6, ఫిబ్రవరి 2021, శనివారం

*శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం 18**

 **దశిక రాము**


**శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం 18**


నాగ కన్య చరిత్ర


 కింపురుష ఖండం లో తార్శ్ని వేనుడు అనే వాడి తమ్ముడు సుషేణుడు అనే గంధర్వ రాజు వున్నాడు .పావనుడు ,జ్ఞాని ,సుశీలుడు ,సత్య వ్రతి .దయా దాక్షిణ్యం వున్న వాడు .హనుమ పద సేవకుడు .నిత్యమూ హనుమను జలం తోనూ ,పంచామృతాలతోను సేవిస్తాడు .త్రికాల పూజా దురంధరుడు .దానాలు చేస్తూ ,హనుమ కు ప్రీతి గా హోమాలు చేస్తాడు .షడ్రసోపేత భక్ష్య భోజ్య,ములను నైవేద్యం పెట్టె వాడు .ఆ కాలమ్ లోనే ”నాగ కన్య ”అనే పతివ్రతా వుండేది .సుశీల ,సుగుణ మని ,సత్య వ్రాతు రాలు .సర్వ సద్గుణ సంపన్న .ఆమె రక్త రోముడు అనే క్రూర రాక్షసునికి భయ పడి గంధర్వ రాజైన సుషేనుడిని శరణు వేడింది .

ఆయనతో ”గాంధర్వ రాజా !కామాంధుడు ,క్రూరుడు అయిన రక్త రాముడు అనే రాక్షసుడు నాగ లోకం వచ్చి నన్ను బలాత్కారింప ప్రయత్నించాడు .నన్ను రక్షించే వారు లేక నీ శరణు వేడు కొంటున్నాను” అని వినయం గా మనవి చేసింది .సుషేణుడు నాగ కన్య తో ”భయం వద్దు అమ్మాయీ !నీ భయం పోగొట్టే ,నీ మనసుకు సంతృప్తి కలిగించే ఒక మాట చెబుతాను విను .వజ్ర దేహుడు అరమ పావనుడు పావని నీకు అండ గా నిలుస్తాడు .అతడు యజ్న భోక్త .ఆపన్న రక్షకుడు .ఆర్తి ని పోగొట్టే వాడు అలాంటి హనుమ మూల మంత్రాన్ని నీకు ఉప దేశిస్తాను .ఆచరించి ,మనోభీస్తాన్ని పొందు నేను కూఒడా ఆ జపం వల్లే సౌఖ్యం గా వున్నాను .”అని చెప్పి హనుమంమంత్రాన్ని ఉప దేశించాడు

ణాఆఆ కన్య హనుమంమంత్రాన్ని ”శ్రీ మన్నిరంతర కరుణామృత సాగర వర్షినీం ,పింగాక్షం ,అమోఘ మహేంద్రా యుధ క్షతాన్చిత మహా హనుమ ,అరుణాధర బింబ భూషిత ముఖ చంద్ర మండలం ,ఆతప్త కార్తస్వర భాస్వర ,కాన్తిచ్చతా కాంతి కలిత ,చూడా విరాజితం ,అప్రతిమ దివ్య మాణిక్య మండిత గండ భాగం ,అసమాన మాన నీయ ,రామా కాంత ,కర కమల కలిత పంచ జన్య బందుకంబుధారం ,ఇరావత నాసాదండ సుమత్త దీర్ఘ భుజార్గలం ,అనన్య సాధారణ సంకల్ప సంభావాస్తాన పీథ ,పరినాహి బాహ్వంతరం ,అమూల్య పీతాంబరాలంక్రుత కటి ప్రదేశం ,అనవరత వినత జన మనోరధ సాధన పాద యుగళం ,ఉష్ట్ర వాహనం ,అమర గంగా నదీ పరి వేష్టిత ,హాట కాచల ,వద్దీర్ఘ లాంగూల రంగ ఉత్తుంగ ,మంగ లాంగాకం ,అన్జనానంద వర్ధనం ,అమల ఊర్ధ్వ పుండ్రం ,తదు పరి కర్పూర సమ్మిశ్రిత శుభ్ర విభూతి ధారణం ,యజ్ఞోప వీత తులసీ పద్మాక్ష రుద్రాక్ష మాలాభి రామం ,శ్రీ రామ చంద్ర చరణార వింద ,సంధిత హృదయార విందం ,అఖిల కళ్యాణ గుణ వంతం ,హనుమంత ముపాస్మహే ”అని తీవ్రం గా తపస్సు చేసింది .ఆమె తపస్సు ఫలించి హనుమ దివ్య రూపం తో ప్రత్యక్ష మయాడు .

హనుమ నాగాకంయను ఉద్దేశించి ”కన్యా మణీ !ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు ?నీ కోరిక తెలియ జేస్తే నేను నీ కార్యాన్ని సాను కూల పరుస్తాను ”అన్నాడు .దానికి ఆమె తన కదా నతా వివరం గా విన్న వించు కొన్నది .స్వామి దర్శనం తో తాను ధన్యత చెందానని చెప్పింది .హనుమ ప్రీత మానసుడై అభయమిచ్చాడు .తనతో ఆమెను నాగ లోకానికి తీసుకొని వెళ్ళాడు .అక్కడ అతి భయంకరు డైన ,అతి బలవంతు డైన రక్త రోమ రాక్షసుని చూశాడు .వాడు ఆంజనేయుని మీదకు యుద్ధానికి వస్తుండటం గమనించి ”దుష్టుడా !నా ప్రతాపం తెలియక విర్ర వీగు తున్నావు .బ్రహ్మాదులకు కూడా నేను అసాధ్యుడిని ”అని తీవ్రం గా హుంకరించి తన తోక తో రక్త రామున్ని బంధించి నెల మీద విసిరి కొట్టాడు .ఆ దెబ్బకు వాడు తీవ్రం గా రోదిస్తూ ,రక్తం కక్కు కొని చచ్చాడు .దేవ యక్ష గాంధర్వ కింపురుషులు పూల వర్షం కురిపించి హనుమను కీర్తించారు .నాగ కన్యకు దీవేనలిచ్చి అనేక వరాలు అంద జేసి ఇక నుంచి భయం లేకుండా నాగ లోకం లో హాయిగా స్వేచ్చ గా ఉండమని చెప్పాడు .అక్కడి నుండి పావని అదృశ్యమై పంపా తీరం చేరి అక్కడ కొత్త కాలం వుండి ,మళ్ళీ గంధ మాదన పర్వతం చేరు కొన్నాడు .

నాగ కన్య చేసిన స్తోత్ర గద్యను నిండు మనసుతో భక్తీ తో ఎవరు పథి స్తారో వారికి అన్ని కార్యాలను దగ్గర వుండి తీరుస్తాడు హనుమ .ఈ సారి ఇంకో కధ


🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu

మనిషి సంపాదన

 *"మనిషి సంపాదన కాలి చెప్పు అంత ఉండాలట!!*     

                *ఎందుకని?*

...

..కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో, అలా ధనము కూడా నీకు కావలిసినంత ఉంటే చాలు అని "వేదాంత" వాక్య. 


....లోకం లోని 84 లక్షల జీవరాసులలో తరువాతి తరానికి కూడబెట్టడం అన్న లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే. మిగిలిన ఏ ప్రాణి అయినా తమ బిడ్డలకు స్వయంగా ఆహారం సంపాదించుకునే శక్తి వచ్చే వరకే వాటిని పోషిస్తాయి. 


....ప్రకృతి పరమైన ఇబ్బందులు దృష్ట్యా కేవలం ఒక్క చీమ మాత్రం ఆహారాన్ని నిలువ చేసుకుంటుంది.


....".లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలు అయ్యింది అంటే ప్రింటింగ్ ప్రెస్సువచ్చిన తరువాత. లోకంలో దరిద్రం ఎపుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినపుడు ".


.....పేపర్ కరెన్సీ రానంత వరకు ఎవరికి అవసరానికిసరిపడేదివారు వస్తువినిమయంతో సంపాదించుకొనితినేవారు. ఆరోజుల్లో దరిద్రం అంతగాలేదు. ఎంత తిండికి అవసరమో అంత సంపాదించుకునే వారు. మహా దాచుకున్న రెండు ధాన్యం బస్తాలు ఎక్కువగా ఉంటే సంవత్సరానికి సరిపోయేవి. 


... ఎపుడు కరెన్సీ వచ్చి దాచుకోవడం మొదలు అయిందో. ఒకడి కన్నా వేరొకరు పోటీ పడి రంగు కాగితాలు కట్టలు కట్టి దాచుకోవడం మొదలెట్టారు. ఫలితంగా వాడి కన్నా వీడికి, వీడి కన్నా వాడికి దరిద్రం వచ్చి పడింది.


....ప్రింటిగ్ ప్రెస్ వచ్చి ఎవరికి తోచిన విధంగా వారు పుస్తకాలు వ్రాసి లోకం మీదకు వదిలేశారు. వారి భావాలన్ని జనాలకు అంటుకున్నాయి. తెలిసి తెలియని వాడు ఆ పుస్తకాలు చదివి అసలు విషయం తెలుసుకోలేక అజ్ఞానంలోకి వెళ్ళి పోయాడు. 


.....వస్తు మార్పిడి ఉన్న రోజుల్లో జనాల్లో ఇంత దరిద్రం లేదు. ముందు తరాల వారికి దాచాలన్న వెర్రి కోరిక మనిషిని అజ్ఞానంలోకి నెట్టి వేస్తుంది.


  (బ్రహ్మశ్రీ చాగంటి.కోటేశ్వరరావు గారి ప్రవచనములు నుండి సేకరణ)

శీఘ్ర ద‌ర్శ‌నం టిక్కెట్లు

 ఆర్టీసీ బ‌స్సుల్లో శీఘ్ర ద‌ర్శ‌నం టిక్కెట్లు

* ఛార్జీపై అద‌నంగా రూ.300 చెల్లించి టిక్కెట్లు బ‌స్సుల్లోనే పొందే వీలు

* శ్రీవారి భ‌క్తుల‌కు అమూల్య‌మైన అవ‌కాశం క‌ల్పించిన తితిదే

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఆయా బస్సుల్లో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయ‌ని ఏపిఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆర్పీ ఠాకూర్ గురువారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఏపిఎస్ ఆర్టీసీ బస్సుల్లో తిరుమల వెళ్లే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అమూల్యమైన ఈ అవకాశం కల్పించారు. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్టును పొందవచ్చు. ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు చేసింది. తిరుమల బస్‌స్టేషన్ చేరుకున్న అనంత‌రం శీఘ్ర దర్శనం చేసుకునేందుకు ప్రయాణికులకు ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయ‌స‌హ‌కారాలు అందిస్తారు. ఈ క్ర‌మంలో తిరుపతి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో శీఘ్ర దర్శనం టికెట్టును పొంద‌ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆర్టీసీ అధికారులు కోరారు.

*( ప్రజా రవాణా విభాగం గ్రూప్ సమాచారం)*

 ప్రతి రోజు తిరుపతికి ఆర్టీసీ సంస్థ 650 బస్సులు నడుపుతుంది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం విచ్చేసే ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యంగా ఉంటుంది. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఈ సదవకాశం కల్పించిన తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ కే.ఎస్.జవహార్‌రెడ్డికి ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

*ఖాళీ కడుపుతో పండ్లు తినడం*

 *ఖాళీ కడుపుతో పండ్లు తినడం*


చివరి వరకు చదివి, ఆపై మీ ఇ-జాబితాలోని అందరికీ పంపండి......


డాక్టర్ స్టీఫెన్ మాక్ టెర్మినల్  క్యాన్సర్ రోగులకు *"అన్-ఆర్థోడాక్స్"* పద్దతి ద్వారా చికిత్స చేస్తారు.


చాలా మంది రోగులు ద్వారా మంచి ఫలితాలు సాధించారు.


అతను తన రోగుల అనారోగ్యాలను తొలగించడానికి సౌర శక్తిని ఉపయోగించే ముందు, అనారోగ్యాలకు వ్యతిరేకంగా శరీరంలో సహజమైన వైద్యం మీద నమ్మకం కలిగిస్తారు.


అతని వ్యాసం చదవండి:


క్యాన్సర్‌ను నయం చేసే వ్యూహాలలో ఇది ఒకటి.  క్యాన్సర్‌ను నయం చేయడంలో నా విజయం రేటు 80%.


 క్యాన్సర్ రోగులు మరణించకూడదు.  ఇది నా ధ్యేయం.

క్యాన్సర్ నివారణ ఇప్పటికే కనుగొనబడింది - *మనం పండ్లు తినే విధంగా*


 మీరు నమ్ముతున్నారా లేదా అనేది మీరే గమనించండి.




 *పండ్లు తినడం*


 మనమందరం పండ్లు తినడం అంటే కేవలం పండ్లు కొనడం, కత్తిరించడం మరియు మన నోటిలోకి పాప్ చేయడం.


 ఇది మీరు అనుకున్నంత సులభం కాదు.  పండ్లు ఎలా మరియు ఎప్పుడు తినాలో తెలుసుకోవడం ముఖ్యం.


పండ్లు తినడానికి సరైన మార్గం ఏమిటి?


 *భోజనం తర్వాత పండ్లు తినకూడదు*


 *పండ్లు ఖాళీ కడుపుతో మాత్రమే తినాలి*


మీరు ఖాళీ కడుపుతో పండ్లను తింటుంటే, ఇది మీ వ్యవస్థను నిర్విషీకరణ చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది, బరువు తగ్గడం మరియు ఇతర జీవిత కార్యకలాపాలకు మీకు అధిక శక్తిని అందిస్తుంది.


 ఫ్రూట్ చాలా ముఖ్యమైన ఆహారం ._


మీరు రెండు రొట్టె ముక్కలు తరువాత ఒక ముక్క పండు తింటే.....


పండ్ల ముక్క కడుపు ద్వారా నేరుగా ప్రేగులలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది, కానీ పండ్ల ముందు తీసుకున్న రొట్టె కారణంగా అలా చేయకుండా నిరోధించబడుతుంది.


ఈలోగా రొట్టె & పండ్లు పులియబెట్టి మొత్తం ఆమ్లం గా మారుతుంది.


పండు కడుపులోని ఆహారం మరియు జీర్ణ రసాలతో సంబంధంలోకి వచ్చిన నిమిషం, ఆహారం మొత్తం ద్రవ్యరాశి చెడిపోవటం ప్రారంభమవుతుంది.


కాబట్టి దయచేసి మీరు పండ్లను *ఖాళీ కడుపుతో * లేదా మీ భోజనానికి ముందు తినండి*


ప్రజలు ఫిర్యాదు చేయడం మీరూ విన్నారు:


నేను పుచ్చకాయ తినే ప్రతిసారీ,  నా కడుపు ఉబ్బిపోతుంది, అరటిపండు తిన్నప్పుడు నేను టాయిలెట్‌కు పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది.


మీరు  ఖాళీ కడుపుతో పండ్లు తింటే అసలు ఇవన్నీ తలెత్తవు.


ఈ పండ్లు ఇతర ఆహారాన్ని ఉంచడంతో కలిపి వాయువును ఉత్పత్తి చేస్తుంది మరియు అందువల్ల మీరు ఉబ్బుతారు!


కళ్ళు కింద నలుపు, బట్టతల, నాడీ విస్ఫోటనం మరియు చీకటి వృత్తాలు వేయడం ఇవన్నీ మీరు ఖాళీ కడుపుతో పండ్లు తీసుకుంటే  జరగదు. 


నారింజ మరియు నిమ్మకాయ వంటి కొన్ని పండ్లు ఆమ్లమైనవి కావు, ఎందుకంటే అన్ని పండ్లు మన శరీరంలో ఆల్కలీన్ అవుతాయి, ఈ విషయంపై పరిశోధన చేసిన డాక్టర్ హెర్బర్ట్ షెల్టాన్ ప్రకారం.


మీరు పండ్లు తినడానికి సరైన మార్గాన్ని నేర్చుకుంటే, మీకు  అందం, దీర్ఘాయువు, ఆరోగ్యం, శక్తి, ఆనందం మరియు సాధారణ బరువు యొక్క రహస్యం ఉంది. 


మీరు పండ్ల రసం తాగినప్పుడు -  *తాజా పండ్ల రసాన్ని మాత్రమే తాగండి* డబ్బాలు, ప్యాక్‌లు లేదా సీసాల నుండి కాదు.


వేడెక్కిన రసం కూడా తాగవద్దు.


వండిన పండ్లను తినవద్దు ఎందుకంటే మీకు పోషకాలు అస్సలు రావు.మీరు దాని రుచిని మాత్రమే పొందుతారు.

వంట అన్ని విటమిన్లను నాశనం చేస్తుంది.


కానీ, రసం తాగడం కంటే మొత్తం పండు తినడం మంచిది.


మీరు తాజా పండ్ల రసాన్ని తాగాలంటే, నెమ్మదిగా త్రాగాలి, ఎందుకంటే మింగడానికి ముందు మీ లాలాజలంతో కలపాలి.


మీ శరీరాన్ని శుభ్రపరచడానికి లేదా నిర్విషీకరణ చేయడానికి మీరు 3 రోజుల పండ్లనే ఆహారం గా తీసుకోవొచ్చు.


కేవలం 3 రోజులు పండ్లు తినండి మరియు తాజా పండ్ల రసం త్రాగండి.


మీరు ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తున్నారో మీ స్నేహితులు చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు!


 *కీవీ పండు:*


 చిన్నది కాని శక్తివంతమైనది.

 ఇది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఇ & ఫైబర్ యొక్క మంచి మూలం.  దీని విటమిన్ సి కంటెంట్ నారింజ కంటే రెండు రెట్లు ఎక్కువ.


 *ఆపిల్*


రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచుతుందా?

ఒక ఆపిల్‌లో తక్కువ విటమిన్ సి కంటెంట్ ఉన్నప్పటికీ, ఇందులో యాంటీఆక్సిడెంట్లు & ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి, ఇది విటమిన్ సి యొక్క కార్యాచరణను పెంచుతుంది, తద్వారా పెద్దప్రేగు క్యాన్సర్, గుండెపోటు & స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.


 *స్ట్రాబెర్రీ:*


 రక్షిత పండు.

ప్రధాన పండ్లలో స్ట్రాబెర్రీ అత్యధిక యాంటీఆక్సిడెంట్ శక్తిని కలిగి ఉంది మరియు క్యాన్సర్ కలిగించే, రక్తనాళాలు-అడ్డుపడటం మరియు ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుతుంది.


 *ఆరెంజ్:*


రోజుకు 2-4 నారింజ తీసుకోవడం వల్ల జలుబు దూరంగా ఉండి, కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు, మూత్రపిండాల్లో రాళ్లను నివారించవచ్చు మరియు కరిగించవచ్చు, అలాగే పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


 *పుచ్చకాయ:*


 చక్కని దాహం చల్లార్చు.  92% నీటితో కూడి, ఇది గ్లూటాతియోన్ యొక్క భారీ మోతాదుతో నిండి ఉంటుంది, ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అవి కూడా లైకోపీన్ క్యాన్సర్ ఫైటింగ్ ఆక్సిడెంట్ యొక్క ముఖ్య వనరు. *

పుచ్చకాయలో లభించే ఇతర పోషకాలు విటమిన్ సి & పొటాషియం.


 *జామ & బొప్పాయి :*


విటమిన్ సి కోసం అగ్ర పురస్కారాలు వారి అధిక విటమిన్ సి కంటెంట్ కోసం స్పష్టమైన విజేతలు.


జామలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంది, ఇది మలబద్దకాన్ని నిరోధిస్తుంది.


బొప్పాయిలో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది;  ఇది మీ కళ్ళకు మంచిది.


భోజనం తర్వాత కోల్డ్ వాటర్ లేదా డ్రింక్స్ తాగడం క్యాన్సర్ కారకం 


 మీరు దీన్ని నమ్మగలరా?


చల్లటి నీరు లేదా శీతల పానీయాలు తాగడానికి ఇష్టపడేవారికి, ఈ వ్యాసం మీకు వర్తిస్తుంది.


భోజనం తర్వాత ఒక కప్పు చల్లటి నీరు లేదా శీతల పానీయాలు కలిగి ఉండటం చాలా బాగుంది అనిపిస్తుంది.


అయితే, చల్లటి నీరు లేదా పానీయాలు మీరు ఇప్పుడే తిన్న జిడ్డుగల పదార్థాన్ని పటిష్టం చేస్తాయి. 


 *ఇది జీర్ణక్రియను తగ్గిస్తుంది*


 * ఈ 'బురద' ఆమ్లంతో స్పందించిన తర్వాత, అది విచ్ఛిన్నమవుతుంది మరియు ఘన ఆహారం కంటే వేగంగా ప్రేగు ద్వారా గ్రహించబడుతుంది. *


ఇది పేగును లైన్ చేస్తుంది.


అతి త్వరలో, ఇది క్రొవ్వు గా మారి క్యాన్సర్‌కు దారితీస్తుంది! 


భోజనం తర్వాత వేడి సూప్ లేదా వెచ్చని నీరు త్రాగటం మంచిది.


జాగ్రత్తగా ఉండండి మరియు తెలుసుకోండి.  మనం మనుగడ సాగించే మంచి అవకాశాన్ని ఎక్కువగా తెలుసుకోవాలి.


*ప్రముఖ కార్డియాలజిస్ట్*

 ఇలా అంటారు:


ఈ సందేశం వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని 10 మందికి పంపితే, మేము కనీసం ఒక ప్రాణాన్ని అయినా కాపాడుతామని మీరు అనుకోవచ్చు.


కాబట్టి దీన్ని ఆచరిద్దాం....

నలుగురితో పంచుకుందాం....


        *🙏సర్వేజనా సుఖినోభవంతు🙏*

కరక్కాయ

 కరక్కాయ  గురించి సంపూర్ణ వివరణ -


 తెలుగు  - కరక్కాయ . 


 సంస్కృతం  -  హరీతకి . 


 హింది - హరడ్ . 


 లాటిన్  - TERMINALIA CHIBULA . 


 కుటుంబము  - COMBRETACEAE . 


 గుణగణాలు  - 


     కరక్కాయ లవణరస వర్జితముగా , అయిదు రసములు గలదిగా , రూక్షముగా , వేడిగా , జఠరదీపనముగా , బుద్ధిబలమును ఇచ్చునదిగా , మధురపక్వముగా , ఆయురారోగ్యాలను ఇచ్చునదిగా , నేత్రములకు హితవుగా , తేలికగా , ఆయువును పెంపొందించునదిగా , ధాతువృద్ధిగా , వాయువును కిందకి వెడలించునదిగా ఉండును. మరియు శ్వాసను , దగ్గును , ప్రమేహమును , మొలలను , కుష్టును , నంజును , ఉదరమును , క్రిమిని , స్వరభంగమును , గ్రహిణిని , మలబద్ధకమును , విషజ్వరమును , గుల్మమును , కడుపుబ్బరం , దాహము , వాంతిని , ఎక్కిళ్ళను , దురదను , హృదయరోగమును , కామెర్లను , శూలను , ప్లీహారోగమును , అనాహమును , కాలేయవ్యాధిని , శిలామేహమును , మూత్రకృచ్చ రోగమును , మూత్రఘాత రోగమును నాశనం చేయును . 


           కరక్కాయ పులుసు రసం కలిగి ఉండుటచే వాతాన్ని హరించును . తీపి , చేదురసం కలిగి ఉండటం చేత పిత్తాన్ని హరించును . రూక్షత్వం ,వగరు రసం కలదగుట చేత కఫాన్ని హరించును . ఈ విధముగా కరక్కాయ త్రిదోషహరమైనది. 


        కరక్కాయను వర్షఋతువు నందు సైన్ధవ లవణము చేర్చి , శరదృతువు యందు పంచదార చేర్చి  , హేమంత ఋతువు నందు శొంఠిని చేర్చి శిశిర ఋతువు నందు పిప్పలిని చేర్చి , వసంత ఋతువు నందు తేనెని చేర్చి , గ్రీష్మఋతువు నందు బెల్లమును చేర్చి భక్షించవలెను. కరక్కాయను భోజనానంతరం భక్షించినను పథ్యకరమైనది . మరియు భోజనం జీర్ణం అయిన తరువాతను , అజీర్ణసమస్య ఉన్నప్పుడును పుచ్చుకోవచ్చు. 


  రూప లక్షణాలు  - 


     కరక్కాయ మొత్తం 7 రకాలుగా కలదు. అవి 


             *  విజయా . 


             *  రోహిణీ . 


             *  పూతన . 


             *  అమృతా . 


             *  అభయా . 


             *  జీవంతి . 


             *  చేతకీ . 


      అని మొత్తం 7 జాతులుగా ఉండును. ఇప్పుడు మీకు వీటి గురించి సంపూర్ణముగ వివరిస్తాను. 


        విజయా కరక్కాయ వింధ్య పర్వతం పైన పుడుతుంది. చేతకీ కరక్కాయ హిమాలయ పర్వతాలపైన పుట్టుచున్నది. పూతన కరక్కాయ సింధూనది ప్రాంతము నందు పుట్టుచున్నది . అమృత కరక్కాయ , అభయ కరక్కాయ చంపారణ్యం నందు పుట్టుచున్నది. రోహిణీ కరక్కాయ అన్ని స్థలముల యందు పుట్టుచున్నది. జీవంతి కరక్కాయ సౌరాష్ట్ర దేశము నందు పుట్టుచున్నది. 


                  సొరకాయ వలే పొడవుగా , గుండ్రముగా ఉండునది విజయా కరక్కాయ , కేవలం గుండ్రముగా ఉండునది రోహిణి కరక్కాయ , బీజము పెద్దదిగా ఉండి పై చర్మము పలుచగా ఉండునది పూతన కరక్కాయ , బీజములు చిన్నవిగా ఉండి పేడు మందముగా ఉండునది అమృత కరక్కాయ , అయిదు రేఖలు కలిగినది అభయ కరక్కాయ. బంగారు రంగుతో ఉండునది జీవంతి కరక్కాయ , మూడు రేఖలు కలిగినది చేతకీ కరక్కాయ . 


     విజయ కరక్కాయను సర్వరోగముల యందు ఉపయోగించదగినది. రోహిణి కరక్కాయను వ్రణము హరించుటకు ఉపయోగించదగినది . పూతన కరక్కాయ లేపనమందును , పైన పట్టు వేయుటకు ఉపయోగించతగినది. అమృత కరక్కాయ శోధనార్థం , విరేచనములు మొదలగు వానికి ఉపయోగించతగినది. అభయ కరక్కాయ నేత్రరోగములకు ఉపయోగించతగినది. , జీవంతి కరక్కాయ సర్వరోగములను హరించును . చేతకీ కరక్కాయ చూర్ణములకు ప్రశస్తమైనది. 


                కరక్కాయ మనుష్యులకు తల్లివలె హితము చేయును . తల్లికి ఒకప్పుడైనను కోపము కలిగి దండించును. కాని కడుపులో ప్రవేశించిన కరక్కాయ ( తినిన ) ఎప్పటికి హానిచేయదు . ఎల్లప్పుడూ మంచిచేయు గుణము కలిగినది . 


     చేతకీ కరక్కాయ తెలుపు రంగు , నలుపు రంగు బేధము వలన రెండు విధములుగా ఉండును. తెల్ల చేతకీ కరక్కాయ 6 అంగుళముల పొడవుగాను , నల్ల చేతకీ కరక్కాయ ఒక అంగుళము పొడవుగా ఉండును.  


           ఒక జాతి కరక్కాయ తినుట చేతను , ఇంకో జాతి కరక్కాయ వాసన చూసిన మాత్రం చేతను , మరొక జాతి కరక్కాయ ముట్టుకొనిన మాత్రమున , వేరొక జాతి కరక్కాయ చూచిన మాత్రమునే విరేచనం కలిగించును. ఈ ప్రకారం నాలుగు బేధముల విరేచన గుణములు కరక్కాయల యందు కలవు. 


              చేతకీ కరక్కాయ చెట్టు కింద ఏ మనుష్యులు కాని లేక పశు , పక్షి , మృగాదులు కాని తిరిగిన తక్షణం విరేచనములు అగును. చేతకీ కరక్కాయను హస్తము నందు ఎంతసేపు ఉంచుకొనునో అంతవరకు ఆ కరక్కాయ ప్రభావం వలన నిశ్చయముగా విరేచనములు అగుచుండును. చేతకీ కరక్కాయను సుకుమారులు , బలహీనులు , ఔషధము నందు ద్వేషము కలిగినవారు చేతిలో పట్టకూడదు. చేతకీ కరక్కాయ అత్యంత ప్రశస్తమైనది. సుఖవిరేచనం కలిగించుటకు హితకరం అయినది. 


             పైన చెప్పిన 7 జాతులలో విజయ కరక్కాయ ప్రధానం అయినది. ప్రయోగము నందు సుఖవిరేచనం ఇచ్చునది. సర్వరోగముల యందు ఉపయోగించతగినది. ఏ కరక్కాయ నూతనమైనది , జిగట కలిగినది . గొప్పది , గుండ్రనిది , బరువు కలిగినది . నీటిలో మునుగునదిగా ఉండునో ఆ కరక్కాయ ప్రశస్తమైనది. తూనిక నందు 2 తులములు తూగినది ప్రశస్తమైన కరక్కాయ . 


 ఔషధోపయొగాలు  - 


 *  కామెర్ల నివారణ కొరకు  - 


        కరక్కాయ , తేనె , బెల్లం కలిపి తినిన కామెర్లు తగ్గును. 


 *  కీళ్ళవాతము నివారణ కొరకు - 


        కరక్కాయ చూర్ణమును , ఆముదముతో కలిపి ప్రతినిత్యం వాడిన కీళ్లవాతం , గృదసీవాతం ( సయాటికా ) తగ్గును. 


 *  క్రిమిరోగముల నివారణ కొరకు  - 


         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో కలిపి వాడిన క్రిమిరోగాలు తొలగును . ఇది చక్కని విరేచనాన్ని కలుగచేయును . అర్శమొలల సమస్యతో ఇబ్బంది పడువారికి ఇది చాలా మంచిది . 


 *  కడుపునొప్పి నివారణ కొరకు 


         కరక్కాయ చూర్ణము నందు బెబులిన్ కలదు. ఇది కడుపునొప్పిని తగ్గించును . 


 *  చర్మరోగముల నివారణ కొరకు  - 


         కరక్కాయ చూర్ణమును , గోమూత్రము నందు కలిపి తాగిన పామా , దద్రు మొదలగు చర్మరోగాలు తగ్గును. కరక్కాయను కాల్చి చూర్ణము చేసి ఆ చూర్ణముకు నువ్వులనూనె కలిపి రాసిన పురాణ వ్రణములు తగ్గును. 


 *  విషమ జ్వరాల నివారణ కొరకు  - 


         కరక్కాయను తేనెతో కలిపి వాడిన విషమ జ్వరాలు తొందరగా నయం అగును. 


 *  ఆమ్ల పిత్తము నివారణ కొరకు  - 


         కరక్కాయను ద్రాక్షతో కలిపి సేవించిన ఆమ్లపిత్తము నయం అగును. 


 *  అర్శమొలల నివారణ కొరకు  - 


          కరక్కాయ చూర్ణమును బెల్లముతో కలిపి ప్రతిరోజు సేవించిన అర్శమొలలు , మలబద్ధకం , వాత్తరక్తం శమించును . 


 *  బరువు తగ్గుట కొరకు - 


         కరక్కాయ ప్రతినిత్యం వాడుచున్న బరువు తగ్గును. 


 *  గోరుచుట్టు నివారణ కొరకు  - 


        పసుపు రసమునకి కరక్కాయలను చేర్చి వాటిని బాగా దంచి మెత్తగా నూరి పైపూతగా రాయుచున్న గోరుచుట్టు తగ్గును. 


 *  నీళ్ల విరేచనాల నివారణ కొరకు  - 


         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో తాగుచున్న నీళ్ళవిరేచనాలు తగ్గును. 


 *  రక్తస్రావ నివారణ కొరకు  - 


        కరక్కాయ చూర్ణాన్ని అడ్డసరం రసంతో భావన చేసి ఎండబెట్టి ఆ చూర్ణమునకు పిప్పళ్లు , తేనె చేర్చి సేవించిన ఎంతపెద్ద రక్తస్రావం అయినను తగ్గును. 


 *  శరీర బలం పెరుగుట కొరకు  - 


         కరక్కాయలను నేతిలో వేయించుకుని తినుచున్న శరీరానికి మంచి బలం కలుగును. 


 *  పాండురోగం నివారణ కొరకు  - 


        కరక్కాయలను గోమూత్రము నందు వేసి మరిగించి తీసి పైపెచ్చు పొడిని చేసి దానిని 5 గ్రాముల మోతాదులో కొంచం ఆముదం కలిపి ప్రతినిత్యం ఉదయం సమయంలో పరగడుపున సేవించవలెను . దీనిని గోమూత్ర హరీతకీ అని అంటారు.  దీనిని వాడటం వలన పాండురోగం , అధిక బరువు , వరిబీజం తగ్గును. 


 *  చర్మ దళ కుష్టు నివారణ కొరకు  - 


       20ml గోమూత్రము నందు 3 గ్రాముల కరక్కాయ చూర్ణము కలిపి తాగితే చర్మ దళ కుష్ఠు , కిటిభకుష్టు  తగ్గును . ఇతర చర్మవ్యాధుల యందు కరక్కాయ పొడికి సమానం వేపాకు చూర్ణం కలిపి 1 స్పూన్ చొప్పున రెండుపూటలా తాగవలెను . 


 *  గొంతు బొంగురు నివారణ కొరకు  - 


       కరక్కాయ చూర్ణమునునకు పిప్పలి చూర్ణం లేదా శొంఠిచూర్ణం మరియు తేనె కలిపి లేహ్యముగా చేసి అరస్పూన్ చప్పరించి మింగుచున్న బొంగురుగొంతు , గొంతులో నస తగ్గును. 


 *  దగ్గు నివారణ కొరకు  - 


        కరక్కాయ పెచ్చును నోటిలో ఉంచుకుని రసము మింగుచున్న కొండనాలుక , దగ్గు , గొంతు వొరుచుకొనుట , పొడిదగ్గు తగ్గును. 


 *  తలనొప్పి నివారణ కొరకు  - 


        కరక్కాయ గింజలతో నుదుటి పైన పట్టువేసిన తలనొప్పి తగ్గును. 


 * కండ్ల ఎరుపు నివారణ కొరకు  - 


         కరక్కాయ , కాచు సమాన భాగాలుగా తీసుకుని నీటితో నూరి కండ్లపైన గుడ్డ వేయవలెను . కండ్ల ఎరుపులు తగ్గును. 


 *  ఎక్కిళ్లు నివారణ కొరకు  - 


       గోరువెచ్చని నీళ్లతో కరక్కాయ చూర్ణం కలిపి ఇచ్చిన ఎక్కిళ్ళు కట్టును . 


 *  ఉదరరోగ నివారణ కొరకు  - 


       ఉదయం మరియు సాయంత్రం ఒక్కొక్క కరక్కాయ చొప్పున 2 నెలలపాటు తినుచుండిన ఎటువంటి ఉదరరోగం అయినను తగ్గిపోవును. 


 *  ఆహారం జీర్ణం అగుటకు  - 


       వేడినీటితో కరక్కాయ చూర్ణం కలిపి తాగిన తినిన ఆహారం సరిగ్గా అరగకుండా ఉన్న సమస్యని తొలగించి ఆహారాన్ని జీర్ణం చేయును . 


 *  కఫజ్వర నివారణ కొరకు  - 


       గోమూత్రంలో కరక్కాయలు భావన చేసి తినిన కఫసంబంధ దోషం వలన వచ్చు జ్వరం నివారణ అగును. 


 *  వాంతుల నివారణ కొరకు  - 


        కరక చూర్ణం తేనెతో సేవించిన వాంతులు తగ్గును. 


 *  కఫ సంబంధ బోదకాలు నివారణ కొరకు  - 


       కరక్కాయ ముద్దను గోమూత్రముతో కలిపి తాగిన బోదకాలు నివారణ అగును. 


 *  గుల్మ నివారణ కొరకు  -  


        కరక్కాయ చూర్ణం బెల్లముతో కలిపి తినుచున్న గుల్మరోగం నివారణ అగును. 


 *  రక్తపిత్త రోగ నివారణ కొరకు  - 


        అడ్డసరం రసములో 7 సార్లు భావన చేసిన కరక్కాయను నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకుని కొంచం పిప్పలి చూర్ణం కలిపి తేనెతో సేవించిన అసాధ్యమగు రక్తపిత్తం తగ్గును. 


 *  ఉబ్బురోగం నివారణ కొరకు - 


     బెల్లం మరియు కరక్కాయ సమానంగా కలిపి తీసుకొనుచున్న ఉబ్బురోగములు తగ్గును. 


 *  వాతరక్త వ్యాధి నివారణ కొరకు  - 


     5 కరక్కాయలు బాగుగా నమిలి మింగి తిప్పతీగ కషాయం తాగిన వాతరక్తం తగ్గును.


 *  అండవృద్ధి నివారణ కొరకు  - 


        గోమూత్రము నందు భావన చేసిన కరక్కాయను ఆముదము నందు వేయించి వేడినీటి అనుపానంగా సేవించిన అండవృద్ధి హరించును . 


 *  నేత్రరోగ నివారణ కొరకు  - 


        కరక్కాయ ఆవునేతితో ఉడికించి అది కంటిపైన వేసి కట్టు కట్టుచున్న నేత్ర దోషాలు నివారణ అగును. 


 *  పిల్లల కోరింత దగ్గు నివారణ కొరకు  - 


       కరకపువ్వు 1 భాగము , వేయించిన పిప్పళ్లు 1/2 భాగము , ఎండిన ఉస్తిపండ్లు 1/4 భాగము తీసుకుని వీటన్నింటిని మెత్తగా చూర్ణం చేసి మూడు గురిగింజలంత చూర్ణము 2 గంటలకి ఒక పర్యాయము తేనెతో నాకించుచుండిన కోరింత దగ్గులు తగ్గును. కరకపువ్వు చూర్ణం కూడా వాడవచ్చును  . 


  గమనిక  - 


           అతిగా నడచినవాళ్లు , బలహీన శరీరం కలవాళ్ళు , చిక్కిన శరీరం కలవాళ్లు , ఉపవాసం వలన బలహీనపడిన వారు , శరీరం నందు అమిత వేడి కలిగినవారు , గర్భవతులు , రక్తం తీయబడిన వారు , రక్తస్రావం వలన ఇబ్బందిపడేవారు , హనుస్థంభ వాత రోగులు కరక్కాయను వాడరాదు  . 


          మరిన్ని సులభయోగాలు నా గ్రంథాల యందు ఇవ్వడం జరిగినది.

 

    గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

సుభాషితమ్

 🙏 *శుభోదయమ్*🙏

🌸 *సుభాషితమ్* 🌸


శ్లో|| ద్వావుమౌ పురుషౌ రాజన్ స్వర్గస్యోపరి తిష్ఠతః

ప్రభుశ్చ క్షమాయా యుక్తో దరిద్రశ్చ ప్రదానవాన్


*విదురనీతిః*


తా|| సమర్థుడై యుండియు సహనము కలవాడు,

దరిద్రుడై యుండియు దానములు చేయువాడు 

ఈ ఇరువులు స్వర్గమునకు పై భాగమున నిలుతురు.

🙏✨💖🌷

శ్రీ దేవి భాగవతం - 194 వ అధ్యాయము --

 🙏🙏 *శ్రీ దేవి భాగవతం - 194 వ అధ్యాయము --  వరాహమూర్తి భూమిని ఉద్దరించుట*🙏🙏


*నారాయణుడిట్లనెను:* *పరంతాపా ! ఈప్రకారమగ బ్రహ్మ మన్వాదులు మునివరులు మరీచ్యాదులు నగు వారిని గూడి యాలోచింప సాగెను. అట్లు ధ్యానించుచున్న బ్రహ్మ ముక్కు కొన నుండి వెంటవే బొటన వ్రేలంతటి వరహపోత ముద్బవించెను. ఓ నారదా! బ్రహ్మ చూచుచుండగనే యొక్క క్షణ మాత్రమున నది లోకాద్బుతముగ పెద్ద యేనుగంతగ పెరెగెను. నారాదా! మరీచి ముఖ్య విప్రులతో సనకాది మునులతో గూడి పుటము నుండి యాత్యాశ్చర్యము నుద్బవించినదే! ఇది మొదట బొటన వ్రేలంతగ నుండి పిదప క్షణముననే పర్వతమంత మారినది. ఆహా! ఇతడు భగవానుడో! కాక యజ్ఞమూర్తియో! యని నా మదిలో సంశయము గల్గుచున్నది. అని పరమాత్మరూపుడగు బ్రహ్మ సంశయించుచుండగ వరహ భగవానుడు పర్వతమంత రూపము దాల్చి యెలుగెత్తి గర్జించెను. దిక్కలు పిక్కటిల్లు గర్జా ధ్వనితోనే ద్విజవరులకు బ్రహ్మకు భయముడిపి ధైర్యము గలిగించెను. జన స్తపస్సత్య లోకావాసులగు నమరవరులును దుఃఖములు తొలగించునట్టి ఘర్ఘుర రావమును వినిరి. అంత విప్రులు బుక్‌ సామ ఆధర్వణములందలి ఛంధో మయములగు వచస్సులతో ఆద్య పురుషుని వరాహమును స్తుతించిరి. వారి వేదస్తోత్రము లాలకించి యాద్యుడు భగవానుడు ఈశ్వరుడునగు రాహమూర్తి సంతసించి దయతోడి చూపులతో నీట మునిగెను. అచడు నీచ ప్రవేశించగనే, యతని గట్టి జడల తాకిడికి పీడితుడై ''దేవా! శరణప్రదా! నన్ను గాపాడు మని సాగరుడు మొఱపెట్టకొనెను. సముద్రుడు పల్కిన మాటలు విని యీశ్వరుడగు వరాహవిభుడు జలచరములను చీల్చి చెండాడుచు లోతైన నీటి లోనికి మునింగెను.*


*అట్లు వరాహస్వామి నీటిలోన నిటునటు పరుగెత్తుచు మెల్లమెల్లగ భూమిని వెదకి పట్టుకొని పల్మారు మూర్కొనెను. ఎల్ల భూత కోటుల కాశ్రయ భూతమై నీట మునిగియున్న భూమిని వరాహ దేవదేవుడు తలకోఱలతో పైకెతైను. యజ్ఞ వరాహ పురుషుడట్లు భూమిని తన కోఱల కోనలతో పైకి లేపెను. అది దిగ్గజము పైకి లేపిన కమలమునట్లు శోభ వహించెను. కొనకోఱలతో పుడమినిపైకి లేపిన వరాహదేవుని గని బ్రహ్మ మనువు స్వరాట్టు మున్నగువారు అతని నిట్లు సంస్తుతించిరిః బ్రహ్మ యిట్లనెను. ఓ పుండరీక్షాక్ష! భక్తార్తిభంజనా! సర్వకామ ఫలప్రదా! నీకు విజయమగు గావుత! నీవు సత్య లోకమును సైతము ప్రతాపముచే కురుచ పరచితివి. దేవా! ఏనుగు తొండముపై నలరారు కమలము చందమున నీ కొనకోఱలపై నీ భూదేవి శోభిల్లు చున్నది. తొండముపై కమలమును దాల్చిన గజరాజు శరీరమువలె కోఱలపై భూమిని దాల్తిన నీ వరహ శరీరము సొబగు వహించుచున్నది. దేవేశా! సృష్టిసంహారకారా! నీకు నా నమోవాకములు. దానవ నాశమునకు పెక్కురూపులు దాల్చు భగవానుడు నీవే కదా. ఎల్ల దేవతలకు నిలయమైన తేజోనిధానమా! నీకు మహాశక్తియుక్తుడువు. నీనే ప్రజాసృష్టికి నీచే నియమింప బడితిని. నీ యానతి చోప్పున విశ్వమును పుట్టించి సమయింప చేతును. దేవేశా! మున్ను తగిన కాలము తగిన బలముతో సురవరులు నీ సాహాయ్య సానుభూతులతో నమృతము బొందిరి. ఇంద్రుడు సైతము నీ యానతి ప్రకార మెల్ల సురలచేతపూజితుడై త్రిలోకి సామ్రాజ్యశ్రీ ననుభవించెను. అగ్ని నీ వలన నాయా ప్రాణుల జఠరములందు నెలకొల్పబడి వైశ్వాన రూపమున దేవ - అసుర-నరులను తృప్తి పఱచుచున్నాడు.*


*సమవర్తి సర్వసాక్షి కర్మఫలదాత కర్మసాక్షి పితృపతి ధర్మరాజునగు యముడు నీ నియోగముననే జీవుల కర్మానుసారము ఫలము లొసగు చుండును గాదా! రక్షసాంపతి విఘ్న వినాశకుడు యక్షుడు నగు నైఋతుడు సర్వకర్మ సాక్షియగుట నీ వనలనే కదా! జలాధినాధుడగు వరుణుడును నీ యాజ్ఞ వలననే ప్రాణులకు ప్రాణాధారుడై లోక పాలకుడయ్యెను. గంధవహుడు - జగద్గురువగు వాయువు నీ వలననే సర్వభూతములకు ప్రాణాధారమై లోకపాలకుడు అయ్యెను. యక్షకిన్నరాదుల కధిపతి యగు కుబేరుడు నీ యానతి మేరకు సకల లోకపాలకులలో గౌరవపాత్రుడయ్యెను. ఇక సర్వరుద్రేశుడు - ఈశానుడు అంతకుడు - సకలలోక వంద్యుడగునగు శివుడు సర్వదేవాధి నాయకుడువగు నీ కారణముననే లోకవంద్యుడై విలసిల్లు చున్నాడు. ఇన్ని సర్వ శుభ లక్షణములు గల జగదీశ్వరుడవు భగవానుడవు నగు నీకు నమోవాకములు. నీ యొక్క యంశము వలన నెల్ల దేవతలు లుద్బవించిరి. అట్లు బ్రహ్మచేత నుతింపబడిన యాది పురుషుడగు భగవానుడు తన విలాస వీక్షణ మునులతో బ్రహ్మనము గ్రహించెను. అత్తఱి హిరణ్యాక్షడను ఘోర మహాసురుడు త్రోవకడ్డు నిలువబడగా వరాహ దేవుడు భీమమగు గదతో నతనిని చావమోదెను. అది వరాహ పురుషుడగు భగవానుని శరీరము దానవుని నెత్తుట తడిసెను. అట్లు వరాహదేవుడు భూమిని నీటి నుండి లీలగ తన కోఱలతో పైకి లేపెను. లోకనాథుడగు వరాహమూర్తి భూమిని యథాస్థానమున నుంచి తన స్థానమున కేగెను. ఇట్లు భగవంతుడు భూమి నుద్దరించుట చిత్రము. ఈ వరాహ చరిత్ర ముత్తమము. దీనిని చదివిన - వినిన మానవుడు సర్వపాప విముక్తుడై వైష్ణవ మార్గము బొందును.*


*ఇది శ్రీ దేవి భాగవత మహ పురాణమందలి యష్టమ స్కంధమున ద్వితీయ అధ్యాయము సమాప్తం.*

       🙏🙏🙏🙏🙏

పూర్ణమిదః

 🙏

ఓం పూర్ణమిదః పూర్ణమదం 

పూర్ణాత్ పూర్ణముదచ్యతే|

పూర్ణస్య పూర్ణ మాదాయా పూర్ణమేవావశిష్యతే||

ఓం శాంతి శాంతి శాంతిః 


తాత్పర్యం: 

భగవంతుడు పూర్ణుడు.... పూర్ణానికి పూర్ణం కలిపినా.. పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా....

మిగిలేది పూర్ణమే..


ఇదే శ్రుతి వాక్యం. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే..... జీవితమంతా ఇందులోనే దాగుంది. మోక్ష మార్గం ఇందులోనే దాగుంది..... సమస్త సాధనాల సారం ఇందులోనే ఉంది.


0 + 0 = 0....

0 ౼ 0 = 0....


కానీ.....

0+1 = ఎంత అంటే.....

మనం వెంటనే 1 అని సమాధానం ఇస్తాం.....

ఇక్కడ సున్నా ...ఒకటితో కలవగానే అది 1 గా మారిపోయింది.


0+2 = 2.....

సున్నా 2 తో కలవగానే సున్న మాయమై.....

అది రెండుగా మారిపోయింది... అంటే.....

సున్న దేనితో కలిస్తే అదిగా మారిపోతూంది.


గాఢ నిద్రలో మనం పూర్ణమైన భగవంతుడిగా ఉంటాం. మనకప్పుడు ఏ భావోద్వేగాలు ఉండవు. ఎప్పుడైతే సున్న లాంటి మనం నిద్ర లేవగానే ప్రకృతితో కలుస్తామో... మనం ప్రకృతే ఐపోతున్నాం.


మనం దేనితో కలుస్తామో... దానిగా మారిపోతున్నాం


బాగా గమనించు....

నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు...

అతడు గతంలో నీకు ఎంతగానో సహాయం చేసాడు.... ఆ వ్యక్తి ని చూడగానే... నీలో అతని పట్ల ఆత్మీయత కలుగుతుంది... నువ్వూ అతనికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఆలోచిస్తావు. 


ఒక వ్యక్తి నిన్ను ఎంతగానో బాధించాడు... అతను కనబడగానే నువ్వు కూడా అతన్ని ఎలాగైనా బాధించాలని ఆలోచిస్తావ్....


ఎదుటి వ్యక్తి ప్రేమతో వస్తే..... నీకూ అతని పట్ల ప్రేమ కలుగుతోంది.....


ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవిస్తే ..... నీకూ అతని పట్ల గౌరవం కలుగుతుంది.....


అంటే.....

మనం ఎదుటి వ్యక్తిలోని ఏ గుణాన్నయితే గమనిస్తున్నామో..... మనం మనకు తెలీకుండానే ఆ గుణంతో కలిసిపోయి... ఆ గుణం గానే మారిపోతున్నాం.....


"మనం దేనితో కలుస్తున్నామో... అది గా మారిపోతున్నాం."


మనలో సున్న (0) లా ఉన్న పరమాత్మ తత్వం..... 

ఎదుటి వ్యక్తీ లోని కోపం తో కలవగానే అది కోపంగా మారిపోయి మనకు కోపం వస్తుంది.


నువ్వు ప్రేమతో కలిస్తే ప్రేమగా..... 

ద్వేషం తో కలిస్తే ద్వేషంగా..... మారిపోతావ్.

 

ఎదుటివారి లోని అహంకారాన్ని చూస్తే నీలో కూడా అహంకారం మొలుస్తుంది.


అందుకే.....

ప్రతి జీవిలోనూ.....

మనిషిలోనూ.....

పరమాత్మ ఉన్నాడని గ్రహించి......

ఆయనతో అనుసంధానం అవ్వు.


అంటే నీలోని పూర్ణాన్ని.....

ఎదుటి వ్యక్తీ లోని పూర్ణంతో కలుపు.....

వచ్చేది పూర్ణమే.


ఎదుటి మనిషిని చూడగానే అతనిలోని దోషాలను గుర్తిస్తే.....

మనం అతనిలో దేన్ని ముందుగా చూస్తామో.....

మనం అదిగా మారిపోతామన్న 

మహా సత్యాన్ని గమనించాలి.


అందుకే ఎలాంటి వారిలోనైనా.....

భగవంతుణ్ణి చూడగల్గి.....

ఆయనతో కలిస్తే....

మనం కూడా భగవత్ తత్వంగా మారిపోతాము.


సదా ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాణు స్వరూపంతో ఉన్న భగవంతునితో అనుసంధానమవుతూ..... ఉండాలి.


హరిః ఓం తత్సత్.... 

సర్వేజనా సుఖినోభవంతు...!!


సేకరణ

శ్రీ అగ్ని మహా పురాణం - 30 వ అధ్యాయం

 🔥🔥 *శ్రీ అగ్ని మహా పురాణం - 30 వ అధ్యాయం - మణ్డలాదివర్ణనం* 🔥🔥


*నారదుడు చెప్పెను :*


*భద్రమండలము మధ్య నున్న కమలమున అంగదేవతా సహిత బ్రహ్మను పూజింప వలెను. తూర్పున నున్న కమలమున పద్మనాభుని, ఆగ్నేయమున నుద్న కమలమున ప్రకృతిని, దక్షిణమున నున్న కమలమున పురుషుని దక్షిణభాగమున అగ్నిదేవతను , నైరృతిదిక్కున నిరృతిని , పశ్చిమదిక్కున నున్న కమలమున వరుణుని , వాయవ్యదిక్కునం దున్న కమలమున వాయువును , ఉత్తరదిక్కునందున్న కమలమున ఆదిత్యుని , ఈశాన్యదిక్కునందున్న కమలమున బుగ్వేద యజుర్వేదములను పూజింపవలెను. రెండవ ఆవరణమునందు ఇంద్రాది దిక్పాలకులను, షోడశ దల కమలమున క్రమముగా సామవేద, అథర్వవేద, ఆకాశ, వాయు, తేజో, జల, పృథివీ, మనః, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, భూర్లోక, భువర్లోకములను పూజింపవలెను.*


*పిమ్మట తృతీయవరణము నందలి, ఇరువదినాలుగు దళముల కమలమున క్రమముగ మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అగ్నిష్టోమ, అత్యగ్నిష్ణోమ, ఉక్థ, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామ, వ్యష్టిమనో, వ్యష్టిబుద్ధి, వ్యష్ట్యహంకార, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, జీవ, సమస్టిమనః, సమష్టిబుద్ధి (మహత్తత్వ), సమష్ట్యహంకార, ప్రకృతులను పూజింపవలెను. వీటి అన్నింటియొక్క స్వరూపము శబ్దమాత్రమే. అనగా కేవలము వీటి పేరులు చెప్పి నమస్కరించిన చాలును; మూర్తులను ధ్యానింపవ అవుసరము లేదు. ఇరువది యైదవ అధ్యాయములో చెప్పిన వాసుదేవాదిమూర్తులను తొమ్మిందింటిని, దశవిధ ప్రాణములను, మనో, బుద్ధ్య, హంకార, పాయు, ఉపస్థలను, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, వాక్‌, పాణి, పాదములను, ఈ ముప్పదిరెండింటిని, ముప్పదిరెండు దళముల కమలమున ఆర్చన చేయవలెను. ఇవి నాల్గవ అవరణమునందలి దేతవలు. ఈ ఆవరణమున సాంగ సపరివార దేవతాపూజ చేయవలెను.*


*పిమ్మట వెలుపలి ఆవరణమునందు పాయు ఉపస్థల పూజ చేసి, పండ్రెండు మాసాల అధిపతులను, పురుషోత్తముడు మొదలగు ఇరువది యారు తత్త్వములను పూజించవలెను. మాసాధి పతుల పూజ చక్రాబ్జముపై క్రమముగా చేయవలెను. ఎనిమిది, లేదా ఆరు, లేదా ఐదు ప్రకృతులను అచటనే పూజింపవలెను. పిమ్మట మండలములపై వేరు వేరు రంగులు గల చూర్ణములు చల్లవలెను. ఎచట ఏ రంగుగల చూర్ఱము చల్లవలెనో చెప్పదను; వినుము కమలకర్ణిక రంగు పసుపు పచ్చగా ఉండవలెను. సమస్తరేఖులును సమప్రమాణము గలవై తెల్ల రంగలో నుండవలెను. రెండు హస్తముల మండలముల రేఖలు బొటనవ్రేలంత లావుగా ఉండవలెను. ఒక హస్తము మండలమునందలి రేఖలు బొటనవ్రేలి లావులో సగము లావు ఉండవలెను. రేఖలు తెల్లగా ఉండవలెను. పద్మములకు తెల్లరంగును, సంధులకు నలుపు లేదా నీలి రంగు వేయవలెను. కేసరములు ఎరుపు-పసుపురంగులో ఉండవలెను. కోణములం దున్న కోష్ఠములను ఎఱ్ఱని రంగు గల చూర్ణముతో నింపవలెను. ఈ విధముగా యోగపీఠమును యథేష్టముగ అన్ని రంగులతోను అలంకరింప వలెను. వీథిని లతల తోడను, పత్రాదుల తోడను అలంకరింపవలెను. పీఠద్వారమును తెల్లని రంగు గల చూర్ణముతోను, శోభాస్థానములను ఎఱ్ఱని చూర్ణముల తోడను నింపవలెను. ఉపశోభలపై నీలి రంగు చూర్ణము చల్లవలెను. కోణముల శంఖములను తెల్లగా చిత్రింపవలెను. ఇది భద్రమండలముపై రంగు లుంచు విధానము. ఇతర మండలముపై గూడ ఈ విధముగనే అనేకవిధము లగు వర్ణములు గల చూర్ణములు చల్లవలెను. త్రికోణమండలము తెలుపు - ఎరుపు - నలుపురంగులతో అలంకరింప వలెను. ద్వికోణమును ఎరుపు పసుపు రంగులతో అలంకరింపవలెను. చక్రకమలమునందలి నాభిస్థానమును నలుపురంగు చూర్ఱముతో అలంకరిపవలెను.*


*చక్ర కమలము ఆకులకు పసుపు-ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము-ఎరుపు రంగులు వేసి అలంకరింప వలెను. బైట నున్న రేఖలకు తెలుపు, శ్యామము, ఎరుపు, నలుపు, పసుపు* *రంగులు వేయవలెను. వరిపిండి మొదలగువాటిని తెలుపురంగునకు ఉపమోగించవచ్చును. కుసుంధచూర్ణాదులు ఎరుపు రంగునకును, పసుపు పసుపురంగునకును, మాడ్చిన బియ్యపు పిండు నల్లరంగునకును ఉపయోగించును. శమీ* *పత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును. బీజ మంత్రములను ఒక లక్ష జపించుట చేతను, ఇతర మంత్రములను అక్షరలక్షలు జపించుట చేతను, విద్యలను ఒక లక్షజపించుట చేతను, బుద్ధవిద్యలను పదివేల సార్లు జపము చేయుట చేతను స్తోత్రములను వేయి* *పర్యాయములు జపించుట చేతను, లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుటచేతను, మంత్రశుద్ధియు, ఆత్మశుద్ధియు కూడ కల్గును. రెండవ పర్యాయము ఒక లక్ష* *జపించుటచే మంత్రము క్షేత్రీకృత మగును (సాధకునకు దానిపై నిలకడ ఏర్పడును). బీజ మంత్రజపము మొదట ఎంత సంఖ్యలో చేయబడునో హోమము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతర మంత్రముల విషయమున హోమము జపసంఖ్యలో పదవ వంతు* *చేయవలెను. మంత్ర పునః శ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతo ఆవలంబింప వలెను. నేలపై మొదట ఎడమ కాలు ఉంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు మూడురెట్లు జపము చేసిననే మధ్యమ ఉత్తమ శ్రేణికి చెందిన ఫలముల లభించును*


*ఇపుడు మంత్రమువలన ఫలము సిద్ధించుటకై ఉపమోగించు మంత్ర ధ్యానమును చెప్పెదను - మంత్రము యొక్క స్థూల రూపము శబ్దము. ఇది దాని బాహ్యరూపము. మంత్రముయొక్క సూక్ష్మ రూపము జ్యోతిర్మయ మైనది. ఇదే దాని ఆంతరరూపము. ఇది కేవలము చింతనామయ మైనది. చింతనమునకు కూడు అతీతమైనది మంత్రము యొక్క పర రూపము. వరాహ నరసింహ-శక్తిమంత్రముల స్థూలరూపమునకే ప్రాధాన్యము. వాసుదేవుని రూపము చిన్తనరహిత మని చెప్పబడినది.*


*ఇతరదేవతల చింతామయ మగు ఆంతరికరూపమే సర్వదా ముఖమైనదిగ పరిగణింపబడుచున్నది. విరాట్టు యొక్క స్వరూపము స్థూలము. లింగమయ స్వరూపము సూక్ష్మము. ఈశ్వరుని రూపము చింతారహితము. బీజమంత్రము హృదయ కమలము నందు నివసించునది; అవినాశి; చిన్మయము; జ్యోతి స్వరూపము. జీవాత్మకము. దాని ఆకాశము కదంబ పుష్పముతో సమానము. ఈ విధముగ ధ్యానింపవలెను. కుండలో నుంచిన దీపముయొక్క కాంతి పైకి ప్రసరింపకుండునట్లు నిరుద్ధమై సంహత రూపమున ఒంటరిగా ఉన్నట్లు, మంత్రేశ్వరుడు హృదయము నందు ప్రకాశించుచుండును. అనేక రంధ్రములున్న కుంభములో నుంచిన దీపము కాంతులు ఎన్ని రంధ్రము లున్నవో అన్ని బైటకు ప్రసరించినట్లు జ్యోతిర్మయ బీజ మంత్రముల రశ్ములు నాడుల ద్వారా ప్రసరించుచు దేవాత్మక దేహముతో ప్రకాశించును. నాడులు హృదయమునుండి బయల్వెడలి నేత్రేంద్రియము వరకును ప్రసరించి ఉన్నవి. వాటిలో అగ్ని - సోమాత్మకము లగు రెండు నాడులు నాసికాగ్ర భాగమునందుడును. మంత్రసాధకుడు ఉద్ఘాతయోగముచే శరీరవ్యాపియై యున్న ప్రాణవాయువును చక్కగా జయించి జపధ్యానతత్పరుడై యున్నచో ఆతనికి మంత్రఫలము లభించును. పంచభూతతన్మాత్రల శుద్ధి చేసికొని యోగాభ్యాసము చేయు సాధకుడు కోరికలు కలవాడైనచో అణిమాది సిద్ధులను పొందును. వైరాగ్యవంతు డైనచో ఆ సిద్ధులను దాటి, చిన్మయ స్వరూపముతో నుండి, భరూత మాత్రల నుండియు, ఇంద్రియము లనెడు గ్రహముల నుండి సర్వదా విముక్తుడగును.*


*శ్రీ మదగ్ని మహాపురాణము నందు మండలాదివర్ణన మను ముప్పదవ అధ్యాయము సమాప్తము.*

       🔥🔥🔥🔥🔥

పూజగదిలో

 ⚱️🙏🏻⚱️🙏🏻⚱️🙏🏻⚱️

🙏🏻⚱️🙏🏻⚱️🙏🏻⚱️🙏🏻




*⚱️పూజగదిలో చెంబు పాత్రలో నీటిని ఎందుకు వుంచాలి..??⚱️*




⚱️పూజగదిలో చెంబు పాత్రలో తీర్థం వుంచడం చేస్తుంటాం. సాధారణంగా పూజగదిలో చెంబు లేదా మట్టి పాత్రలో నీటిని వుంచడం చేయొచ్చు. ఇలా నీటిని వుంచి ప్రార్థించడం ద్వారా సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం. మహా నైవేద్యం కంటే నీటిని వుంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలను ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.


⚱️రాగి చెంబులో మంచినీటిని వుంచి మంత్ర పఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలుండవు. ప్రతిరోజు పూజ సమయంలో నీటిని వుంచి.. తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలుండవు. ఈ నీటిని రోజు మార్చి రోజు చెట్లకు పోయడం చేస్తుండాలి.


⚱️ఇలా చేస్తే ఆ ఇంట వున్న నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అలాగే పూజ చేసేటప్పుడు గంటను మోగించడం కూడా దుష్ట శక్తులను, ప్రతికూల శక్తులను పారద్రోలేందుకేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే పూజ సమయంలో ప్రకృతిని, పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో ఇబ్బందులుండవు.🌸

🌷శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు🌷*_

 _*🌷శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు🌷*_




త్యాగరాజ ఆరాధన ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజును స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాలు. ఈ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు త్యాగయ్యకు తమ నివాళులు అర్పించడానికి విచ్చేస్తారు. 

*ఈ ఉత్సవం త్యాగరాజు కావేరీ నది ఒడ్డున సమాధి సమీపంలో పుష్య బహుళ పంచమి  నాడు జరుగుతుంది.*  ఈ రోజు సంగీత విద్వాంసులంతా ఆయన సమాధి చుట్టూ కూర్చుని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు.  సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారు.


*చరిత్ర*

ఈ ఆరాధన ప్రతి సంవత్సరం త్యాగరాజు స్వామి పరమపదించిన *రోజైన పుష్య బహుళ పంచమి* రోజున శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ ఆధ్వర్యంలో జరుగుతుంది. తమిళనాడు లోని , తంజావూరు జిల్లా , తిరువయ్యూరులోని త్యాగరాజు సమాధి ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగుతుంది.


ప్రస్తుతం జరుగుతున్న ఆరాధనా సంప్రదాయానికి వంద సంవత్సరాలకన్నా తక్కువ వయసే ఉంటుంది. త్యాగరాజు 1847లో మరణించాడు. మరణానికి కొద్దిరోజుల ముందుగా ఆయన సాంప్రదాయ బద్ధంగా అన్నీ త్యజించి సన్యాసిగా మారాడు. ఆయన మరణించిన తరువాత భౌతిక కాయాన్ని కావేరీ నది ఒడ్డున ఖననం చేసి అక్కడే ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఆయన శిష్యులంతా వారి వారి స్వస్థలాలకు చేరుకుని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని వారి ఇళ్ళలోనే జరుపుకునే వారు. 1903 సంవత్సరం వచ్చేసరికి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన స్మారక నిర్మాణం పాడుపడిపోయే స్థితికి వచ్చింది. అప్పుడే , ఆయన దగ్గర విద్యనభ్యసించిన ఇద్దరు విద్యార్థులు దాన్ని సందర్శించడం జరిగింది. వారే ప్రముఖ సంగీత విద్వాంసులు ఉమయాల్పురం కృష్ణ భాగవతార్ , సుందర భాగవతార్లు. వారు తమ గురువు సమాధికి అలాంటి పరిస్థితి కలగడం చూసి చలించిపోయారు. అప్పటికప్పుడే ఆ ప్రాంతాన్ని పునరుద్ధరణకు ఏర్పాట్లు చేశారు. ప్రతిసంవత్సరం ఆయన వర్థంతిని అక్కడే జరపడానికి నిశ్చయించారు.


మరుసటి సంవత్సరం నుంచి సంగీత ప్రపంచంలోని  ఉద్ధండులంతా ఆయన వర్ధంతి రోజు తిరువయ్యూరులోనే జరపాలనీ , వారందరూ కలుసుకుని తమ అభిప్రాయాలను పంచుకోవడానికి వేదికగా ఎంచుకోవాలనుకున్నారు. 1905లో ఈ ఉత్సవాలు పేదవాళ్ళకి పెద్దఎత్తున అన్నదానం , వేద సంప్రదాయాల ప్రకారం పూజలు ఘనంగా జరిగాయి. కృష్ణ భాగవతార్ , సుందర భాగవతార్ ఈ ఉత్సవాలకు ప్రేరణగా నిలిస్తే , తిలైస్థానం నరసింహ భాగవతార్ , తిలైస్థానం పంజు భాగవతార్లు నిర్వాహకులుగా ఆర్థిక సహాయకులుగా ఉన్నారు. అయితే మరుసటి సంవత్సరానికి ఆ ఇద్దరూ అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇద్దరూ సమాంతరంగా ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. మిగతా వారు కూడా చెరో పక్క చేరి రెండు వైరి వర్గాలుగా విడిపోయారు. పెద్దవాడైన నరసింహ భాగవతార్ నిర్వహించే ఆరాధన పెరియ కచ్చి (పెద్ద బృందం) చిన్నవాడైన పంజు భాగవతార్ నిర్వహించే ఆరాధన చిన్న కచ్చి (చిన్న బృందం) గా పేరు పెట్టుకున్నారు. వారిద్దరి మరణానంతరం పెరియ కచ్చి ప్రముఖ వాయులీన విద్వాంసుడు మలైకోట్టై గోవిందసామి పిళ్ళై ఆధీనంలోకి , చిన్న కచ్చి ప్రముఖ హరికథా కళాకారుడు శూలమంగళం వైద్యనాథ భాగవతార్ ఆధీనంలోకి వచ్చింది. నెమ్మదిగా చిన్న కచ్చి ఆరాధనకు ఐదు రోజుల ముందు ప్రారంభమై , ఆరాధన రోజున ముగిసే లాగా , పెద్ద కచ్చి ఆరాధనరోజు ప్రారంభమై తరువాత నాలుగు రోజలపాటు సాగే సాంప్రదాయం మొదలైంది. రెండు వర్గాలు సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. పేదలకు అన్నదానం చేసేవారు. ఆ తొమ్మిది రోజులు సాధారణ ప్రజలకు మంచి వేడుకగా ఉండేదు. కొద్ది రోజులకు రెండు వర్గాలకు మధ్య సయోధ్య కుదిరింది. అప్పట్లో ఆడవాళ్ళను సంగీత ప్రదర్శన చేయనిచ్చేవారు కాదు. దేవదాసీలు తప్ప సాధారణ గృహస్థులెవరూ బహిరంగంగా పాడటానికి , నృత్యం చేయడానికి ఒప్పుకునే వారు కాదు. రెండు వర్గాలు నాదస్వరాన్ని కూడా ప్రదర్శనలలోకి అనుమతించేవారు కాదు.


అప్పట్లో బెంగుళూరు నాగరత్నమ్మ అలాంటి దేవదాసీగా ఉండేది. అప్పటి విద్వాంసులలో ఆమెకు ప్రముఖ స్థానం ఉండేది. త్యాగరాజుకు , సంగీతానికి వీరాభిమాని అయిన ఆమె అప్పట్లో మద్రాసులో నివసించేది. ఆమె ప్రదర్శనల్లో చాలావరకు ఆయన కృతులను ఆలపించేది. ఆయన అనుగ్రహం వల్లనే తనకు మంచి సంపద సమకూరిందని భావించేది. 1921లో , ఆమెకు వయసు మీరింది. పిల్లలు కూడా లేరు. ఆమె తన యావదాస్తినీ త్యాగరాజు యొక్క వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందేలా చేయడానికి ఆయన స్మృతులను భద్రపరచడానికి రాసిచ్చేసింది. 1925 లో ఆయన స్మారకానికి ఆలయ నిర్మాణం ప్రారంభించింది. కొంతమంది ఆమె ఆలయాన్ని నిర్మించడానికి వీలుగా సమాధి ఉన్న స్థలాన్ని కొన్నదనీ , మరికొంతమంది ఆ స్థలం గ్రామ పంచాయితీకి సంబంధించినదనీ , ఆమె నిర్మాణం నిబంధనలకు విరుద్ధమైనదనీ , కానీ ఆమె ఉద్దేశం మంచిదవడంతో గ్రామపెద్దలు అందుకు అడ్డు చెప్పలేదనీ భావించారు. ఆ సమాధి దగ్గరే త్యాగరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది. 1926 మొదట్లో ఆ ఆలయానికి కుంభాభిషేకం జరిగింది. రెండు వైరి వర్గాలు ఈ నిర్మాణంలో జోక్యం కలుగజేసుకోలేదు కానీ నాగరత్నమ్మను అక్కడ ప్రదర్శన ఇవ్వడానికి , కనీసం హరికథ చెప్పడానికి ఒప్పుకోలేదు. త్యాగరాజు తన పాటలలో అక్కడక్కడా మహిళపై చేసిన ఆరోపణలను అందుకు కారణంగా చూపించారు.


కానీ నాగరత్నమ్మ వాటన్నింటికీ బెదరక మూడో వర్గాన్ని ప్రారంభించి ఆ ఆలయం వెనుకలే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. ఇక్కడ చాలామంది మహిళా సంగీత విద్వాంసులు ఆలపించేవారు. దాంతో మిగతా వర్గాల పాపులారిటీ కొంచెం తగ్గింది. ఆమె అంతటితో ఆగకుండా ఆ రెండు వర్గాలను ఆలయంలోకి నిషేధించాలనీ ఆమె నిర్మించింది కాబట్టి ఆ హక్కు తనకే ఉండాలని కోర్టుకు ఎక్కింది. ఆమె కేసు ఓడిపోయింది. కానీ కోర్టు మూడు వర్గాలు ఆరాధనను మూడు సమాన భాగాలుగా విభజించుకుని నిర్వహించుకోమని తెలిపింది.


ఈ సాంప్రదాయం 1940 వరకు అలాగే కొనసాగింది. 1941 యస్.వై కృష్ణస్వామి అన్ని వర్గాలవారిని ఏకం చేశాడు. అప్పటి నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఆరాధన సంప్రదాయం మొదలైంది. హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్ పంచరత్నకీర్తనలను బృంద గానానికి బాగా సరిపోతాయని వాటిని ఎన్నుకున్నాడు. అప్పటి నుంచి అందరూ కలిసి పంచరత్నకీర్తనలను ఆలపించడం సాంప్రదాయంగా మారింది. 1941 కు మందు మూడు వేర్వేరు ప్రదర్శనలు జరపడం వల్ల ఎవరికిష్టం వచ్చిన కీర్తనలు వారు పాడుకునేవారు.


నాగరత్నమ్మ తన మిగతా రోజులు కూడా తిరువయ్యూరు లోనే గడపాలనీ , తన సంపదనంతా త్యాగరాజు స్వామి సేవకే అంకితం చేసింది. అంతే కాకుండా మహిళలు కూడా ఆరాధనల్లో పాల్గొనేందుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసింది. 1952 లో ఆమె చనిపోయినపుడు ఆమెను త్యాగరాజు సమాధికి సమీపంలోనే ఖననం చేసి ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం త్యాగరాజు సమాధిని చూస్తూ ఉన్నట్లు ఉంటుంది. ప్రస్తుతం తిరువయ్యూరులో  ఏటేటా పెరుగుతున్న ప్రేక్షకులకు అనుగుణంగా అతి పెద్ద మండపం నిర్మాణంలో ఉంది.🌷

ఉమా

 *🌷ఉమా🌷*



ఉకారము శివుడు. మా అంటే పార్వతి. ఉమ అంటే శివశక్తులు అని అర్ధం. తారకాసుర సంహారం కోసం దేవతలు పరమేశ్వరిని ప్రార్ధించారు. అప్పుడు ఆమె వారికి ప్రత్యక్షమై నా అంశతో హిమవంతునికి ఒక కుమార్తె పుడుతుంది. ఆమెను శివునకిచ్చి

వివాహం చెయ్యండి. వారిద్దరికీ పుట్టిన కుమారుడు తారకుని సంహరిస్తాడు అని చెబుతుంది. కొంతకాలానికి హిమవంతుని భార్య మేనక గర్భవతి అయి ఆడపిల్లను ప్రసవించింది.

ఆ బాలిక దినదిన ప్రవర్ధమానమైంది. సర్వకాల సర్వావస్థలయందు శివనామాన్నే జపిస్తుండేది. రానురాను తాను శివుణ్ణి తప్ప వేరెవరినీ వివాహమాడను అని తేల్చి చెప్పింది.

ఆ సమయంలో శివుడు విరాగియై తపోదీక్షలో ఉన్నాడు. అతణ్ణి భర్తగా పొందాలంటే తపస్సు ఒక్కటే మార్గం. అందుకని తపస్సు చెయ్యటానికి ఇంటి నుంచి బయలుదేరింది. అప్పుడు తల్లి అయిన మేనక కుమార్తెను వారిస్తూ ఉ - ఓయమ్మా, మా - వద్దు అన్నది. అప్పటి నుండీ ఆమెకు 'ఉమా' అనే పేరు సార్ధకమై పోయింది.


ఉత్తమమైన చిత్తవృత్తి గలది. సూతసంహితలో పరానుభూతియు,  సంసార పాపములను నశింపచేయునదియు, సదాశివుని కన్న మించిన శోభనసంపద గల ఉమ అను పేరు గల అనేక విధాలయిన వైభవముగల ఉత్తమ చిత్తవృత్తికి మ్రొక్కెదను అని చెప్పబడింది. 


విష్ణు శివ బ్రహ్మ వాచకములైన అకార ఉకార మకారములతో కూడిన త్రిమూర్త్యాత్మకమైన ప్రణవస్వరూపిణి. అందుచేతనే ఉమా అంటే - దేవీ ప్రణవము అని చెప్పబడినది.


లింగపురాణంలో శివుడు దేవితో “అకార ఉకార మకారములు నా ప్రణవము. ఉకార మకార అకారములు నీ ప్రణవమందు గలవు' అంటాడు.


మహావాసిష్టంలో “ఓంకార సారశక్తి గలదగుటచే ఉమ అని కీర్తించబడింది" అని చెప్పబడింది. 


ఉమ అంటే చంద్రకళ. ఇది ముల్లోకాలలోను నిద్రించువారి మేల్కొనువారి హృదయాలను ప్రేరేపిస్తుంది.


శివసూత్రాలలో ఇచ్ఛాశక్తి ఉమాకుమారి అని చెప్పబడింది. యోగుల యొక్క ఇచ్ఛకు ఉమ అని పేరు, సింధువనమున ఉండే దేవత. ఉమా అంటే - కాంతి అని అర్ధం.


యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా

అన్ని జీవులయందు కాంతిరూపంలో ఉంటుంది.


కేనోపనిషత్తులో “ఒకసారి దేవదానవులకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. ఆ తరువాత వారందరూ ఒకచోట చేరి యుద్ధం రకంగా జరిగింది. తాము ఏ విధంగా విజయం సాధించాము అనే విషయాలను గాధలుగా

చెబుతున్నారు.  ఆ విజయానికి కారణం నేనే అని ప్రతివారూ చెబుతున్నారు. 


అగ్నిదేవుడు అంటున్నాడు. “ఆ యుద్ధంలో నేను నిప్పులు కురిపిస్తుంటే రాక్షసులంతా మాడిమసి అయిపోయారు"


వాయుదేవుడు అంటున్నాడు " ఆయుద్ధంలో నేను చండప్రచండగా గాలులు వీస్తుంటే రాక్షసులు ఆ గాలులకు కొట్టుకుపోయారు"


పరబ్రహ్మతత్త్వం ఈ మాటలు విన్నది. దేవతలంతా గర్వించి ఉన్నారు. వారికి జ్ఞానోదయం చెయ్యాలి అనుకున్నది. అనుకున్నదే తడవుగా వారి ఎదుట పెద్ద భూతాకారంగా ప్రత్యక్షమైంది. దాన్ని చూసి భయపడ్డారు దేవతలు. ఆ భూతం ఏమిటో వారికి అర్ధం కాలేదు. అప్పుడు వారు అగ్నిదేవుని దగ్గరకు వచ్చి, “ఓ దేవా ! నీ పరాక్రమం

వల్లనే రాక్షసులను జయించగలిగాము. ఇప్పుడు ఆ భూతం ఏమిటో కనుక్కోవలసినది అన్నారు. సరేనన్నాడు అగ్నిదేవుడు. ఆ భూతాన్ని సమీపించాడు. అప్పుడు ఆ భూతం

అగ్నిని చూసి ఎవరు నువ్వు ? అన్నది.


అగ్ని: నేను అగ్నిదేవుడను. జాతవేదుడు అంటారు నన్ను.

భూతం : నీ శక్తి ఏమిటి ?

అగ్ని: ఎటువంటి వస్తువునైనా క్షణాల్లో దహించివేస్తాను.

భూతం : అలా అయితే ఈ గడ్డిపరకను దహించు. అంటూ ఒక గడ్డిపరకను చూపించింది. అగ్నిదేవుడు శతవిధాల ప్రయత్నించాడు. గడ్డిపరక కసికందలేదు. అవమానంతో వెళ్ళిపోయాడు అగ్నిదేవుడు. ఆ తత్త్వం ఏమిటో తెలుసుకోవటం తనవల్ల కాలేదన్నాడు. దేవతలంతా ఈ సారి వాయువును ప్రార్ధించారు. ఆ తత్త్వం ఏమిటో తెలుసుకోమని అర్ధించారు. సరేనన్నాడు వాయువు. ఆ తత్త్వం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు

ఆ భూతం వాయువుతో అన్నది.


భూతం : ఎవరు నువ్వు ?

వాయువు : నేను వాయుదేవుడను. ఆకాశంలో చరిస్తుంటాను. అందుచేత నన్ను మాతరిశ్వుడంటారు.

భూతం : నీ గొప్పతనం ఏమిటి ?

వాయువు : ఏ వస్తువునైనా క్షణాల్లో ఎగరగొట్టగలను.

భూతం : అలా అయితే ఈ గడ్డిపరకను ఎగరగొట్టు.

వాయుదేవుడు తన శక్తి అంతా కూడదీసుకుని గాలులు వీచాడు. గడ్డిపరక కదలను కూడా లేదు. అవమానంతో వెళ్ళిపోయాడు వాయువు, దేవతల దగ్గరకు వెళ్ళి ఆ తత్త్వం ఏమిటో తనకు తెలియలేదు అన్నాడు. ఈ సారి దేవతలు ఇంద్రుణ్ణి వెళ్ళమన్నారు.ఇంద్రుడు బయలుదేరి ఆ తత్త్వాన్ని సమీపించాడు.


ఆ తత్త్వం మాయమైపోయింది. ఆ స్థానంలో ఉమాదేవి ఉన్నది. అప్పుడు ఇంద్రుడు ఆమెతో అమ్మా ! ఇప్పటి దాకా ఇక్కడ ఉన్న తత్త్వం ఏమిటి ? అన్నాడు అందుకు ఉమాదేవి.


దేవేంద్రా ! అదే పరబ్రహ్మతత్త్వము. దాన్ని మీరు గుర్తించలేకపోయారు. ఆ తత్వానికి నాకూ తేడా లేదు. మేమిద్దరమూ ఒకటే అని చెబుతుంది. ఈ రకంగా పరబ్రహ్మను

ముందుగా దర్శించినవాడు కాబట్టే ఇంద్రుడు దేవతలకు రాజయినాడు. అగ్ని వాయువులు దిక్పాలకులయినారు అని చెప్పబడింది.


కాబట్టి ఉమ అంటే ఆ పరబ్రహ్మమే. ఆరు సంవత్సరాల బాలికను కూడా ఉమ అంటారు.


శ్రీమాత్రే నమః🌷

దర్శనం

 🙏🏻🍁🙏🏻🍁🙏🏻🍁🙏🏻

🍁🙏🏻🍁🙏🏻🍁🙏🏻🍁




*🙏🏻దైవ దర్శనం తరువాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా ?🙏🏻*




దైవదర్శనం మనసును పవిత్రం చేస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కష్టాలు  నష్టాలు బాధలు బాధ్యతలు ఎక్కువైనప్పుడు దైవదర్శనం వలన మనసుకి ఉపశమనం లభిస్తుంది. దైవం మనకి అండగా ఉందనే భరోసా కలుగుతుంది. దైవం అనుగ్రహం కన్నా మనకు కావలసిందేముందనే సంతృప్తి మిగులుతుంది.


అందుకే చాలా మంది ఉదయాన్నే ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటూ వుంటారు.కరుణాకటాక్ష వీక్షణాలను తమపై ప్రసరింపజేయవలసిందిగా దైవాన్ని ప్రార్ధిస్తుంటారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి మనసు కుదుటపడేవరకూ ఆలయ ముఖమంటపంలో కూర్చుంటారు. ఇక సమస్యలు పెద్దగా లేనివారు సైతం నిత్యం దైవదర్శనం చేసుకుంటూవుంటారు. వీరిలో ఒకరకమైన తేజస్సు చైతన్యం స్పష్టంగా కనిపిస్తుంటాయి.


ఇక ఇలా ఆలయానికి వచ్చే భక్తులను ఓ సందేహం సతమతం చేస్తుంటుంది. ఆలయానికి వెళ్లిన తరువాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా? లేదంటే అక్కడి నుంచి నేరుగా ఎక్కడికైనా వెళ్లవచ్చా? అని అనుకుంటూ వుంటారు. ఈ సందేహానికి సమాధానం మనకి శాస్త్రాల్లో కనిపిస్తుంది. పండితుల ప్రసంగాల్లోనూ వినిపిస్తుంటుంది.


విశేషమైనటువంటి పుణ్య తిథుల్లో ఆలయానికి వెళ్లినప్పుడు, పూజ పూర్తి అయిన తరువాత తిరిగి నేరుగా ఇంటికి రావాలని పెద్దలు చెబుతుంటారు. ఆ తరువాతే దైనందిన వ్యవహారాల నిమిత్తం బయటికి వెళ్లాలని అంటూ వుంటారు.


ఇక సాధారణ రోజుల్లో కూడా దైవదర్శనం తరువాత, అపవిత్రమైన ప్రదేశాలకు, మైలలో వున్న ఇళ్లకు వెళ్లకూడదని చెబుతుంటారు. అందువలన దైవ దర్శనం తరువాత ఆ పవిత్రత చెడని ప్రదేశాలకు ప్రశాంతత చెదరని ప్రదేశాలకు వెళ్ల వచ్చని సూచిస్తుంటారు.


*ఓం నమో నారాయణాయ🙏*

గోరంతదీపం

 🪔🙏🏻🪔🙏🏻🪔🙏🏻🪔

🙏🏻🪔🙏🏻🪔🙏🏻🪔🙏🏻




*🪔గోరంతదీపం కొండంత వెలుగు🪔*


           


దీపాలను వెలిగించడమనేది తెలుసుకున్న నాటినుండే మానవాళి నాగరికత  అభివృద్ధి చెందిందని భావించవచ్చును. ఆదిలో రాళ్ళ రాపిడితో, కట్టెలతోను, జంతువుల కొవ్వుతోను  ఆదిమానవుడు దీపం వెలిగించడం నేర్చుకున్నాడు. తరువాత గవ్వలతో , శంఖులతో దీప ప్రమిదలు తయారు చేయడం మొదలయింది. 

ఆ తరువాత తయారు చేయబడిన  మట్టి ప్రమిదలు ఈనాటికి వాడుకలోవున్నవి.


ఆషాఢ మాసం నుండి ఆశ్వీయుజ మాసంవరకు  విశేషంగా వర్షాలు కురుస్తాయి.  దీనితో అనారోగ్యకారకాలైన క్రిములు వాతావరణంలో వ్యాపిస్తాయి.  కలరా వంటి అంటు వ్యాధులని వ్యాపింప చేస్తాయి. అలాటి అంటువ్యాధుల నిర్మూలనకు  కార్తిక దీపోత్సవాలలో వందలాది మంచి నూనె  దీపాలు  మన గృహాలలో వెలిగించడం ఒక సంప్రదాయంగా మారింది.

ఇది మన సనాతనులు కనిపెట్టి మనకు అందించిన వైజ్ఞానిక సంపద.  


ప్రతీదినమూ  మన ఆలయాలలో వేలకి వేలు దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలకాంతుల శక్తికి  రోగ క్రిములు నశిస్తాయి. 



*🪔కామాక్షి దీపం*


దీపాలలోనే ఇది పవిత్రమైన దీపం.అందరి గృహాలలో వుండవలసిన దీపం. 

పూజకి ముందు  పువ్వులతో  అలంకరించి, బొట్టు పెట్టి మంగళకరంగా దీపం వెలిగించి, నిత్యం పూజించవలసిన దీపం కామాక్షి దీపం. దక్షిణాదిన వంశపారంపర్యంగా యీ కామాక్షి దీపాన్ని  బంగారంలా కాపాడుకోవడం ఒక ఆచారంగా పాటిస్తారు.

కొంతమంది తమ గృహాలలో, వారి పెద్దవారు వెలిగిస్తూ వచ్చిన కామాక్షి  దీపం ఆరిపోకుండా కాపాడుకుంటూ

వస్తారు. 


గృహ ప్రవేశ సమయాలలో,  వధూవరులు  పెళ్ళి పందిరికి ప్రదక్షిణం చేసినప్పుడు , అంధకారాన్ని తొలగించే విధంగా , అనుగ్రహకాంతులు అందరికీ లభించేలాగ దీపాన్ని పట్టుకుని  భయభక్తులతో తీసుకుని వెళ్ళే దీపం కామాక్షి దీపం. తమ కుమార్తె అత్తవారింటికి వెళ్ళేటప్పుడు రెండు  పెద్ద దీప స్ధంభాలవంటి కుందులు, కామాక్షి దీపాన్ని 

సారెగా తప్పకుండా యిచ్చి సాగనంపుతారు.🙏

ఆంజనేయుడు శనీశ్వరుడిని

 ఆంజనేయుడు శనీశ్వరుడిని తలపై 

ఎందుకు కూర్చోబెట్టుకున్నాడో తెలుసా ?🙏


పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు. అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో వుంచుకోగలిగిన మహాశక్తిశాలి.. హనుమంతుడు. శ్రీ రాముడు లంకకు చేరుకునేందుకు గాను.. రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమగ్నమై వుండగా.. శనిభగవానుడు హనుమంతుడిని బంధించేందుకు వచ్చాడు. రెండున్నర గంటసేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు. 


''రెండున్నర గంట పాటు హనుమా నిన్ను చెరపట్టాలి. నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకివ్వమని అడుగుతాడు. అయితే రామసేతు నిర్మాణంలో తానుండగా.. చేస్తున్న పనికి ఆటంకం కలిగిస్తున్నావని హనుమ చెప్తాడు. అయినా నీకు నా తలభాగం ఇస్తాను. అక్కడ ఎక్కి కూర్చోమంటాడు. అంతే శని కూడా హనుమంతుడి తలపై ఎక్కి కూర్చుంటాడు. 


కానీ ఆంజనేయుడు రాళ్లను, కొండలను తన తలపై మోసాడు. భారం తాళలేక శనిభగవానుడు గగ్గోలు పెట్టగా, మాట తప్పకూడదు. రెండున్నర గంట సేపు అలానే వుండాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ రెండున్నర గంటకు తర్వాతే హనుమంతుడు శనీశ్వరుడు తల నుంచి శనీశ్వరుడిని కిందికి దించుతాడు. ఆపై రామ భక్తులను, ఆంజనేయ భక్తులను శనీశ్వరుడు ఇక్కట్లకు గురిచేయకూడదని హెచ్చరించాడు'' అలా శనీశ్వరుడి చెర నుంచి హనుమంతుడు తప్పుకున్నాడు. 


అలాంటి మహిమాన్వితుడైన హనుమంతునికి తులసీ మాలను సమర్పించుకుంటే శనిగ్రహ బాధల నుంచి గట్టెక్కవచ్చు. ఆంజనేయునికి రామనామం అంటే మహాప్రీతి. హనుమజ్జయంతి రోజున ''రామ రామ రామ'' అనే మంత్రాన్ని పఠించడం చేయొచ్చు. 


''ఓం ఆంజనేయాయ విద్మహే

వాయుపుత్రాయ ధీమహి

తన్నో హనుమాన్ ప్రచోదయాత్'' అనే మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా శనీశ్వర గ్రహ దోషాల నుంచి గట్టెక్కవచ్చు. హనుమజ్జయంతి రోజున తులసీమాల సమర్పించడం, తులసీ ఆకులతో అర్చన చేయడం ద్వారా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆ రోజున వడమాల సమర్పించడం, వెన్నతో ఆంజనేయుడిని అలంకరించడం, అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. 


మనోబలం, బుద్ధిబలం, శరీరబలం, ప్రాణ బలం కోసం ఆంజనేయ స్వామిని స్తుతించడం చేయాలి. ఆంజనేయ ఆరాధన ద్వారా వీరం, వివేకం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.🙏