9, నవంబర్ 2022, బుధవారం

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 67 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ఒకానొక రోజున కంసుని పనుపున పూతన అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఆవిడ బాలఘాతకి. ఆవిడ శిశువులు ఎక్కడ వున్నా తొందరగా పసిగట్టి చంపగలదు. ఆవిడ కామరూపిణి. రూపం మార్చుకుంటుంది. మార్చుకుని భవనమునందు ప్రవేశించింది. ఆమె శిశువులను చాలా గమ్మత్తుగా చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. విషమును పాలలా ఇస్తుంది. పాలు త్రాగి శిశువులు మరణిస్తారు. అది ఆవిడకు ఉన్న శక్తి. ఆమె చంపేదానిలా కనపడదు. పెంచేదానిలా కనపడుతుంది. ఆవిడ వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. ఆమె ఆకాశంనుండి వస్తున్నప్పుడే నందుని భవనంలో ఉన్న కృష్ణ పరమాత్మను కనిపెట్టింది. లోపల ఊయల దగ్గరకు వెళ్ళింది. పర్యంకము దగ్గరకు చేరింది. ఏ భావనతో చేరినా పరమేశ్వరుని దగ్గరకు చేరింది. ఆమె రాశీభూతమయిన పిల్లవాని సౌందర్యమును చూసి ‘నేను సహజంగా రాక్షసిని. చాలా వికృతంగా ఉంటాను. నా రూపమును మరుగుపరచి చాలా అందమయిన దానిలా వచ్చాను’. ఈవిడ వస్తుంటే చరాచర ప్రపంచపు ఆంతరమున, బాహ్యమునందు నిండిపోయిన పరమాత్మకు ఈవిడ ఎందుకు వస్తోందో తెలుసు. కాలు చేయి పొట్టకింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా జగత్తునంతా నిండి ఉన్న పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలు పెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చి చూసి ఎంత రాక్షసయినా ఆ బాలుని అందమునకు వశపడిపోయింది. ఆమె తెలియకుండానే ‘నేను నీ ప్రాణములను తీసెయ్యడానికి ఇంత అందంగా వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు త్రాగితే ఎందుకూ పనికిరాకుండా అయిపోతావు’ అని అన్నది.

పూతన తెలియకుండానే ‘నళినదళాక్షా’ అని పిలిచింది. ‘తామరరేకుల వంటి కన్నులు వున్న పిల్లవాడా! ఎంత అందంగా ఉన్నావు! నా పాలు ఒక గుక్కెడు త్రాగావంటే ఇంత అందం చటుక్కున మాయమయిపోతుంది. నా అందమేమిటో అప్పుడు చూద్దువుగాని! నీ అందానికి సార్థకత వస్తుంది. రా త్రాగు’ అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతోంది. ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణి, యశోదాదేవి చూసి ‘అయ్యో! అదేమిటి అలా మా పిల్లవానికి పాలు ఇస్తున్నావు! మా పిల్లవాడు అన్యస్త్రీల క్షీరమును స్వీకరించడు. ఆగుఆగు’ అంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే. ఒక్కసారి ఆ విషమును నోట్లో పెడితే చాలు అనుకుని గబగబా పిల్లవాడిని తీసి ఒడిలో పెట్టుకుని, వాడి ముఖమును త్రిప్పి, ఎలాగయినా సరే స్తన్యం నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. కృష్ణుడు ఏమీ తెలియని వాడిలో ఆవులించాడు. ఒకసారి క్రీగంట చూసాడు. మరల నిద్ర వచ్చేసినవాడిలా కళ్ళు మూసాడు. మళ్ళీ కళ్ళు విప్పాడు. ‘పాలు త్రాగక తప్పదా’ అన్నట్లుగా చూసి విసుక్కుని అయినా పాలను తాగడం అలవాటయిన వాడిలా అమ్మ స్తన్యం త్రాగినట్లే ఆ స్తనమును తన బుజ్జి బుజ్జి వేళ్ళతో పట్టుకుని గుటుకు గుటుకుమంటూ రెండు గుక్కల పాలు త్రాగాడు.

ఆ రెండుగుక్కలలో ఆమె గుండెలలో ప్రాణముల దగ్గరనుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటిని లాగేశాడు. ఇప్పటి వరకు ‘త్రాగు త్రాగు’ అనడమే తప్ప ‘వదులు వదులు’ అనడం తెలియదు. పూతన ‘వదలరా బాబోయ్ అంటున్నది పూతన. ఆయన పట్టుకుంటే వదులుతాడా? ఆయన త్రాగేశాడు. ఆయన పాలు త్రాగెయ్యగానే ఆమె కామరూపం పోయి ఒక్కసారి గిరగిరగిర తిరుగుతూ నెత్తురు కక్కుతూ భయంకరమయిన శరీరంతో క్రిందపడిపోయింది. పదమూడు కి.మీ దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో నెత్తురు కక్కుతూ నేలమీద పడిపోయింది. పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. స్తన్యపానం చేస్తున్న కృష్ణుడు ఆవిడ గుండెలమీద ఉన్నాడు. ఆ గుండెల మీద వున్న కృష్ణుడిని అలాగే చేతులతో పట్టుకొని గిరగిర తిరిగి పడిపోయింది. ఆమె కోరలు నాగటి చాళ్ళలా ఉన్నాయి ముక్కు రంధ్రములు పెద్ద కొండగుహల్లా ఉన్నాయి. పర్వత శిఖరములవంటి స్తనములు, కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి. ఆమె శరీరం చుట్టూ గోపగోపీ జనమంతా నిలబడి ‘ఎంత పెద్ద రాక్షసి’ అంటున్నారు. కృష్ణుడు ఆమె మీద ఉన్నాడని వాళ్ళకి తెలియదు. అక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయం యశోదా రోహిణులకు మాత్రమే తెలుసు. అయ్యో పిల్లాడు అయ్యో పిల్లాడని పూతన భుజములమీదనుండి పర్వతమును ఎక్కినట్లు ఎక్కారు. పసికూన అయిన కృష్ణునికి ప్రమాదం జరిగి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. కానీ కృష్ణుడు చక్కగా నవ్వుతూ హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని ఏమీ తెలియని వాడిలా బోసి నవ్వు నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళు అబ్బో ఎంత అదృష్టమో పిల్లవాడు బ్రతికి వున్నాడని పిల్లాడిని ఎత్తుకుని భుజంమీద పెట్టుకొని ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి క్రింద పడిపోతే పిల్లవాడు భయపడి ఉంటాడని అనుకున్నారు. ఆయనకా భయం? ‘భయకృద్భయనాశనః’ అని ఆయనకు పేరు. గోపికలు అనుకుంటున్నారు. వీళ్ళదీ పరమభక్తి అంటే! వాళ్లకి కృష్ణుని గొప్పతనం తెలియదు. వారు కృష్ణుని ప్రేమించారు.

ఆ పిల్లవాడికి రక్ష పెట్టాలనుకుని గబగబా ఆవు దగ్గరకి తీసుకు వెళ్ళారు. ఆవుతోక పిల్లవాడి చుట్టూ తిప్పి, ఆవు మూత్రము ఆయన మీద చల్లి, ‘నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక, కంఠమును హృషీకేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, గర్భమును మాధవుడు రక్షించు గాక, తొడలను ముకుందుడు రక్షించుగాక’ అంటూ పరమాత్మ పన్నెండు నామములు పెట్టి బాలుని శరీరంలోని ప్రధానమయిన అంగములకు పేడ పూస్తూ రక్షపెట్టారు. ‘ఏమి భక్తిరా వీళ్ళది?’ అని ఆయన మనస్సులో నవ్వుకుంటున్నాడు. ఇంతలో ఒక చిత్రమయిన గమ్మత్తు జరిగింది.

నందవ్రజమునకు పూతన రావడానికి పూర్వము నందుడు మధుర వెళ్ళాడు. కంసరాజుకి ఈయన సామంతుడు. ప్రతి ఏడాది కప్పం కట్టాలి. కప్పం కట్టడం కోసమని ధనమును తీసుకువెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి, మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుని చూడడానికి వెళ్ళాడు. వసుదేవుడు ఎదురువచ్చి కౌగలించుకొని ‘నందా! నిన్ను కలవడం చాలా సంతోషం. నీకు కొడుకు పుట్టాడని విన్నాను. ఎంత ఐశ్వర్యము ఉన్నా పిల్లలు లేని ఇల్లు ఐశ్వర్యము లేని ఇల్లే కదా! నీవు గొప్ప ఐశ్వర్యమును పొందావు. నేను చాలా సంతోషిస్తున్నాను’ అన్నాడు. నందుడు నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు. నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను. నీకు ఆరుగురు కుమారులు పుట్టారు. ఆరుగురినీ దుష్టుడై కంసుడు సంహరించాడు. వసుదేవా! నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నాకొడుకు నీ కొడుకే’ అని అన్నాడు. నిజమునకు కృష్ణుడు వసుదేవుడి కొడుకేగదా! వసుదేవుడు త్రికాలవేది. వసుదేవుడు ‘నందవ్రజంలో ఉత్పాతములు జరగబోతున్నాయి. నీవు తొందరగా బయలుదేరి వెళ్ళిపో’ అన్నాడు. కంసుడు కృష్ణుడిని పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడని తెలుసు.

నందుడు గబగబా బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నాడు. దారిలో పడివున్న రాక్షసి శరీరమును చూశాడు. వసుదేవుడు చెప్పినది యథార్థమని గ్రహించాడు. ఆ శరీరమునంతటినీ ఊరికి దూరంగా తీసుకువెళ్ళి పెద్ద కుప్ప వేసి అగ్నిహోత్రమును వెలిగించారు. ఆవిడ రాక్షసి. శరీరం కొవ్వుతో నిండిపోయి ఉన్నది. అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుందని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అగరువత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో వున్న పాపమును కూడా త్రాగేశాడు. పుణ్యమే మిగిలిపోయింది. ఆ శరీరం కాలిపోతుంటే అగరువత్తుల వాసన వచ్చింది. కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణునికి తల్లి ఉంటే ఏ లోకములకు వెళుతుందో ఆ లోకములకు పూతన వెళ్ళిపోయింది. మరి ఆ ‘పిల్లవాడు నా కొడుకు’ అనే ప్రేమతో పాలిచ్చిన తల్లి ఏ స్థితికి వెళుతుందో ఆ స్థితిని నేనుచెప్పలేను అన్నారు పోతనగారు.

ఇది పూతన సంహార ఘట్టము. ఈ ఘట్టమును తాత్త్వికంగా పరిశీలించాలి. భాగవత దశమస్కంధము ఉపనిషత్ జ్ఞానము. ఆవిడ పేరు పూతన. అమరకోశం ‘పునాతి దేహం పూతన’ అని అర్థం చెప్పింది. దేహమును పవిత్రముగా చేయుడానికి పూతన అని పేరు. మనకి సంబంధించిన ఒక వస్తువును చూపించి ఎవరిదీ అని ప్రశ్నిస్తే నాదని చెపుతాము. అయితే నేను అనబడే నువ్వు ఎవరు? దానికి జవాబు మనకే తెలియదు. అదే పెద్ద అజ్ఞానము. ‘నేను నేను’ అంటున్నది ఏది? అంటే తెలియక ఆ ‘నేను’ని చీకటితో, అజ్ఞానముతో కప్పివేశాము. అదే పూతన. అవిద్య. ‘నేను’కు ‘నాది’ తోడవుతుంది. నేను అనేది అబద్ధము. ఈ అబద్ధమునకు నాదనే మరొక అబద్దం తోడవుతుంది. దీనికి అస్తిత్వం లేదు. ‘నా’ అన్నప్పుడల్లా ఒక పాశం వేసుకుంటున్నాడు. ఎన్ని వేసుకుంటే అంత పశువు అవుతున్నాడు. పశువుకి అజ్ఞానం, అవిద్య ఉంటాయి. ‘నేను, నాది’ అనే రెండు పూతన రెండు స్తనములు. ఇందులోంచి విషయములను ఇస్తుంది. విషయమే విషము. దేహము ఎప్పుడూ సుఖమునే కోరుతుంది. దేహసంబంధమయిన సుఖములు విషముతో సమానమయినవి. అవి ఎప్పటికీ దేహి సూక్ష్మరూపమును తెలియనివ్వవు. అలా తెలియకుండా జీవుడు ఈ అబద్ధంలోనే చచ్చిపోతాడు. దీనిని ఏమయినా చేయగలమా? ఏ పని చేసినా దానిని భగవత్ ప్రసాదమని భావించాలి. భగవదర్పణ చేసి సుఖములను అనుభవిస్తే అవి మనపట్ల విషములు కావు అమృతములవుతాయి. భగవంతుని అర్పించడం వలన లోపల శుద్ధి జరుగుతుంది. శుద్ధి లేకుండా తింటే విషం. పూతన కృష్ణునికి విషపూరిత స్తన్యమును ఇచ్చింది. విషము అమృతము అయింది. మీకు కూడా అన్నింటినీ ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటయితే అది అమృతం అవుతుంది. మనస్సును దేహమును కూడా శౌచపరచగలదు. ఈశ్వరుని వైపు తిప్పగలదు. ఈ రహస్యమును ఆవిష్కరించడమే పూతన సంహారమునందున్న పెద్ద ప్రయత్నము.

ప్రకృతి వికారమయిన శరీరం పైకి అందంగా ఉన్నట్లు ఉంటుంది. దీనియందే ఉండిపోతే అసత్యమయిన ‘నేను’నందు మీరు ఉండిపోతే అది అమృతత్వమును ఇవ్వదు. అసత్యమయిన ‘నేను’ సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపు వెళ్ళినట్లయితే ఈ భక్తి ఒకనాడు జ్ఞానము అవుతుంది. జ్ఞానము ఎప్పుడు కలిగేదీ మనం చెప్పలేము. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే ప్రారంభించాలి. అది ఎప్పుడో జ్ఞానం అవుతుంది. జ్ఞానమును అగ్నిహోత్రంతో పోలుస్తారు. మీకు తెలియకుండానే ఒకరోజున ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అసలు ‘నేను’ను తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికి భక్తి నుండే వెళ్ళాలి. అదే పూతన సంహారఘట్టం. కృష్ణుని మొదటి లీల పూతన సంహారంతో మొదలవుతుంది. అపవిత్రమయినది పవిత్రం అయింది. పవిత్రము అవగానే లోపల ఉన్న వస్తువును తెలుసుకోవడానికి ఇది ఉపకరణంగా మారిపోతుంది. మారిపోయి అసలు ‘నేను’ను పసిగట్టగలిగిన స్థితికి తీసుకు వెళుతుంది. ఈ ఘట్టమును పరమోత్కృష్టమయిన పరమ పావనమైన ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...

instagram.com/pravachana_chakravarthy

లేకపోతే జబ్బులు.*

 🌈<>><<>><♾🔘♾<>><<>><🌈

*శ్రీ గురు దేవా నమః🙏*


*👉 మన శరీరం లోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో... మలినంగా బయటికి  వెళ్లిపోవాలి, లేకపోతే  జబ్బులు.*


*👉 మన శరీరం లోకి వెళ్ళిన నీరు 4 గంటల్లో… బయటికి వెళ్లిపోవాలి, లేకపోతే  జబ్బులు.* 


*👉 మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా… బయటికి వెళ్లిపోవాలి లేకపోతే మనం రోగగ్రస్థులం అవుతాం.*


*👉 మరి మనలోకి చేరిన కోపం, అసూయ, ద్వేషం, మోసం... ఇలాంటివన్నీ సంవత్సరాలుగా మనలోనే ఉంటే... ఏమౌతుందో తెలుసా...  మనం నిత్య రోగగ్రస్తులుగా అవుతాం.*


*👉 అందుకే ఋషులు అంటారు... "మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్న మూర్ఖులం... నిజానికి మనం రోజూ కొద్దీ కొద్దీగా మరణిస్తున్నాం."*  


*👉 మనకు వయసు పెరిగితే... ఆయుష్షు తగ్గినట్టా? పెరిగినట్టా?... మనం ప్రతి రోజూ... నెగెటివ్ ఎనర్జీ లతో కొద్ది కొద్దిగా మరణిస్తున్నామన్న చేదు నిజాన్ని త్వరగా గ్రహించాలి.*


*👉 మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని... మన జీవితాల్ని మృతప్రాయం చేస్తున్న... కోపాన్ని, ఒత్తిడిని, ద్వేషాన్ని, బద్ధకాన్ని, అనారోగ్యాన్ని… ప్రతి రోజూ ధ్యానం, యోగ చెయ్యడం ద్వారా ప్రాణ శక్తిని ఎక్కువగా పొంది నెగెటివ్ ఎనర్జీ దూరం చెయ్యాలి.*  


👉 *మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణ శక్తిని చేర్చే ఏకైక మార్గం  ధ్యానం, యోగాయే...* 


*👉 అందుకే భారతీయ ఋషులు ధ్యానం, యోగ మార్గాన్నే అనుసరించారు.* 


👉 *రోజూ కనీసం అర గంట... యోగా, ప్రాణాయామం, ధ్యానం,   చెయ్యండి... ఆయురారోగ్యాలతో జీవించండి...*


*సర్వేజనా స్సుఖినోభవంతు.* 

*లోకా సమస్త సుఖినోభవంతు*

🌈<>><<>><♾🔘♾<>><<>><🌈

ముగియించు నరుని

 భువి యంత్య  ముండదు భోగమ్ములకును 

యంత్యమై పోయద మా  ధ్యాస తోడ

తమ కంతమవవెప్డు  తాపత్రయములు 

తా మంత మయ్యేరు తాపత్రయముల 

కాల మెక్కడ పోదు గమనించి చూడ 

కాలాను రీతిగా గతియించు నరుడు

ఆశ లేనాటికి న్నంతమ్ము కావు 

ముదుసలి ప్రాయమే  ముగియించు నరుని



గోపాలుని మధుసూదనరావు శర్మ

తాపత్రయాలు తగలబడవు

 శ్లోకం:☝️

*భోగా న భుక్తా వయమేవ భుక్తాః*

 *తపో న తప్తం వయమేవ తప్తాః ।*

*కాలో న యాతో వయమేవ యాతాః*

 *తృష్ణా న జీర్ణా వయమేవ జీర్ణాః ।।*

  - వైరాగ్యశతకం, భర్తృహరి


భావం: భోగాలకు అంతం అంటూ ఉండదు కానీ మనం అంతమైపోతాం. తాపత్రయాలు తగలబడవు (నశించవు), కానీ (మరణాంతే) మనం తగలబడతాము! కాలమెక్కడికీ పోదు, కానీ మనం వెళ్లిపోతాము. ఆశలు ఎన్నటికీ తీరవు, నిత్య నూతనంగా ఉంటాయి కానీ మనకు వృద్ధాప్యం వస్తుంది.

భువి యంత్య  ముండదు భోగమ్ములకును 

యంత్యమై పోయద మా  ధ్యాస తోడ

తమ కంతమవవెప్డు  తాపత్రయములు 

తా మంత మయ్యేరు తాపత్రయముల 

కాల మెక్కడ పోదు గమనించి చూడ 

కాలాను రీతిగా గతియించు నరుడు

ఆశ లేనాటికి న్నంతమ్ము కావు 

ముదుసలి ప్రాయమే  ముగియించు నరుని



గోపాలుని మధుసూదనరావు శర్మ

8, నవంబర్ 2022, మంగళవారం

నిజాలు స్వాములకు చెప్పండి

 నా ఈ వ్యాసం కొద్దిగా పెద్దది కానీ *సమాచారం చాలాగొప్పది*


ముందుగా అయ్యప్ప *భక్తులదీక్ష* తెలుసుకుందాం


అయ్యప్పస్వామి భక్తులు ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం,

మధ్య, మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం,

మాలాధారణలో ఉన్నన్ని రోజులూ ,అహోరాత్రులూ ఆ స్వామి చింతనలో,మిగతా స్వామి భక్తులతో సమయం గడపడం, 

సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు.


వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. 

నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభూదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు. 

అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం (41 రోజులు) పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.


దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు #గురుస్వామి (ఆరు సార్లు మాల వేసిన సీనియర్ స్వామి) వద్దనుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు.


*మాలధారణ* అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.


నిత్య పూజాక్రమంలో గాని, దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది.


*ఎరుమేలి*

**********

శబరిమలై యాత్ర "ఎరుమేలి"తో మొదలవుతుంది. ఎరుమేలిలో *వావరు స్వామి* ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక దారిదోపిడి *గజదొంగ* అనంతరం స్వామి *సన్నిహితభక్తు* నిగా మారాడు.


అతడే వావరు స్వామి.

"నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు"అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట!. 

ఈ వావరు స్వామి ఒక *ముస్లిం మతస్తుడు*. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే) దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ రకరకాల వేషధారణతో "పేటై తులాల" అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు "పేటై తులాల") .

ఈ ఎరుమేలి వద్ద ఉన్న "ధర్మశాస్త" ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను "కన్నెమూల గణపతి" అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.


అసలు విషయం

***************

● పూర్వం శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం,పైగా దొంగల బెడద కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది.


◆ సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819) లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం ఏడు'రూపాయలని పందళరాజు వంశీయుల రికార్డులలో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అప్పుడు అక్కడ *శిలావిగ్రహాని* కే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరల దేవాలయాన్ని పునఃనిర్మించినట్లు తెలుస్తోంది.


■ శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ నిర్మాణం జరిగింది 12 శతాబ్దంలో ....


★ ఈ అఖండ భారతావనికి *ఎడారిమతాలు దండెత్తి* వచ్చింది 15,16 శతాబ్దంలో దీనికి ముందు ఈ మన పవిత్రభారతావనిలో.. కేవలం హిందూధర్మం పాటించేవారలు తప్ప , పరాయిమతస్థులు జీవించి ఉన్నట్టుగా చారిత్రిక ఆధారాలు ఈదేశ చరిత్రలో ఖచ్చితంగా లేనేలేవు ..అందరూ మనదేశ సౌభాగ్యాన్ని దోచుకోవాలని తుర్క అరబ్బుదేశాలనుంచి దండెత్తి వచ్చినవాళ్లే!


కాబట్టే మనదేశం *హిందూదేశం* గా పిలువబడినది ఇక్కడికి వచ్చినవారు కూడా *హిందుస్థాన్*(హిందువులు నివసించే స్థానం /ప్రదేశం } అనే పిలిచారు.


● కేరళ రాష్ట్రం అనాదిగా ఆర్ధిక వనరులు { అనంత పద్మనాభస్వామి ఆలయం } సమృద్ధిగా ఉన్నదేశం అందుకే మనదేశానికి వ్యాపారం పేరుమీద వచ్చిన ఆగ్లేయులు కూడా కేరళ ప్రాంతం కేంద్రంగా చేసుకుని ఇక్కడి నుండే మనదేశంలోకి చొచ్చుకొని వచ్చారు.


ముందుగా మనదేశం మీదికి వచ్చిన మహమ్మదీయులు  *ఖిల్జీ* లాంటి ఉన్మాదులు అన్ని రాజ్యాలను ఆక్రమిస్తూ వాటిని వశపరుచుకొని ధనాన్ని కొల్లగొట్టడం చేస్తుండేవారు మన హిందూదేవాలయాలను కూల్చి *ధ్వంసం* చేస్తుండేవారు.


ఆ సమయంలో అక్కడ ఒక మహమ్మదీయుని భక్తునిగా *చిత్రించి* { దేవాలయాన్ని పరిరక్షించుకుందుకే }

మిగతా దేవాలయాల ధ్వంసకాండ ఉదంతాలను దృష్టిలో ఉంచుకొని, మనలోని కొందరు పురాణపురుషులు ముందు చూపుతో పుట్టించిన పరాయమత *కల్పిత* పాత్రలే కొన్ని అక్కడక్కడా హిందూ పుణ్యక్షేత్రాలలో కనిపిస్తూ ఉంటాయి.

【తిరుమల లోని బీబీ నాంచారి, *శ్రీరంగం* లోని *నాచియార్*,లు】

■ కేరళ శబరిమల లోని అయ్యప్ప దేవాలయం మీద ఆక్రమణలు దాడులు జరుగకుండా ఇక్కడ కల్పితపాత్ర యైన *వావర్ మసీదు* ని కట్టారుట


◆ ఎక్కడ 12 వ శతాబ్దము అయ్యప్ప పుట్టింది? 


మరెక్కడా 15,16 శతాబ్దము ముస్లిం దొంగ పుట్టింది ?....*వీళ్లెలా స్నేహితులవుతారు* ?


12వ శతాబ్దంలోపుట్టిన దైవంశ సంభూతుడికి

16శతాబ్దం లో పుట్టిన ముస్లిం మనిషికి{గజదొంగ } స్నేహితాడా ? ఇది సాధ్యమేనా అని ఆలోచించారా ?


■ అయినా *దేవుడి* దర్శనానికి వచ్చే *ముందుగా* భక్తుడైన *వావర్ దర్శన* మేమిటి ?... ఇది దుర్మార్గమైన చర్యగా కనిపించడం లేదా ?


సరే! .. 

హిందువులు భక్తితో మాలధారణ దీక్ష చేసి, హైందవ వేషధారణలోనే ముందుగా వావర్ స్వామిని దర్శనం చేసుకోవడం మ్రొక్కడం చేస్తున్నప్పుడు ?...

ఇప్పటివరకూ ఏ మహమ్మదీయుడన్నా ముందుగా ఆయప్పదర్శనం చేసుకున్నాడా లేదా మసీదుకు ముందుగా వెళ్లి, తరువాతైనా శ్రీఅయ్యప్ప స్వామీ దర్శనానికి వచ్చిన దాఖలాలేమైనా ఉన్నాయా ?


సుమారు 41 రోజు నియమనిష్టలతో హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాలతో ఉన్న భక్తులను మోసంతో వారి వ్రతదీక్షలను భంగం కలిగించడం ,హేళన చేసే విధంగా ,ముందుగా వెళ్లి మసీదులోని వావరుకి మ్రొక్కడమేమిటి ?...


ఒక మహమ్మదీయ వావరు అయితే...అతడు *బాబా కావాలి కానీ స్వామీ ఎలా* అవుతాడు?...... 

*వావరుస్వామీ* అనీ ఎలా పిలుస్తారు? ఒకసారి బాగా ఆలోచించండి ! ఇది పక్కాగా కుట్రప్రకారం చేసిన చర్యే !


● కన్యసాములు మొదట దర్శనం చేసుకోవాలి ..ఈ గజదొంగ యైన వావరు భక్తుణ్ణి ..అంటే అయ్యప్ప మాల వేసుకున్నవాడు తప్పనిసరి ఆ దేవుడికంటే ముందుగా ఈ దొంగ దర్శనం చేయాలనే కదా?


★ మసీదుల్లో ఉండేదీ ఘోరీలు మాత్రమే ఘోరీల్లో ఉండేది ఎవరివైనా ప్రవక్తల లేదా భక్తుల అస్థికలు లేదా బూడిద లేదా వారి జ్ఞాపకాలు మాత్రమే!... 

అలాంటిది ...దీక్షలో ఉన్న సమయంలో అయ్యప్ప మాల ధరించిన భక్తులు *శవం* గానీ శవం అనే *మాట* ను మాట'వినబడితేనే వెళ్లి *స్నానంతో పాటు మళ్ళీ విభూతి, చందన తిలకధారణ చేస్తారు* అలాంటివారిని ... శబరిలో మొట్టమొదటగా ఒక ముస్లిం ఉండే మసీదులోకి భక్తులను పంపి ఆచారం భక్తి పేరిట మోసం చేస్తూ ,అక్కడ ఇరుముడులని దించేవిధంగా,నిష్టగా ఉన్న అయ్యప్పస్వామి భక్తుల చేత మొదటగా ముస్లిం కి మ్రొక్కించడం ఇది మోసం, ధగా కాదంటారా ?


◆ *వావరూకి అయ్యప్ప స్వామికి సంభంధం లేదు కేరళాలో ఫకీరు సమాధి ఉంది ఆదాయం కోసం*!...

ఇది అయ్యప్పకీ ముడి వేశారు అంతే!.. 

ఈ మసీదుని కొందరు చెబుతున్నట్టుగా 1907 తరువాతే పెద్దదిగా నిర్మించారు .


● బలవంతముగా మన అయ్యప్ప చరిత్రలో

వావర్ స్వామి అనే పాత్రను సృష్టించి మనకు ముస్లిమ్స్ అంటే వ్యతిరేకత లేకుండా ఇస్లాంను కూడా ఆదరించాలని బలవంతముగా

ఈ వావర్ స్వామి పాత్రను ప్రవేశపెట్టినారు!


కావాలంటే Google లో వెదికి చూడండి ఎక్కడా కూడా ఈ మసీదును ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో సరియైన సమాచారం ఉండదు .


ఇక్కడ ఏ మతాన్ని మతాచారాలను తప్పుబట్టడం కానే కాదు

జరిగిన జరుగుతున్న మోసాలను గ్రహించగలరని మూఢనమ్మకాలను పోగొట్టుకోవాలని మాత్రమే చెప్పడం అన్యధా భావించకండి!..


ఈ విషయంలో చాలామందికి అనుమానాలున్నాకూడా *నోరు మూసుకొని మనసుని చంపుకుని ... హా హతవిధి అనీ మ్రొక్కుతూ వచ్చేస్తున్నారు* .


మన దురదృష్టం...ఏంటంటే ఈ *మాల వేయించడంకూడా ఓ వ్యాపారమైంది కొందరు సీనియర్ స్వాములకు* 

గురుస్వాములు అనే వారు డబ్బుసంపాదన కోసం,పేరు ప్రఖ్యాతులకోసం గొప్ప కోసం తప్ప, నిజానికి కొందరు గురుస్వాములమని చెప్పుకునేవాళ్లకే అసలు నియమాలు,పూజావిధానాలు ,ఆచారాలు,వారికి ఏమి తెలియదు...


★ కావాలంటే అస్సలు *అయ్యప్పస్వామికీ ..  ఆ ముసల్మాన్ వావర్ బొందలగడ్డ కి సంభందం ఏమి?*... 

ఇంత నియమ నిష్టలతో ఇన్ని రోజులున్న మనం చివరి రోజున అది కూడా అయ్యప్పదర్శనానికి ముందు రాక్షస వేషాల్లో ఆ మసీదులోకి దర్శనాని కెందుకెళ్లాలని ప్రశ్నించి చూడండి ?


నాకు కూడా అనుమానంగానే ఉంది ఇంతకన్నా గొప్పదైనా ఆధారాలతో కూడిన సమాచారమేదైనా ఉంటె దయచేసి నాలోంటోళ్లకు వివరించి చెప్పగలరు.మీకు తెలిస్తే కొందరు జనాల్లో ఉన్న ఈ అపోహలను తొలిగించగలరు.


*ఇప్పటి వరకు జరిగిన ఒక ఎత్తు ఇప్పటి నుంచి జరుగుతున్నది ఒక ఎత్తు*!...  

గతం తెలియక చాలామంది వావర్ సమాధిని దర్శించుకుని ఉండచ్చు కానీ *ఇక మీదట ఇలాంటివి సాగనీయకుండా వావర్ స్వామి సమాధిని దర్శించుకోవాలి అంటే మేము మాల కూడా ధరించము అని ఖచ్చితంగా చెప్పండి*


గురు స్వాములకు

ఈ విషయంపై తోటి స్వాములతో చర్చించండి

దీని గురించి నిజాలు స్వాములకు చెప్పండి

యింకా మీదట *ప్రతి హిందూ దేవాలయంలోనూ సెక్యులర్ భావాలు చెల్లవు!*


ఈ నాపోస్ట్ రూపంలో రాసింది తప్పుగా *నేను* రాసుంటే భక్తులు క్షమించగలరు...

*ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశ్యం మాత్రం నాది కాదు*

మీ *Ravinder Gajawelli*!!

ఇదే పోస్ట్ ని *నేను రాసి* 6 ఏళ్లుగా పోస్ట్ చేస్తూ వచ్చా .. దీన్నే కొందరు *Vedio ల రూపంలో* కూడా చేశారు..

ప్రతి హిందువు తెలుసుకుని ఆలోచించాల్

 *ఈ వాస్తవం చదువుటానికి కేవలం 3 నిముషాలు మాత్రమే పడుతుంది.* 


కాథలిక్ క్రిస్టియన్

కుటుంబంలో జన్మించిన

"మార్టీన"  అనే ఆవిడ

హిందూధర్మం పై...

వెలిబుచ్చిన 

అభిప్రాయాన్ని 


ప్రతి హిందువు

తెలుసుకుని

ఆలోచించాల్సిన 

అవసరం ఉంది. 


నేను 

ఒక కాథలిక్ క్రిస్టియన్

కుటుంబంలో జన్మించాను .


నాకు చిన్నప్పటినుండి 

మా చర్చి ఫాస్టర్.. 


యేసు ఒక్కడే దేవుడు 

అని చెప్తుండే వాడు.


ఐతే 

నాకు అంతగా 

అతని మాటలు 

నమ్మబుద్ధి కాలేదు.


నేను 

పాత, 

కొత్త నిబంధనలు చదివి... 

మా పాస్టర్ ని అడిగాను. 


భూమి ఆకారం గురించి

బైబిల్ 

ఎందుకు 

తప్పుగా చెప్పింది? 


తండ్రితో 

కూతురు కామాలీలల్లో

పాల్గోవచ్చు అని ఉంది ... 


ఇంతకు 

బైబిల్ ముఖ్య ఉద్దేశం

ఏమిటి?


ఒక గ్రంధంలో

ఇలాంటి వాటికి 

ఎలా స్థానం కల్పించారు?... 


అని ప్రశ్నించేసరికి...


ఆ చర్చి సభ్యులు 

నన్ను ఇంకోసారి 

చర్చికి రావొద్దు! 

అని నన్ను 

అక్కడ నుండి తరిమేసారు.


అప్పుడు వయస్సు

13 ఏళ్ళు.


ఆ తరువాత 

నాకు ముస్లిం స్నేహితులతో

పరిచయం అయింది.


ఒకసారి 

మసీద్ కు వెళ్ళగా...

అక్కడ నాకు 

చేదు అనుభవం

ఎదురయ్యింది.


నేను ముందు 

హిజాబ్ వేసుకోవాలని

ఆర్డర్ ఇచ్చారు. 


హిజాబ్ వేసుకొని 

ఇంటికి వెళ్లి 

అక్కడే 

నమాజ్ చేయాలనీ...


"ఓ అల్లాహ్ నేను పాపిని,

నేను 

ఏ జన్మలోనో 

ఎంతో పాపం చేశాను...


అందుకు 

నన్ను మహిళగా

సృష్టించావు" అంటూ

వేడుకోవాలని చెప్పారు.


ఆమాట విని 

నాకు కన్నీళ్ళు ఆగలేదు. 


అల్లాహ్ ఎవ్వరు? 

అని ...నేను అడిగాను


అల్లాహ్ 

దైవం అని...

అల్లాహ్ కి 

రూపం లేదు అని ...

వాళ్ళు చెప్పారు .


రూపం లేని దైవానికి

మగాడు 

అనే ఎలా ముద్ర వేసారు?

అని అని అడిగాను.


"మొహమద్ ప్రవక్త

చెప్పారు" 

అని మాత్రమే వాళ్ళు

బదులిచ్చారు.


అప్పుడే అర్ధం అయ్యింది. 


ఇస్లాంలో 

మహిళలకు 

చాలా తీవ్రమైన

ఇబ్బందులు 

ఉన్నాయి అని... 


ఇస్లాంలో 

మహిళలను 

కేవలం కామావాంఛ

తీర్చుకోడానికి 

ఒక బొమ్మగా

ఉపయోగిస్తారు అని...


మహిళలకు 

మసీద్ లోపలికి 

ప్రవేశం కూడా ఉండదు

అని తెలిసింది.


మహిళను 

ఎంత అపవిత్రంగా

చూస్తున్నారో తెలుసుకొని... 

నాలో నేను 

కుమిలిపోయాను.


అలా కుమిలిపోతూ

ఏడుస్తున్న తరుణంలో...

ఒక వృద్ద మహిళ 

నా చెంతకు వచ్చి ... 


పవిత్రమైన భావాలకు

ఆధ్యాత్మికతకు నిలయం

"భారతదేశం" అనీ.... 

కొన్ని ఆధారాలతో 

నాకు మొత్తం 

వివరించి చెప్పారు .


ఐతే 

నేను ఆమె మాటకు 

అంత ప్రాముఖ్యత

ఇవ్వలేదు . 


ఎందుకంటే

ఇంతకుముందు వెళ్ళిన 

మతాలలో 

మహిళలకు విలువ లేదు

అని తెలుసుకున్నాను.


భారతదేశంలో

మహిళల పరిస్దితి ఇంకా

దారుణంగా ఉంటుంది 

అని పాస్టర్ చెప్పిన

వాఖ్యలు గుర్తొచ్చి ...


ఇంక హిందుత్వం వైపు

వెళ్ళకూడదని

నిశ్చయించుకున్నాను.


ఒక రోజు 

నా స్నేహితురాలు

భారతదేశం నుండి 

తీసుకు వచ్చిన 

గంగ నీళ్ళు ఇచ్చి 

నన్ను త్రాగామని చెప్పింది. 


ఎందుకో కొంచెం

అయిష్టంగానే తాగాను. 


నేను 

నా స్నేహితురాలిని అడిగా

"గంగ ఎవ్వరు? 

ఏమిటి ఈ కధ?" అని.


"గంగ అంటే నీరు...


భారతీయులు 

మంచి నీటిలో 

దైవాన్ని  చూస్తారు.


గంగానదిని 

'గంగాదేవి' అని 

దేవతగా పూజిస్తారు 

అని ఆమె చెప్పింది.


 " నేను 

ఆశ్చర్యంగా అడిగా 

"గంగ మహిళ కదా, 

మరి మహిళ మీద 

అక్కడ వివక్ష చూపరా?"

అని అడిగాను. 


అప్పుడు ఆమె చెప్పింది...


"వాస్తవానికి 

భారతీయులు

ఆరాధించేది...

భూమాత, 

వేదమాత, 

గోమాత, 

ధన మాత,

ధాన్యమత,

గంగామాత  " అని... 


ఇలా భారతీయులు 

ప్రతి 

మంచి విషయాలలో కూడా 

మహిళలకే 

ప్రథమస్థానం ఇస్తారు.  


ప్రతి ప్రాణిలోనూ 

మంచిని చూస్తారు.


మనం 

అక్కడికి  వెళితే తప్ప... 


మనకు 

భారతీయత యొక్క

పవిత్రత తెలియదు 

అని ఆమె చెబుతుంటే

ఆశ్ఛర్యపోయాను.


అప్పుడు 

నేను అడిగా ...


"మరి 

అంత మంచి 

హిందుత్వం కదా, 

మరి నేడు ప్రపంచంలో

అత్యధిక శాతం 

క్రిస్టియన్ మతం, 

ఇస్లాం మతం 

ఎందుకు

తీసుకుంటున్నారు?


ఆమె  

దానికి చాల చక్కగా

జవాబు ఇచ్చారు 


"స్వర్గం చాల చిన్నది... 


నరకం చాల పెద్దది. 


నరకం వైపు వెళ్ళడానికి

అన్ని తలుపులు 

తెరిచి ఉంటాయి.


కానీ 

స్వర్గం వైపు

పయనించాలంటే ....


ఒక చిన్న ఇరుకు సందులో

నుండి ప్రయాణించాలి"


అనే సమాధానం 

నా గుండె 

అంతర్భాగానికి తాకింది .


ఆ మరుసటి నెలలో 

నేను భారతదేశానికి

ఎలాగైనా వెళ్లి 

అక్కడ వాస్తవ రూపం

తెలుసుకోవాలి 

అని అనుకున్నాను.


ఇప్పుడు 

ఇక్కడికి వచ్చిన తరువాత

తెలుసుకున్నాను...

"ప్రపంచానికి 

తల్లీ,తండ్రి లాంటిది 

ఈ వేద భూమి

భారతదేశం .


ఇక్కడ ఉన్న ప్రేమ 

ప్రపంచం మొత్తం 

ఎక్కడ వెతికినా దొరకదు.


నాకు 

ఇంకో జన్మంటూ ఉంటే ...

ఈ వేద భూమిలో

ఒక మహిళగా  

పుట్టాలని ఉంది" అంటూ... 


స్థానికి ఛానల్ కి 

ఇచ్చిన ఇంటర్వ్యూ లో

మార్టీన చెప్పింది. - 

(Hindu Jwala నుండి)


హిందూధర్మం

సనాతన ధర్మము... 

పునాది చాలా బలమైంది. 


మధ్యలో 

కొన్ని లోపాలు చేరాయని

మొత్తం హిందూధర్మాన్ని

అగౌరపరచడం అవివేకం.


దయచేసి 

భారతీయ సంస్కృతిని,

మన ధర్మాన్ని, 

మన సంప్రదాయాలను...

జాగ్రత్తగా

కాపాడుకుందాము....... 


జై హింద్...


🌹🌼🌼🌼🌼🌹🌹🌼🌼🌼🌼🌹


*📮 ఈ మెసేజ్ చదివి ఊరుకోవడం కాకుండా మీకు వీలైనంత వరకు తప్పకుండా ఫార్వర్డ్ మరియు షేర్ చేయగలరు.*

దీపం వెలుతురుని

 🙏🪔

శ్లోకం:☝️

*కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః*

  *జలే స్థలే యే నివసంతి జీవాః |*

*దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః*

 *భవంతిత్వం శ్వపచాహి విప్రాః ||*


భావం: క్రిమికీటకాలు, పక్షులు, ఈగలు దోమలు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు ఒకటేమిటి ఈ భూమిమీద నివసించే ప్రతీ ఒక్కజీవికీ కూడా ఈ దీపం వెలుతురుని దర్శించగానే ఇక మరుజన్మ అంటూ లేని అనంత పుణ్యాన్ని పొందాలి. వైదిక ధర్మాన్ని శ్రద్ధగా అచరించనివాడు కూడా ఈ దీపకాంతి ప్రసరించడం చేత అభ్యున్నతి కలిగి మరుజన్మలో వేదమునేర్చి లోకోపకారియైన బ్రాహ్మణజన్మను పొంది ఉద్ధరింపబడాలి.🙏

హిందువులు

 *తెలుగు రాష్ట్రాల్లో  73% హిందువులు హిందు వ్యతిరేక శక్తులకే మద్ధతు ఇస్తున్నారు.*


భారత్ టుడే సర్వేలో వెల్లడి


*అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువులే.!!*


ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు :-


*1. అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.*


*2. అన్ని మతాల సారం ఒక్కటే అంటారు.. ఏదో  వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా.*


*3. అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని  బోధనలు చేస్తారు...  వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.*


*4. వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద  వేదాంతుల్లాగా.* 


*5. వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.*


*6. క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు. మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.*


*7. క్రైస్తవుల ఇంటికి ప్రార్దనకు వెళ్లి కేకులు, బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.*


*8. హిందువులను, హిందు గ్రంధాలను, హిందూ దేవుళ్లను దూషించేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.*


*9. హిందూ ధర్మం గొప్పతనాన్ని  ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.*


*10. పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా: కృష్టుడికి 16 వేలమంది భార్యలు).*


*11. స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.*


*12. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.*


*13). ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?*


*ఈ సెక్యులర్ హిందువులు (హిందూ ధర్మాన్ని నాశనం చేసేవారు) ఇప్పుడైనా మారండి నిజం తెలుసుకోండి* 


*గొప్పదైన నీ ధర్మాన్ని నీ దేశాన్ని కాపాడుకో. మేలుకోండి హిందువులారా! లేకపోతే కొన్ని రోజులు, కొన్ని ఏళ్ళ తర్వాత మీ పిల్లలకి పూర్వం హిందూమతం ఉండేది అనిచెప్పే దుస్థితి వస్తుంది. హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ, ఆచరిస్తూ తమ పిల్లలను సైతం హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటించేలా పెంచాలని విజ్ఞప్తి.* 

ధన్యవాదాలు 🙏

నవంబర్_8_నాటి_చంద్రగ్రహణం #ధార్మికనియమాలు

 L#నవంబర్_8_నాటి_చంద్రగ్రహణం  #ధార్మికనియమాలు


            ఈ సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రజలకు వార్తల నిజాలు చేరువలో కి వస్తున్నా  , ఫేక్ న్యూస్ లు - ప్రజలను సందిగ్ధం లో పడవేసే విషయాలు పుష్కలంగా హల్ చల్ చేస్తున్నాయి. You Tube వీడియోలలో అబద్ధాల ప్రచారాలు, ప్రజలను confusion లో పడవేసే విషయాలు చెప్పే పండితమ్మన్యులు బాగా ఎక్కువై పోయారు. వచ్చే మంగళవారం నాటి గ్రస్తోదయ #చంద్రగ్రహణం విషయంలో ప్రజలు, పంచాంగకర్తలతో సహా పండితులు కూడా సందిగ్ధం లో పడుతున్నారు. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ దృష్టిలో ఉంచుకుని, కొన్ని పంచాంగాలలో ఆయా పంచాంగకర్తలు రాసిన గ్రహణ నియమాలను చూసి ప్రజలు సంశయగ్రస్తులైనారని తెలిసి ఈ పోస్ట్ పెడుతున్నాను. 

            ఈ చంద్రగ్రహణం సంపూర్ణచంద్రగ్రహణమే. అయితే, గ్రహణం మధ్యాహ్నం 2:39 కి ప్రారంభమై ( స్పర్శ) సాయంత్రం 6:19 ( మోక్షం) కి ముగుస్తుంది. ధర్మశాస్త్రంలో  #చంద్రసూర్యోపరాగేచ_యావద్దర్శనగోచరః అని ఉన్నది. అనగా గ్రహణ సమయంలో ఎంతసమయం వరకూ గ్రహణం దృశ్యమానమో అంతవరకూ మాత్రమే పుణ్యకాలం. ఈ గ్రహణం మధ్యాహ్నం ప్రారంభమైనప్పటికీ మనకు చంద్రుడు కనపడడు కాబట్టి మనకు మధ్యాహ్నం 2:39 నుండీ పుణ్యకాలం కాదని గ్రహించాలి.  చంద్రోదయం ఎప్పుడైతే అప్పుడే మనకు చంద్రుడు కనబడడం ప్రారంభిస్తాడు కనుక మనకు చంద్రోదయం నుండి 6:19 కి (గ్రహణం పూర్తయిపోతుంది కాబట్టి ) వరకే పుణ్యకాలం. 

         చంద్రోదయమనేది  గ్రహణం లో చంద్రుడు ఉండగా జరుగుతోంది కనుక ఇది #గ్రస్తోదయచంద్రగ్రహణం. 


1. #పట్టుస్నానం_ఎప్పుడు_చేయాలి? 

      మధ్యాహ్నం 2:39 కు స్పర్శ కావున అప్పుడే స్నానం చేయాలన్న ప్రచారం బాగా జరుగుతోంది. అయితే, అది సరి కాదు. కాలమాధవం లో మాధవాచార్యులు -

     #యత్తు_కాలవిపర్యాసేన_ప్రాప్యమాణం_జ్యోతిశ్శాస్త్ర_మాత్రప్రసిద్ధం_గ్రహణం_తత్ర_స్నానాదికం_నకర్తవ్యమ్


అని చెప్పారు. అంటే పగలు వచ్చిన చంద్రగ్రహణానికి, రాత్రి వచ్చిన సూర్యగ్రహణానికీ స్నానదానాదులు అవసరం లేదు.  అంటే సూర్యోదయ-సూర్యాస్తమయాల నడుమ వచ్చిన చంద్రగ్రహణం, చంద్రోదయ-చంద్రాస్తమయాల నడుమ వచ్చిన సూర్యగ్రహణం రెండూ నిష్ఫలమే. మనం ఏ గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. 

           

             అయితే, వచ్చే చంద్రగ్రహణం లో గ్రహణ స్పర్శ సూర్యాస్తమయం లోపున వచ్చి, మోక్షం సూర్యాస్తమయం దాటాక వచ్చింది. అందుకే దీనిని #గ్రస్తోదయగ్రహణం అని అన్నారు. ఇప్పుడు స్నానం ఎప్పుడు చేయాలి? అన్నది ప్రశ్న. 

        #జ్యోతిర్నిబంధం అనే గ్రంథంలో -  


#గ్రస్తోదితేగ్రహే_గ్రస్తందృష్ట్వా_స్నానం_సమాచరేత్। 

#గ్రస్తాస్తే_మౌక్తికంస్నానం_ముక్తందృష్ట్వా_రవింవిధుమ్ ॥ 


    కాబట్టి ఏ ఊరిలో చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తాడో అప్పుడు గ్రస్తచంద్రుని చూసి పట్టు స్నానం చేయాలి. కిందన వీలైనన్ని ప్రదేశాలకు చంద్రోదయం ఇచ్చాను. 


2. #మంత్రజపం_చేసుకోవచ్చా? 

       

      మంత్రం తీసుకున్నవారు విధిగా మంత్రజపం చేసుకుని తీరాలి. అయితే, గ్రహణ పురశ్చరణ అనేది గ్రస్తోదయ, గ్రస్తాస్తమయ గ్రహణాలలో  చేయడం కుదరదని గ్రహించాలి. 


3. #నిత్యభోజనాదుల_విషయం_ఏమిటి ? 


      #గ్రస్తోదయేవిధోః_పూర్వం_నాహర్భోజనమాచరేత్ అన్న వసిష్ఠమహర్షి వాక్యానుసారం పగలు భోజనం మానేయాలి. సూర్యోదయం నుండి గ్రహణమోక్షం వరకూ ఏమీ తినరాదు. అయితే బాల, వృద్ధ, రోగుల విషయంలో మధ్యాహ్నం వరకూ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. 


4. #పూర్ణిమతిథినాటి_ప్రత్యాబ్దికం_ఎప్పుడు_పెట్టాలి? 

    

      #గ్రస్తోదయోభవేదిందోః_దివాశ్రాద్ధం_న_కారయేత్। 

      #రాత్రావపితదాకుర్యాత్_ప్రత్యబ్దం_మనురబ్రవీత్ ॥ 


     అని చెప్పబడుటవలన, రాత్రి మోక్షానంతరం శుద్ధ చంద్రబింబాన్ని చూసి విడుపు స్నానం చేసి శ్రాద్ధానికి ఉపక్రమించాలి. 


#వివిధప్రదేశాలలో_చంద్రగ్రహణసమయాలు 👇


 1.గుంటూరు       5:33   to  06:19  ( 46 mts) 

2. విజయవాడ    5:32    to  06:19  (47mts) 

3. విశాఖపట్నం    5:20   to  06:19    (59mts) 

4. తిరుపతి         5:41    to  06:19    (38mts) 

5. బెంగళూరు      5:49     to  06:19   (30mts) 

6. చెన్నై               5:38     to  06:19  ( 41mts) 

7. న్యూఢిల్లీ          5:28      to  06:19 (51 mts) 

8. ప్రయాగరాజ్     5:14      to  06:19  (65mts) 

9. కలకత్తా            4:52       to  06:19 ( 87 mts) 

10. ముంబై           6:01     to  06:19  ( 19 mts) 

11. వారాణసీ        5:09       to  06:19 ( 57 mts) 

12. గౌహతి            4:32       to  06:19 (107 mts) 

13. Hyderabad   5:40       to  06:19 (39 mts) 

14. రాజమండ్రి      5: 27    to  06:19 ( 52 mts) 


#ఏనక్షత్రంవారు_ఏయేరాశులవారికి_శాంతి_అవసరం? 


 సూక్ష్మనక్షత్ర గణితరీత్యా ఆ సమయానికి కృత్తిక నక్షత్రమున్నది కావున కృత్తిక నక్షత్రం వారు, మేష-వృషభ-కన్య-మకర రాశుల వారు తప్పనిసరిగా బింబదానం చేయాలి. 


✍️ డా. తుకారాం

కంచికామకోటిపీఠ_శాస్త్రానుసరణ_ఆదర్శప్రాయం

 #కంచికామకోటిపీఠ_శాస్త్రానుసరణ_ఆదర్శప్రాయం 


               8 నవంబర్ 2022, మంగళవారం నాటి చంద్రగ్రహణం సందర్భంగా పాటించవలసిన ధార్మిక నియమాలలో ప్రజలలో కొద్దిపాటి అసంగ్ధిత నెలకొని ఉన్నది. దానిని కంచికామకోటిపీఠం తొలగించిన తీరు అత్యంత ప్రశంసనీయం. 

      

               ఇది గ్రస్తోదయగ్రహణమని మనకందరకూ తెలిసినదే. గ్రహణస్పర్శ మధ్యాహ్నం 2:39 ని. లకు జరుగుతుంది. అయితే మనకు చంద్రోదయం నుండే గ్రహణం కనబడుతుంది. ముందు, స్పర్శస్నానం మధ్యాహ్నమే చేయాలని కంచి కామకోటిపీఠ పండితులు నిర్ణయించారు. అయితే, శాస్త్రరీత్యా గ్రస్తోదయ చంద్రుని చూసిగానీ స్నానానికి ఉపక్రమించరాదని శాస్త్ర నిర్దేశం. 


               ఈ విషయమై నేను కామకోటిపీఠ సిద్ధాంతి विजय सुब्रह्मण्य सिद्धान्ति लक्कावज्झुल ( LS Siddhanti) గారిని సంప్రదించగా వారు తెలిపిన విషయాలను మిత్రులతో పంచుకుందామని ఈ పోస్ట్ పెడుతున్నాను.


 మొన్న రాత్రి ( 4 నవంబర్, శుక్రవారం)  స్వామివారు పీఠపండితులను సంప్రదించి గ్రహణస్పర్శస్నాన విషయంలో ప్రజలలో అసందిగ్ధత నెలకొని ఉన్నదనీ, దానిని తొలగించాల్సిన బాధ్యత పీఠంపై ఉన్నదనీ, ఈ విషయంపై పీఠపండితులంతా తిరిగి చర్చ చేసి మార్గదర్శకాలను భక్తులకు విడుదల చేయమని ఆదేశించారు. దానితో కామకోటిపీఠ పండితులంతా రాత్రి 11 గంటలనుండి 1:00 వరకు చర్చలు జరిపి గ్రహణస్పర్శ స్నానం శాస్త్రరీత్యా చంద్రోదయ సమయానికే చేయాలని  తిరిగి నిర్ణయించి నిన్న మార్గదర్శకాలను విడుదల చేసారు. 


 #తస్మాచ్ఛాస్త్రం_ప్రమాణంతే_కార్యాకార్యవ్యవస్థితౌ అని గీతాచార్యుడు బోధించినట్లుగా తమ పూర్వ నిర్ణయాన్ని శాస్త్రరీత్యా సవరించి ప్రజలలో నెలకొన్న సందిగ్ధత ను తొలగించినందులకు పీఠపండితులు అభినందనీయులు. #కామకోటిపీఠ స్పందన కు మనమంతా సర్వదా కృతజ్ఞు లము. 


#వారి_మార్గదర్శకాలలోని_ప్రధానవిషయాలు:👇


ఆరోజు మధ్యాహ్నం 2:39 నుండి స్పర్శ స్నానం చేసేవారు మహాసంకల్పం చెప్పుకుని చేయాలనీ, చంద్రోదయసమయానికి లఘుసంకల్ప పూర్వక స్నానం చేయవలెనని తెలిపారు. పై సమయం నుండీ ప్రజలంతా ప్రాపంచిక విషయాలనుండి దృష్టి మరల్చి దైవచింతనలో గడపాలని, సంధ్యావందనాది నిత్యానుష్ఠాలకు లోపం కలుగకుండా వాటిని చంద్రోదయానికి ముందే పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రహణ సమయంలో  మంత్రానుష్ఠానము గావించుకుని, మోక్షానంతరము దానములు ఇచ్చు కోవాలని వివరణ ఇచ్చారు. 


     ప్రజల సందిగ్ధత ను తొలగించినందులకు కంచి కామకోటి పీఠాధిపతులకూ, పీఠ పండితులకూ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏


హర హర శంకర!!!    జయ జయ శంకర!!!

దివ్యోత్పాతసంహర్తకున్

 

ఒకచో తూర్పున తెల్లవారు నిను డొక్కోయంచు మేల్గొల్పగా 

నొకచో మింటను మంటగొల్పు రవి మొర్రోయంచు వాపోవగా 

నొకచో పశ్చిమమందగించు ద్యుమణీవ్యూహమ్ము శాంతించగా 

నొకరీతిన్ నడువంగరాదుగద! దివ్యోత్పాతసంహర్తకున్ 

*~శ్రీశర్మద*


సీ.

స్వచ్ఛనీరము లేదు స్నానమ్ము చేయింప 

స్వర్గంగ తెప్పించు శక్తి లేదు

శుద్ధమౌ తేనెలజోరు నీకర్పించ 

పూదేనె లభియించు పుడమి లేదు 

భస్మమ్ము దెచ్చి నిన్ భక్తితో స్నానింప 

చితిభస్మమును దెచ్చు చేవ లేదు 

పుఱ్ఱెదండల నిన్ను మిఱ్ఱుగా పూజించ 

భూరిగా యత్నించి పోరలేను 

తే.గీ.

చర్మవస్త్రము లర్పించు మర్మమెఱుగ 

భక్తి తోడుత నినుగొల్తు పాడిదప్ప 

దిక్కులంబరముగ దాల్చిన దేవదేవ! 

భుజగభూషణ నిరతమ్ము బ్రోవుమయ్య! 


ఉ. 

శీతలమావహించు పెనుచీకటివేళల కార్తికమ్మునన్ 

భూతలవాసులన్ మిగుల పోరుకు పొమ్మను రీతి వార్ధులన్ 

మూతులు ముక్కులన్ ముడిచి పోయి మునుంగు మనంగ న్యాయమే? 

నీ తలపోత చాటున ననేకము లుండు గదయ్య శంకరా! 

*~శ్రీశర్మద*

ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


(ఎడమభుజంపై ఉత్తరీయం వేసుకుని పూజచేయాలి)ఇపుడు చదవండి..


* ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు .


సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజా చేయాలి. సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే పూజామందిరంలోకి వెళ్ళడం ఇంక అంతకన్నా అన్యాయమైన విషయం ఏం ఉంటుంది? ఇంక దానిమీద వ్యాఖ్యానం చేయడం అనవసరం. కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చేయాలి.


 పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. వినాయక వ్రతంలాంటిది చేసినప్పుడు. వస్త్రధారణా నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం.


ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే  ఉండాలి పురుషుడికి. 


చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే. కళ్యాణం చేసుకోవడానికి వెళ్తే ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పక్కరలేదు. మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు.


యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు. 

ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి. 


మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు. ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి.


‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. 


దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో. ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు.


పరమమంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె


కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణయందు అటువంటి నియమము ఉన్నది. అదేం పెద్ద విశేషమా? అదేం బ్రహ్మవిద్యేం కాదు. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.

కాఫీ తాగావా

 కాఫీ తాగావా?


పరమాచార్య స్వామివారు కేరళలోని కొల్లక్కోడులో మకాం చేస్తున్న సమయం. అక్కడ స్వామివారు ఒక పండితులతో ఒక వేదసభను ఏర్పాటు చేశారు. ఆ సభకు విష్ణుపురం నుండి ఒక వేద పండితుణ్ణి కూడా ఆహ్వానించారు.


పరమాచార్య స్వామివారి ఆదేశం మేరకు శ్రీమఠంలో కాఫీను నిషేధించారు. అది ఆరోగ్యానికి హానికరమే కాక పూజకట్టులో మడికి పనికిరాదని నిషేధించారు. మహాస్వామివారు సేవకులతో సహా ప్రతి ఒక్కరికి కాఫీను త్యజించాలని ఆజ్ఞాపించారు. కాని కాఫీ అలవాటు బాగా ఉన్నవారికి, ఉదయాన్నే కాఫీ పడకపోతే, వారికి ఏదో కోల్పోయినట్టు ఉంటుంది.


కాఫీ లభించకపోవడంతో ఆ విష్ణుపురం పండితునికి కూడా అలాంటి స్థితియే కలిగింది ఆరోజు. ఒక వ్యక్తి వచ్చి వారిని బయటకు పిలుచుకుని వెళ్ళారు. ఎందుకు పిలిచాడో తెలియక బయటకు వెళ్ళిన ఆ పండితునికి, ఆ వ్యక్తి త్రాగడానికి కాఫీ ఇవ్వడంతో చాలా ఆనందపడ్డాడు ఆ పండితుడు.


కొద్దిసేపటి తరువాత వేదసభ మొదలయ్యింది. పరమాచార్య స్వామివారు సభకు వచ్చి వెంటనే ఆ పండితుని వద్దకు వెళ్లి నవ్వుతూ, “కాఫీ తాగారా?” అని అడిగారు. ఆ పండితుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎవరికీ తెలయుదులే అనుకుంటే, ఈ విషయం పరమాచార్య స్వామివారికి తెలిసిపోయిందని ఆ పండితుడు భయపడ్డాడు.


తప్పు చేశాననే భావనతో భయపడుతూ “ఎవరో ఇచ్చారు పెరియవ” అని బదులిచ్చాడు.


“నేనే నీకు ఇమ్మని చెప్పాను” అని చెప్పారు స్వామివారు. ఈ మాటలు విన్న పండుతుడు ఆశ్చర్యపోయాడు. పరమాచార్య స్వామివారు తనను ఆదరించిన విధానము, వారి కరుణను తలచుకుని పొంగిపోయాడు.


మహాస్వామి వారిని మనం సంపూర్ణ శరణాగతి చేస్తే, భక్తుల కోరిక మేరకు వాళ్ళను అనుగ్రహిస్తారు. అది మనకు సుఖశాంతులను, సౌభాగ్యాలను, ఐశ్వర్యాలను ప్రసాదిస్తుదనడంలో అతిశయోక్తి లేదు.


--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

జ్వాలాతోరణం

 ॐ         జ్వాలాతోరణం

    కార్తీకమాసంలో రాత్రి పౌర్ణమి గల సాయంత్రం (ఈరోజు) శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి..ఓ కర్రను అడ్డంగా వాటిపై పెట్టి.. ఎండుగడ్డిని తోరణంలా కడతారు. దీనిని యమద్వారం అంటారు. 

    ఈ గడ్డిపై నెయ్యిపోసి మంట వెలిగిస్తారు..

    ఆ జ్వాల కిందనుంచి శివపార్వతుల మూర్తులను పల్లకిలో మూడుసార్లు ఊరేగిస్తారు. 

1. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష. 

    కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుందని నమ్మకం. 

2. జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.

వేదాధ్యయనం

 వేదాధ్యయనం - విదేశీయానం


పరమేశ్వరుడంతటి దయాళువు, శుక మహర్షి అంతటి ఉన్నతులు అయిన మన మహాస్వామి మనందరినీ ఆదరించి ఆశీర్వదిస్తున్నారు.


1968లో కుంబకోణం శ్రీ రంగరాజచారి పరమాచార్య స్వామియొక్క పరిపూర్ణ కటాక్షంలో మునిగిపోయారు. 1971లో ఋగ్వేద అధ్యయనం పూర్తైన తరువాత, జీవనాధారం కోసం వైదిక వ్రిట్టు చేపట్టాలని భావిస్తే, అందుకు పరమాచార్య స్వామివారు తమ అంగీకారాన్ని తెలపలేదు.


“నీ వేద విద్యార్జనకు నేను తగిన ఏర్పాట్లు చేస్తాను. నీ విద్యార్జన కొనసాగించు” అని స్వామివారు తెలిపారు. ప్రతి నేలా రెండు వందల రూపాయలు రంగరాజచారి కుటుంబానికి అందేట్టు, స్వంతంగా వండుకోవడానికి కావాల్సిన సంభారాలు కూడా ఏర్పాటు చేశారు. రంగరాజచారి గారిది పెద్ద కుటుంబం. కేవలం పరమాచార్య స్వామివారి ఆశీస్సులతోనే అందరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగాయి.


మహాస్వామివారు పండరీపురంలో మకాం చేస్తున్నప్పుడు, రంగరాజచారి స్వామివారిని దర్శించుకుని సాష్టాంగం చేసి నమస్కరించారు. అప్పుడు మహాస్వామివారు, “నువ్వు నాకు సాష్టాంగం చెయ్యొచ్చా?” అని అడిగారు.


“మా సంప్రదాయం ప్రకారం, యజ్ఞోపవీతము, శిఖ లేని సన్యాసిని చూస్తే స్నానం చెయ్యాలి” అని రంగరాజచారి బదులిచ్చాడు.


“అలా అయితే, మరి నా ముందర ఎందుకు సాష్టాంగం చేశావు?”


“ఈ స్వరూపము విష్ణు స్వరూపమే అని నాకు అనిపించింది” అని భక్తితో బదులిచ్చాడు. ఈ శీవైష్ణవ భక్తశిఖామణి జీవితంలో పరమాచార్య స్వామి అనుగ్రహంతో ఒక అద్భుతం జరిగింది. రంగరాజచారిది పేద కుటుంబం. వారి ఆదాయంతో సభ్యులందరినీ చూసుకోవడం కూడా వీలు కాని పరిస్థితి. ఆడపిల్లల పెళ్ళిళ్ళకు డబ్బు కూడా అవసరం. ఇటువంటి స్థితిలో వారికి ఒక మంచి అవకాశం వచ్చింది. 1978లో వేద విద్యాభ్యాసం ముగియగానే, వారిని జర్మని రమ్మని కొందరు ఆహ్వానించారు. అంతటి కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న సమయంలో జర్మని అవకాశాన్ని, నేలకు మూడువేల రూపాయల సంపాదనని ఎలా కాదనగలరు. ఈ డబ్బుతో పాటు మూడేళ్ళ తరువాత మూడు లక్షల రూపాయలు అందుతుంది. కనుక రంగరాజచారి ఈ అవకాశాన్ని ఒప్పుకోవడంలో ఆశ్చర్యం ఏమి లేదు.


ఈ అవకాశాన్ని ఇచ్చినతనికి అన్ని ఏర్పాట్లు చూసుకోమని చెప్పాడు. ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయాడు. అదే సంవత్సరం అక్టోబరు 31న బోంబే నుండి బయలుదేరడానికి నిర్ణయించుకున్నాడు. ఇంత జరిగినా ఈ విషయాలేవీ ఇతరులకు తెలియనివ్వలేదు. అక్టోబరు 27న తన తండ్రికి విషయం తెలపడానికి గ్రామానికి వెళ్ళాడు.


“పరమాచార్య స్వామివారి అనుమతి తీసుకున్నావా?” అని అడిగారు అతని నాన్న. “లేదు, నాకు తెలిసి వారు అనుమతి ఇవ్వరు. స్వామివారు అనుమతించకపోతే, ఇంత డబ్బులు వచ్చే ఈ ప్రతిపాదనని నేను కాదనలేను. వెళ్ళడానికి నేనే నిర్ణయించుకున్నాను. మనకు డబ్బు అవసరం చాలా ఉంది. నాకు ఇంకొక మార్గం కనపడడం లేదు” అని చెప్పాడు.


ఆరాత్రికి తన ఊళ్లోనే ఉండిపోయాడు. రాత్రి మూడు గంటలప్పుడు, నిద్ర రాక మంచంపై అటు ఇటు దొర్లుతున్నాడు. అప్పుడు కళ్ళముందు మహాస్వామివారు ఉన్నట్టుగా లీలగా కనపడుతోంది. దగ్గరకు వచ్చి తనని తాకినట్టుగా తనకు అనుభూతి కలిగింది. తన తల్లి అడిగినట్టుగానే, “వెళ్ళడానికే నిర్నయించుకున్నావా?” అని అడిగినట్టు అనిపించింది. అది కలో, నిజమో అర్థం కావడంలేదు. ఆలస్యం చేయకుండా మరుసటిరోజే పరమాచార్య స్వామివద్దకు వెళ్లి అనుమతి పొందాలని భావించాడు.


అప్పుడు పరమాచార్య స్వామివారు కర్ణాటక రాష్ట్రం, బాదామి దగ్గరలోని బనశంకరి అనే చోట మకాం చేస్తున్నారు. అక్కడకు చేరుకోగానే స్వామివారి దర్శనానికి ముందు, స్నానం చేస్తున్నాడు. అప్పుడు పరమాచార్య స్వామివారి సహాయకులొకరు వచ్చి, “వచ్చి దర్శనం చేసుకోమని పరమాచార్య ఆదేశించారు” అని చెప్పాడు.


తను వస్తున్న విషయం కాని, వచ్చిన కారణం కాని ఎవరికీ తెలియదు. కాని మహాస్వామివారు కబురుచేయడంతో ఆశ్చర్యపోయాడు. అదే ఆశ్చర్యంతో వెళ్లి స్వామివారి ముందు నిలబడ్డాడు.


“ఎప్పుడు బయలుదేరుతున్నావు?” అని అడిగారు స్వామివారు.


“స్వామివారు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు” అని బడులిచ్చాడు స్వామివారు తన తిరుగు ప్రయాణం గురించి అడుగుతున్నరేమో అనుకుని.


“నీవున్నచోటికి తెరిగివెళ్ళే విషయం గురించి నేను అడగడం లేదు. విదేశాలకు వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నావు కదా! దాని గురించి ఎప్పుడు అని అడుగుతున్నా”


ఆ మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. ఇంకా ఆ విస్మయం నుండి తేరుకునే లోపే, పరమాచార్య స్వామివారు ఇంకొక విషయం తెలిపారు.


“నువ్వు ఇక్కడకు రావడానికి కారణమేంటో చెప్పనా? మొన్న నేను వచ్చి నిన్ను అడిగాను, “వెళ్ళడానికే నిశ్చయించుకున్నావా?” అని. అందుకే వెళ్లబోయేముందు ఇక్కడకు వచ్చావు. అంతేనా?” అని అన్నారు.


ఆరోజు జరిగినది కల కాదని, నిజంగా స్వామివారే వచ్చి ఆశీర్వదించారని తెలుసుకున్న తరువాత రంగరాజచారి భావోద్వేగానికి గురయ్యాడు. 


“నీ మంచి నడతను కొనసాగించు . . . డబ్బు అవసరం లేదు . . . మంచి నడవడిక ముఖ్యం” అని చెప్పి, తమ దివ్య పాదచారణాలను ఆ భక్తుని తలపై ఉంచి కరుణతో ఆశీర్వదించారు.


ఇది అద్భుతం కదా! ఒక సాంప్రదాయస్తుణ్ణి విదేశాలకు వెళ్ళకుండా ఆపారు స్వామివారు. ధర్మం యొక్క సాకార రూపమైన మన స్వామివారు తన భక్తులను ధర్మ మార్గంలో పయనించడానికి అనుకూలంగా అనుగ్రహాన్ని ప్రసరిస్తారు.


--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం