస పర్వతాన్ని "శివ పిరమిడ్" అని కూడా పిలుస్తారు.


ఈ పర్వతం ఎక్కడానికి బయలుదేరిన వారెవరైనా చనిపోయారు, లేదా ఎక్కకుండా తిరిగి వచ్చారు.


2007 లో, రష్యన్ అధిరోహకుడు సెర్గీ సిస్టికోవ్ తన బృందంతో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. సెర్గీ తన అనుభవాన్ని ఇలా వివరించాడు: "కొంత దూరం ఎక్కడం నా తలపై మరియు మొత్తం జట్టులో తీవ్రమైన నొప్పిని కలిగించింది. అప్పుడు మా అడుగులు సమాధానం ఇచ్చాయి. నా దవడ కండరాలు సాగడం ప్రారంభించాయి, మరియు నాలుక స్తంభింపజేసింది. నోటి నుండి శబ్దాలు రావడం ఆగిపోయింది. ఎక్కేటప్పుడు, ఈ పర్వతం ఎక్కడానికి నేను సరిపోనని గ్రహించాను. నేను వెంటనే టేకాఫ్ చేయడం మొదలుపెట్టాను, అప్పుడు నాకు విశ్రాంతి వచ్చింది.


"కల్నల్ విల్సన్ కూడా కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు, అతను ఇలా వివరించాడు:" నేను శిఖరానికి చేరుకోవడానికి కొంచెం మార్గం చూసిన వెంటనే, మంచు కురుస్తుంది. మరియు ప్రతిసారీ నేను బేస్ క్యాంప్‌కు తిరిగి రావలసి వచ్చింది. "అప్పుడు చైనా ప్రభుత్వం కొంతమంది అధిరోహకులను కైలాస శిఖరాన్ని ఎక్కమని కోరింది. అయితే ఈసారి ప్రపంచం మొత్తం ఈ చైనా చేష్టలను వ్యతిరేకించడంతో చైనా ప్రభుత్వం ఈ పర్వతం ఎక్కడం మానేసింది. అతను ఎక్కడానికి ప్రయత్నిస్తాడు, అతను ఎక్కలేకపోతున్నాడు, అతని గుండె మారుతుంది. గాలిలో ఏదో భిన్నంగా ఉంటుంది. మీ జుట్టు మరియు గోర్లు 2 రోజుల్లో పెరుగుతాయి, ఇది 2 వారాలలో పెరుగుతుంది. కనిపిస్తోంది. వృద్ధాప్యం ముఖం మీద కనిపించడం ప్రారంభిస్తుంది. కైలాస శిఖరం ఎక్కడం క్రీడ కాదు.


29,000 అడుగులకు పెరిగిన తర్వాత కూడా ఎవరెస్ట్ ఎక్కడం సాంకేతికంగా సులభం. కానీ కైలాస పర్వతం ఎక్కడానికి మార్గం లేదు. నిటారుగా ఉన్న రాళ్ళు మరియు మంచుకొండలతో చేసిన కైలాష్ పర్వతాన్ని చేరుకోవడానికి మార్గం లేదు. అతి పెద్ద అధిరోహకులు కూడా ఇలాంటి కష్టతరమైన రాళ్ళను ఎక్కడానికి మోకరిస్తారు.ప్రతి సంవత్సరం లక్షలాది మంది కైలాష్ పర్వతం చుట్టూ కక్ష్యలోకి వస్తారు. మార్గంలో, మానస సరోవరంను కూడా సందర్శిస్తాడు, కాని ఈ రోజు వరకు ఒక విషయం మిస్టరీగా మిగిలిపోయింది. ఈ పర్వతం తగినంతగా తెలిస్తే, ఈ రోజు వరకు ఎవరూ ఎందుకు ఎక్కలేదు?


ఓం నమఃశివాయ

🙏🙏🙏🙏🙏🙏

మొగలిచెర్ల

 *లక్షణమైన జీవనం..*


"నాచిన్నప్పుడు..నాకు పదేళ్ల వయసుంటుందేమో..సరిగ్గా గుర్తులేదు..నన్ను తీసుకొని మా అమ్మా మా నాయనా మాలకొండకు పోతూ దారిలో ఇక్కడ ఆగారు.అప్పటికి ఈ స్వామి బతికే వున్నాడు..మా నాయన రెండు చేతుల తో దణ్ణం పెట్టాడు..అమ్మ కూడా దణ్ణం పెట్టింది..స్వామీ చెయ్యెత్తి ఆశీర్వదించారు..నాకు బాగా గుర్తు.."కొండయ్యా..అమ్మాయి పేరేంది?.." అని మా నాయనను అడిగాడు.."లక్షమ్మ స్వామీ.." అని మా నాయన బదులిచ్చాడు..మంచిది అన్నాడు..ఆ తరువాత ఏం మాట్లాడింది గుర్తు లేదు..కొంచెం సేపు ఇక్కడే పందిరి కింద కూర్చున్నాము..కొండకు పోయి తిరిగివచ్చేటప్పుడు కూడా మా అమ్మానాయనా స్వామికోసం ఆగారు కానీ..స్వామి కనబడలేదు..మా ఊరుకు వెళ్లిపోయాము.." అంటూ ఆ పెద్దావిడ మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడల్లా గుర్తుచేసుకొని చెప్పుకుంటూ ఉంటుంది..ఆమె మాట్లాడే విధానం లో పల్లెటూరి యాస ఉంటుంది..కానీ అత్యంత భక్తి ప్రపత్తులు అందులో దాగి ఉంటాయి..


"స్వామివారిని చూశావు కదా..నీ గురించి ఆయనేమీ చెప్పలేదా..?" అని నేను అడిగాను.."ఏమో నయ్యా..నాకు గుర్తులేదు..కాకుంటే..మా నాయన నా పేరు చెప్పిన తరువాత..నా తలకాయ మీద చెయ్యిపెట్టాడు..అదొక్కటే గుర్తు..నాకూ ఆశీర్వాదం ఇచ్చాడేమో.." "ఆతరువాత రెండు మూడేళ్లకు అనుకుంటా.."మొగిలిచెర్ల స్వామివారు సమాధి అయ్యాడట.."అని మా వాళ్లే చెప్పుకుంటుంటే విన్నాను..అట్లా జరిగిపోయింది ఆరోజుల్లో.." అని పెద్దగా నిట్టూర్చి చెప్పేది..


"అదృష్టవంతురాలివి తల్లీ..స్వామివారి చేతి స్పర్శను పొందావు..మహానుభావుడు నిన్ను నేరుగా ఆశీర్వదించారు..అంతకంటే నీకేం కావాలి..నీ జీవితం ఎలా సాగింది?" అని ఆవిడను ఒకసారి అడిగాను..


"నాకే లోటూ లేదయ్యా..అప్పట్లో మా ఇళ్లల్లో మేనరికాలో..లేకపోతే దగ్గర బంధువుల్లోనో పిల్లను ఇచ్చేవాళ్ళు..నాకు మాత్రం బైట సంబంధం వచ్చింది..ఆరోజుల్లోనే మా అత్తగారు వాళ్ళు మద్రాసు లో బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు..నా భర్త కూడా అదే వ్యాపారం చేసాడు..లక్షణంగా సంపాదించుకున్నాము..ముగ్గురు బిడ్డలు పుట్టారు..ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు..వాళ్లకూ పెళ్లిళ్లు అయ్యాయి..కొడుకు బాగానే చదువుకున్నాడు కానీ..ఈ వ్యాపారమే బాగుందని ఇందులోనే ఉండిపోయాడు..ఇప్పుడు మద్రాసులో మాకు మొత్తం ఐదు చోట్ల దుకాణాలు ఉన్నాయి..మేము తెలుగు వాళ్ళము అని చెప్పినా నమ్మరు..నాకు పెళ్ళైన తరువాత నేను మా అత్తగారింట్లో ఈ స్వామి గురించి చెప్పాను..మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు..మా అబ్బాయికి వాడి పదహారో ఏట పెద్ద జబ్బు చేసింది..డాక్టర్లు మందులు వాడారు..తగ్గినట్లే తగ్గి, మళ్లీ జబ్బు తిరగబెట్టింది..నేను పట్టుబట్టి మా పెనిమిటి చేత ఈ స్వామికి ముడుపు కట్టించాను..పిల్లవాడికి జబ్బు తగ్గితే..రెండు కట్టలు బియ్యం తీసుకొచ్చి మొగిలిచెర్ల గుడి దగ్గర ఇస్తాను అని మొక్కుకున్నాను..సరిగ్గా వారం రోజుల్లో వాడికి నయం అయింది..వాడు పూర్తిగా కొలుకున్నాక నా భర్తా నేను ఇక్కడికి వచ్చి స్వామి సమాధి కి నమస్కారం చేసుకొని మొక్కు చెల్లించుకున్నాము..ఆరోజు నుంచే మా ఆయన కూడా స్వామి నే నమ్ముకున్నాడు..ప్రతి ఏడూ మేము ఇక్కడికి వచ్చి..మా వంతుగా రెండుకట్టలు బియ్యం ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాము..మా అబ్బాయికి పెళ్లి చేసి ఆ పసుపు బట్టలతోనే వాళ్ళిద్దరినీ ఇక్కడకు తీసుకొచ్చి స్వామి కి దణ్ణం పెట్టించాము.." అని చెపుతూ ఒక్కక్షణం ఆగింది..చీరకొంగుతో కళ్ళు తుడుచుకుంటూ.."పోయిన ఏడాది ఆయన కాలం చేసాడు..అదొక్కటే వెలితి నాకు..ముత్తైదువుగా పోయుంటే బాగుండేది..కొడుకూ కోడలు నన్ను బాగా చూసుకుంటారు.." అన్నది..


నిండైన జీవితం లక్షమ్మది..ఏ లోటూ లేకుండా జీవితాన్ని వెళ్లదీసింది..తాను బ్రతికున్నంత కాలమూ..ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి వచ్చేది..పోయిన సంవత్సరం దత్తదీక్ష ల కాలం లోనే ఆమె మరణించినట్లు మాకు వార్త తెలిసింది..


స్వామివారి వరద హస్త స్పర్శ పొందిన ధన్యజీవి లక్షమ్మ..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

దీర్ఘాయుష్మాన్

 🍀🌺🍀🌺🍀 🌺🍀🌺🍀🌺🍀



       *దీర్ఘాయుష్మాన్ భవ అంటే...*

                  ➖➖➖✍️



      చాలా సంవత్సరాల క్రితం ఓసారి... మహాస్వామి వారి దర్శనానికి  నలుగురై దుగురు పండితులు వచ్చారు.    స్వామి వారికి సాష్టాంగం చేసి,    వారి ముందు కూర్చున్నారు. 


    మహాస్వామి వారు భక్తులతో   మాట్లా డుతూ,     ఆ కూర్చున్న    పండితులను ఉద్దేశించి ఇలా అడిగారు...


   “భక్తులు  నాకు  నమస్కరిస్తే, నేను.... వారిని   “నారాయణ నారాయణ”   అని ఆశీర్వదిస్తాను. మరి  మీరు గృహస్తులు ఏమని అశీర్వదిస్తారు?”


     "మేము ‘దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య’ అని  అశీర్వదిస్తాము,  అదే....     సంప్ర దాయము” అని అన్నారు.


     ”అంటే ఏమిటి?” అని మహాస్వామి వారు ప్రశ్నించారు.


   ”చాలాకాలం సౌఖ్యంగా ఉండు” అని దీని అర్థం.


         మహాస్వామి వారు  అక్కడ  ఉన్న అందరు  పండితులను       అదే  ప్రశ్న వేసారు.   అందరూ   అదే సమాధానం చెప్పారు. 


   మహాస్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి,    “మీరందరూ చెప్పిన  అర్థం... తప్పు!” అన్నారు.


      పండితులు ప్రశ్నార్థకంగా చూసారు. వాళ్ళందరూ   పెద్ద పెద్ద విధ్వాంసులు! సంస్కృత వ్యాకరణాలలో శిరోమణులు. మంచి విద్వత్ కలిగిన వారు.


       సంస్కృత వాక్యం “దీర్ఘాయుష్మాన్ భవ”  అనునది  చాలా   సామాన్యము. సంస్కృత పరిజ్ఞానము ఏమి లేకపోయి ననూ అర్థమగును.    కానీ మహాస్వామి వారు    ఆ అర్థము తప్పు అంటున్నారు, అని పండితులు ఒకరి మొహాలు ఒకరు చూసుకునుచున్నారు.


       వారి పరిస్థితి చూసి    మహాస్వామి

వారు  ”నేను చెప్పనా దాని అర్థం” అని అన్నారు.    పండితులంతా   చెవులు... రిక్కించారు.


    ”పంచాంగములోని (తిథి వార నక్షత్ర యోగ కరణ) పంచ అంగములలో ఉన్న 27 యోగములలో ఒకటి-   ఆయుష్మాన్ యోగము,   11 కరణములలో ఒకటి .... భవకరణము,     వారములలో    సౌమ్య వాసరము  అంటే... బుధవారము అని అర్థం! ఎప్పుడైతే ఇవి మూడు అంటే... ‘ఆయుష్మాన్=యోగము’, ‘భవ=కరణము’, ‘సౌమ్యవాసరము=బుధవారము’ 

కలిసి వస్తాయో అది శ్లాగ్యము!

 - అంటే చాలా శుభప్రదము మరియు యోగ కారకము. 


     కావున "ఇవి మూడు కలిసిన రోజున ఏమేమి   మంచి  ఫలములు     సంభవ మగునో అవి నీకు ప్రాప్తించుగాక”    అని అర్థం!


      ఈ మాటలు     విన్న వెంటనే      ఆ పండితులు ఆశ్చర్యపోయి,     అందరూ మహాస్వామి వారికి      సాష్టాంగం  చేసి నమస్కరించారు....


   అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।



                        🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

నవగ్రహాల అనుకూల స్తితి*

 *నవగ్రహాల అనుకూల స్తితి*


గ్రహాలు అనుకూలించాలి అంటే పరిహార ప్రక్రియలు చేసుకోలేని వారికి ఈ విధంగా చేస్తే గ్రహాలు కొంత వరకు  అనుకూలిస్తాయి. రవిచంద్రులు అనుకూలించాలి అంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి. తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి. గురు బలం కావాలంటే ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి. లేకుంటే రోజు పసుపును పాలతో కలిపి నుదుటన బొట్టు పెట్టుకోవాలి. ఆడవారు అయితే ముఖానికి పసుపు రాసుకోవాలి. శుక్ర గ్రహం అనుకూలించాలి అంటే ఇంటి ఆడ పిల్లలను గౌరవించాలి. ఆదరించాలి అలా చేస్తే శుక్ర గ్రహము వందకు రెండు వందల శాతం అనుగ్రహం ఇస్తుంది. ఒకవేళ ఇంటిలో ఆడపిల్లలు లేకుంటే మేనత్తను గౌరవించాలి. అత్త కూడా లేకుంటే కన్నతల్లిని గౌరవించాలి. కన్నతల్లి కి శుక్రవారం రోజు తాంబూలం ఇచ్చి పాద నమస్కారం చేసుకోవాలి. కుజుడు అనుభవించాలంటే సోదర వర్గాన్ని ఆదరించాలి. సోదరి బాగా చూసుకోవాలి. కార్తీకమాసం వచ్చిన భగినీహస్తభోజనం శుద్ధ విదియ నాడు వస్తుంది. ఆడపిల్ల ఇంటికి వెళ్ళి  భోజనం చేసి బట్టలు పెట్టి  రావాలి.  శని భగవానుడు  అనుకూలించాలి అంటే ఇంట్లో పని మనుషుల పై చికాకు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పనిచేసే వారికి తగినంత జీతం ఇవ్వాలి. ఇంట్లో పని వారు లేకుంటే బీద సాద లను వికలాంగులను ఆదరించాలి. బుధుడు అనుగ్రహించాలంటే మేనమామను ఆదరించాల బాగా చూసుకోవాలి. యోగక్షేమములు బాగా చూసుకోవాలి. 

....

..............

హనుమాన్ చాలీసా

 హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? ఎందుకోసం పుట్టింది.?


ఆపదలుబాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమయిన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము.


వారణాసిలో నివసిస్తూవున్న సంత్ తులసీదాస్ : రామనామ గాన నిరతుడయి బ్రహ్మానందములో తేలియాడుతుండేవారు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలు వెల్లువలవుతూ ఉండేవి. వారిప్రభావము వలన ప్రభావితులయిన జనం వారిద్వరా రామనామ దీక్ష తీసుకుని రామనామ రసోపాసన లో తేలియాడుతుండేవారు. ఎంతోమంది ఇతర మతాలకుచెందిన భక్తులుకూడా రామనామ భజనపరులుకావటం జరుగుతున్నది. ఐతే భగవంతుని పట్ల కాక తమ నమ్మకాల పట్ల మాత్రమే మొండి పట్టుదలకల ఆ మతగురువులకు ఇది కంటగింపుగా వున్నది. వారు తులసీదాసు మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మనమతాన్ని కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ పాదుషావారికి పంపుతుండేవారు.


ఇదిలాఉండగా వారణాసిలో వున్న ఒక సదాచారవంతుడయిన గృహస్తు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మలాంటి అమ్మాయితో వివాహం చేసాడు. వారిద్దరూ చిలకా గోరింకల్లా ఎంతో అన్యోన్యతతో ఆనంద తీరాలు చవిచూస్తున్నారు. కానీ కాలానికి ఈ సుఖ దు:ఖాల తో పనిలేదు కదా ! విధివక్రించి హఠాత్తుగా ఆయువకుడు కన్ను మూసాడు. ఆ అమ్మాయి గుండెపగిలి ఘోరంగా విలపిస్తున్నది. తలబాదుకుంటూ విలపిస్తున్న ఆతల్లిశోకానికి అందరిగుండెలూ ద్రవించిపోతున్నాయి. ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి ఆగవుకనుక బంధువులు శవయాత్రకు సన్నాహాలు చేశారు. శవాన్ని పాడెమీద పడుకోబెట్టి మోసుకుని వెళుతుండగా ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకు వెళ్ళనీయకుండా అడ్డంపడి రోదిస్తుండటంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకుని వుండగా శవ యాత్రసాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగనే సాగుతుంది. శవవాహకులు ఆశ్రమం దాటే సమాయానికి అక్కడ ఇంటివద్ద పట్టుకున్నవారిని విదిలించుకుని మృతుని భార్య పరుగుపరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమములోకి పరుగిడి, ధ్యానస్తులైవున్న తులసీదాసుగారి పాదాలపైన వాలి విలపించటం మొదలెట్టింది.


గాజులు , కాలి అందెల శబ్దం విన్న తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. దానితో ఆయువతి మరింత బిగ్గరగా ఏడుస్తుండటం తో కనులు తెరచిన సంత్ , అమ్మా ! నేను దీవించిన దానిలో తప్పేమున్నది తల్లీ ! ఎందుకిలా దు:ఖిస్తున్నావని అడిగారు. అప్పుడామె : తండ్రీ ! నాలాంటి నిర్భాగ్యురాలిని దీవించి తమలాంటి మహాత్ముల వాక్కుకూడా వ్యర్ధమయిందే అని బాధపడుతున్నాను అని దు:ఖిస్తూ పలికింది. అమ్మా : నా నోట రాముడు అసత్యం పలికించడే ! ఏమయినదమ్మా ! అని అనునయించాడు. 

తండ్రీ ! ఇంకెక్కడి సౌభాగ్యం, అదిగో నాతలరాత నా పసుపు కుంకుమలను మంటలలో కలిపేందుకు వెళుతున్నదని విలపించుట తట్టుకోలేని ఆయన లేచి వెళ్ళీ శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు. అయ్య కొద్దిగా ఆపండి ,అని ఆపి ఆశవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండల జలాన్ని చల్లాడు.


దానితో శవములో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకున్నది. అదిచూసిన జనం జేజేలు పలుకుతూ వారికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. దీనితో ఆయనగురించి మరింత ప్రాచుర్యం జరిగి , తండోపతండాలుగా జనం వారిని దర్శించి రామనామాన్ని స్వీకరించి జపించటం ఎక్కువయినది.


ఇదే అదనుగా భావించిన ఇతరమత గురువులు ఢీల్లీ పాదుషావారికి స్వయముగా వెళ్ళి ,తులసీదాస్ రామ నామము గొప్పదని చెబుతూ మన మతస్తులను ,అమాయకులను మోసంచేస్తున్నాడని, పలుఫిర్యాదులు చేసారు. 

దానితో ఢిల్లీ పాదుషా విచారణకోసం సంత్ గారిని ఢిల్లీ దర్భారుకు పిలిపించారు.

తులసీదాస్ గారూ మీరు రామనామము అన్నిటికన్నా గొప్పదని ప్రచారము చేస్తున్నారట. నిజమేనా ? అని పాదుషా ప్రశ్న.

అవునుప్రభూ ! సృష్టిలోని సకలానికీ ఆధారమయిన రామనామ మహిమను వర్ణించ నెవరితరము.?


పాదుషా : 

అలాగా? రామనామముతో దేనినయినా సాధించగలమని చెబుతున్నారట నిజమేనా?


సంత్ : 

అవును ! రామనామము తో సాధించనిదేమున్నది.


పాదుషా : 

మరణాన్ని సహితం జయించకలదని చెప్పారట?


సంత్ : 

అవును ప్రభూ ! రామనామానికి తిరుగేమున్నది.


పాదుషా : 

సరే ! మేమిప్పుడొక శవాన్ని తెప్పిస్తాము ,దానిని మీ రామనామము ద్వారా బ్రతికించండి ,అప్పుడు నమ్ముతాము.


సంత్ : 

క్షమించాలి ప్రభూ! జననమరణాలు జగత్ప్రభువు ఇచ్చాను సారంగా జరుగుతాయి కానీ మనకోరికలతో కాదు.


పాదుషా : 

చూడండి తులసీదాస్ జీ మీరు మీమాటను నిలుపుకోలేక మీరుచెప్పే అబద్దాలను నిరూపించుకో లేక ఇలాంటి మాటలు చెబుతున్నారు, మీ రామ నామము, మీరు చెప్పినవి అబద్దాలని చెప్పండి వదలివేస్తాము అని పాదుషా ఆగ్రహించాడు.


రామనామము దాని మహిమ సత్యమని పలికిన తులసీదాస్ మోసగాడిగా భావించిన పాదుషా చివరికి తులసీ నీకు చివరి అవకాశం ఇస్తున్నాను

రామనామము మహిమ అబద్దమని చెప్పి ప్రాణాలుదక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని మొండిగా ఆజ్ఞా పించాడు. అప్పుడు తులసీదాసు "ఈ విపత్కర పరిస్తితిని కల్పించిన నువ్వే పరిష్క్రించుకోవాలని" మనసులో రామునికి మనవి చేసుకుని ధ్యాన మగ్నుడయ్యాడు. అది తనను ధిక్కరించటమని భావించిన పాదుషా ,తులసీ దాసుని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు.

అంతే ! ఎక్కడ నుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీ దాసును బంధించవచ్చే సైనికులవద్ద ,ఇతర సైనికులవద్ద ఆయుధాలు లాక్కుని వారికేగురిపెట్టి, అందరినీ కదలకుండా చేసాయి. సభికులు ,ఏకోతి మీదపడి కరుస్తుందోనని హడలిపోతూ వున్నారు. ఈ కలకలానికి కనులువిప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది. 

దీనికి కారణమేమిటాని చుట్టూ చూడగా , సింహద్వారము మీద ఆసీనులై వున్న హనుమంతుడు దర్శనమిచ్చాడు. దానితో ఒడలు పులకించిన సంత్ ......

జయ హనుమాన జ్ఞాన గుణసాగర............ అంటూ 40 దోహాలతో ఆశువుగా వర్ణించాడు

దానితో ప్రసన్నుడయిన పవనసుతుడు, తులసీ నీ స్తోత్రంతో మాకు ఆనందమయినది నీకేం కావాలో కోరుకో అని అన్నారు

అయితే మహాత్ములెప్పుడూ తమస్వార్ధం కోసం కాక లోకక్షేమం కోసము మాత్రమే ఆలోచిస్తారు కనుక , తండ్రీ ! ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమివ్వాలని విన్నవించుకున్నాడు

దానితో మరింత ప్రియం కలిగిన స్వామి , తులసీ మాకు అత్యంత ప్రీతి పాత్రమయిన ఈస్తోత్రంతో మమ్మెవరు స్తుతించినా వారిరక్షణ భారం మేమే వహిస్తామని వాగ్దానం చేశారు

అప్పటినుండి ఇప్పటివరకు హనుమంతుని చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై నెరవేరుస్తూనేవున్నది....... 

త్రయంబకుడు

 త్రయంబకుడు అంటే అర్థం ఏమిటి ?

(శివ తత్వాన్ని వివరించే పోస్ట్)

మహా మృత్యుంజయ మంత్రం:

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం

ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్


అర్ధం :-

అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక!


ఉదయం తెలిసినామె మా యింటికి వచ్చారు. మాటల మద్యలో... ఈ మద్య ఒకరి సూచన ప్రకారం 'మహా మృత్యుంజయ మంత్రం' రోజూ పదకొండుసార్లు చదువుతున్నానండి. కానీ, కొన్ని సందేహాలున్నాయండి. ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా, మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదండీ... మరి అలాంటప్పుడు ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు? అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియడం లేదు. అది అడుగుదామనే వచ్చానండీ ... అన్న ఆమెకు, నా అవగాహన మేరకు నేనిచ్చిన బదులిది -


మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదండీ, పునర్జన్మ లేకపోవడం.అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగంటారా?


ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి. సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. అంటే మాయనుండి విడివడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. (జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు. ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు. పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదండీ.


ఈసరికే మీకు అర్ధమై యుంటుంది, దోసపండుతో ఎందుకు పోల్చారోనన్నది.


ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. ఆ ఆరాధన ఎలాగుండాలంటే -


జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం.


మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం. ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి. శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -


పంచభూతాత్మకుడు :- శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.


త్రయంబకుడు :- శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.


నామము :- శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు.


విభూతిదారుడు :- సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.


త్రిశూలం :- సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.


నాగాభరణుడు :- సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.

PARENTS' HOUSE

 PARENTS' HOUSE

It is indeed a lovely post to share with you 😊


*The Parents' house* (father and Mothērs house)


*It's the only house* where you can go to dozens of times without an invitation. 

*The only house* where you can put the key in the door and enter directly. 

*The house* that has loving eyes that stare at the Đoor until they see you. 

*The house* which reminds you of your care free days, stability and your happiness during your Chîldhood. 

*The house* in which your presence and look at your mother’s and father’s faces is for you a bliss and your conversation with them is a reward.

*The house* that if you do not go, the hearts of its owners will shrink, and if you hurt them,  they will be broken.

*The house* in which two candles were burnt to light up the world and fill your life with håppinēss and joy.

*The house* where the dining table is pure for you and has no hypocrisy. 

*the house* that if the food time arrives and you don't eat, the hearts of its owners will be broken and annoyed.

*The house* that offers you all the laughs and Håppinēss.


*Ôh Chîldrēn*, find out the value of these houses before it's too late. 


 *Lucky are those who have their parents house to go to.*

అతనొక్కడే

 అతనొక్కడే … !!!

డబ్బుకు విలువుండొచ్చు.. కానీ “డబ్బుతో”నే విలువ రాదు.. ఆ విషయాన్ని నిరూపించిన అతికొద్దిమందిలో పూసపాటి అశోక్ గజపతిరాజు ఒకరు.. ! విగ్రహంలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ…నిండైన మనిషి.. రాజు గారు…! నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా…. చిన్న మరక కూడా లేకుండా.. స్వచ్చపాలిటిక్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. నాలుగుదశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన్ను ఎవరూ వేలెత్తి చూపింది లేదు.. పల్లెత్తు మాట అనింది లేదు.. కానీ ఈ మధ్యనే చెడ్డీలేసుకున్న ఓ చిల్లర గ్యాంగ్ ఆయన కోట ముందు కూతలు పెడుతోంది… గతి తప్పి మతి లేకుండా మాట్లాడే మూక రాజుగారి కథ తెలుసుకోండి.. రాజకీయనాయకుడు కాకముందే ఆయన “రాజు.. ” దేశంలోని ప్రముఖ సంస్థానాల్లో ఒకటైన విజయనగర సంస్థాన వారసుడు.. కోటలని.. కోట్లని కాదనుకుని….భూములను బంగళాలను వదులుకన్న అసామాన్యుడు..! ఎలైట్ సర్కిల్ లో పెరిగినా.. విజయనగరం వీధుల్లోనే తిరిగిన సామాన్యుడు..! గ్వాలియర్ రాజసంస్థానాల్లో చదువుకున్నాడు. పెద్ద పెద్ద పట్టాలు లేకపోవచ్చు.. కానీ ఆయన డిగ్నిటీ ముందు అవన్నీ దిగదుడుపు..! కార్పోరేటర్ గా ఉంటేనే కళ్లు నెత్తికెక్కినట్లు బిహేవ్ చేస్తున్న రోజులివి..! ఎమ్మెల్యేగా.. మంత్రిగా..కేంద్రమంత్రిగా ఉన్నా ఆయన ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు విమానాల శాఖ మంత్రిగా ఉన్న అశోక్ ఫ్యామిలీకి.. 1945లొనే సొంత విమానం ఉండేది. కలకత్తా నుంచి చెన్నై వరకు మొత్తం ఈస్ట్ కోస్ట్ లో ఎక్కడా బీఎస్సీ కాలేజ్ లేదు.. అశోక్ తండ్రి పీవీజీ రాజు వందేళ్లకు మునుపే.. విజయనగం “మహారాజ” కాలేజ్ లో బీఎస్సీ కోర్సు పెట్టించారు.


దాదాపు 2 లక్షల ఎకరాలు విద్యా సంస్థలు, దేవాలయాలకు ఇచ్చిన కుటుంబం అది…! ‬ తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కుగానీ ఎస్పీ ఆఫీసు కుగానీ ఫోన్ చేసి ఈ కేస్ మా వాళ్లే … వదిలేయండి అని గాని పలానా వల్ల మీద కేస్ పెట్టండి అని గానీ చెప్పీన దాఖలా లేదు. . ఎమ్మెర్వో నుంచి కలెక్టర్ వరకు ఎవరికీ ఫోన్ చేసి ఔట్ ఆఫ్ ద వే పని చేయమని ఒకసారి కూడా అడగలేదు..


పనులు చేసిపెడితేనే “మనవాడు” అనుకునే రాజకీయంలో జనం ఆయన్ను ఓసారి ఓడించారు..చివరకు జనమే తప్పు తెలుసుకున్నారు… తప్పితే రాజుగారు తన వైఖరి తప్పలేదు. గల్లీ లీడర్లు కూడా ఫార్చునర్లూ.. ఎండీవర్లు వాడుతుంటే.. ఆగర్భ శ్రీమంతుడైన ఆయన.. “నానో” కారులో తిరిగేవారు ముందూ వెనుక పైలట్లు కూడా అవసరం లేదు.. సీటు బెల్టు పెట్టుకుని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటారు. ప్రాంతీయ పార్టీలో ఉన్నా.. కూడా ఆయన “విలువ” ఏమాత్రం తగ్గలేదు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు రాష్ట్రం అంతా “ఆదేశిస్తారు..” కానీ విజయనగరంలో “పాటిస్తారు” . కొన్ని సందర్బాల్లో పార్టీ స్థానిక నాయకత్వం ఎక్కడన్నా అభ్యంతరం చెప్పినా “అశోక్ చెప్పినట్లు” చేయండంటారు. పార్టీ అధినేతకు ఆయనంటే అంత గౌరవం..! రిజల్ట్స్ వచ్చిన వెంటనే కేంద్రమంత్రిగా ఆయన్ను ప్రకటించగానే.. అంతా సైలెంట్..! రాజకీయాలకు సంబంధించి ఆయన రోల్ మోడల్.. ఎంపీ నిధులతో అంతా రోడ్డేసుకుని.. బిల్డింగులు కట్టిస్తే…ఈయన స్కూలు పిల్లలకు బెంచీలు చేయింతారు. వారికి KINDLE ఈ- బుక్ రీడర్లు కొనిపించి పుస్తకాలు చదవమన్నారు. ఎవరో చిన్నారి ఆయన గొప్పతనం గురించి చెబుతుంటే విని పసిపిల్లాడిలా ఏడ్చేశాడు.


అశోక్ తన కారును తానే స్వయంగా కడుక్కుంటారు. ఓసారి ..ఆయన కారు కడుక్కుంటే చూసిన గన్ మెన్.. అదేంటి సార్ మీరు చేస్తున్నారు.. మేమున్నామంటూ.. వస్తే.. “మీ డ్యూటీ మీరు చేయండ”ని పంపేశారు.. కేంద్ర కేబినెట్ మంత్రి అయినా ఆయనలో ఏ మార్పూ లేదు. పోయినవారం విజయనగరంలో తమ దివానంలో మేనేజర్ గా పనిచేసే ఆయన షష్టి పూర్తి కి వెళ్ళారు. .ఆయన షష్ఠి పూర్తికి అశోక్ దంపతులు, కూతురు వచ్చారు. పార్టీ లీడర్లే కాదు కనీసం అనుచరులు కూడా లేకుండా వాళ్లే వచ్చారు… వాళ్ళది రెండు అంతస్తుల ఇరుకు ఇల్లు. . మేడ మీద వరండాలో హోమం చేశారు. హోమం పూర్తయ్యే వరకూ వరండాలోనే ఎండలో గంటకు పైగా ఉన్నారు. హోమం తరువాత మరో గంటసేపు చిన్న గదిలో ఉన్నారు. షష్ఠి పూర్తి దంపతులకు మంగళ స్నానాలు చేయిస్తారు. అశోక్ దంపతులు మొదట గా వారి మీద నీళ్లు పోసి. అప్పుడు వెళ్లారు. మాములు ఎమ్మెల్యే కూడా . తాను వస్తే ఘనంగా స్వాగతం చెప్పాలి…ఎంతో గౌరవించాలి అనుకుంటాడు. కానీ అశోక్ తన ఉద్యోగి షష్ఠి పూర్తి కి మాములుగా వచ్చి రెండుగంటలున్నాడు.. అదీ అశోక్..!


ఉద్యోగులను గౌరవించడమే కాదు.. రూల్స్ తప్పితే అంతే కఠినం..!

అశోక్ కూతురు చిన్నప్పుడు 6 వ తరగతి కోసం విశాఖ వ్యాలీ స్కూల్ కి అప్లై చేశారు. అప్పుడు ఆయన రాష్ట్ర మంత్రి గా ఉన్నారు. కానీ వాళ్ళ అమ్మాయికి మెరిట్ లిస్టులో సీట్ రాలేదు. ఆ స్కూల్ కమిటీ కి విశాఖ కలెక్టర్ చైర్మన్. అశోక్ ఆఫీసియల్ పీఏ కలెక్టర్ కి ఫోన్లో విషయం చెప్పాడు. ఆ విషయం అశోక్ కి కూడా చెప్పలేదు. ఇలాంటి చిన్న విషయం చెప్పేది ఏముంది.. వాళ్ళ అమ్మాయి కి సీట్ కోసమే కదా అనుకున్నాడు. కలెక్టర్ ఆ అమ్మాయికి సీట్ ఇచ్చాడు. ఓ వారం తరువాత అశోక్ ఎదో మీటింగ్ కొసం విశాఖ వెళ్లారు. అప్పడు కలెక్టర్ ఆయన దగ్గరకు వచ్చి ‘ సార్, మీ అమ్మాయికి సీట్ ఇచ్చాము. ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. నేను పర్సనల్ గా కేర్ తీసుకుంటాను.’ అని చెప్పి.. అశోక్ దగ్గర మార్కులు కొట్టేద్దామని అనుకున్నాడు. దాంతో అశోక్ కు అసలు విషయం తెలిసింది. అక్కడే తన పీఏ ను పిలిచారు. ‘ మీరు మీ పేరెంట్ డిపార్టుమెంట్ కు వెళ్లిపొండి’ అని చెప్పేశారు. తరువాత విజయనగరం కలెక్టర్ కు చెప్పి ఆయన్ని రిలీవ్ చేసేసి కొత్త పీఏ ను పెట్టుకున్నారు.


అశోక్ స్టేట్‌లో మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆయన కూతురుకు మెడిసిన్ సీట్ వచ్చింది. ర్యాంక్ కొంచెం ఎక్కువ వచ్చింది. దాంతో నిజామాబాదో మరిదో తెలంగాణా జిల్లా కాలేజ్ లో సీట్ వచ్చింది. దాంతో ఆ అమ్మాయి రోజు తమ కార్ లో హైదరాబాద్ బస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసి బస్సులో కాలేజీకి వెళ్ళేది. ఈ విషయం తెలిసి సీఎం పేషీ అధికారులు ఆ అమ్మాయిని సెకండ్ ఇయర్‌లో హైదరాబాద్ ఉస్మానియా /గాంధీ మెడికల్ కాలేజీ స్లయిడింగ్‌లో తెచ్చేద్దాము అనుకున్నారు. అందుకు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే చాలు. అదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. అశోక్ అందుకు ఒప్పుకోరు అని బాబు అన్నాడు. అయిన మీరు ట్రై చేయండి అని చెప్పాడు. దాంతో సీఎం పేషీ సెక్రటరీ అశోక్‌తో మాట్లాడాడు. దానికి ఆశోక్ స్పందిస్తూ ‘ హైదరాబాద్ కాలేజీలో చదవాలి అంటే మా అమ్మాయి ఇంకా మంచి ర్యాంక్ తీసుకోవాల్సింది. తెచ్చుకోలేదు. కాబట్టి అక్కడే చదవాలి. అంతే’ అని అనేశారు. 


విమానంలోకి లైటర్‌తో వస్తే నన్ను పట్టుకోలోదేంటి అని విమానాశ్రయ సెక్యూరిటీకి షాక్ ఇచ్చారు.. దాదాపు దివాళాలో ఉన్న ఏవియేషన్‌ను దారికి తెచ్చారు. తన సొంత ఊరిలో అంతరజాతీయ విమానాశ్రయం వస్తున్నా.. రూల్స్ కు విరుద్దంగా ఒక్క పనీ చేయలేదు. ఔట్ ఆఫ్ ది వే ఆయన డిక్షనరీలోనే లేదు. కేంద్రం నిధుల విషయంలో మనం సరిగ్గా ఒత్తిడి తేలేకపోతున్నామని ఓసారి చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ మీటింగ్ లో క్యాజువల్ గా అంటే. “నేను సరిగ్గా పనిచేయలేకపోతున్నా అని భావిస్తే .. ఇప్పుడే కేబినెట్ కు రిజైన్ చేస్తా” అన్న నిఖార్సయిన మనిషి..!


అందుకే మళ్లీ చెప్పడం..

నిజాయితీ ఉన్నోళ్లు చాలా మంది ఉండొచ్చు.. కానీ బంధుప్రీతి.. కులభిమానం.. పక్షపాతం…మొహమాటం ఇవేమీ లేని నేత “అతనొక్కడే..

అంతా రామమయం


*అంతా రామమయం !. మన బతుకంతా రామమయం !!*


*ఒక దేశానికి, జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే - రామాయణం.*


*ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ - రాముడు మనవెంట నడిచిన దేవుడు !*


*మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు.*


*మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన - అద్దం రాముడు.*


*ధర్మం పోత పోస్తే - రాముడు !*


*ఆదర్శాలు రూపుకడితే - రాముడు !*


*అందం పోగుపోస్తే - రాముడు !*


*ఆనందం నడిస్తే - రాముడు !*


*వేదోపనిషత్తులకు అర్థం - రాముడు !*


*మంత్రమూర్తి - రాముడు !*


*పరబ్రహ్మం - రాముడు !*


*లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు - రాముడు !*


*ఎప్పటి త్రేతాయుగ రాముడు ? ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ? అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా - రాముడే.*


*చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట - శ్రీరామరక్ష సర్వజగద్రక్ష !*


*బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - రామాలాలి - మేఘశ్యామా లాలి.*


*మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష.*


*మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా.*


*వినకూడని మాట వింటే అనాల్సిన మాట - రామ రామ.*


*భరించలేని కష్టానికి పర్యాయపదం - రాముడి కష్టం.*


*తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు.*


*కష్టం గట్టెక్కే తారక మంత్రం - శ్రీరామ.*


*విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ.*


*అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా !*


*వయసుడిగిన వేళ అనాల్సిన మాట - కృష్ణా రామా !*


*తిరుగులేని మాటకు - రామబాణం.*


*సకల సుఖశాంతులకు - రామరాజ్యం.*


*ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన.*


*ఆజానుబాహుడి పోలికకు - రాముడు.*


*అన్నిప్రాణులను సమంగా చూసేవాడు - రాముడు.*


*రాముడు - ఎప్పుడూ మంచి బాలుడే.*


*చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా - రామా కిల్డ్ రావణ ; రావణ వాజ్ కిల్డ్ బై రామా.*


*ఆదర్శ దాంపత్యానికి - సీతారాములు.*


*గొప్ప కొడుకు - రాముడు.*


*అన్నదమ్ముల అనుబంధానికి - రామలక్ష్మణులు.*


*గొప్ప విద్యార్ధి - రాముడు (వసిష్ఠ , విశ్వామిత్రలు చెప్పారు).*


*మంచి మిత్రుడు - రాముడు (గుహుడు చెప్పాడు).*


*మంచి స్వామి - రాముడు (హనుమ చెప్పారు).*


*సంగీత సారం - రాముడు (రామదాసు, త్యాగయ్య చెప్పారు).*


*నాలుకమీదుగా తాగాల్సిన నామం - రాముడు ( పిబరే రామ రసం - సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు).*


*కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు.*


*నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు.*


*చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు.*


*చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు.*


*జన్మ తరించడానికి - రాముడు, రాముడు, రాముడు.*


*రామాయణం పలుకుబళ్లు*


*మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.*


*ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది.*


*చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక రామాయణం.*


*జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ.*


*ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక పుష్పకవిమానం.*


*కబళించే చేతులు, చేష్ఠలు - కబంధ హస్తాలు.*


*వికారంగా ఉంటే - శూర్పణఖ.*


*చూసిరమ్మంటే కాల్చి రావడం - హనుమ.*


*పెద్ద పెద్ద అడుగులు వేస్తే - అంగదుడి అంగలు.*


*మెలకువలేని నిద్ర - కుంభకర్ణ నిద్ర.*


*పెద్ద ఇల్లు - లంకంత ఇల్లు.*


*ఎంగిలిచేసి పెడితే - శబరి.*


*ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు.*


*అల్లరి మూకలకు నిలయం - కిష్కింధ కాండ.*


*విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - అగ్ని పరీక్షలే.*


*పితూరీలు చెప్పేవారందరూ - మంథరలే.*


*యుద్ధమంటే - రామరావణ యుద్ధమే.*


*ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - రావణ కాష్ఠాలే !*


*కొడితే బుర్ర - రామకీర్తన - పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).*


*సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు.*


*బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.*


*ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.*


*ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు.*


*ఒక ఊళ్లో నీళ్ళు తాగి ఉంటారు.*


*ఒంటిమిట్టది ఒక కథ..*


*భద్రాద్రిది ఒక కథ...*


*అసలు రామాయణమే మన కథ.*


*అది రాస్తే రామాయణం చెబితే మన భారతం మహ భారతం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.*


*జై శ్రీ సీతారామ చంద్ర హనుమాన్ కీ జై*