3, సెప్టెంబర్ 2022, శనివారం

గోవు వెనక వెళ్ళడమెందుకు

 గోవు వెనక వెళ్ళడమెందుకు?

పరమాచార్య స్వామివారు విజయయాత్రలలో భాగంగా, వివిధ ప్రాంతాలలో నివసిస్తుండేవారు. అలాంటి సమయాలలో కొందరు భక్తులు, తమ ఇళ్ళకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్తిస్తుంటారు.

భక్తులు రమ్మని ప్రార్తిస్తున్నది దేవాలయానికే అయితే పరమాచార్య స్వామివారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడకు వెళ్లి, దేవుని దర్శనం చేసుకుని, దగ్గరలోని ఒక స్థలంలో మకాం చేసి, కొద్దిసేపో లేదంటే ఒకరోజో అక్కడ ఉంది భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటారు. కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కాని లేదా సామాన్య విషయాలు చర్చించడం కాని జరుగుతూ ఉంటాయి.

ఒకసారి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తం విజయయాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా తిరుచిరాపల్లిలో కొన్నిరోజుల పటు మకాం చేశారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు.

ఆ భక్తజన సమూహంలో తిరుచ్చిలోని ఒక కళాశాల ప్రధానాచార్యులు కూడా ఉన్నారు. వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి, ఎన్నోరకాల పళ్ళు పూలు సమర్పించాడు. మహాస్వామివారి దివ్యపాదములు తన కళాశాలను తాకాలని, విద్యార్ధులని అనుగ్రహించాలని ప్రార్థించాడు.

కాని మహాస్వామివారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయ్యింది. అతను మాత్రం రోజూ వచ్చి స్వామివారిని అర్థించేవాడు.

చివరగా ఒకరోజు కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపజేశారు. పటికబెల్లం, కుంకుమ ప్రసాదం ఇస్తూ, స్వామివారు అతనితో, “రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను. ఒక ఆవు, దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించారు.

ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు. “ఖచ్చితంగా అలాగే చేస్తాను పెరియవా” అని మహదానందంతో వెళ్ళిపోయాడు.

చెప్పినట్టుగానే ఉదయం స్వామివారు కళాశాలకు వెళ్ళారు. అతను ఆవు, దూడ, పూర్ణకుంభంతో సహా స్వామివారికోసం ఎదురుచూస్తున్నాడు. మహాస్వామివారి పూర్ణకుంభాన్ని స్వీకరించి, కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు.

స్వామివారు ఆ భక్తునితో, “నువ్వు ఎక్కడేక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో, అక్కడకు నువ్వు ఆవు, దూడను ముందు తీసుకుని వెళ్ళు, నేను అనుగమిస్తాను” అని తెలిపారు.

స్వామివారి ఆదేశం ప్రకారం అతను భార్యతో కలిసి ఆవు దూడను ముందు తీసుకుని వెళ్తూ ఉంటె స్వామివారు ఆవు వెనుకగా వస్తున్నారు. మొత్తం కలియతిరిగిన తరువాత స్వామివారు ఆ భక్తునితో, “సంతృప్తిగా ఉందా?” అని అడుగగా, అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటలలో చెప్పడం కుదరక, కళ్ళ నీరు కారుస్తూ, హృదయం ఉప్పొంగి, తనకు స్వామివారు కలిగించిన అదృష్టానికి, వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. 

తమ వసతికి తిరిగొచ్చిన స్వామివారు సాయింత్రం భక్తులతో మాట్లాడుతూ, ఉదయం తాము కళాశాలకు వెళ్లోచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని, “పెరియవా, కళాశాలో మీరు ఆవు వెనుకగా ఎందుకు వెళ్ళారు?” అని అడిగాడు.

స్వామివారు చిరునవ్వుతూ, “అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు. నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు. కాని అది ఆడపిల్లలు చదివే కళాశాల. వారు అన్ని రోజులలోను కళాశాలకు వస్తారు. వారు దూరం ఉండాల్సిన సమయాలలో కూడా కళాశాలకు వస్తారు. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. అతని కోరికను తీర్చాలి. నా అనుష్టానం, నియమపాలన కూడా కాపాడబడాలి. దానికి పరిష్కారం ఒక్కటే. మన శాస్త్రాలలో ఉన్నదాని ప్రకారం, ఎటువంటి అశౌచమైనా, ఎటువంటి స్థలమైనా గోవు డెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే, ఆ స్థలం పవిత్రమవుతుంది. అందుకే ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించాను” అని బదులిచ్చారు.

స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులై నిలబడిపోయారు. ఇంతటి ధర్మసూక్ష్మము ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ధర్మాన్ని, ఆశ్రమ నియమ పాలనను ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామివారు కాక ఇంక ఎవరు ఉంటారు?

--- “కడవులిన్ కురల్” - తిరువారూర్ దివాకరన్. ‘కుముదం’ పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।

2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

*అమ్మ కొంగుచాటు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*🌷శ్రీమతి శశికళ ఓలేటి గారి కథనం🌷*

                *అమ్మ కొంగుచాటు!* 

                       🌷🌷🌷                                         


“ అమ్మకూ నాకూ మధ్య అడివంత దూరం! అడివయితే పరవాలేదు అఖాతం కాకుండా ఉంటే చాలు!”… అనుకుంటూ…దట్టమయిన చెట్లు చీకట్లు పరుస్తూంటే, అడివి గుండా నెమ్మదిగా డ్రయివ్ చేస్తున్నాడు భాస్కర్. 


“ అమ్మతో ఆ విషయం ఎలా ప్రస్థావించాలో ఏమిటో? అమ్మ ఎలా తీసుకుంటుందో. నన్ను అసహ్యించుకుంటుందేమో. ఇన్నాళ్ళూ తన బాధ్యతలు ఏదీ పంచుకోకుండా, దేశాంతరాలు ఉద్యోగనిమిత్తం పారిపోయి, ఇప్పుడు హఠాత్తుగా ఊడిపడి… ఇల్లూ, పొలం అమ్మేసి నా దగ్గరకు వచ్చేయి… అంటే…ఒప్పుకుంటుందా? లేక తను పెంచిన కొడుకేనా ఈ వంచకుడు… అనుకుంటూ నిరసిస్తుందా?”…అతని తలపులు అతన్ని సతమతం చేస్తుంటే, ఎదురుగా వస్తున్న అడవి దున్నను ఇంచుమించు గుద్దేయబోయాడు. హఠాత్తుగా వేసిన బ్రేకు… కారుని మూడొండల అరవై డిగ్రీలు తిప్పి, పక్కనున్న గెడ్డ లోకి తోసేసింది. 


       కారు కదిలే పరిస్థితి లేకపోవడంతో, ముఖ్యమయిన వస్తువులు తీసుకుని, అడవిదారిని నడవసాగాడు భాస్కర్. ఆకాశం మేఘాచ్ఛాదితమై ఉంది. అలసిన ప్రాణానికి సాంత్వనిస్తూ చల్లగాలి  తగులుతోంది. దారిలో మర్రిచెట్టు కింద చిన్న గూడులో “కడిమితల్లి రాయి”…పసుపుకుంకాలతో, అడివిపూలతో కలకలలాడుతోంది. ఎంత చిరపరిచితమైన పరిసరాలు ఇవన్నీ. అమ్మకొంగు పట్టుకుని బాల్యమంతా తారాడిన నెలవులు. కడిమితల్లి రాయి తనూ, అమ్మే కదా మోసుకుంటూ తెచ్చి అక్కడ పెట్టింది. 


బడికి వెళ్ళాలంటే అడవి దాటాలి… “ఒంటరిగా. భయం వేస్తోందమ్మా… “…అంటే కడిమి చెట్టు కిందుండే రాయిని తెచ్చి అక్కడ పెట్టి… “ ఈమె కదంబవన వాసిని. నిన్ను సదా రక్షిస్తూ నీతోనే ఉంటుంది!”…అంది అమ్మ. ఒకరోజు ఇలాంటి వానలోనే దారి తప్పినపుడు “ కడిమి తల్లీ!” అని పిలుస్తూ ఏడుస్తున్నాడు తను. ఇంతలో ఓ చెట్టు కింద తలదాచుకున్న ఒక అమ్మాయి, చెంచెత తన చెయ్యి పట్టుకుని ఇంటిదాకా తెచ్చి వదిలింది. అమ్మకు చెప్తే… “ అమ్మవారే కాపాడింది!”… అంటూ ఊరంతా చెప్పడం, కడిమితల్లి రాయి దేవతగా పూజింప బడడం మొదలయ్యింది అక్కడ. 


          “అయినా వేరే దేవతలేలా? అమ్మే పెద్ద దేవతామూర్తి. ఎంత సహనం, ఎంత శాంతం. సాటివారంటే ఎంత ప్రేమ. చిన్నవయసులో పెళ్ళి, పెద్దపెద్ద బాధ్యతలు మోస్తూ, నాన్న కోపాన్ని సహిస్తూ, చాలా ఏళ్ళు గొడ్రాలిగా ముద్రపడి, లేకలేక పుట్టిన తనను అపురూపంగా పెంచుకుంటూ…అలాంటి అమ్మను అనాధలా ఇన్నేళ్ళూ వదిలేసి, ఇప్పుడు తన స్వార్ధ ప్రయోజనం కోసం వెళ్తున్నాడు తను”… మనసంతా సిగ్గుతో ముడుచుకుపోయింది. సన్నగా చినుకులు మొదలవ్వడంతో నడక వడి పెంచాడు భాస్కర్. 


“ఎండొచ్చినా, వానొచ్చినా తన పెద్ద పవిటను ముందుకు లాగి, గొడుగులా పట్టి, తనకు ఆచ్ఛాదన నిచ్చేది అమ్మ. తను చిన్నపిల్లలా మారిపోయి ఎన్ని ఆటలాడేది. ఎన్ని పాటలు పాడేది. అమ్మ అంతరంగం అడివిలా చాలా లోతుగా, చిక్కగా రహస్యాలన్నీ దాచుకున్నట్టే ఉండేది. ఇంట్లో కన్నా ఎక్కువ పొలంలో, అడివిలో ఎందుకు ఆడించేదో మెల్లగా అర్ధమయ్యే వయసు వచ్చింది తనకు. రోజంతా బాధ్యతలు పట్టకుండా తాగుడులో గడిపే తండ్రి, అతని వ్యసనాలకు కరిగిపోతున్న ఇంటిపరువు, ఆస్తిబరువూ… తన కంట పడకూడదనే ఆమె తాపత్రయం అర్ధమవుతూ ఉండేది.”


      “తనను అమ్మ నుండి దూరం చేసిన రోజు తనకు ఇంకా గుర్తుంది. బాల్యచాపల్యం కొద్దీ నాన్న తాగి వదిలేసిన సీసాలోని ద్రావకం తను తాగాడు. అది చూసిన అమ్మ మొట్టమొదటి సారి తన మీద చెయ్యి చేసుకుంది. అలాగే చేతిలో చెయ్యి వేయించుకుంది…. జీవితంలో దాని మొహం చూడకూడదని. తన కోసం నాన్న ముందు గొంతు విప్పింది. బాబాయింటికి పట్నం పంపేసింది చదువులకు. ఒక హాస్టలు నుండి మరో హాస్టలుకు మారుతూ తన చదువంతా బయట ఊళ్ళలోనే. సెలవలకు అమ్మమ్మ ఇంట్లో అమ్మను చూడ్డమే”


తండ్రిగా తనకు ఏ జ్ఞాపకాలూ మిగల్చని తండ్రి తనకు ఒకే బాధ్యత నప్పచెప్పాడు. ఆయనకు కొరివి పెట్టడం. ఆయనతో అన్నేళ్ళ పాటూ సహజీవనం చేసిన ఆ మరోస్త్రీకి కూడా ఎంతో కొంత అప్పచెప్పి… మర్యాదగా సాగనంపిన తల్లి సంస్కారానికి దణ్ణం పెట్టాలో , లేక అన్నేళ్ళూ పడ్డ మనోవేదనకు చలించిపోవాలో కూడా అర్ధం కాలేదు తనకి. ఏదయితేనేం తండ్రితో ఉన్న ఋుణానుబంధం తీరిపోయింది. ఒక విధంగా ఊరితో కూడా. 


అమ్మ మాత్రం స్వయంగా పొలం పనులు చేసుకుంటూ, నాన్న పోగొట్టిన భూమినంతా తిరిగి సాధించుకుంది. ఇల్లు నిలబెట్టుకుంది… దేనిలోనూ తన కష్టం, ప్రమేయం లేకుండానే. 


        చదువవుతూనే, గల్ఫ్ లో ఉద్యోగం, దానికి ముందు స్నేహితుని చెల్లెలు కవితతో కులాంతర వివాహం అన్నీ కలలోలాగా జరిగిపోయాయి. కలల్లో బతికే కవితకు… కష్టాన్ని నమ్ముకున్న అమ్మకూ జత కుదరకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు, కానీ తననూ, అమ్మనూ విడగొట్టేంత విద్వేషం కవితలో ఎందుకో ఇప్పటికీ జవాబు లేని ప్రశ్న. మనవల కోసం తపించే అమ్మకు వాళ్ళు లీలగా గుర్తంతే. అంతలా ఎడం పెట్టింది కవిత అమ్మనుండి. ఈ రోజు స్వదేశంలో స్థిరపడుతూ… అమ్మ, ఆమె ఆస్తులు కావలసి వచ్చాయి కవితకు. “కలవాలి అమ్మను, మాట్లాడాలి మనసు తీరా… ఆస్తి కోసం కాదు…ఆత్మీయత కోసం. అందుకే తన ఈ ప్రయాణం”…..


   ఆలోచనల్లో పడి  పక్కనే ఏదో మోటర్ సైకిల్ ఆగడం గమనించనే లేదు భాస్కర్ . “ ఎవరింటికి అబ్బాయిగారూ? ఊళ్ళోకి వెళ్తున్నా. దిగపెట్టమంటారా?”… ఆపద్బాంధవుడిలా అడిగాడు అతనెవరో. ఇంటి దాకా దింపే వాడే…. వర్షం ముసురులా మారకపోతే. ఊరు పట్టణంలా మారిపోయి చాలా రోజులే అయిపోయినట్టుంది, గుర్తుపట్టనంతగా మారిపోయాయి వీధులన్నీ. చిన్న డాబా దగ్గర ఆపి, వాన తగ్గాకా వెళ్దామని ఆపాడతను. ఇలా మహాలక్ష్మిగారి అబ్బాయిని అని చెప్పాడో లేదో…అక్కడ ఉన్నవాళ్ళంతా గుమికూడిపోయారు. ఎవరి నోట విన్నా తల్లి గుణగణాలూ, ఉపకారాలూ, మంచిమాటలే. కడుపు నిండిపోయింది భాస్కర్ కు. వాళ్ళిచ్చిన వేడి టీ తాగుతూ… తల్లికి ఫోన్ చేసాడు. అమ్మ కదా…” వానలో తడుస్తూ రాకు నాన్నా. కారు పంపుతాను.”… అంటూ జాగ్రత్తలు. ఆమె గొంతులో సంభ్రమాశ్చర్యాలు దాచినా దాగడం లేదు. 


       మరో పదినిమిషాలు గడిచాయి. డాబా ముందు కారాగిన శబ్దం. “కారులోండి చీకట్లో గొడుగు వేసుకుని వడివడిగా వస్తోంది ఎవరదీ… అమ్మే కదా.” ఒక్క ఉదుటున బయటకు పరిగెట్టాడు. గొడుగు పట్టిన అమ్మను పట్టుకుని కొడుకు…ఇరువురూ ప్రేమ కోసం తపిస్తున్న దాహార్తుల్లా. దారంతా మాటల్లేవు. తల నుండి కారుతున్న నీళ్ళతో కన్నీరు కలిసిపోతోంది. 


      ఇంటికి చేరగానే… ఎదురుగా తండ్రి… నిలువెత్తు పటంలో. అప్రయత్నంగా నమస్కరించాడు. “బహుశా ఈ జన్మసంస్కారమే ఈ దేశంలో బాంధవ్యాలను గట్టిగా పట్టి ఉంచిందేమో! “. 


తల్లికి సాయంగా ఉంటున్న రైతు కుటుంబం వచ్చి పలకరించారు. తల తుడుచుకుంటూ…వాళ్ళతో మాట్లాడుతుంటే.. తల్లి కొంగు పట్టుకుని వ్రేలాడుతూ… అచ్చం చిన్నప్పటి తనలాగే నాలుగేళ్ళ పిల్లాడు, పెద్దపెద్ద కళ్ళతో, బూరి బుగ్గలతో, ఉంగరాల జుట్టేసుకుని… తన కేసే ఉత్సుకతతో చూస్తూ. 


“ పెద్దనాన్న!”… అంటూ ముందుకు తోసింది తల్లి. అప్రయత్నంగా చేతులు చాపాడు భాస్కర్. అంతే పరుగుల్న వచ్చి, చంకనెక్కాడు వాడు. 


       “ రోహిత్” ట వాడి పేరు. రాత్రంతా కురుస్తున్న వానతో పాటూ సాగిన తల్లీకొడుకుల కబుర్లధారలో ఎన్నో విషయాలు దొర్లాయి. రోహిత్ తల్లీతండ్రీ పొలంలో పనిచేస్తూ…పిడుగుపాటుతో చనిపోవడంతో రోహిత్ తన ఒడి చేరాడని,  న్యాయబద్ధంగా దత్తత చేసుకుని, రెండేళ్ళ నుండి తనే పెంచుతున్నట్టు చెప్పింది తల్లి. తన బిడ్డలు పొందవలసిన నాయనమ్మ ప్రేమ ఒక అనాధకు దక్కడం… భాస్కర్ లో చిన్న అసహనాన్ని కలిగించినా, అది క్షణికం మాత్రమే. అతనికి తన తల్లి మనసు తెలుసు. ఆమె ఏనాడూ తనకు దక్కని బంధాల గురించి వగచే మనిషి కాదు. తను కావలసిన వారినే బంధాలుగా మార్చుకునే మనిషి. జీవితంలో ఎలాంటి అసంతృప్తీ, పితూరీలు లేని మనిషి. 


      రెండు రోజుల్లో తిరిగి వెళ్ళిపోవాలని వచ్చిన భాస్కర్…వారం రోజులు ఉండిపోయాడు. చేజార్చుకున్న తల్లి ప్రేమ మళ్ళీ ఇన్నాళ్ళకు సంపూర్ణంగా అనుభవిస్తున్నాడు అతను. తల్లి కష్టించి, పెద్దది చేసిన పొలం చూసొచ్చాడు. ఫార్మ్ హౌస్ లో పౌల్టరీ, ఆవుల్నీ చూసి ఆశ్చర్యపోయాడు. పెద్ద చదువుసంధ్యలు లేకపోయినా, ఎలాంటి మగదక్షత లేకుండా తెలివితేటలతో, శ్రమతో ఆమె పెంచిన ఆ చిన్న సామ్రాజ్యం చూసాకా, రోహిత్ తో, అక్కడి రైతుల కుటుంబాలతో ఆమె పెంచుకున్న అనుబంధం చూసాకా…తల్లితో ఆస్తులు అమ్మించి, తనతో రమ్మని పిలవాలన్న ఆలోచనకు పూర్తిగా స్వస్థి చెప్పేసాడు భాస్కర్. తనకు శక్తి ఉంటే… కనీసం సమీపభవిష్యత్తులో నయినా తన పిల్లలను తన తల్లికి దగ్గర చెయ్యాలి అన్న ఆలోచన ఒక్కటే అతని మనసులో! 


    ఉరుమూ మెరుపూ లేకుండా ఊడిపడ్డ కొడుకు రాక యాదృచ్ఛికం కాదని ఆ అమ్మకు తెలీదా! బయట పడతాడేమో అని ఎదురు చూస్తోంది. కానీ ఎంత కాదన్నా ఆమె పెంపకం కదా. తల్లిని బాధపెట్టే ఏ మాటా అతని నోటంట రావడం లేదు. అతని ప్రయాణానికి ముందురోజు…కొడుక్కి అన్ని వివరాలూ చెప్పడం మొదలుపెట్టింది. ఎంత సంపాదించి పెట్టింది, అతని పిల్లలకు ఏం ఇవ్వబోతోంది .. రోహిత్ బాధ్యత, తనను నమ్ముకున్న కుటుంబాల సంక్షేమం.. వంటివి తల్లి చెప్తుంటే మౌనంగా వింటున్నాడు. 


“ నా మనవల కోసం పొదుపు చేసిన అరవై లక్షలున్నాయి భాస్కర్. వాళ్ళ పెద్దచదువుల కోసం ఇప్పుడే వాడుకో. మామయ్య నాకు తన అవసరార్ధం అమ్మిన విలువైన షేర్లు ఉన్నాయి. అవి అమ్ముకుని…ఏ ఇంటి మీదయినా పెట్టుకో! మిగిలినవి నా చివర వరకూ ఉంటాయి. ఈ వూరు విడిచి, నీ దగ్గరకు రమ్మనమని నువ్వు అడగచ్చు. కానీ ఊరితో, భూమితో, రోహిత్ తో నా అనుబంధం ఇప్పట్లో తెంపుకునేది కాదు. అమ్మగా ప్రస్థుతం నేను ఇంతే చెయ్యగలను నీకు. విదేశాల్లో సంపాదించింది ఇక్కడ వ్యాపారాల్లో పెట్టి నష్టపోయావని తెలిసింది. ఎప్పటికీ ఈ ఇంటి తలుపులు నీకోసం తెరుచుకునే ఉంటాయి. నువ్వెప్పుడూ నా గారాల కన్నయ్యవే. అమ్మకొంగు పట్టుకుని నువ్వెంత రక్షణ పొందావో, నీ చిట్టిచేయి పట్టుకుని ఈ అమ్మ కూడా అంత ఆసరా పొందింది నీ బాల్యంలో!”…కొడుక్కి చెప్పుకుంటుంటే ఆమె చెంపల మీంచి కన్నీరు జారిపోతోంది. 


          తల్లి అన్నీ తెలుసుకుంటోంది, తనను వదిలేయలేదన్న విషయం అతనికి కొండంత ధైర్యాన్నిచ్చింది. ‘అమ్మకొంగు చివరనే నేను ఎప్పుడూ’ అన్న నిశ్చింత అతని పరాజయాల్ని మరిపింప చేసింది. 


      “ నువ్వు రావద్దమ్మా నా దగ్గరకు. ఆమె ఉన్న ఇంట్లో నువ్వు ఒక్క క్షణం ఉండలేవు. నీకు గౌరవం లేని చోట నిన్ను ఉండనియ్యను. నేనే వస్తాను నీ దగ్గరకు. నీ మనవలు వస్తారు.నీ చెయ్యి ఎప్పుడూ అంతెత్తులో ఉండాలిసిందే. నేనే వస్తా నీ దగ్గరకు.!”…కన్నీళ్ళతో పలవరిస్తున్నట్టు చెప్తున్నాడు భాస్కర్. 


శశికళ ఓలేటి.

వక్రములను తొలగించే గణపతి

 వక్రతుండ నామార్ధం


గణపతికి వక్రతుండుడని పేరు. వక్రతుండ అనగానే వంకర తొండము కలవాడని చెప్పేస్తారు, కానీ నిజానికి అది వక్రతొండం కాదు, వక్రతుండం. వక్రానాం తుండయతి ఇతి వక్రతుండః అని అంటున్నది గణేశపురాణం. వక్రములను తుండనము చేయువాడు వక్రతుండుడు. వక్రములంటే దుష్టశక్తులు, దురలవాట్లు, చెడు సంస్కారాలు, పాపౌ ఆలోచనలు, నీచభావనలు మొదలైనవి చెప్పుకోవచ్చు. దుష్టులను శిక్షించేవాడు కనుక గణపతి వక్రతుండుడయ్యాడు. గణపతి శాంత స్వభావుడు అయినా, దుష్టులపట్ల చండశాసనుడు, కాలుడు. తన తొండంతో దుష్టులను, అరిష్టాలను, గండాలను, దోషాలను ద్వంసం చేస్తాడు. దుష్టులంటే వ్యక్తులే అని భావించనవసరంలేదు. మనలో కూడా అనేక చెడు సంస్కారాలు, నీచపు ఆలోచనలు ఉంటాయి. వాటిని నాశనం చేస్తాడు కనుక గణపతికి వక్రతుండ అని పేరు. అంతేకాదు, మనలో చెడు తొలగించినా, మనం మంచిగానే ప్రవర్తించినా, ఎదుటివారు మనకు కీడు చేయవచ్చు. కనుక అటువంటి వారి వక్రమైన ఆలోచనల పాలిట కాలుడై, నంశింపజేయువాడు కనుక గణపతికి వక్రతుండ అన్న నామం వచ్చింది.


పిల్లలు దురలవాట్లకు లోనైనప్పుడు, తల్లిదండ్రులు గణపతికి వక్రతుండ నామంతో జపించి, అర్చించి, వేడుకుంటే, తప్పుత్రోవ పట్టిన పిల్లలు తిరిగి మంచిమార్గంలోకి వస్తారు. ఈ వక్రతుండ అన్న నామం చాలా మహిమాన్వితమైంది. తంత్రశాస్త్రంలో సదాచారతంత్ర విధానంలో 'ఓం వక్రతుండాయ నమః' అనే వక్రతుండ గణపతి మంత్రానికి ఒక బీజాక్షరం చేర్చి, జపిస్తారు. ఈ వక్రతుండ గణపతి మంత్రాన్ని గణపతి గురించి తెలిసినవారి వద్దనుంచి గ్రహించి జపించాలి. ఆ జపం చేయడం వలన ఉపాసకుడి పై చేసిన ప్రయోగాలు విఫలమవుతాయి. మనం ధార్మికంగా ఉన్నా, లోకమంతా వ్యతిరేకంగా మారి, మనపై యుద్ధానికి వస్తున్న సమయంలో, ఈ వక్రతుండ గణపతిని జపిస్తే, చాలా త్వరగా వక్రమైన ఆలోచనలు నశించి, మిత్రభావం ఏర్పడుతుంది. ప్రపంచంలో అల్లకల్లోలాలు, ఉత్పాతాలు, యుద్ధాలు ముంచుకొస్తున్న సమయంలో వక్రతుండ గణపతి మంత్రాన్ని జపిస్తే, తక్షణమే ఫలించి, లోకంలో శాంతి ఏర్పడుతుందని చెప్పారు. ఎప్పుడైనా ఆపదలు ముంచుకోస్తే, పరిస్థితులు చేజారితే, వెంటనే వక్రతుండ అనే నామంతో గణపతి స్మరించాలి. రక్షణ కలుగుతుంది. తొండం యొక్క ప్రస్తావన వచ్చింది కనుక గణపతికి ఉండే వంకర తిరిగిన తుండం ఓంకారానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి.


ఓం వక్రతుండాయ నమః


వక్రములను తొలగించే ఆ గణపతి మనలోని చెడు భావనలను తొలగించుగాకా

ఓం గం గణపతయే నమః

గురు మూర్తియే

 జయజయ శంకర  హరహర  శంకర


     ఛాందోగ్య  ఉపనిషత్తులోని  మూడు  నాలుగవ  అధ్యాయములలో  మధువిద్య, సంవర్గవిద్య  అని రెండువిద్య  లున్నవి. తత్త్వమసి  వాక్యము  ఛాందోగ్యములోనిదే.

    శ్వేతకేతువుకు, అతని  తండ్రి  గురువును అయిన  ఉద్దాలక  ఆరుణి- తత్త్వమసి  యని  తొమ్మిదిమార్లు  ఉపదేశము చేశాడు - తత్  అనగా  పరమాత్మ యగు  బ్రహ్మము. త్వం  అనగా  జీవాత్మ - అసి అనగా వున్నావు.

    నీవు  బ్రహ్మముగా  నున్నావు - అని దీని అర్థం. సాధనలుచేసి  ఎన్నడో  భావికాలమున  నీవు  బ్రహ్మ అవుతావని కాదు. ఇప్పుడూ  ఎప్పుడూ  నీవు  బ్రహ్మమే - అని  తండ్రి  శ్వేతకేతువుకు  బోధిస్తాడు.

       ఐనచో  సాధనలు  ఎందుకు? బ్రహ్మగా  మనమున్నా  మనకు  బ్రహ్మనిష్ఠలేదు. వున్నచో  మనలను  ఆవరించుకొనివున్న  కామక్రోధాదుల మాట ఏమి? సంతత  బ్రహ్మనిష్ఠులమై  యున్నచో  నిస్తరంగ సముద్రంలాగా  వుంటాము కదా ! అట్లు  ఒకస్థితి వున్నదని  కూడా  తెలియని  స్థితిలో  కదా మనమున్నాము?

      బృహదారణ్యకములోని  " చెలది  పురుగు తన దేహమునుండి  వెలువడు  తంతువులచే  గూడును అల్లినట్లు, అగ్ని నుండి  విస్ఫులింగములు  వెలికి వచ్చినట్లు, బ్రహ్మ  నుండి సమస్త  ప్రపంచము  నిర్ణయించుచున్నది" అను  మంత్రమును  భగవత్పాదులవారు  వివరించునపుడు  భిల్లుని కథ చెప్పి ' ఆదర్శ  సంప్రదాయవిద  ఆఖ్యాయికాం సంప్రచక్షతే' - సంప్రదాయ విదులు  చెప్పిన కథ అని  వ్రాసినారు.

      ఈ  కధలోని  భిల్లుడు  రాజుగా మారలేదు. అతడు ఎప్పుడూ  రాజకుమారుడే. కాని  భిల్లుల  సాంగత్యము వల్ల  తన్ను  భిల్లుడని అనుకున్నాడు. మంత్రి  ఉద్భోధవల్ల  తాను భిల్లుడు కాదనీ, రాజకుమారుడనీ గ్రహించాడు. అజ్ఞానస్థితిలో  భిల్లుడనియా, జ్ఞానము  కలిగిన  పిదప తాను రాజకుమారుడని తెలుసుకొన్నాడు.

      మన  స్థితికూడ  ఈ భిల్లుని వంటిదే. మనమందరమూ  జీవాత్మలు  అన్న భావనలో  సంసారులముగా  ఉన్నాము. వాస్తవంగా  మనము  పరమాత్మలమే. మన స్వరూపాన్ని  మనకు బోధించి  దానిని  అనుభవములోనికి  తెచ్చుకొనుటకై  వలసిన  సాధనాంగములను  నేర్పి, మన కర్మావశేషమును  నిర్మూలించుటకు  తన  తపస్సును వ్యయంచేసి మనలను  ఉద్ధరించు అవ్యాజకరుణామూర్తి  ఎవరు?

     మన  గురు మూర్తియే!

1, సెప్టెంబర్ 2022, గురువారం

అహం సర్వస్య ప్రభవ

 15.3,15.4


న రూపమస్యేహ తథోపలభ్యతే నాన్తో న చాదిర్న చ సంప్రతిష్ఠా I

అశ్వత్థమేనం సువిరూఢమూలమసంగశస్త్రేణ దృఢేన చిత్వా II


తత: పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తిన్తి భూయ: I

తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత: ప్రవృత్తి: ప్రసృతా పురాణీ II


*ప్రతి పదార్థం*


రూపమ్ - రూపము; అస్య - ఈ వృక్షముకు; ఇహ - ఈ ప్రపంచములో; తథా - కూడ; న,ఉపలభ్యతే - తెలియబడదు; న,అన్తః - అంతము కనబడదు; న,చ,ఆదిః - మొదలు కూడ కనబడదు; న,చ,సంప్రతిష్ఠా - మూలము కూడ కనబడదు; అశ్వత్థవృక్షమును; ఏనమ్ - ఈ; సు-విరూఢ-మూలమ్ - మిక్కిలి ధృఢముగా వేళ్ళుగలదానిని; అసంగ-శస్త్రేణ - అనాసక్తి అను ఆయుధముచే; ధృఢేన - బలమైన; ఛిత్త్వా - ఛేదించి; తతః - తరువాత; పదమ్ - స్థితి; తత్ - అట్టి; పరిమార్గితవ్యమ్ - అన్వేషించబడవలెను; యస్మిన్ - దేనిని; గతాః - పొందినవారు; న,నివర్తన్తి - నెనుకకురారో;  భూయః - తిరిగి; తమ్,ఏవ,చ - ఆతడినే; చ - కూడ; ఆద్యమ్ - ఆదియైన; పురుషమ్ - పరమపురుషుని; ప్రపద్యే - శరణు వేడుదును; యతః - ఎవని నుండి; ప్రవృత్తిః - ఆరంభమై; ప్రసృతా - వ్యాపించినదో; పురాణీ - అతి పురాతనమైన.


*అనువాదము*


ఈ వృక్షపు యథార్థ రూపమును ఈ జగత్తు నందు చూడబడదు. దాని ఆదినిగాని, అంతమునుగాని లేదా మూలమునుగాని ఎవ్వరును అవగతము చేసికొనజాలరు. కాని మానవుడు ధృఢనిశ్చయముతో అనాసక్తి అను ఆయుధముతో దృఢమైన వ్రేళ్ళు గల ఈ సంసార వృక్షమును ఛేదింపవలెను. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్యపదమును అన్వేషించి, అనాదికాలము నుండి ఎవని వలన సర్వము ఆరంభమయ్యెనో మరియు ఎవని నుండి సర్వము వ్యాప్తినొందెనో అట్టి దేవాదిదేవుని అచ్చట శరణుపొందవలెను.


*భాష్యము*


ఈ అశ్వత్థవృక్షపు యథార్థరూపము ఈ భౌతిక జగత్తు నందు తెలియబడదని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. వ్రేళ్ళు ఊర్ధ్వముగా నుండుటచే ఈ నిజమైన వృక్షపు వ్యాప్తిక్రిందుగా నుండును. అట్టి వృక్షము యొక్క భౌతిక విస్తారము నందు బద్ధుడైనపుడు మానవుడు అది ఎంతవరకు వ్యాపించి యున్నదనెడి విషయమును గాని దాని మొదలును గాని గాంచలేడు. అయినప్పటికిని, మానవుడు ఈ వృక్షకారణమును కనుగొనియే తీరవలెను. “నేను నా ఫలానా తండ్రి పుత్రుడను. నా తండ్రి ఫలానా వారి పుత్రుడు. నాతండ్రి యొక్క తండ్రి ఫలానా వారి పుత్రుడు.” ఈ విధముగా పరిశోధించుచు పోయినచో చివరకు అతడు గర్భోదకశాయి విష్ణువు నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుని చేరును. బ్రహ్మదేవుడు సర్వులకు మూలమని తెలియును. చివరకు బ్రహ్మదేవునికి ఆదియైన శ్రీకృష్ణుని చేరిన పిమ్మట పరిశోధన కార్యము సమాప్తమగును. దేవాదిదేవుని గూర్చిన సంపూర్ణ జ్ఞానము గల వ్యక్తుల సాంగత్యమున ప్రతియొక్కరు దేవాదిదేవుని రూపమైన ఈ సంసారవృక్షపు మూలాధారములను అన్వేషింపవలెను. అప్పుడు అట్టి అవగాహనచే మానవుడు క్రమముగా యథార్థతత్త్వపు విపరీత ప్రతిబింబము పట్ల అనాసక్తుడై, జ్ఞానముచే బంధమును ఛేదించి యథార్థవృక్షము నందు ప్రతిష్ఠితుడగును. 


ఈ సందర్భమున ‘అసంగ’ అను పదము మిక్కిలి ప్రధానమైనది. ఎందుకనగా, ఇంద్రియ భోగములందు ఆసక్తి మరియు భౌతిక ప్రకృతిపై అధికారము వహింపవలెనను భావన మిక్కిలి బలమైనది. కనుక ప్రామాణిక గ్రంథముల ననుసరించి ఆధ్యాత్మిక జ్ఞానమును గూర్చి చర్చించుట ద్వారా మానవుడు అనాసక్తిని అభ్యసింపవలెను. వాస్తవముగా జ్ఞానవంతులైన వ్యక్తుల నుండి శ్రవణము చేయవలెను. భక్తుల సాంగత్యమున చేయబడు అట్టి ఆధ్యాత్మిక చర్చలకు ఫలితముగ అతడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి ఎరుగగలుగును. అప్పుడు అతని ప్రథమ కర్తవ్యము భగవానుని శరణుపొందుటయే. దేనిని చేరిన పిమ్మట మానవుడు ఈ విపరీత ప్రతిబింబమైన సంసార వృక్షమునకు తిరిగిరాడో ఆ ప్రదేశము యొక్క వర్ణన కూడ ఈ శ్లోకమునందు తెలుపబడినది. ఎవని నుండి సమస్తము ఉద్భవించినదో అట్టి ఆది మూలము దేవాదిదేవుడైన శ్రీకృష్ణభగవానుడే. అట్టి భగవానుని కృపను పొందుటకు శరణాగతియే మార్గము. శ్రవణ కీర్తినాదిపద్ధతులతో చేయబడు భక్తియుక్త సేవకు ఫలితమిదియే. ఈ భౌతిక జగత్తు వ్యాప్తికి భగవానుడే కారణము. భగవానుడే స్వయముగా “అహం సర్వస్య ప్రభవ:” – “నేనే సర్వమునకు మూలాధారము” అని ఇదివరకే వివరించి యున్నాడు(భ.గీ. 10.8). కనుకనే భౌతిక జీవితమనెడి అత్యంత ధృఢమైన ఈ సంసార వృక్షపుబంధము నుండి విడివడుటకు మానవుడు శ్రీకృష్ణభగవానుని శరణుపొందవలెను. అట్లు అతనికి శరణు పొందినంతనే మానవుడు అప్రయత్నముగనే ఈ భౌతిక జీవితము నుండి విముక్తుడగును.

తక్కువగా స్పందిస్తే

 🙏జి వి రామయ్య. అనంతపురం 


తగులబడిన తాడుపై పూర్వపు ఆకారం ఉన్నా అది దేనినీ  బంధించడానికి ఏ విధంగా అయితే పనికిరాదో అదేవిధంగా జ్ఞానాగ్నిచే దగ్ధమైన అహంకారం కూడ  కర్మబంధాన్ని కలిగించే శక్తి లేనిదై ఉంటుంది.*  

                     

వాదించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు.*

  ----------------------------------------------------------


శ్లో|| కృతశతమసత్సు నష్టం సుభాషితశతం చ నష్టమబుధేషు |

వచనశతమవచనకరే బుద్ధిశతమచేతనే నష్టమ్ ||


తా|| సత్పురుషులు కానివారికి నూరు మంచిపనులు చేసిననూ వ్యర్థమే. బుద్ధిలేని వారికి నూరు సుభాషితములు చెప్పిననూ వ్యర్థమే. చెప్పినట్లు చేయనివారికి నూరుమాటలు చెప్పిననూ వ్యర్థమే.    మూర్ఖులకు నూరు మంచిమాటలు చెప్పిననూ వ్యర్థమే.🙏

31, ఆగస్టు 2022, బుధవారం

నేను లేకపోతే

 *నేను లేకపోతే?*


అశోక వనంలో రావణుడు సీతమ్మ వారి మీదకి కోపంతో కత్తి దూసి ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని  రావణాసురుని తలను ఖండించాలి' అని


కానీ మరుక్షణంలోనే హనుమంతుడు  మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! 


హనుమంతుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. 'నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతను ఎవరు రక్షించే వాళ్ళు అని భ్రమలో నేను ఉండేవాడిని' అనుకున్నాడు హనుమంతుడు! 


బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం,  'నేను లేకపోతే ఎలా?' అని. 

అయితే ఇక్కడ ఏం జరిగింది చూద్దాం... 


సీతామాతను రక్షించే పనిని, ప్రభువు రావణుని యొక్క భార్యకు అప్పగించాడు. 


అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది  'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని  చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని. 

**

మరింత ముందుకు వెళితే త్రిజట 'తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుంది. అది లంకను కాల్చివేస్తుంది..దాన్ని నేను చూశాను.' అని చెప్పింది. 

అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. 


అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు. 

*

హనుమంతుని చంపడానికి రావణుని సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. 

అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు. 

అప్పుడు హనుమంతునికి తెలిసింది తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని  పై ఉంచాడు అని. 


ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే  విభీషణుడు ఆ మాట చెప్పినప్పుడు రావణుడు వెంటనే ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. అయితే కోతులకు తోకంటే మహా ఇష్టం కాబట్టి తోకకు నిప్పు పెట్ట' మని చెప్పాడు. 


అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. లేకపోతే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! 


కానీ గమనించండి...పరమాశ్చర్యం ఏంటంటే వాటన్నిటి ఏర్పాటు రావణుడే స్వయంగా చేయించాడు. 

అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తన నుండి తనకు కావలసిన పనిని చేయించుకోవడంలో ఆశ్చర్యం ఏముంది! 

**

అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతోంది అని అనుకోండి. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం అని గుర్తు పెట్టుకుని మసలండి. 

అందువల్ల *ఎప్పుడు కూడా నేను లేకపోతే ఏమవుతుందో?* అన్న భ్రమలో ఎప్పుడు పడవద్దు 

'నేనే గొప్పవాడి'నని అనుకోవద్దు. *భగవంతుని కోటాను కోట్ల దాసులలో అతి చిన్నవాడను* అని ఎఱుక కలిగి ఉందాం.

జై శ్రీరామ🙏

☘️🍂


(హిందీ రచనకు స్వేచ్ఛానుసరణ)

వినాయకచవితి ని జరుపుకుంటున్నారు

 పార్ధసారధి పోట్లూరి


.


మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ?


మొదటి సారిగా బెంగుళూరు ఈద్గా మైదానంలో వినాయకచవితి ని జరుపుకుంటున్నారు ! గత 75 ఏళ్లుగా కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలు తేల్చకుండా


వదిలేసిన సమస్య 'ఈద్గా మైదాన్ "! ఈ రాజకీయ పార్టీలకి వోట్లు పోతాయనే భయంతో ఈద్గా మైదాన్ విషయంలో కప్పదాటు ధోరణిని ప్రదర్శించి సమస్యని జటిలం చేసి వెళ్లిపోయాయి. ముస్లిం రాజకీయ నాయకులని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక సమస్యని నాన్చి మరింత జటిలం చేశాయి. ఇది మరీ ముఖ్యంగా సుదీర్ఘ కాలం కర్ణాటకని పాలిచిన కాంగ్రెస్ పార్టీ నిర్వాకం. గత ఆగస్ట్ 15 న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించి బెంగుళూరు లోని చామరాజ పేట లో ఉన్న ఈద్గా మైదానం ని దానికి వేదిక చేసుకోవాలని నిర్ణయించుకొని చామరాజ పేట లోని స్థానికులు ఈద్గా మైదానం లో చిన్న సమావేశం నిర్వహించారు. అయితే స్థానిక ఎంఎల్ఎ అయిన జహీర్ అహ్మెద్ వచ్చి ఈద్గా మైదానం తమది అని ఇక్కడ రంజాన్, బక్రీద్ ల సందర్బంగా నమాజు చేయడానికి మాత్రమే అనుమతిస్తామని ఇతర కార్యక్రమాలకి అనుమతించమని వాగ్వివాదానికి దిగాడు స్థానీకులతో ! అయితే బిజేపి నాయకులు 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ప్రభుత్వ అనుమతిని కోరారు! ప్రభుత్వం అనుమతి ఇచ్చి పోలీసు బందోబస్తు మధ్యన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిపోయింది.


తాజాగా ఆగస్ట్ 31 న వినాయ చవితి పండుగని జరుపుకోవడానికి అనుమతి ఇవ్వమని ప్రభుత్వాన్ని


 కోరారు గణేష్ ఉత్సవ నిర్వహుకులు. ఇక్కడ సమస్య మొదలయ్యింది మళ్ళీ. ఈద్గా మైదాన్ లో కేవలం ముస్లిం మత పరమయిన కార్యక్రమాలకే అనుమతి ఇస్తామని

 గణేష్ పూజకీ అనుమతి ఇవ్వమని స్థానిక ఎంఎల్ఎ జహీర్ అహ్మెద్ మళ్ళీ అభ్యంతరం పెట్టాడు. ఈద్గా మైదాన్ తమదే అని తమకి సంబంధించిన స్థలంలో మా అనుమతి లేకుండా ప్రభుత్వం అనుమతి ఎలా ఇస్తుంది అంటూ వాదనకి దిగాడు జహీర్ అహ్మెద్. 


BBMP అధికారులు ఈద్గా మైదాన్ కి యాజమాన్యమ్ కి సంబంధించి డాక్యుమెంట్లు చూపించమని అడిగారు. కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి యాజమాన్య హక్కులని నిర్ధారించే డాక్యుమెంట్స్ లేవు. అదేసమయంలో BBMP దగ్గర కూడా ఈద్గా మైదాన్ కి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తెలిసింది మొదటిసారిగా !


కానీ కర్ణాటక రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రం 2 ఎకరాల 10 గుంటల భూమికి సంబంధించి అది ప్రభుత్వానిదే అని నిర్ధారించే రికార్డులు ఉన్నాయి. దాంతో కర్ణాటక ప్రభుత్వం అది ప్రభుత్వ స్థలం కాబట్టి గణేష్ ఉత్సవ నిర్వహకులకి వినాయక చవితి పండుగని జరుపుకోవచ్చని అనుమతి ఇచ్చింది.


దీనిమీద ఈద్గా మైదాన్ తమదే అని వాదిస్తూ వచ్చిన జహీర్ అహ్మెద్ హై కోర్టు ని ఆశ్రయించాడు. తన పిటిషన్ లో ఈద్గా మైదానం లో గణేష్ ఉత్సవాన్ని నిర్వహించుకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలని కోరాడు. ప్రభుత్వ తరపున ఈద్గా మైదాన్ నిర్వహుకుల వాదనలు విన్న కర్ణాటక హై కోర్టు గణేష్ ఉత్సవం నిర్వహించడాన్ని ఆపమని కోరిన పిటిషన్ ని కొట్టివేస్తూ చట్ట ప్రకారం ఎలాంటి అనుమతులు ఇవ్వవచ్చో వాటిని ఇవ్వమని


ప్రభుతాన్ని ఆదేశించింది! ఆగస్ట్ 31 న మొదటిసారిగా ఈద్గా మైదాన్ లో వినాయకచవితి


ఉత్సవాలు జరగబోతున్నాయి అన్నమాట ! గత దశాబ్దాలుగా ఈద్గా మైదాన యాజమాన్య హక్కులు తమవే అని వాదిస్తూ వచ్చిన వాళ్ళని కనీసం భూ యాజమాన్య హక్కులకి సంబంధించి పత్రాలు ఉన్నాయా ? లేవా ? అని అడిగిన పాపాన పోలేదు. ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వాలు కాని ! చామరాజ పేట లోని 2 ఎకరాల 10 గుంటల భూమి విలువ ఇప్పుడు హీన పక్షం 500 కోట్లు ఉంటుంది కానీ కేవలం వోట్ బాంక్ రాజకీయాలతో ఎలాంటి పత్రాలు లేని వాళ్ళకి ఇన్నాళ్ళూ అక్కడ మేకలు, గొర్రెలు అమ్ముకోవడానికి సంతని నిర్వహించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? వందల సంఖ్యలో జనావాసాల మధ్య మేకలని, గొర్రెలని పెంచుతూ వాటి దుర్గంధం ని స్థానికులు అభ్యంతరం పెడుతూ వచ్చినా ఎందుకు ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాల్సి వచ్చింది ?


తమది కానీ భూమిలో జాతీయ జెండాని ఎగురవేయడానికి అనుమతి ఇవ్వము అని చెప్పేంత ధైర్యం వాళ్ళకి ఎవరు ఇచ్చారు ? ఇలాంటి సమస్యలు బహుశా దేశ వ్యాప్తంగా కొన్ని వేలు ఉండి ఉండవచ్చు ! జైహింద్ !

30, ఆగస్టు 2022, మంగళవారం

సాధకుడు జీవితం

 సాధకుడు తన జీవితంలో ఎలా వుండాలి


కమలం బురదలో పుడుతుంది, నీటిపైన జీవిస్తుంది...

ఈ రెండింటిని తనలో చేర్చు కోదు, ఆడవారు కంటికి పెట్టుకునే కాటుక గ్రుడ్డు కు అంటదు...

పచ్చళ్లు, కూర్మాలూ, ఎన్ని తిన్నా గాని నాలుకకు జిడ్డు అంటదు...

అట్లే సాధకుడు, జగత్తులో ఉన్నప్పటికీ, జగత్తు మనలను అంటకూడదు...

సుఖ దుఃఖములు, సంయోగ వియోగములతోనూ, మనకు సంబంధముండకూడదు...


అభిమాన, అహంకారములున్నచోట, దైవభక్తి ఉండజాలదు...

నేను కీర్తనలు బాగా పాడుతున్నాననీ, నా పూజా మందిరాన్ని రంగుల దీపాలతో బాగా అలంకరించాననీ గర్వపడవద్దు...

మన అలవాట్లల్లో వైఖరిలో మంచి పురోగతి ఉండాలి...

అది లేనప్పుడు సాధన వ్యర్థమైన కాలక్షేపమే...

కలి మహత్మ్య మేమో కానీ ఈరోజు ఆడంబర భక్తి తాండవ మాడుతోంది...

దైవము దేనినీ ఆశించడు, పరోపకారం, దీన ప్రాణులకు చేతనైనా సహాయ సహకారాలు అందించడం స్మరణ అనేది ఒక స్టాంపు, మననం అనేది ఒక చిరునామా, నామమును స్మరించాలి, ఆయన రూపమును ధ్యానించాలి... అంతేచాలు. అదే ఆయనను చేరుతుంది

వినాయక చవితి సందేశాలు

 ॐ          వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                  సందేశం - 1         


ఏకవింశతి (21) పత్రి  


    వినాయక చవితి రోజున వినాయకుణ్ణి మనం 21 రకాల పత్రితో  పూజిస్తాం. 

    ఆ పత్రికీ, వాటి వృక్షభాగాలకీ అనేక ఔషధ విలువలు ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్పుకుందాం.  

  (ముఖపుస్తకం నుంచి చొప్పకట్ల సత్యనారాయణగారి సౌజన్యంతో)


21 రకాల పత్రి - ఔషధ గుణాలు


1) మాచీపత్రం : ఇది మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది. 

    మన ఇళ్ళ చుట్టుప్రక్కల, రోడ్ల మీద ఇది విపరీతంగా పెరుగుతుంది. కానీ ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. 

    ఇది నేత్రరోగాలకు అద్భుత నివారిణి. మాచీపత్రి ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి. 

    ఇది చర్మరోగాలకు మంచి మందు. ఈ ఆకును పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మవ్యాధి ఉన్న చోట పైపూతగా రోజు రాస్తూ ఉంటే వ్యాధి తొందర్లో నివారణ అవుతుంది. 

    రక్తపు వాంతులకు, ముక్కు నుండి రక్తం కారుటకు మంచి విరుగుడు.


2) బృహతీ పత్రం. 

    భారతదేశమంతటా విస్తారంగా ఎక్కడపడైతే అక్కడ పెరుగుతుంది బృహతీ పత్రం. 

    దీనినే మనం 'వాకుడాకు', 'నేలమునగాకు' అని పిలుస్తాం.     

    ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది. ఎక్కిళ్ళను తగ్గిస్తుంది. కఫ, వాత దోషాలను, ఆస్తమానీ, దగ్గునూ, సైనసైటిస్‌నూ తగ్గిస్తుంది. 

    అరుగుదలను పెంచుతుంది,     

    గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.     

    బృహతీపత్ర చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది. 

    బృహతీ పత్రం యొక్క కషాయంతో నోటిని శుభ్రరపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. 

    రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీపత్రానికి ఉంది. 

    ఇంకా బృహతీపత్రానికి అనేకానేక ఔషధీయ గుణాలున్నాయి.


3) బిల్వపత్రం : దీనికే మారేడు అని పేరు. శివుడికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీస్వరూపం. 

    ఇది మధుమేహానికి (షుగర్‌కు) దివ్యౌషధం. ఈ వ్యాధి గలవారు రోజు రెండు ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

    మారేడు గుజ్జును ఎండబెట్టి పోడిచేసుకుని, రోజూ ఒక చెంచా పొడిని మజ్జిగలో వేసుకుని త్రాగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. 


4) దూర్వాయుగ్మం(గరిక) : గణపతికి అత్యంత ఇష్టమైనవస్తువు గరిక. ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. 

    తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక. 

    దూర్వాయుగ్మం అంటే రెండు కోసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. 

    ఈ గరిక మహాఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. 

    మగవారికి సంతాన నిరోదకంగా కూడా పనిచేస్తుంది. 

    కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. 

    చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 

    ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. 

    గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. 

    హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.            


5) దత్తూర పత్రం : దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం. 

    ఉష్ణతత్వం కలిగినది. కఫ, వాతా దోషాలను హరిస్తుంది. కానీ 'నార్కోటిక్' లక్షణాలు కలిగినది కనుక వైధ్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడడు. 

    మానిసక వ్యాధి నివారణకు పనిచేస్తుంది. మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయించి, ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని రెండు నెలల పాటు మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది.      

    దీని ఆకులు, వ్రేర్లు, పువ్వులు అమితమైన ఔషధ గుణములు కలిగినవే అయినా, దీని గింజలు(విత్తనాలు) మామూలుగా స్వీకరిస్తే విషంగా పనిచేస్తాయి. 

    జ్వరాలు, అల్సర్లు, చర్మరోగాలకు, చుండ్రుకు ఉమ్మెత్త ఔషధం.


6) బదరీ పత్రం : దీనినే రేగు అని పిలుస్తాం. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపం. 

    చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. 3 ఏళ్ళ పైబడి 12 ఏళ్ళలోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు. 

    ఒకటి లేదా రెండు రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంతవరకు తినిపించాలి, 

    కానీ రేగు ఆకులు ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది. 


7) అపామార్గ పత్రం: దీనికే ఉత్తరేణి అని వ్యవహారనామం. 

    దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులూ, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులూ నివారణమవుతాయి. 

    దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో, హోమాల్లో వినియోగించడం వలన హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. 

    స్తూలకాయానికి, వాంతులకు, పైల్స్‌కు, ఆమం(టాక్షిన్స్) వలన వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి. 

    ఉత్తెరేణి ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వలన గాయాలు త్వరగా మానిపోతాయి. నొప్పి తగ్గిపోతుంది. 

    పిల్లలు చెడుమార్గంలో వెళ్తున్నారని, చెడ్డ అలవాట్లకు లోనవుతున్నారని బాధపడే తల్లిదండ్రులు ఉత్తరేణి మొక్కను పూజించి, దాని వేర్లను పిల్లల మెడలో కడితే బుద్ధిమంతులవుతారు. 

    రోజు ఉత్తరేణి కొమ్మలతో పళ్ళు తోముకునే అలవాటు ఉన్నవారు ఎక్కడకు వెళ్ళినా, ఆహారానికి లోటు ఉండదు. ఆహరం దొరకని ఎడారిలో కూడా ఎవరో ఒకరు పిలిచి భోజనం పెడతారట. అది ఉత్తరేణి మొక్క మహిమ. 

    ఇంకా ఉత్తరేణికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. 

    ఇంత గొప్ప ఉత్తరేణి మన దేశంలో ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది.


8) తులసి: 'తులానాం నాస్తు ఇతి తులసి' - ఎంత చెప్పుకున్నా, తరిగిపోని ఔషధ గుణములున్న మొక్క తులసి. పరమ పవిత్రమైనది, శ్రీ మహాలక్ష్మీ స్వరూపం, విష్ణు మూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సంప్రదాయం. అంత గొప్ప తులసి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.


    కఫ, వాత, పైత్య దోషాలనే మూడింటిని శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది తులసి. 

    కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తులసి వాసనకు దోమలు దరిచేరవు. 

    తులసి ఆకులు, వేర్లు, కొమ్మలల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. 

    చర్మరోగాలను నయం చేస్తుంది. 

    తులసి ఆకులు నమలడం చేత పంటి చిగుళ్ళకున్న రోగాలు నయమవుతాయి. 

    అరుగుదలను, ఆకలిని పెంచుతుంది. కఫం వలన వచ్చే దగ్గును, ఆస్తమాను తగ్గిస్తుంది. 

    తులసిరసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం వలన ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. 

    తులసి శరీరంలో ఉన్న ఆమాన్ని(టాక్సిన్స్/విషాలను) విశేషంగా తీసివేస్తుంది. 

    ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం ఒక్క తులసి చెట్టు మాత్రమే రోజుకు 22 గంటల పాటు ప్రాణవాయువు(ఆక్సిజెన్)ను విడుదల చేస్తుందని తేలింది. 


    కానీ పురాణ కధ ఆధారంగా గణపతిని తులసిదళాలతో ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదు. 


9) చూత పత్రం : మామిడి ఆకులను సంస్కృతంలో చూత పత్రం అని అంటారు. మామిడి మంగళకరమైనది.


    లేతమామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది.   

    మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడిచేసి ఔషధంగా పూస్తే కాళ్ళపగుళ్ళు, చర్మవ్యాధులు ఉపశమిస్తాయి. 

    చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం. 

    చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తరువాత కూడా ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకుంది. 

    మామిడి దేవతావృక్షం. అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే. ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టున్నా, అది మేలే చేస్తుంది. 

    మామిడి చెట్టును సాధ్యమైనంతవరకు కాపాడాలని, ఇంటి ఆవరనలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే, ఆ ఇంటి సభ్యుల అభివృద్ధిని నరికేసినట్లేనని వాస్తు శాస్త్రం గట్టిగా చెప్తోంది. 

    ఏ శుభకార్యంలోనైనా, కలశ స్థాపనకు ముందు కలశంలో 5 రకాల చిగుళ్ళను వేయాలి. అందులో మామిడి కూడా ఒకటి.


10) కరవీర పత్రం : దినినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. 

    సాధారణంగా పూజకు కోసిన పువ్వులు, అవి చెట్టు నుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో క్రింద పడితే ఫర్వాలేదు కానీ, మరొకచోట(అది దేవుడుముదైనా, పూజ స్థలంలోనైనా సరే) క్రింద పడితే ఇక పూజకు పనిరావు. కానీ గన్నేరు పూలకు ఈ నిబంధన వర్తించదు. గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో క్రింద పడినా, నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. 

    గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి. గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు, అది అనేక రోగాలను దూరం చేస్తుంది.


11) విష్ణుక్రాంత పత్రం : మనం వాడుకభాషలో అవిసె అంటాం. 

    దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామరవ్యాధి ఉన్న చోట పూస్తే తామరవ్యాధి నశిస్తుంది. 

    ఆకును కూరగా చేసుకుని భుజిస్తే రక్తదోషాలు నివారణావుతాయి. 

    విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది.


12) దాడిమీ పత్రం : అంటే దానిమ్మ. భారతదేశమంతటా పెరిగే చెట్టు ఇది. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసుమప్రభ' అనే నామం కనిపిస్తుంది. 

    దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. 

    దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది. పైత్య దోషాన్ని అదుపులో ఉంచుతుంది. 

    దానిమ్మ పండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది. గొంతురోగాలకు ఔషధం దానిమ్మ. 

    దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.

    దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాన్లో తగినంత చక్కెర కలిపి సేవిస్తే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. 

    దీని ఆకులకు నూనె రాసి వాపు ఉన్నచోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.


13) దేవదారు : ఇది వనాలలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీ దేవికి మహాఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. 

    దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు, కంటి సంబంధ రోగాలు దరిచేరవు. 

    దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.


14) మరువక పత్రం : మనం దీన్ని వాడుక బాషలో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవారు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసనం కలది. 

    మరువం వేడినీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది.


15) సింధువార పత్రం : వావిలి ఆకు. ఇది తెలుపు-నలుపు అని రెండు రకాలు. 

    రెండింటిలో ఏదైనా వావిలి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింతవాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. 

    ఈ ఆకులను దంచి దానిని తలమీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి.


16) జాజి పత్రం: జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అన్ని చోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. 

    ఈ సువాసన డిప్రేషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది. 

    జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళుతోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. 

    జాజి కాషాయన్ని రోజు తీసుకోవడం వలన క్యాన్సర్ నివారించబడుతుంది. 

    జాజి చర్మరోగాలకు దివ్యౌషధం. 

    కామెర్లను, కండ్లకలకను, కడుపులో నులుపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. 

    జాజిమొగ్గలతో నేత్రవ్యాధులు, చర్మరోగాలు నయం చేస్తారు.


17) గండకీపత్రం: దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. 

    థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం. 

    అరణ్యాలలో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి, ధీర్ఘవ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 

    చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబును హరిస్తుంది.


18) శమీ పత్రం: దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. 

    జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. 

    జమ్మిపూలను చక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. 

    జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.


19) ఆశ్వత్థపత్రం: సంస్కృతంలో అశ్వత్థం అంటే, తెలుగులో రావి అంటాం. 

    తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దలమాట. 

    రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపం. పరమాత్మయే తనును తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు. 

    రావిమండలను ఎండబెట్టి, ఎండిన పుల్లలను నేతితీ కలిపి కాల్చి భస్మం చేసి, ఆ భస్మాన్ని తేనేతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశవ్యాధులు నివారణ అవుతాయి. 

    అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను సమిధలుగా వాడుతారు. 

    రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం. 

    దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు. 

    రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు. 

    రావి చర్మరోగాలను, ఉదరసంబంధ వ్యాధులను నయం చేస్తుంది, రక్తశుద్ధిని చేస్తుంది.


20) అర్జున పత్రం: మనం దీనినే మద్ది అంటాం. ఇది తెలుపు-ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. 

    మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. 

    భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాలు, బెంగాలు, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా ఇది పెరుగుతుంది. 

    ఇది శరీరానికి చలువ చేస్తుంది. 

    కఫ, పైత్య దోషాలను హరిస్తుంది కానీ, వాతాన్ని పెంచుతుంది. 

    పుండు నుంచి రక్తం కారడాన్ని త్వరగా ఆపుతుంది. 

    మద్ది బెరడును రుబ్బి, ఎముకలు విరిగినచోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. 

    దీని బెరడును నూరి, వ్రణమున్న ప్రదేశంలో కడితే, ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి.


21) అర్క పత్రం: జిల్లేడు ఆకు. 

    జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. 

    జిల్లేడు పాలు కళ్ళలో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది, కానీ జిల్లేదు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. 

    ఆస్తమా, దగ్గు మొదలైన వ్యాదులకు జిల్లేడు పూలను వాడటం ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. 

    జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్త శుద్ధిని చేస్తుంది. 


                   =x=x=x= 


    — రామాయణం శర్మ

              భద్రాచలం

28, ఆగస్టు 2022, ఆదివారం

నల్లటి మచ్చలు ,మంగు నివారణ -

 స్త్రీల సౌందర్యానికి చిట్కాలు - 


 నల్లటి మచ్చలు ,మంగు నివారణ -


 *  జాపత్రిని మంచినీటితో మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపర్చుకొనుచున్న అతిత్వరలోనే ముఖము పైన కల మంగు ,నల్లమచ్చలు మాయం అగును . 


 *  మిరియాలు గోరోజనముతో కలిపి నూరి పైకి లేపనం చేయుచున్న మొటిమలు తగ్గును . మచ్చలు పోవును . 


 *  బాదం పప్పును నీటితో నూరి వడకట్టగా వచ్చిన పాలను ముఖంపై మర్దన చేయుచున్న క్రమంగా నల్లమచ్చలు , మంగు , మొటిమలు త్వరలోనే హరించును . 


 *  ధనియాలు , వస , సుగంధపాల ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణముగా చేసి ఈ చూర్ణమును ఒంటికి నలుగు పిండిలా పట్టించుచున్న నల్లటి మచ్చలు , మొటిమలు తగ్గును . 


 *  నిమ్మరసమును పాలతో కలిపి రాత్రిపూట ముఖానికి మర్దన చేసుకుని తెల్లవారిన తరువాత లేవగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకొనవలెను . సబ్బు వాడరాదు . ఇలా క్రమం తప్పకుండా చేయుచున్న మచ్చలు , మంగు పోయి ముఖం కాంతివంతం అగును . 


 *  తులసి ఆకుల రసములో కొద్దిగా టంకణం ( Borax ) కలిపి పైకి లేపనం చేయుచున్న ముఖం పైన మచ్చలు , మంగు హరించును . 


 *  మంజిష్ట చూర్ణమును ఆవుపాలతో కలిపి అరగదీసి అందులో కొంచం తేనె కలిపి ముఖమునకు లేపనం చేయుచున్న నల్లమచ్చలు , మంగు హరించును . 


         

నమ్మి చెడినట్టివారు లేరు

 🌴దైవమును నమ్మక చెడినవారలున్నారు కానీ నమ్మి చెడినట్టివారు ఎవరూ లేరు, లేరు, లేరు. ఈ జగత్తంతా నమ్మకంపై ఆధారపడి నడుస్తోంది.  డ్రైవరు ఎవరో తెలియకపోయినా అతను మనల్ని సురక్షితంగా గమ్యం చేరుస్తాడని విశ్వసించి మనం బస్సుకానీ, ట్రైను కానీ ఎక్కి ప్రయాణం సల్పుతున్నాము. ఎవరో తెలియని వంటవాడిని నమ్మి, భోజనశాలకు వెళ్ళి అతను వండిన పదార్థాలను తృప్తిగా భుజిస్తున్నాము. ఈరీతిగా నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనీ నమ్మకంతోనే ముడిపడి ఉంది. అది లేకపోతే ఈ లోకంలో మనుగడ సాగించలేము. మనుషుల్ని ఇంతగా నమ్మే మనము భగవంతుని మాత్రం ఎందుకు నమ్మకూడదు?! ఎందుకు నమ్మడం లేదు?!! నిజంగా పరిపూర్ణమైన ప్రేమతో భగవంతుణ్ణి విశ్వసిస్తే, ఆ భగవంతుడే మన జీవనయానాన్ని సజావుగా సాగేలా చేయడా! మానవునిపై పెట్టుకున్న విశ్వాసము మాధవునిపై పెట్టుకుంటే మన జీవితాలను సుఖసంతోషాలతో నింపి, మనల్ని గమ్యం చేరుస్తాడు కదా!. కానీ మనం ఇలా చేస్తున్నామా? ఆయనపైనే శతకోటి సందేహాలు పెంచుకుంటున్నాం. దేవునిపై పెంచుకోవలసింది సందేహాలను కాదు, విశ్వాసమొక్కటే! ఆయనపై ప్రగాఢమైన విశ్వాసాన్ని మన గుండెల్లో  నింపుకున్నపుడు మనభారం అంతా ఆయనే చూసుకుంటాడు. చెడడం అనే మాటే ఉండదు.. జీవితం అంతా ఆనందమయమే అవుతుంది.🌴

గౌరవము

 *వస్త్రేణ వపుషావాచా విద్యయా వినయేచ*

*వకారైః పంచభిర్లుప్తోనరో నాప్నోతి గౌరవమ్*


మనుష్యులకు లభించే గౌరవము ఐదు స్థాయిలలో ఉంటుంది......


ఆ గౌరవాన్ని ఇచ్చే మనుష్యులను కూడా ఐదు వర్గాలుగా విభజించవచ్చును.....


1. అతిసాధారణస్థాయి మనుష్యులు (వస్త్రసౌందర్యం): 


ఈ స్థాయివారు మనుష్యులను వారు ధరించిన వస్త్రములను చూచి గౌరవిస్తారు....  ఇటువంటి ప్రేక్షకులే ఫ్యాషన్ షోలకు, వస్త్రవ్యాపారుల ధనార్జనకు ఆధారం...


2. సాధారణస్థాయి మనుష్యులు (శరీరసౌందర్యం):


ఈ స్థాయివారు మనుష్యులను వారివారి శరీరసౌందర్యం చూసి గౌరవిస్తారు.... వీరు నోరువిప్పి మాట్లాడితే వినబడే భాష చాలాసార్లు అనాగరికంగా డండడంవలన దానిని  మనము వినలేము. ...


ఈ విగ్రహపుష్టిని, దానిని గౌరవించే వీరాభిమానులను మనము సినిమా పరిశ్రమలోను, ఫ్యాషన్ పరిశ్రమలోనూకూడా చూడగలము....


ఈ మొదటి రెండు స్థాయిలూ బాహ్యసౌందర్యానికి సంబంధించినవి...


3. మధ్యమస్థాయి (వాక్సౌందర్యం)


ఈ వాక్చతురతకలవారి మాట ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది... నేడు వివిధరంగాలలో ప్రజ్ఞాపాటవాలు కలవారికన్న వాక్చాతుర్యం కలవారు ఎక్కువగా రాణిస్తున్నారన్నది సర్వవిదితమే...


ఈ  స్థాయి మనుష్యులను గౌరవించేవారు మధ్యమస్థాయికి చెందిన శ్రోతలు...


4. ఉత్తమస్థాయి (విద్యాపాండిత్యం):


కేవలం వాక్చాతుర్యం కలవారికన్న వివిధరంగాలలోని పండితులు ఇంకా గొప్పవారు.... 


"స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అన్న సూక్తిననుసరించి వీరు విద్యవిలువ తెలిసినవారందరిచేతా గౌరవింపబడతారు...


5. అత్యుత్తమస్థాయి (వినయసౌందర్యం):


కేవలం విద్యాపాండిత్యం సర్వోత్తమస్థాయి కాదు... ఎందుకంటే సద్గురుకృపలేని విద్యాపాండిత్యం జ్ఞానాన్నికాక గర్వాన్ని కలుగజేస్తుంది...


కావున సద్గురుకృపాప్రసాదంచే విద్యాసంపన్నులైనవారు వినయభూషణులై ఉత్తమస్థాయి పెద్దలచే గౌరవింపబడుతారు...


తక్కిన సాధారణస్థాయివారు వీరి విలువను సాధారణంగా అర్థంచేసుకోలేరు..


కాని నిజముగా తెలుకుంటే ఇదియే సర్వోత్కృష్టమైన గౌరవము....


- సేకరణ

మంచి స్వభావం

 🙏🕉️శ్రీ మాత్రే నమః శుభోదయం 🕉️🙏.                     🌹 మంచి స్వభావం మరియు మంచి ప్రవర్తన శారీరక అందం కంటే గొప్పవి.. జీవితంలో ఎప్పుడు రిలేషన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించకూడదు🌹మన రిలేషన్ లో జీవితాన్ని నింపటానికి ప్రయత్నించాలి.. అది జీవితాన్ని అందంగా మారుస్తుంది🌹 ఆనందం అనేది పోర్టబుల్ లాంటిది మనం ఎక్కడికి వెళ్లి తీసుకు వెళ్ళాలి🌹 ఆందోళన మన మనసులను అందుడిని చేస్తుంది... సత్యాన్ని మరియు వాస్తవాన్ని చూడకుండా నిరోధిస్తుంది🌹 మంచి పోటీదారుడు నిరాశలో ఉన్న వారి కంటే తక్కువ ప్రమాదము.. గెలిచి ఓడడం కంటే ఓడి గెలవడం మంచిది🌹 లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు.. నీ లక్ష్యాన్ని ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు🌹 సాధించే వాడికి కోరిక మాత్రమే ఉంటుంది విమర్శించే వాడికి తీరిక ఎక్కువ ఉంటుంది🌹🌹🌹మీ అల్లంరాజుభాస్కర రావు 

శ్రీ విజయ ఆయుర్వేదిక్

గోకవరం 🚍స్టాండ్

Rajhamundry

9440893593🙏 🙏🏻🙏🙏🏻

సహధర్మచరీ

 శ్లోకం:☝️

*ఇయం సీతా మమ సుతా*

    *సహధర్మచరీ తవ |*

*ప్రతీచ్ఛచైనాం భద్రం తే*

   *పాణిం గృహ్ణీష్వ పాణినా ||*

*పతివ్రతా మహాభాగా*

    *చాయేవానుగతా సదా ||*


భావం: "ఈమె నా బిడ్డ సీత ఈమెను సహధర్మచారిణిగా నీకు సమర్పిస్తున్నాను. ఎటువంటి కష్టనష్టాలలో అయినా నీకు నీడలా వెన్నంటి ఉండే పతివ్రతను నీ చేతిలో పెడుతున్నాను. నేటి నుండి మీరు ఇద్దరూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒకే మాటగా నిలవాలి." అని జనక మహరాజు గారు సీతమ్మ కి రామయ్య తో పాణిగ్రహణం జరిపించారు. కన్యాదాన సమయంలో జనకుడు చెప్పిన ఈ శ్లోకాన్ని, కళ్యాణం కన్యాదాన సమయంలో భక్తులందరిచేతా ఆచార్యులు చెప్పిస్తారు.🙏