20, ఫిబ్రవరి 2023, సోమవారం

మార్కండేయుని వృత్తాంతము

 🌴🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴

          _*సోమవారం*_

    _*ఫిబ్రవరి 20, 2023*_


       _*మాఘ పురాణం*_

     _*30 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉 


*మార్కండేయుని వృత్తాంతము*


🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️


వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము , మృకండుని జననము , కాశివిశ్వనాధుని దర్శనము ,  విశ్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట  మొదలగు వృత్తాంతములను వివరించి *"మహారాజా ! ఇక మార్కండేయుని గురించి వివరింతును , శ్రద్దగా ఆలకింపుమని యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాస్త్రములు, వేదాంత పురాణేతిహాసములు , స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను. అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండేయునకు "కుమారా ! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ , పెద్దలయెడ , బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన , నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధగును"* అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినవి. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన , భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి , మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు , మునీశ్వరులు , గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరుకు నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా , ఆయన మార్కండేయుని వారించినారు , అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా ! మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా ! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా ? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను.


అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. *'చిరంజీవివై వర్ధిల్లు'* మని దీవించినందున వారి వాక్కులసత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా ? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి , వశిష్టులు కొంతసేపాలోచించి *"మునిసత్తములారా ! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు"* అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ *'చిరంజీవిగా జీవించు నాయనా'* అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొంత తడవడి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి *"పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక"* యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి *"ఓ మునులారా ! మీరు పోయిరండు ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు"* అని పలికి వత్సా మర్కండేయా ! నీవు కాశీ క్షేత్రమునకు పోయి , విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని ధైర్యము చెప్పి పంపి వేసెను.


మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి , *'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ'* నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక , కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి. విశ్వేస్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనేయుండసాగెను.


క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధిలో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి , ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా , నాతడు భయపడి , శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి , మార్కండేయుని రక్షించెను.


యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాదిదేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి , కోపముచల్లార్చుకో మహేశా ! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా ! అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని , ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన , మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులదగ్గరికి రావలదు సుమా ! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి , తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.


_*ముప్పయ్యవ అధ్యాయము సమాప్తం*_

    🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

మృగశృంగుని కథ*

 🌴🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴

           _*ఆదివారం*_

    _ *ఫిబ్రవరి 19, 2023*_


       _*మాఘ పురాణం*_

     _*29 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉 


*మృగశృంగుని కథ*


🕉️🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️


వశిష్ట మహర్షి దిలీపునితో నిట్లనెను. దిలీపమహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమ ముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయవలెనని తల్లిదండ్రుల అనుమతి నొంది  ఇంటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభమగునాటికి అతడు కావేరి తీరమును చేరెను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలెనని తలచెను. అతడచట కావేరీనదిలో ప్రతి దినము స్నానము చేయుచు మూడు సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవలెనను సంకల్పము  కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయనారంభించెను. కుత్సుని పుత్రుడగుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణ మూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను. మృగశృంగుడు శ్రీహరిని జూచి ఆనందపరవశుడై పెక్కు రీతుల స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చియిట్లనెను. *"నాయనా ! నీవు అనేక పర్యాయములు మాఘమాస స్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును , నా ప్రేమను సాధించితివి. నీయీ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరమును కోరుకొమ్మనెను".* మృగశృంగుడును *"స్వామీ ! నీ దివ్యదర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను , ఇట్టి నీయనుగ్రహము పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగుటలేదు. కావున యీ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చు చుండవలయునని కోరెను".* శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనకంగీకరించి అంతర్థానము నందెను.


కౌత్సుడు ఇంటికి తిరిగివచ్చెను. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమును అంగీకరించెను. అనుకూలతకల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగ పాటించి , ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములు నాల్గిటిని సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలయునని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి.


భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండెను. వానికొక  కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల , ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు , గుణవంతురాలు. కౌత్సుడామెను వివాహము చేసికొనవలయునని తలచెను. సుశీల యొకనాడు తన ఇద్దరు స్నేహితురాండ్రతో కలిసి నదీస్నానమునకు బయలు దేరినది. ఆ సమయమున మదించిన అడవియేనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల , ఆమె మిత్రురాండ్రును బెదిరిపారిపోవుచు గట్టులేని నేల బారునూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణవార్తను విని దుఃఖించెను , చనిపోయిన ముగ్గురిని బ్రదికింపవలయునని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పెను. సమీపమున నున్న నదిలోస్నానము చేసి ధ్యానమగ్నుడై యుండెను. మదించిన ఆ యేనుగు వానికెదురుగ నిలిచి వానిని కొంతసేపుచూచెను. తటాలున వానియెదుట తలవంచి వానిని తోండముతో తన మీదకు యెక్కించుకొన్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటిని చల్లెను. రెండు చేతులతో దానిని స్పృశించెను. వెంటనే ఆ యేనుగు తన రూపమును విడిచి దివ్యరూపమునందెను. శాప విమోచనమును కల్గించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు బోయెను.


కౌత్సుడును చనిపోయినవారిని బ్రతికింపవలయునని మరల నదిలో మునిగి యమధర్మరాజు నుద్దేశించి తపము చేయసాగెను, యముడును వానికి ప్రత్యక్షమయ్యెను. వరము నిత్తును కోరుకొమ్మనెను. మృగశృంగుడును(కౌత్సుడు) యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన ముగ్గురు కన్యలను బ్రతికింపుమని కోరెను. యముడును వాని పరోపకార బుద్దికి మెచ్చుకొనెను అడిగిన వరమునిచ్చి యంతర్థానము చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపముచేతను , యముని దయవలన , సుశీల ఆమె ఇద్దరు మిత్రురాండ్రు బ్రతికిరి. వారిని జూచి అందరును ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగువారు నిద్రనుండి లేచినట్లుగ లేచికూర్చుండిరి. వారు యమలోకమున జూచిన విశేషములను యిట్లు చెప్పిరి. జీవిచేసిన పాపముననుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసినవారు కఠినముగ శిక్షింపబడుదురు. పాపము చేసిన వాడు యెఱ్ఱగాకాలిన ఇనుపస్తంభమును కౌగిలించు కొనవలయును. మరుగుచున్న నూనెలో , పాపముచేసిన వానిని పడవేయుదురు. తలక్రిందుగ వ్రేలాడదీసి క్రిందమంటలను పెట్టుదురు. ఎఱ్ఱగా కాల్చి వానితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి.


వారు చెప్పిన మాటలకు మిగిలిన వారందరును భయపడిరి. అప్పుడు సుశీల మున్నగువారు భయపడకుడు. మాఘమాసస్నానము చేసి , ఇష్టదైవమును పూజించి , యధాశక్తి దానము , జపము మున్నగునవి చేయుట యొక్కటే సర్వ సులభమైన ఉపాయము మాఘస్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవులకు శుభలాభములు ఆనందం వచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్టమహర్షిని దిలీపుడు గురువర్యా ! భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత ? చనిపొయిన వారు మరల బ్రతుకుటకు వీలగునా యని ప్రశ్నించెను. అప్పుడు వశిష్టమహర్షి నాయనా ! భక్తికి పుణ్యమునకు సాధ్యముకానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘస్నానమును , సుశీల మున్నగువారు అనేకమార్లు చేయుటవలన వారు సంపాదించిన పుణ్యము , కౌత్సుడు చేసిన తపఃప్రభావము వారిని యీ విధముగా కాపాడినది సమాధానము చెప్పి నాయనా ఇట్టిదే మరొక్క విషయము కలదు వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు. మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములగు కార్యములనెన్నిటినో చేసినవాడు.


యముడొకనాడు తన భటులను చూచి పుష్కరుని తీసుకొని రండని పలుకగా యమభటులు పుష్కరుని తీసికొని వచ్చిరి. యముడు తీసికొని రమ్మన్నది ఇతనిని కాదు పుష్కరుడను పేరు గల మరియొకనిని భటులు పాపాత్ముడగు పుష్కరుని తీసికొని వచ్చుటకు బదులు పొరబాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకొనివచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరబాటునకు భటులను మందలించెను. క్షమింపుడని పుష్కరుని ప్రార్థించెను. పుష్కరుని భూలోకమున దించి రండని భటులకు ఆజ్ఞనిచ్చెను. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను. యముడందులకంగీకరించెను. భయంకరములగు శిక్షలననుభవించువారిని చూచి ఇతడు భయపడెను. భయముపోవుటకై హరినామ భజనమును చేసెను. ఇట్టి భజనమును వినుటచే పాపాత్ములపాపములు తగ్గి వారి శిక్షలును తగ్గసాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞావంతుడయ్యెను. దిలీపా ! యమ లోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకను యెందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను.


*☘️మృగశృంగుని వివాహములు☘️*


వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల నిట్లనెను. మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రజ్ఞుడై దేశాటనము చేసెను , మాఘమాసస్నానములు తపము చేసి శ్రీహరియనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగువారిని యముని అనుగ్రహము నంది బ్రదికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహము చేయవలయునని వాని తల్లిదండ్రులు తలచిరి. మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదునని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషముతో నంగీకరించిరి. శుభముహూర్తమున సుశీలామృగశృంగులకు వివాహము మహావైభవముగ జరుప నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాండ్రులిద్దరును మృగశృంగుని చేరి తమ ఇద్దరిని కూడ ఆ ముహూర్థముననే వివాహము చేసికొనవలసినదిగ కోరిరి. మృగశృంగుడు అంగీకరింపలేదు. వారు పురుషుడు యెక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్దము , ధర్మవిరుద్దము కాదు దశరధునకు భార్యలు ముగ్గురు లేరా ? శ్రీకృష్ణునకుయెనిమిది మంది పట్టపు రాణులు లేరా ? ఆది దేవుడైన పరమేశ్వరునకు గౌరీ , గంగ ఇద్దరు లేరా ? వారికి లేని అభ్యంతరము నీకెందులకు ? అని వాదించిరి. ప్రాణదానము చేసినవానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశమునిమ్మని నిర్భందపరచిరి. పెద్దలును వారి అభిప్రాయమునే బలపరచిరి. చివరకు మృగశృంగుడు సుశీలతో బాటు వారిద్దరిని వివాహమాడెను.


కథను వినుచున్న దిలీపుడు మహర్షీ వివాహమెన్ని విధములో వివరింపుడని కోరెను. అప్పుడు వశిష్టుడు *బ్రాహ్మణకన్యను అలంకరించి వరునకిచ్చి చేయు వివాహము బ్రహ్మవివాహము , యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగానుండుటకై కన్యనిచ్చి చేయు వివాహమును దైవ వివాహమందురు. పెండ్లికుమారుని నుండి గోవులను తీసికొని కన్యనిచ్చి చేయువివాహమును ఆర్ష వివాహమందురు. ధర్మము కొరకు కలసియుండునని  చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహమని పేరు. ధనమును తీసికొని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసురరమని పేరు , ఒకరినొకరు ప్రేమించుకొని తమంతతాముగా చేసికొను వివాహమును గాంధర్వమని యందురు. బలవంతముగ కన్యనెత్తుకొని పోయి చేసికొను వివాహము రాక్షస వివాహము మోసగించి చేసికొను వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను.* గృహస్థ ధర్మములను పతివ్రతా లక్షణములను దిలీపుడు కోరగా వారికి వాటిని గూడ వివరించెను.


దిలీపుడు కోరగా వశిష్టుడు మరల నిట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు నలుగురు భార్యలతో గలసి సుఖముగనుండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్ననలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కలవానికి మృకండుడని పేరు పెట్టెను. మృకండుడును బంధువుల కానందమును కలిగించుచు సద్గుణశాలియై పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను. మృకండుడును శ్రద్ధాసక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికి ఇష్టుడై అందరిలోను అన్నిటమిన్నయై విద్యలన్నిటిని నేర్చెను , మృగశృంగుడు ఉత్తమలక్షణములు కల మరుద్వతియను కన్యతో వానికి వివాహము కావించెను.


మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలును పుత్రులను కనిరి వారును మృకండుని వలె విద్యలనుగ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాసస్నానములను మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. దానములను మానవ యధాశక్తిగ చేయుచుండెను. తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను. మాఘమాస స్నాన మహిమ వలన సర్వసౌఖ్యములను , సర్వలాభములను పొందెను , మనుమలను గూడ పొందెను. ఈ విధముగనున్న తన వృద్ధికి సంతృప్తినంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమునందెను. ఇక , అతని జ్యేష్ఠకుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజునకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే పరివార భారమంతయు మోపి గృహమునందు యే అశాంతియు లేకుండ చూచుచుండెను. అయిననూ ఒక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలకాలము గడిచిననూ సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు యీ విధముగా తలపోసెను. *"కాశీ మహా పుణ్యక్షేత్రము , సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక , మనస్సునందలి కోరికలు నెరవేరును, అనేకమంది కాశీ విశ్వనాధుని దర్శనము చేసికొని , వారి అభీష్టములను పొందగలిగిరి గాన నేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణసన్నద్ధుడై బయలదేరును. మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారినుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతికష్టము మీద తప్పించుకొని , కుటుంబసహితముగా కాశీక్షేత్రము చేరినాడు.


కాశీపట్టణము నానుకొని పవిత్రగంగానది తన విశాలబాహువులను చాచి , ప్రశాంతముగా ప్రవహించు చున్నది. మృకండుడు  పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాదికవిధులు నెరవేర్చుకొని , విశ్వనాధుని మందిరమునకు వెళ్ళెను. ఆలయావలలోనికి రాగానే మృకండునకు యెక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెననియు , తాను కైలాసమందున్నట్లును తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్దలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి , ఒక లింగమును ప్రతిష్టించి , దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దాని కెదురుగా తన భార్యపేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా ఒక సంవత్సరము వరకును విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనెంచెను. ఒక దినము మృకండుని మువ్వురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. మృకండుడు చాల దుఃఖించెను. విధిని యెవ్వరూ తప్పించలేరు గదా ! అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును దీర్చుకున్నాడు. మృకండుడు యెంతకాలమునకునూ సంతానము కలుగనందుననే కాశీక్షేత్రము వచ్చినాడు గదా ! సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాధుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి , ప్రమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు. *"మహామునీ ! మీ భక్తికి యెంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సుమమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంగ భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చి నారము. కాన మీ యభీష్టమెరిగినపుడు"* డని పలికెను. అంత మృకండుడు నమస్కరించి *"తండ్రి ! మహాదేవా ! తల్లి అన్నపూర్ణా  ! ఇవే మా నమస్కృతులు , లోకరక్షకా ! మీదయవలన నాకు సులక్షణవతి , సౌందర్యవతి , సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖసంసారము అనుభవించుచున్నాము. కాని యెంతకాలమైననూ మాకు సంతానము కలుగనందున కృంగి కృశించుచున్నాము. సంతానము లేనివారికి నుత్తమగతులు లేవు గదా ! కావున మాకు పుత్రసంతానము ప్రసాదింప వేడుకొనుచున్నాను"* అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకండుని దీనాలాపము లాలకించిన త్రినేత్రుడు *"మునిసత్తమా ! నీ యభీష్టము నెరవేరగలదు. కానీ ఒక నియమమున్నది. బ్రతికియున్నంతవరకు వైధవ్యముతో నుండు పుత్రిక కావలయునా ? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా ?"*

అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలోపడవలసి వచ్చెను. కొంత తడబడి *"హే శశిధరా ! నన్ను పరీక్షింప నెంచితివా ? నాకు జ్ఞానోదయమయినది మొదలు నేటివరకును మీ ధ్యానమునే పలుకుచు సేవించుచున్న నాకు యేమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమే ప్రసాధింపుమని"* అడిగెను. *"అటులనే అగునుగాక !"* అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రహము వలన మృకండుని భార్యయగు మరుద్వతి ఒక శుభ ముహూర్తమున పుత్రుని గనెను. మృకండూనకు పుత్ర సంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడావచ్చి ఆ బిడ్డకు జాతకర్మవేసి వెడలెను. ఓ దిలీపమహారాజా ! పరమపూజ్యుడును , ఋషిసత్తముడునూ యగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి , వారి దయకు పాత్రుడయి పుణ్యమును బడసిన యీ పుత్రుడే పరమ భాగతోత్తముడగు మార్కండేయుడు.


_*ఇరవైతొమ్మిదవ అధ్యాయము సమాప్తం*_

    🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

అమ్మల కథ

 *ఒక కథ!* 


*Amma Katha*


కొన్ని నెలల క్రితం, కొత్తగా ఒక పనిమనిషి చేరింది, నాకు పనిమనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు, మీకందరికి అర్థం కావటానికి ఇలా రాశా, ఇక ఈ వ్యాసంలో ఈ పదాన్ని ఊయోగించను. ఆవిడ పేరు.......


మూడు నాలుగు రోజుల తరువాత అడిగా.. 

అమ్మా! ఎక్కడ మీ ఇల్లు, ఎంత మంది పిల్లలు అని.

ముగ్గురు అమ్మాయిలు అండి, 


పెళ్లిళ్లు అయ్యాయా, లేదండి ఇంకా చదువుకుంటున్నారు. 


O.K, ఏం చదువు కుంటున్నారు అని క్యాజువల్ గా అడిగా, పెద్ద అమ్మాయి M.Sc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తోంది, 

ఆ అంటూ నోరు తెరిచా, 


రెండో అమ్మాయి M.Sc Computers మొదటి సంవత్సరం, 


మూడో అమ్మాయి ఎంబీబీస్ రెండో సంవత్సరం. 


ఆ అని నోరు వెళ్ల బెట్టా. నర్సింగా అన్నా, 

కాదు సార్ M.B.B.S అంది. 


నాకు అర్థం కావటం లేదు, ఈవిడ ఏమంటోంది, 

ఏం మాట్లాడుతోంది. ఈవిడకు ఏం మాట్లాడుతోందో అర్థం అవుతోందా? 


మళ్ళీ అడిగా, అవే సమాధానాలు, 


M.B.B.S ఫ్రీ సీటా అని అడిగా, అవును సార్, 

ఫ్రీ సీట్ యే, 

అదేదో బిల్డింగ్ ఫీజ్ అంటా, దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి.


ఏ స్కూలులో చదువుకున్నారు అమ్మా మీ పిల్లలు అని అడిగా?


ఇక్కడే, మన ఊరి బడి లొనే 10 వ తరగతి వరకు. 


లాంగ్ టర్మ్ గట్రా వెళ్లిందా ఎంబీబీస్ అమ్మాయి అని అడిగా, ఏం లేదయ్యా, మన ఊరి కాలేజ్ యే, నాకు ఈ చదువుల గోల ఏం తెలీదయ్యా, ఇప్పుడు ఇప్పుడే కాస్త నోరు తిరుగుతోంది. 


ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు అని అడిగా,

రెండులో మానేశానయ్యా, నాకు కూడికలు, తీసి వేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకు రావటానికి.


మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా,


ఆయనా అందరి లాగే, ఇంటి విషయాలు ఏం పట్టవు. 


ఆయన త్రాగుతాడు, 

100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడు ఇప్పుడు కొంచం మారుతున్నడు, పాప డాక్టర్ కోర్స్ లో చేరిన తరువాత.


మా పెద్ద అమ్మాయిని ఏడో తరగతిలో చదువు మానిపించేసా, కానీ వాళ్ల టీచర్ ఇంటికి వచ్చి, నన్ను మందలించి, మంచి తెలివి గల అమ్మాయి, చక్కగా చదువు కొంటోంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థం అయ్యింది నాకు, నా పిల్లలు తెలివి గల వాళ్ళు అని, నా పిల్లల చదువులు ఆగ కూడదు అని ఇంకో రెండు ఇల్లులు ఎక్కువ ఒప్పుకోవటం మొదలు పెట్టా. 


ఇంట్లో సరిగ్గా కరెంట్ కూడా ఉండేది కాదు, మూడు మూడు నెలలు బిల్ కట్టలేక పోయే దాన్ని, పిల్లలు ఆలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు. 


ఇప్పుడు కాస్త పర్వాలేదు, పెద్ద అమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కిందా మీదా పడుతున్నాను అంది. 


నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ,

భర్త త్రాగుబోతు, ఇంతగా కష్టపడి పిల్లలను ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా. 


లక్షలు, లక్షలు ఫీజులు పోస్తుంటే నాపిల్లలు అస్సలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా. 


అంతే, నాకు అర్జంట్ గా వీళ్ళ ముగ్గురు పిల్లలని కలవాలి అనిపించింది.

నేను మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేయ్యాలి అని అడిగా, అలా మా పిల్లలను చూపించినట్లు ఉంటుంది అన్నా. 


నేను ఆడిగినట్లే, ముగ్గురిని తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది ........ 


ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమంది. ఎంతగానో బ్రతిమాలితే గాని, కుర్చీలపై కూర్చో లేదు. 


ఆమె నేల పైనే. నాకు అలవాటే సారూ అంది, 


నా పిల్లలు నాలా మిగిలి పోకూడదు అనే ఈ నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు, అంది కళ్ళ నీళ్లతో..... 


నేను కాదు, వీళ్లు కాదు, 

నువ్వూ ... గొప్ప దానివి అన్నా. 


మొదటి పది నిమిషాలు ముగ్గరు ముడుచుకు కూర్చున్నారు, తరువాత కొంచం కొంచం మాట్లాడ్డం మొదలు పెట్టారు. 

తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకొంది, ఎంతో కొంత స్కాలర్షిప్ లు రావటం, అవి సహాయ పడ్డం. నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు.


వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా. 

ఏం కావాలి అని అడిగా, 

ఎంత అనుకువగా ఉన్నారో, అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగినా, ఆహా వద్దు అనే సమాధానం. 


నేను, నా అర్ధాంగి అడగంగా, అడగంగా, ఒక Two వీలర్ ఇప్పించండి, ముగ్గరము కలిసి ఊయోగించు కుంటాం, మీకు నెల నెలా ఇస్తాం, మేము లోన్లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. Two వీలర్ ఉంటే, కాస్త సౌలభ్యoగా ఉంటుంది, సగం డబ్బులు ఆటోలకు అయి పోతున్నాయి, మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు, దొరికే స్టాప్ వరకు నడచి అలిసిపోవటం, సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి. Two వీలర్ ఉంటే అలిసిపోము, మిగిలిన సమయాన్ని చదువు కునేందుకు ఉపయోగించు కుంటాము అన్నారు. 


Two వీలర్ ఇప్పించా డబ్బులు కట్టి, 


ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు, ఒక పది వేలు ఉంచుకోండి అని అన్నా వినకుండా. 


పెద్ద అమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తరువాత తన కాలేజ్ కు వెళ్లి పోతుంది. మళ్ళీ ఇద్దరని పికప్.

పెద్ద అమ్మాయి J.L పోస్టులకు సన్నద్ధం అవుతోంది. రెండో అమ్మాయి Software ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని.


చెప్పటం మరిచా ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్. ప్రతి రోజు రెండు గంటలు.

 

ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో, మనకు తెలియని ఈ తల్లి లాంటి యోధురాళ్లు ఎందరో..


ఒకసారి ఆమె తో అన్నా, ఇంకో రెండు సంవత్సరాలు కష్టం మీకు, తరువాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని, 


ఏం సారూ నన్ను పనిలో నుంచి తీసేయ్యాలి అనుకుంటున్నారా, నా ఒంట్లో శక్తి ఉన్నoత వరకు నేను నా పని మానను.


ఆమెను అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని, 


లేదు అన్నది, పిల్లలకు ఉంది, అయినా వీళ్లు తమ చదువులు అయిపోయి, పెళ్లిళ్లు చేసుకొని వెళ్లి పోతే తను నేనే కదండి, కోపాలు, తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడి పోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం.


ఒక సారి పెద్ద అమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురుంచి గొప్పగా చెబుతుంటాడు, అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టం అని......


ఎందరో అమ్మల నిజమైన కథ..!!!


🌼🌺🏵️🌻🌸🥀💐🌹🌷🏵️🌺


అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే మాటకు .


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*యువ న్యూస్*

కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి. కనీసం చదువు కున్న వాళ్లకు అర్థం అవుతుంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

సుభాషితమ్

  *శుభోదయమ్ - సుభాషితమ్*


 𝕝𝕝 *శ్లో* 𝕝𝕝 *మరణం మంగళం యత్ర*

*విభూతిశ్చ విభూషణం|*

*కౌశేయం  యత్ర కౌపీనం*

*సా కాశీ కేన మీయతే ||*


*తా𝕝𝕝 ఎక్కడ మరణం మంగళప్రదమైనదో,విభూతియే అలంకారమై ప్రకాశించుచున్నదో,* *కాషాయవస్త్రం కౌపీనమగుచున్నదో అట్టి* *కాశీపుణ్యక్షేత్రమును మించిన పవిత్ర క్షేత్రం మరొకటి కలదా* ??.... 


[ *ముల్లోకాల్లో కాశీ పుణ్యక్షేత్రమంతటి పవిత్రక్షేత్రం లేదని భావం* ].     


  *✍️ నిమ్మగడ్డ శ్రీధర్🙏*

: కాశీ లో నువ్వే

కాటి లో నువ్వే


శుభంలో నువ్వే

అశుభంలో నువ్వే


బ్రతుకునిచ్చేది నువ్వే

భస్మం చేసేదీ నువ్వే


కాలే చితి మంట నీ చెంతే

కార్తీక దీపమూ నీ ముందే


నీళ్ళు పోసినా సరే

పాలు పోసినా సరే


గంధం

బూడిదె

రెండూ సమానమే !


నెత్తిన గంగ

గొంతున గరళం


శిలో...

శిల్పమో

అర్థం కాదు

శివ లింగాకారం


చెంబుడు నీళ్లకే

చిన్న పిల్లాడివవుతావ్

చిటికెడు విభూతికి

చల్లబడతావ్


ఒక్క మారేడు దళంతో

మనసు నింపుకుంటావ్

చిన్న బిల్వపత్రంతో

కొలిచినంతనే కరుణిస్తావు


పరమ పావనమిది

పరమేశ్వరా...నా శంకరా !!


🙏🌹 శుభ సోమవారం శుభాాకాంక్షలు🙏 🌹

అరటి_ఆకులో_భోజనం

 #అరటి_ఆకులో_భోజనం.


అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం..మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి. 


శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు. 


వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.


ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి.


ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్), హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు.


వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడాను.


ఇన్ని రకములయిన ప్రయోజనాలు ఉండటం వలన అరటి ఆకు భోజనం అనేది ఘనమయిన భోజనాన్ని ప్రతిబింబిస్తుంది అంటారు. అంత మంచి, మన అనుకున్న వాళ్ళకి జరగాలి అని అనుకోవడం సహజం కనుక అయినవాళ్ళకి ఆకుల్లో అని వాడడం జరిగినదని నా అభిప్రాయం. 


ఇహ కన్న వాళ్ళకి కంచాలు అంటే ఇది వరకు అందరూ ఇంట్లో వాళ్ళు వెండి కంచం మధ్యలో బంగారు పువ్వు ఉన్న కంచాలలో భోజనం చేసేవారు. ఇది కూడా విషాన్ని హరిస్తుంది. అటువంటి పనిని చేసేది కేవలం మన అరటి ఆకు కనుక దానిని మనం అయిన వాళ్లకి పెడతాము. బహుశా పూర్వ కాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయుట వలెనే ఆ కాలం వాళ్ళు అంత ధృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారేమో!


అరటి ఆకులో, అడ్డాకు (విస్తరాకు) లో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసివచ్చి సాక్షాత్తు లక్ష్మి దేవి ఇంట్లో ఉంటుంది. బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్త్, వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది. జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలలో చెప్పబడింది. ఇది నిజమో లేక కల్పనో తెలియదు కాని మన ఆరటి ఆకుని మించిన ఆకు లేదు..

Latha Ravi

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏 నమస్కారం అండి

శుభోదయం

🙏 *ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏


*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్


*శ్రీ స్వామివారు*-

*అలివిగాని జబ్బుల స్పెషలిస్టు* 


 టి. రంగబాబు, కల్పాకం, తమిళనాడు ఇలా వ్రాస్తున్నారు.


 రెండు సంవత్సరముల వయస్సుగల ప్రణీత్ అనే మా కుమారుడు జామకాయ తింటుంటే చిగుళ్ళ ద్వారా రక్తము వచ్చినది. ఆసుపత్రిలో చూపిస్తే మద్రాసు చైల్డ్ ట్రస్టు ఆసుపత్రికి పొమ్మన్నారు. అక్కడ చూపిస్తే దీనికి ఎలాంటి మందూ లేదని ప్లేట్లెట్స్ మరియు రక్తము ఎక్కించడము మరియు స్టెరాయిడ్స్ మందులు వాడడం మొదలుపెట్టారు. ఆవిధముగా రెండున్నర సంవత్సరములు వాడారు.


 మందులు వాడినపుడు ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. మందులు ఆపేస్తే మరలా ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. ఎప్పుడైనా చిన్న గాయం తగిలినా ఎక్కువగా రక్తము చాలా సేపు కారేది. రక్తము అందరి గాయాలవలె గడ్డ కట్టేది కాదు. ఈ స్టెరాయిడ్స్ అనే మందులు ఎక్కువ కాలము ఎక్కువ మోతాదులో వాడినందువలన రక్తము కక్కుతున్నాడు. జలుబు చేసినా, దగ్గినా రక్తము పడుతుంది. ఆక్యుపంక్చర్, ఆయుర్వేదము మొదలగు వైద్యాలెన్నో ప్రయత్నించాము.


అట్లా నాలుగు సంవత్సరములు గడిచాయి.   ఒక లక్షా యాభైవేలు ఉండవలసిన ప్లేట్లెట్స్ సంఖ్య  అరవై వేల లోపుగానే ఉంది. ఏ వైద్యాలవల్లా నయం కావడం లేదు. 2004 జనవరిలో ముక్కునుండి ఎక్కువగా రక్తము కారుతుంది. అందువలన మద్రాస్ చైల్డ్ ట్రస్టు ఆసుపత్రికి తీసుకొని వెళితే అక్కడకు వెళ్ళిన వెంటనే 1/2 లీటరు రక్తము కక్కుకున్నాడు. వాళ్ళు వెంటనే రాత్రికి రాత్రి రక్తము మరియు ప్లేట్లెట్స్ ఎక్కించారు. ఇప్పుడు అరికాళ్ళు మంటలు.. మోకాళ్ళు వాచి నొప్పులు మొదలైనాయి. డాక్టర్లు మోకాళ్ళ నొప్పులకు (ఆర్ధాయిట్స్) ముసలివారికి వాడే మందులు వాడాలన్నారు. దానిని నేను అంగీకరించలేదు.


మా స్నేహితుడు గొలగమూడికి వెళ్ళమని చెపుతున్నా పిల్లవాడు ఉండే ఈ అపాయ పరిస్థితులలో వైద్యసౌకర్యాలు లేని గొలగమూడికి వెళ్ళేందుకు ఆరు నెలలు జాప్యం చేశాము. పిల్లవానికి ఇంకా బాధలు ఎక్కువైనాయి. కొందరు డాక్టర్ల సలహామీద మానవ శరీరములో ఉండే ప్లీహము అనే అవయవము తొలగించాని కొందరు డాక్టర్లు చెపితే విదేశీయుడైన ఒక డాక్టరు ప్లీహము తొలగించవద్దని సలహా యిచ్చాడు.


అట్టి సంకట పరిస్థితులలో మా స్నేహితుని సలహాపై 22-04-04లో బిడ్డను గొలగమూడి తీసుకువచ్చాము. గొలగమూడి వచ్చేటప్పుడు బిడ్డను చేతులమీద ఎత్తుకొని కారులో కూర్చోబెట్టుకొని గొలగమూడి వచ్చాము. మోకాళ్ళ నొప్పులు, వాపుల వలన అప్పటికి రెండు నెలలుగా మా బిడ్డ మంచములోనే ఉన్నాడు.


*గొలగమూడి రాగానే చాలా చిత్రంగా రెండు నెలలుగా నడవలేని మా బిడ్డ చక్కగా నడవగలిగాడు.* నేను, నా భార్య స్వామి వారి మందిరానికి నిత్యము 108 ప్రదక్షిణలు చేస్తూ అవధూతలీల పారాయణ చేస్తూ 3 రోజులు ఉండి ఇంటికి వెళ్ళాము. మా మిత్రుని సలహా మీద నలభై రోజులు గొలగమూడిలో ఉండాలని మే 1వ తేదిన వచ్చాము. మేము వచ్చిన 4 రోజులకు *మా పిల్లవానికి స్వామి స్వప్నములో కనిపించి నీకు రెండు నెలలకు బాగవుతుంది* అని చెప్పారు. 


నా భార్య రోజూ 108 ప్రదక్షిణలు చేస్తూ అవధూతలీల పారాయణ చేస్తూ పిల్లవాని చేత వీలైనన్ని ప్రదక్షిణలు చేయిస్తూ రెండు నెలలు గొలగమూడిలోనే ఉన్నాము. *ఇప్పుడు బిడ్డకు ఏ బాధలు లేకుండా ప్లీహము తొలగించే పరిస్థితి లేకుండా శ్రీ స్వామివారే తప్పించారు.* మోకాళ్ళ నొప్పులు కానీ, ఏ ఇతర బాధలు లేక హాయిగా స్కూలుకు పోతున్నాడు.. కృతజ్ఞతతో నెలకొకసారి వచ్చి శ్రీ స్వామి వారికి 108 ప్రదక్షిణలు చేసి పోతున్నాము.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


   భజనలో కించిత్తైనా బిడియం లేకుండా హృదయపూర్వకంగా పాల్గొంటున్నారు. ధూమపానం అలవాటు వున్నవారు అప్పుడప్పుడూ లేచి ఎంతో దూరంగా పోయి చెట్లచాటున అవసరాలు తీర్చుకొని రావటం చూచాను. ఆంధ్రులు వారినుండి లవలేశమైనా ఈ శ్రద్ధ నేర్చుకోగలిగితే నికృష్టమైన మన జీవితాలు ఎంత మధురంగా, పవిత్రంగా వుండగలవో గదా అనిపించింది. వేదిక మధ్య మహాత్ముల నడుమ కళ్ళజోడు పెట్టుకొని కూర్చున్న శ్రీ ఆనందమాయి గడ్డం క్రింద చెయ్యి పెట్టుకొని అత్యంత శ్రద్ధతో భాగవతం వింటున్నారు. 


*******************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

"ఓం సమర్థ సద్గురు శ్రీ సాయిరాధాయ నమః"

   -:శ్రీ సాయి లీలామృతం:-

శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం రచన పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మహారాజు.

     -:18 వ అధ్యాయం:-

        నాలుగవ భాగం.

    (శ్రీరామ నవమి మహోత్సవం ఉరుసు చక్కగా జరిగాయి జన సమూహం 75 వేల దాకా పెరిగింది)

      అయినా నేటి విద్యుత్ దీపాలకు అతీతంగా వెలిగే నక్షత్ర గ్రహ గోళలలాగా మహానగరాల సవ్వడి మాటనున్న అతి సామాన్యము, అపారము, అయిన ఆకాశంలో ఈ వైభవం చాటున సాయి మాత్రం మహత్తరము, అతి నిరాడంబరము అయిన జీవితాన్నే కొనసాగిస్తున్నారు.

        ఒక రామనవునికి మహానగరాల నుండి కోటీశ్వరులెన్నెన్నో మిఠాయిలు తెచ్చి అర్పించారు. కానీ సాయి నా భోజనం ఇంకా రాలేదన్నారు. కొంతసేపటికి ఆయన శ్యామతో ఈ జనంలో నెట్టుకు రాలేక ఒక ముసలి పేదరాలు రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చున్నది ,ఆమెను తీసుకురా అన్నారు. తీసుకురాగానే ఆమెతో బాబా నాకేం తెచ్చావు అన్నారు. ఆమె ముందు రోజు సాయి కోసం జొన్న రొట్టెలు చేసుకొచ్చింది. గాని మసీదులోని విలువైన నైవేద్యాలు చూచి సిగ్గుపడి ఏమి తేలేదు అన్నది. కానీ సాయి ఆయన దాచిపెట్టుకున్న మూట అడిగి తీసుకొని ఇది మన భోజనం అంటూ ఎంతో ఇష్టంగా తిన్నారు.

      గురు పూర్ణిమ:-1908 సంవత్సరంలో ఒకరోజు పండరి నుండి వచ్చిన కృష్ణాజి చావడిలో ఉన్నాడు. బాబా సేవతో ఆ ముసలయ్య ను, అనగా నూల్కర్ ను, దుని వద్ద స్తంభాన్ని పూజించుకోమని చెప్పు అని అతను చెప్పి రాగానే, మీరంతా కూడా చేసుకోరాదా! అన్నారు సాయి. దేవా మీకైతే చేస్తాం కానీ, స్తంభాన్ని ఎందుకు పూజిస్తాము. అన్నాడు శ్యామ. మొదట అంగీకరించని బాబా అతడు పట్టు పట్టిన మీదట ఒప్పుకున్నారు. ఇంతలో పంచాంగం చూస్తే నాడు గురు పూర్ణిమ!!అనగా వ్యాస పూర్ణిమ. తాత్య, దాదా ఖేల్కర్, శ్యామ, మొదలగున వారు సాయికి దోవతలిచ్చి పూజించారు. అప్పటినుండి షిరిడిలో గురుపూర్ణిమ చేసుకోవటం ఆచారమైంది. సాయి నోటి మీదగా భక్తులు చేసుకోమని చెప్పిన ఉత్సవమిదొక్కటే.!

        అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు. భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే గురువును సేవించు! అన్న భావాన్నే  సంకేతంగా సాయి చెప్పారు. గురు వెన్నడు నన్ను పూజించు అనడు. జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే! వారికి శిష్యులు ఎవరు ఉంటారు? తాను గురువునని తలచేవాడు ఆ పేరుకె తగడన్నాడురమణ మహర్షిఅలాఅనలేదు. కనుకనే సాయి సద్గురుడు. ఇంటికప్పులు మూసే ఆధారం స్తంభం. అది నేలలో దృఢంగా నాటుకొని ఉంటుంది అదే దాని బలం ఆ బలంతోనే అది ఆ భవనాశ్రయించే వారందరినీ రక్షిస్తుంది.అలానే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మ నిష్ట లో గురుభక్తిలో నాటుకొని ఉంటారు. అంటే గురు భక్తి రూపమైన ఆత్మ నిష్ఠ వలన గురువు కూడా తమ నాశ్రయించిన వారిని రక్షిస్తారు. స్తంభంలాగే గురు రూపాన్ని తగురీతిన కొలవమని సాయి భావం. అంతేకాదు సాయి శరణానందులతో తాము మసీదులోని స్తంభం కిందనున్న గుహలో చాలాకాలం తపస్సు చేసినట్లు సాయి చెప్పారు. చతుర్విధ పురుషోత్తలను శాసించుకోవడానికి సర్వజీవులకు ఆశ్రయము అవకాశము అయిన ( అనగా ద్వారకామాయి) అయిన ఈ జగత్తునే ద్వారకామాయికి ఆధారమైన మూల స్తంభమే. సకల విశ్వరూపుడైన సద్గురువు అందుకే అట్టి మహనీయుని ఇస్లాంలో కుతుబ్ అంటారు. అనగా ధర్మస్థంభమంటారు.

     ద్వారకామాయి అనే శరీరం మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న వెన్నెముక.!" అనగా మేరుదండము" అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆధ్యాత్మిక స్థితులను తనలో ఇముడుచుకున్న గురువుకది సంకేతం. నిరంతరం గురువును సేవించిన వారికి అప్రయత్నంగా ఆ మార్గం తెరుచుకొని యోగ విద్య సిద్ధిస్తుంది. సాయికి వారి గురువు వలన సిద్ధించినట్లు అదే సాయి చెప్పినది.

       గోపాల్ రావు  గుండ్ ఒకసారి శిథిలమైన మసీదును మరమ్మతు చేయించాలని రాళ్లు తెప్పించి చెక్కించాడు. ఆ తర్వాత పని నానా చందోర్కర్ కు, నేల చదును చేసి బండలు తీర్చడం కాక దీక్షిత్ కు, అప్పగించారు బాబా. మొదట శ్రీ సాయి ఎందుకు ఒప్పుకోలేదు. మహాల్సాపతి ఎలాగో ఒప్పించాడు. సాయి చావడిలో నిద్రించిన రాత్రి మసీదులో నేల బాగు చేసి, ఎత్తైన పీఠం అమర్చారు. నాటి నుండి సాయి గోనె మీద కూర్చుండడం మాని దానిపై కూర్చోనారంభించారు. 1914లో భక్తులు ఎంతో శ్రమపడి మసీదు ముంగిట బాగు చేశారు. మొదట అది చాలా చిన్నదిగా ఉండి భక్తులకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. దానిని పెద్దది చేసి పైన కనిపించాలని కాక దీక్షిత్ పని ప్రారంభించాడు. రాత్రంతా కష్టపడి భక్తులు కమ్ములు నాటారు. ఉదయాన్నే చావడి నుండి వచ్చిన సాయి అది చూచి కోపించి,ఆవేశంతో  ఇద్దరు ముగ్గురు కలిసి గాని నాటనలవి గాని ఆ కమ్మెలను ఒక్కరే పీకి పారేశారు. ఆయన ఒక చేత్తో కమ్మే పెరికేస్తూ మరొక చేత్తో సమీపంలోని తాత్య పాటిల్ గొంతు పట్టుకున్నాడు. అతని తలపాగా బలవంతన లాక్కొని దానికి నిప్పంటించి ఆ కమ్మె పాతిన గుంటలో వేశారు. కోపంతో సాయి కన్నులు ఎర్రగా అగ్ని కణాల లాగా వెలిగాయి అందరూ భయభ్రాంతులై చూస్తుండగా శ్రీ సాయి తమ జేబులో నుంచి ఒక రూపాయి నాణెం తీసి భగవ ద్వితమన్నట్లు గౌరవంతో ఆ గుంట లో వేశారు. అంతసేపు ఆయన తాత్య గొంతు విడిచిపెట్టలేదు. తాత్య భయంతో వణికిపోతున్నాడు. అతనికి ఏమి జరగనున్నదో ఎవరికి అంతు పట్టలేదు జోక్యం చేసుకోవడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. చివరకు ధైర్యం చేసి వారింప చూచిన బాగోజీని బలంగా నెట్టి అతని మీద ఇటుకలు విసిరారు.సాయి కొంతసేపటికి ఆయన శాంతించి ఒక భక్తుని దుకాణం నుండి జెర్రీ తలపగా తెప్పించి తాత్యతలకు చుట్టారు. అది చూచి భక్తుల ఆశ్చర్యపోయారు. చివరికి మసీదు మరమ్మత్తులన్నీ సక్రమంగా పూర్తయిన నాడు సాయి నీమ్ గావ్ వెళ్లారు. అక్కడి నుంచి ఆయనను భక్తుల మేళ తాళాలతో ఊరేగింపుతో పునరుద్ధరించిన మసీదుకు తీసుకొచ్చారు.  కట్టుబడి పని చేసిన వారిలో కొండాజి, గాబాజీ, తుకారాం అనే ముగ్గురు సోదరులు వడ్రంగి కుటుంబానికి చెందినవారు ప్రధాన పాత్ర వహించారు.

     18 వ అధ్యాయం సంపూర్ణం.

         'శుభం భవతు'

             🙏🙏🙏

ఆహార సేవన విధి -

 ఆహార సేవన విధి  - 


    ప్రాణుల చేత ఆహారణము చేయబడును కావున ఆహారము అనబడును . సృష్టి యందలి ప్రతి ద్రవ్యము పంచభూతముల నుండియే ఏర్పడుచుండును . ఆకాశము నుండి వాయువు , వాయువు నుండి అగ్ని , అగ్ని నుండి జలము , జలము నుండి పృథ్వి , పృథ్వి నుండి ఔషధాలు , ఔషధముల నుండి అన్నము , అన్నము నుండి మనుష్యులు మొదలగు జీవకోటి ఏర్పడినట్లుగా ఉపనిషత్తుల యందు చెప్పబడినది . అందువలనే ఈ శరీరము ఆహారం నుండి ఏర్పడినదిగాను అటులనే రోగములు కూడా మనం తినే అహితములు ( మంచివి కానట్టి ) అయిన , అధిక ప్రమాణములో భుజించుచుండు , చెడిపోయిన ఆహారసేవన వలన కలుగును అని ఆయుర్వేదం నందు చెప్పబడినది. 


         ఈ విధమైన కారణముల వలెనే మన ప్రాచీనులు మనం తినే ఆహారం మితముగా , హితముగా ఉండాలని నిర్ణయం చేశారు . ఆహారము శరీరముకు పుష్టిని , బలమును , ధారణశక్తిని , ఆయుష్షును , ఉత్సాహమును , సుఖమును , తృప్తిని ఇచ్చును . శాస్త్రవిరుద్ధముగా భుజించు ఆహారం మానవులకు వివిధ వ్యాధులను చివరికి మరణాన్ని కూడా కలుగచేయును . మానవులు రోజూ 2 సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి . ఈ నియమం బాలురకు , రోగులకు వర్తించదు .  ఉదయము మరియు సాయంత్రం సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం లోపునే ఆహారం  తీసుకోవాలి . 


        వేడిగా ఉండు , తాజాగా ఉండు ఆహారాన్ని సేవించాలి . ఆయా ఋతువులకు మరియు ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహారాన్ని సేవించాలి . ఉదాహరణకు ఉత్తర ప్రాంతం వారు గోధుమను , దక్షిణ ప్రాంతం వారు వరి ఆహారంలో భాగంగా తీసుకోవాలి . త్వరపడి ఆహారాన్ని తినరాదు . 


               భోజన ప్రారంభమున తియ్యని పదార్దాలు తరువాత పుల్లని పదార్దాలు తరువాత కారము గల పదార్ధాలను తినాలి . చివర మజ్జిగతో తినవలెను . భోజనం చివర అరటిపండు గాని ఆయా ఋతువులలో దొరుకు పండు కాని తినవలెను . ప్రతిపూటా భోజనం చేసే ముందు 5 అల్లం ముక్కలను ఉప్పు అద్దుకొని తినాలి దీనివలన ఆకలి పుట్టును మరియు రుచిని కలిగించును . 


     మనం నిత్యం వాడే ఆహారాలలో ధాన్యాలైన బియ్యం , గోధుమలలో బియ్యం పథ్యకరమైనవి అనగా తినదగినవి త్వరగా జీర్ణం అగును . గోధుమలు తేలికగా జీర్ణం అవ్వవు . 


     పప్పు ధాన్యములను శింబీ ధాన్యములు అనెదరు . పప్పులు అన్నియు బలకరములైనను తేలికగా జీర్ణం కావు . అపానవాయువును  కలుగచేయును . మలమూత్రాలను బంధించును . బాగా జీర్ణశక్తి కలిగినవారు మాత్రమే ఎక్కువుగా వాడాలి . ముద్దపప్పుగా వాడుట కంటే వానిలో దోషములు పోగొట్టుటకై దాని యందు పులుపు , పోపు వస్తువులు కలిపి పప్పుచారు మొదలగునవి చేసివాడుట మంచిది . పప్పు ధాన్యాలలో పెసర్లు అన్నిటికంటే మంచిది . 



     మరింత విలువైన సమాచారం , ఆహారం మరియు జలపాన నియమాలు , ఔషధ నియమాల గురించి సమస్త సమాచారం , సంపూర్ణముగా నేను రచించిన గ్రంథాలలో వివరించాను . 


    


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

విచార వివేకము

 *విచార వివేకము*

*స్నానము-విధానాలు..*

1. మంత్ర స్నానము

2. మృత్తికా స్నానము

3. భస్మ స్నానము

4. వాయు స్నానము

5. జల స్నానము

6. కాపిల స్నానము

7. దివ్య స్నానము

8. మానసిక స్నానము

9. ధ్యాన స్నానము

మఱియు

10. వారుణ స్నానము.


1. మంత్రోక్తముగా అభిమంత్రించిన నీటి బిందువుల సంప్రోక్షణము

2. చెదలుగా ఉండే పుట్టమన్ను లేదా గోధూళి లేదా తెల్లనిగడ్డి మొలిచిన ప్రదేశములోని మట్టిని శరీరానికి పులుముట

3. భస్మమును (పగటివేళ తడిగా, రాత్రివేళ పొడిగా) దేహమంతా అలముట

4. ప్రాణాయామముతో చేయునది

5. గంగాస్మరణతో ఇంట్లో నీటితో చేయునది

6. శరీరమును తడిబట్టతో తుడుౘుట

7. ఎండావానలు ఒకేసారి ఉండే సమయంలో వర్షములో తడియుట

8. భగవన్నామ (పుండరీకాక్షాయనమః) జపముతో చేయునది

9. పూజా/తులసీ తీర్థము ౘల్లుకొనుట

మఱియు

10. బొడ్డు లోతు నీటిలో నదియందు ముక్కు, చెవులు మూసుకుని మూడు సార్లు మునిగి తేలుట.


న్యాయ్యేన మార్గేణ స్వస్తి ప్రజాభ్యః...

చిత్తు* కు నమస్కారం

 శ్లోకం:☝️చిద్రూప ధ్యానం

*జ్ఞాతా జ్ఞానం తథా జ్ఞేయం*

  *ద్రష్టాదర్శనదృశ్యభూః ।*

*కర్తా హేతుః క్రియా యస్మాత్*

  *తస్మై జ్ఞస్యాత్మనే నమః ॥*

  - యోగవాశిష్ఠం 1.1.2


భావం: అతడే జ్ఞాని (తెలుసుకునేవాడు), జ్ఞానము  (తెలుసుకునే ప్రక్రియ) మరియు జ్ఞేయము (తెలియవలసినది). అతడే చూసేవాడు (ద్రష్ట), చూసే చర్య (దృష్టి) మరియు చూడవలసినవన్నీ (దృశ్యం). ఆయనే చేసేవాడు (కర్త), కారణం (cause) మరియు ప్రభావం (effect); కావున (త్రిపుటి) అన్నీ అయిన జ్ఞానానికి *చిత్తు* కు నమస్కారం.🙏

సోమావతి అమావాస్య*_

 _* సోమావతి అమావాస్య*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*కోటి సూర్యగ్రహణములతో సమానమైనది*


*అమావాస్య !సోమవారంతో కలిసి వచ్చినది!! బహుపుణ్యమహోదయకాలం!!*


*ఈశ్వరార్చన బహుపుణ్యప్రదం!* 


సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఈ రోజును *సోమావతి అమావాస్య* అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.


*సోమావతి కథ*


ఒకానొక ఊరిలో ఓ సాధువు ఓ వ్యాపారి ఇంటికి వస్తూ వుండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంట్లోని పెళ్లికాని ఓ కన్యను ముఖం చూసి దీవించకుండానె వెళ్లిపోయాడు. సాధువు దీవించకుండా వెళ్లడానికి కారణం తెలియక ఆ కుటుంబం.. జ్యోతిష్యుడిని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో ఆ కన్య జాతకం చూసిన జ్యోతిష్యుడు.. ఈమెకు వివాహం జరిగితే భర్త అనతి కాలంలోనే మరణిస్తాడు. ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందని చెప్పాడు. అది విని దిగ్భ్రాంతి చెందిన కుటుంబీకులకు ఆ జ్యోతిష్యుడు పరిష్కారం కూడా చెప్తాడు.


సింఘాల్ ప్రాంతంలోని ఓ చాకలి స్త్రీ వద్ద కుంకుమ అడిగి నుదుటన ధరిస్తే కన్యకు దోషం పోతుందంటాడు. ఇదే తరహాలో చాకలి స్త్రీ వద్దకు చేరుకున్న ఆ కన్య సోమావతి అమావాస్య రోజున ఆమె వద్ద కుంకుమ పొందుతుంది. ఆపై రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేసింది. ఆమె జాతక దోషం కూడా అంతటితో తొలగిపోతుంది. అందుకే సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవు.


అంతేగాకుండా పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజు సోమావతి అమావాస్య . ఈ రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి.



అమావాస్య తిథి February, 2023 

Feb 19, 4:18 pm - Feb 20, 12:35 pm

19, ఫిబ్రవరి 2023, ఆదివారం

జీవన్ముక్తుడు

 *శివం తు పూజయత్వా యో*

  *జాగర్తి చ చతుర్దశీం l*

*మాతుః పయోధర రసం*

  *న పిబేత్ స కదాచన ll*

 - స్కందపురాణం


భావం: మహిమాన్వితమైన మహాశివరాత్రి కృష్ణపక్ష చతుర్దశీ రోజున ఎవరు శివపూజ చేస్తారో, ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని ఇక పునర్జన్మంటూ ఉండదని స్కందపురాణం చెబుతున్నది.🙏

శివాలయం - విష్ణ్వాలయం - బ్రహ్మస్థానం

 *ॐ                 శరీరంలో* 

*శివాలయం - విష్ణ్వాలయం - బ్రహ్మస్థానం* 


*1. మెదడు శివాలయం. అందులోని వెలుగు శివలింగం.*

    *మెదడు అనేది మనస్సు కాదు. మెదడు అనేది మనస్సుకు స్థానము.* 


విశేషం 


    బ్రహ్మరంధ్రమున అగ్ని ప్రతిష్ఠింపబడి యుంటుంది, 

    ఈ అగ్ని అనే వెలుగు, ఒక స్తంభంలాగా సూటిగా ఉంటుంది. 

    దీనినే "శివలింగం" అంటారు. 

    మన భ్రూమధ్యానికి ఎదురుగా వెనుకవైపున ఇది బ్రహ్మరంధ్రం నుండి వ్రేలాడుతుంటుంది. 

    భ్రూమధ్యాన్నే నందియొక్క రెండు కొమ్ముల మధ్య భాగంగా చెబుతారు. 

    దీని ద్వారా, శివాలయంలో గర్భగుడిలోని శివుణ్ణిదర్శించాలి. 

    కపాలమే శివాలయం. 

    పైన చెప్పిన అగ్ని అనే వెలుగే స్తంభరూపంలో ఉండగా! దానిని శివలింగమంటారు. 

    ఇది కైలాసంలో 

  - ధ్యానంలో ఉన్న శివదర్శనానికి 

    నమూనాగా శివాలయంలో, 

  - శివలింగ దర్శనాన్ని ఏర్పాటుచేసి. 

  - మనలోని  మెదడులోని జ్ణానమనే వెలుగును తెలుపుతుంది. 


    మనలోని ఈ శివలింగం యొక్క ఆద్యంతాలు విష్ణుబ్రహ్మలు ఎఱుగరైరి అని కథ చెబుతారు. 


*  *శివుడు జ్ఞానస్వరూపుడు.* 

    *మెదడులోని ఆ జ్ఞానమనే వెలుగు,* 

    *అజ్ఞానమనే అంధకారాన్ని తొలగిస్తుంది.*

    *అర్థరాత్రి లింగోద్భవం అంతరార్థం ఇదే!* 


*2. గుండెకాయ విష్ణ్వాలయము.* 

    *గుండెకాయ హృదయము కాదు. గుండెకాయ హృదయమునకు స్థానము.* 


విశేషం 


    విష్ణువు అంతటా వ్యాపించియున్నవాడు. గుండె ద్వారా భౌతికంగా రక్తం శరీరమంతా పంపిణీ చేయబడుతూ ప్రసరింపబడుతుంది. 

    దానికి సంబంధించిన చైతన్యమే విష్ణుశక్తి. 

    స్థితికి సంబంధించి విష్ణువు 

  - పరమపదంలో ఉంటూ, నియంత్రించేదానికి నమూనాగా, 

  - ఈ లోకంలో విష్ణ్వాలయాలని ప్రతిబింబిస్తూ, 

  - మానవులలో గుండె తెలుపుతుంది. 


* *విష్ణువు సర్వవ్యాపి.* 

    *రక్తం శరీరమంతా వ్యాపించియుంది.*

    *దానికి భౌతిక కేంద్రం గుండె.*  

    *దానికి సంబంధించి చైతన్యశక్తి కేంద్రమే గుండెలోని హృదయం.* 


*3. బ్రహ్మకు ఆలయం లేదు.* 

    *ఆయన ముఖం ద్వారా వ్యక్తమవుతాడు.* 

     *చతుర్ముఖుడుగా వేదాలు ఆయన నోటిద్వారా వినిపిస్తూంటాయి.* 

     *మనకి కూడా పరా - పశ్యంతీ - మధ్యమా - వైఖరీ అని వాక్కు.* 


    భగవత్స్వరూప నిరూపణకు శబ్దం ముఖ్యమైనది. దీనినే శబ్ద బ్రహ్మ అని వేదం తెల్పుతుంది.    

    ఈ శబ్ద బ్రహ్మకి. “పరా, పశ్యంతీ, మధ్యమ, వైఖరి" అని నాలుగు ముఖాలు. 

    ఈ శబ్దం 

  - నాభి వద్ద "పరా"గా ఆరంభమై,  

  - హృదయం వద్ద "పశ్యంతీ"గా చేరి,    

  - గొంతు లో ఉండే స్వర పేటిక వద్ద "మధ్యమా"గా, 

  - నాలుక ద్వారా అక్షరాల రూపంలో "వైఖరి"గా వ్యక్తమౌతుంది. 


* *ఆలయం లేని బ్రహ్మ తన ముఖాలద్వారా వాక్కు వ్యక్తం చేయడంలోని అంతరార్థం ఇదే!* 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

చిరునవ్వును

 అలాంటి చిరునవ్వును నేనెన్నడూ చూడలేదు పార్ట్ 1


హిందూమతంలో అధికారపదవిలో వున్న ఒక మతాచార్యుణ్ణి కలుసుకోవాలన్న ఆరాటం నాకుంది. వారిని కలుసుకుని హిందువుల సనాతనదృష్టి యెలా వుంటుందో తెలుసుకోవాలి. కాని హిందూమతంలో లెక్కలేనన్ని శాఖలున్నాయి. క్రైస్తవ మతంలో వునటు దానికొక గురుపీఠమంటూ లేదు. కొంతవరకు క్రైస్తవుల గురుపీఠంలాంటివని చెప్పదగినవి అయిదు శంకరచార్య కేంద్రాలున్నాయని తెలిసింది. అవి ప్రముఖమైన ఒక హిందూ మత శాఖకు సంబంధించినవి. దాని అధిపతులు జగద్గురు శంకరాచార్యస్వామి నుండి పరంపరగా వస్తున్నవారు.


శంకరాచార్యులు ఎనిమిదో శతాబ్దంలో పుట్టిన ఒక గొప్ప మత సంస్కర్త వారు విగ్రహారాధానను ఖండించారు. సర్వదేవతల అభేదాన్ని చాటి చెప్పారు. సనాతనమైన హిందూ శాఖలకు ఒక ఐక్యరూపాన్నివ్వటం కోసం ప్రయత్నించార్. వారి తర్వాత వచ్చిన ఆచార్యులందరూ తమ వారసుల్ని తామే నియమించారు. ఈ తరంలో కంచికామకోటి పీఠాధిపతులకున్నంత ఆధ్యాత్మికమైన అధికారం మరే పీఠాధిపతికీ లేదు. వారు రెండు హిందూశాఖలను - అంతవరకూ ఒకదానితో విభేదించిన వాటిని - ఏకం చేయగలిగారు. ప్రస్తుతం దక్షిణభారతదేశంలో కనబడి ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కేవలం వారి వల్లనే కలిగింది. వారెంతో పవిత్రులనీ జ్ఞానమార్గంలో చాలా దూరం పయనించారని విన్నాను. నేను దర్శించినప్పుడు వారి మద్రాసుకు సమీపంలోనే వున్నారు.


మా సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు ప్రొఫెసర్ రాఘవన్. వారు మద్రాసు విశ్వవిద్యాలయంలో సంస్కృతశాఖాధ్యక్షులు. వారు రచించిన 'భారతీయ వారసత్వం’ అనే గ్రంథాన్ని భారతదేశాధ్యక్షుల పీఠికతో ఐక్యరాజ్యసమితికి చెందిన విద్యాసాంస్కృతిక శాఖవారు ప్రచురించారు. ఆ గ్రంథం సంస్కృత వాజ్మయానికి సంబంధించిన పరమ ప్రామాణికమైన ఆధారగ్రంథం. ఆ గ్రంథంలోని వాక్యాలను తరువాతి అధ్యాయాల్లో చాలా పర్యాయాలు ప్రమాణాలుగా ఉగ్గడించాను


రాఘవన్ ను విశ్వవిద్యాలయంలోనే మొదటిసారి కలిశాను. అప్పుడు వారు పాశ్చాత్యవేషంలో వున్నారు. తీరికలేని ఓ పెద్దమనిషి అతిథికి మర్యాద చేయటం కోసం ఎంత ఇబ్బంది పడతారో అంత ఇబ్బందీ నాకోసం పడ్డారు. రెండోసారి వారిని కలుసుకోవటం శంకరాచార్యులవారి దర్శనానికి వెళ్లేటప్పుడే. అప్పుడు వారు ధోవతిమాత్రం కట్టుకుని వున్నారు. చొక్కా వేసుకోలేదు. మద్రాసు వీధుల్లో ఎందరెందరో యాత్రికులూ, బిచ్చగాళ్లూ ధోవతి చుట్టుకునే కనబడతారు, కాని ఒక మధ్య వయస్కుడైన ప్రొఫెసర్ నడుందాకా దిగంబరంగా వుండి ఓ ఖరీదైన కార్లో మెత్తటి సౌకర్యాలమీద వాలి కూర్చున్న దృశ్యం నా కెందుకో అసాధారణమనిపించింది. “ఇలాటి వారే మా యిద్దరికి ఒక మిత్రులున్నారు. వారిమీదా మీ మీదా శంకరాచార్యులవారి ప్రభావం ఏమైనా పడిందా?” అని రాఘవన్ నడిగాను. “మాలో ఏదైనా గుణముంటే అది స్వామివారివల్ల సంక్రమించిందే. దోషాలన్నీ మావి” అన్నారు వారు. 


మద్రాసు పరిసరాల్లో ఓ వీథిమూల చీకట్లో కారాపి, చెప్పులు వదిలి క్రిందికి దిగాము. దిగంగానే ఓ మధ్య వయస్కుడైన పెద్దమనిషి మమ్మల్ని పలకరించారు. వారు మద్రాసులో ఓ ప్రచురణకర్తట, రాఘవన్ పరిచయం చేశారు. ఆ ప్రచురణకర్త "ప్రతిసాయంకాలం ఆరు నుండి పదకొండు గంటలదాకా స్వామివారిని కనుపెట్టుకుని వుంటున్నా”నని చెప్పారు.


ఆ వీథిలో దేవాలయం ప్రక్కనవున్న ఓ పాడుబడ్డ చిన్న యింట్లో అడుగుపెట్టగానే యెదురుగా మసక చీకట్లో ఓ యిరుకు వరండా కనిపించింది. దాని కడ్డంగా పురాతనమైన ఓ పల్లకీ వుంది. పల్లకీకి తెల్లరంగువేశారు. ముందూ వెనకా బోయీలు మోసేగట్టి గుంజలకు మాత్రం నల్లరంగు. ఆ వరండాలోంచి ఓ చిన్నగదిలోకి ద్వారముంది. అది జైలుగది లాంటిది. అందులో అంతకు ముందే కొందరొక చాపమీద కూర్చున్నారు. వారితో పాటు మేమూ కూర్చున్నాము.


గుసగుసలాడినట్లేదో మాట్లాడి, కొన్ని నిమిషాలయాక ఓ యువకుడు పల్లకీ దగ్గరకు వెళ్లి వంగి ఎవరితోనో ఏదో మాట్లాడాడు. ఏ ఆకారమూలేని మోపు మీద కప్పినట్లున్న యిటుక రంగు కంబళి పైకీ కిందకీ కదలి పల్లకీలోంచి స్వామివారు మెల్లగా లేచారు. లేస్తూనే కంబళి తలమీద, ఒంటినిండా కప్పుకున్నారు.


వారు పొడగరే. సన్నగా వున్నా చిక్కిపోయినట్లు లేరు. మత్తు వదలక తడబడుతూ పల్లకీ సందుగా లోపలికి వచ్చినా ముందు చాపమీద బాసికపట్టు వేసుకు కూర్చున్నారు. వెంటనే గదిలోవున్న వారందరూ బయటికి వెళ్లారు. వెళ్లినా ద్వారం పక్కనే నిలబడి అప్పుడప్పుడూ తొంగిచూస్తూ చెవులప్పగించి వింటున్నారు. మద్రాసులోని వివేకానంద కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసరొకరు మామధ్య 'దుబాసి'గా వ్యవహరించారు. ఓ అరనిమిషం సేపు స్వామివారేం మాట్లాడలేదు. ఆ అరనిమిషమూ సాయం ముఖాన్ని పరిశీలనగా గమనించాను. కఠోరమైన ఆధ్యాత్మిక సాధనమూలంగా వారి ముఖకవళికలు చాలామట్టుకు పోయి అవసరమయినవే మిగిలాయి. ఉన్నవాటిలో ప్రముఖంగా కనబడేది తెల్లని కురుచ వెంట్రుకల క్రింద ఎత్తైన అర్ధగోళంలా వున్న వారి నుదురు. రెండోది వారి కళ్లు. అవి లోతుగా మెత్తటి చీకటి నీడలు పరుస్తూ కపాలం క్రింద నుంచి గ్రుచ్చి చూస్తున్నట్లున్నాయి. వారి పెదవులు తీర్చినట్లుండి పెరిగిన గడ్డం మధ్య ఆచితూచి మాట్లాడే ప్రతి మాటకూ దృఢంగా భావబంధురంగా కదలుతున్నాయి. వారు నిద్రావస్థలో నుండో సమాధిస్థితి నుండో మెల్లగా బయటకు వస్తున్నట్లనిపించింది. వారి చూపులు ఎదుటివారి మీద నిశ్చలంగా నిలిచివున్నాయి. వారు రోజుకు ఓ మూడుగంటలకన్నా ఎక్కువసేపు నిద్రపోరని విన్నాను. తన విధులకూ, కర్మకాండకూ పోను అప్పుడప్పుడూ మిగిలిన కొద్దిపాటి వేళల్లో పల్లకీలో ఓ మూల చుట్టచుట్టుకుని పడుకుంటారు. వారు నిద్రలో వున్నారో సమాధిలో వున్నారో తరచు భక్తులే చెప్పలేరు. మెల్లగా వారు నేను భారతదేశం రావటానికున్న కారణమడిగారు.


“ఈ దేశాన్ని ప్రజల్ని ఊరికే చూచి పోదామనా లేక యిక్కడి ప్రజల నేదైనా మంచిదారిలో పెడదామనా?”


అంతకుముందు వచ్చిన పుస్తకాలమీద పత్రికలవారు చేసిన వ్యాఖ్యానాలు దృష్టిలో పెట్టుకుని స్వామివారడిగిన ప్రశ్న అది. “చూడటానికీ, తెలుసుకోవటానికి మాత్రమే వచ్చాను. మరే ఉద్దేశమూ లేదు” అన్నాను. 


స్వామి : స్థిరమైన ఆసక్తికి కూడా కొంత ప్రభావం వుంటుంది. ఏమీ ప్రత్యేకంగా చెయ్యక్కర్లేదు. ఊరికే ఒక సమస్యపట్లగానీ, ఒక దేశంపట్లగానీ మన మేర్పరుచుకున్న దృక్పథానికి కూడా ఒక శక్తి, చైతన్యం వుండి తీరుతాయి. 


“అలా వుండటం నాకు బాధగా వుంది. అయినా ఏ నీడా పడకుండా మనిషి కదల్లేడుకదా” అన్నాను.


అప్పుడు స్వామివారు "సత్యమైన సానుభూతి ఒక విధమైన తేజస్సును విరజిమ్ము తుంది” అంటూ చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వు పసిబిడ్డ చిరునవ్వు. అలాటి నను నేనెన్నడూ చూడలేదు. ఆ చిరునవ్వులో అసామాన్యమైన మనోజ్ఞత వుంది. మాధుర్యముంది. వారితో మాట్లాడి తిరిగి వస్తూ దారిలో అనుకున్నాను. పాశ్చాత్య చిత్రకారులు చిత్రించిన సాధు పురుషుల ముఖాలమీద - వారు పారవశ్యంలో వున్నప్పుడుగాని, వారికి ధన్యత సిద్ధించినప్పుడుగానీ, మతంకోసం త్యాగం చేసినప్పుడుగానీ - ఆ చిరునవ్వును, ముగ్ధమోహనమైన ఆ ఎందుకు చిత్రించలేదా అని! యోగులందరూ తమ అనుభవాలు చెప్పినట్లు బహుశా ఆ చిరునవ్వుకూడా ఉలికీ, కుంచెకూ అందలేదేమో


(సశేషం)


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శివుడు

 ॐ          మహా శివరాత్రి శుభాకాంక్షలు 


               ఓమ్ నమశ్శివాయ 


శివ శబ్దం - వ్యుత్తత్తి 


1. పరమానందస్వరూపుడై, ఏ విధమైన పరిణామాన్ని పొందక ఉండేవాడు కాబట్టి శివుడు. 

    "శామ్యతి పరమానందరూపత్వాత్ నిర్వికారో భవతి ఇతి శివః" 

2. ఇతనియందు సత్పురుషుల మనస్సులు ఉంటాయి కాబట్టి శివుడు అని అర్థం. 

    "శేరతే సజ్జనమనాంసి అస్మిన్ ఇతి శివః" 

3. సాధుపురుషుల మనస్సులందు శయనించి యుండేవాడు కాబట్టి శివుడు అని పేరు. 

    "శేతే సజ్జనమనస్సు ఇతి శివః" 

4. శివం అంటే శుభం. శుభంతో కూడినవాడు శివుడు. 

    "శివం కల్యాణం తద్యోగాత్ శివః" 

5. శుభాలు ఇచ్చేవాడు కాబట్టి శివుడు. 

    "శివప్రదత్వాత్ శివః" 


శంకరుని - పంచముఖాలూ - పంచాక్షరి - పంచభూతాలు 


1. పృథ్వి (భూమి): 

    భూమి ఉదకముల నుండి ఉత్పన్నమైంది. 

    కటకట శబ్దాన్ని, కఠిన స్పర్శనీ, లవణాది రసములనూ, గంధ గుణాన్నీ కలిగి, 

    ఇచ్ఛాశక్తిని, సృష్టికృత్యాన్నీ, 

  "సద్యోజాత" ముఖాన్నీ, నివృత్తి కళనూ, చతురస్రాకారాన్నీ, 

   "న" కారబీజమున నొప్పుచు, 

    బ్రహ్మమును అధిష్ఠానంగా కలిగియున్నది. 


ఓం   సద్యో జాతం ప్రపద్యామి

        సద్యో జాతాయ వై నమో     

        నమః 

        భవే భవే నాతి భవే

        భవస్వమాం భవోద్భవాయ

        నమః 


2. జలం (ఆపః) 

    జలావిర్భావం అగ్ని నుండి జరిగింది. 

    ఆది బుడబుడ అనే ధ్వనిని, శీతస్పర్శనీ, శ్వేతవర్ణాన్నీ, మధుర రసాన్నీ, జ్ఞానశక్తినీ, స్థితకృత్యాన్నీ, 

   "వామదేవ" ముఖాన్నీ, ప్రతిష్ఠాకళనూ, 

   "మ"కార బీజాన్ని, అర్థచంద్రాకృతిని కలిగి, 

    విష్ణువును అధిదేవతగా భాసిస్తుంది. 


ఓం  వామదేవాయ నమో

        జ్యేష్ఠాయ నమః 

        శ్రేష్ఠాయ నమో

        రుద్రాయ నమః

        కాలాయ నమః 

        కలవికరణాయ నమో

        బలవికరణాయ నమో 

        బలాయ నమో 

        బలప్రమధనాయ నమ

        స్సర్వ భూతదమనాయ నమో

        మనోన్మనాయ నమః 


3. అగ్ని: 

    అగ్ని వాయువు నుండి పుట్టింది. 

    బుగబుగమనే శబ్దాన్నీ, ఉష్ణగుణాన్నీ, క్రియాశక్తినీ, సంహారకృత్యాన్నీ, విద్యాకళనూ, 

   "అఘోర" ముఖాన్నీ కలిగి, 

   "శి"కార బీజాన్నీ, ఎరుపు రంగునీ, త్రికోణాన్నీ కలిగి. 

    రుద్రుని అధిష్ఠాతగానొంది ఒప్పారుతోంది. 


ఓం. అఘోరేభ్యోఽథఘోరేభ్యో

       ఘోర ఘోరతరేభ్యః 

       సర్వేభ్యః సర్వశర్వేభ్యో

       నమస్తే అస్తు రుద్రరూపేభ్యః 


4. వాయువు: 

    వాయువు ఆకాశంనుండి గలగల శబ్దాన్నీ అనుష్ణశీత స్పర్శలను రెండు గుణాలతో ఆవిర్భవించింది. 

    వాయువు (గాలి) ఆదిశక్తిని, తిరోధానకృత్యాన్నీ, 

   "తత్పురుష" ముఖాన్నీ, 

    షట్కోణాకృతినీ, రూపంలేని స్పర్శగుణాన్నీ, శాంతికళనీ, ఆకుపచ్చని రంగునీ, 

   "వ"కార బీజాన్ని కలిగి 

    ఈశ్వరుని అధిష్ఠాతగా ఒప్పుచున్నది. 


ఓం తత్పురుషాయ విద్మహే

       మహాదేవాయ ధీమహి 

       తన్నో రుద్రః ప్రచోదయాత్ 


5. ఆకాశం: 

    ఈ ఆకాశం పరాశక్తియును, అనుగ్రహకృత్యమును, 

   "ఈశాన" ముఖాన్నీ, శాంత్యతీత కళనూ, గుండ్రని రూపాన్నీ, పసుపు వర్ణాన్నీ కలిగి 

   "య"కార బీజముతో ఒప్పుచూ సదాశివుని అధిదేవతగా కలిగి ఉంటుంది. 


ఓం. ఈశాన స్సర్వ 

       విద్యానామీశ్వర

       సర్వభూతానాం

       బ్రహ్మాధిపతి 

       ర్బ్రహ్మణోధిపతిర్

       బ్రహ్మ శివోమే అస్తు

       సదాశివోం 


                          =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

ఒక అనుమానం

 తాతా..తాతా...ఒక అనుమానం..అడగనా?


అడుగురా చంటీ... ఆడిగితేనే కదా అనుమానం తీరేది..


ఏం లేదు తాతా రోజూ నువ్వు కుళాయి నీళ్లతో స్నానం చేస్తున్నావ్ కదా! మరి ఆ చేస్తున్నప్పుడు నువ్వు ' ॥ ఓం గంగైచ యమునై చైవ - కృష్ణా గోదావరీ సరస్వతి నర్మదా సింధు కావేరీ - జలేస్మిన్ సన్నిధిం కురు॥ అని ఎందుకు చదువుతావు ? నువ్వేమి గంగ నీటి తోనో గోదావరి నీటి తోనో స్నానం చెయ్యడం లేదు కదా?


మంచి ప్రశ్న వేశావు. సరే జవాబు విను.


మన పూర్వీకులు ఏ పని చేసినా ఒక ఆశావహ దృక్పధం అంటే పాజిటివ్ ఆలోచనతో చేస్తే ఆ పని ఫలితం కూడా పాజిటివ్ గా వుండే అవకాశం మెరుగుపడుతుంది అని తెలుసుకొని మన రోజూ వారీ జీవనవిధానంలో కూడా అలా పాజిటివ్ గా ఆలోచించే విధంగా కార్యక్రమాలులో లేదా అలవాట్లులో చొప్పించారు. 

మీ మామ్మ చూడు..

బియ్యం అయిపోయాయి అని చెప్పదు. నిండుకున్నాయి అని అంటుంది.

అలాగే దీపం ఆరిపోయింది అనదు, ఘనం అయింది లేదా దీపం కొండెక్కింది అంటుంది

నల్ల పూసల గొలుసు లేదా మంగళ సూత్రం తెగితే.. గొలుసు పెరిగింది అంటుంది. కానీ తెగింది అని అనదు.

ఇలా ప్రతీదీ పాజిటివ్ గానే చెపుతుంది తప్ప నెగటివ్ గా చెప్పదు.


ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న తీసుకుంటే..

మనకి గంగ యమునా గోదావరి వంటి నదులను పవిత్రంగా భావిస్తాం వాటిని దైవాలుగా కూడా కొలుస్తాం వాటి నీరు వాడుక కూడా ఆరోగ్యంగా భావిస్తాం. కానీ అన్ని ప్రదేశాల్లో ఆ పవిత్ర నదులు ఉండవు కదా! అందుకే అసలు నీటికే గంగమ్మ అని పేరు పెట్టేసుకున్నాం. అలాగే నీటితో జీవితాలు పెనవేసుకున్న బెస్తవారిని గంగపుత్రులు అంటాం. అంటే గంగ వంటి పవిత్ర నదులు మన జీవితాల్లో ఎంతగా పెనవేసుకున్నాయో చూశావు కదా! 


నేను కుళాయి నీళ్ల తోనో, చేరువులోనో, యేటి నీళ్ల తోనో స్నానం చేస్తున్నప్పుడు కూడా ఈ శ్లోకం పఠించో లేక ఒక దండం పెట్టో ఆ నీటిని పవిత్ర గంగజాలంగా భావించి స్నానం చేస్తున్నాను అన్న మాట. అలా భావించడం వల్ల మనం మానసికంగా ఒక పాజిటివ్ థాట్ ని శరీరానికి ఇస్తున్నాం. అంటే ఈ నీరు పవిత్ర గంగాజలంతో సమానం. నా ఆరోగ్యానికి హాని కలుగకుండు గాక అని.


అంటే అలా అనేసుకుంటే అవి నిజంగా గంగ, గోదావరి నీళ్ళు అయిపోతాయా తాతా అని నువ్వు అడగవచ్చు.. దీనికి నేను ఉదాహరణ చెపుతాను.


మా చిన్నప్పుడు రైల్లో వెళుతున్నప్పుడు తాగడానికి నీరు ఇలా మినరల్ వాటర్ బాటిల్స్ లో దొరికేది కాదు..ప్లాట్ ఫామ్స్ మీద కుండలతో ఆ తరువాత కుళాయిలు ఆ తరువాత కూలర్స్ లో అందించేవారు. అదే నీరు భయపడకుండా తాగేవారం. ఇప్పుడు (చేతిలో కాస్త డబ్బు ఉంటే) ఆ నీరు తాగడానికి భయపడుతున్నాం. అందుకని ₹20 పెట్టి ఒక లీటర్ నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. మరి ఆ సీసాలో దొరికే నీళ్లు నువ్వు ప్రతీ సారీ టెస్ట్ చేసి తాగవు కదా! ఆ సీసా మూత సీల్ సరిగ్గా ఉంటే ఏ అనుమానం లేకుండా తాగేస్తున్నావ్. మరి ఆ కంపనీ వాడు ఆ సీసాల్లో ఏ బోర్ నీళ్ళో, చెరువు నీళ్ళో పోసి ఉండచ్చు కదా! అలాగే ఈ మధ్య వింటున్నాం ప్లేట్ ఫార్మ్ మీద దొరికే ఆ ఖాళీ బాటిల్స్ లో సాధారణ కుళాయి నీరు పోసి దొంగ సీల్ వేసి ట్రైన్స్ లో అమ్ముతున్నారు అని. అయినా మనం అనుమానం పడకుండా తగుతున్నాం. అంటే దానికి కారణం ఆ సీసా మీద ఉన్న బ్రాండ్ పేరు. అంటే ఆ నీటికి కంపనీ వాడు ఒక బ్రాండింగ్ చేసాడు. నిజంగా టెస్ట్ చేయకపోయినా ఆ పేరు చూసే మనం ఆ నీటి క్వాలిటీ నమ్ముతున్నాం. అంటే మనసుకి ఒక ధైర్య వచనం చెపుతున్నాం. నేను తాగుతున్న నీరు ఫలానా కంపెనీ స్వచ్ఛమైన నీరు. ఈ నీరు తాగినా నాకు అనారోగ్యం రాదు అని. ఒక వేళ ప్రయాణంలో కానీ ప్రయాణం అయ్యాక గాని సుస్తీ చేసినా ఈ నీటి వల్ల అని అనుమానించం.

అంటే అక్కడ నువ్వు ప్రతీసారీ టెస్ట్ చేయకపోయినా నమ్ముతున్నావ్. అంటే ఇక్కడ ఆ బ్రాండింగ్ నీకు ఒక పాజిటివ్ ఆలోచనని ఇస్తోంది అన్నమాట.


అంటే ఈ శ్లోకం చదవడం ద్వారా లేదా ఒక నమస్కారం పెట్టడం ద్వారా ఆ సాధారణ నీటికి మనం మానసికంగా బ్రాండింగ్ చేస్తున్నాం అన్న మాట

       *SO BE POSITIVE*. 

*


🙏🙏🙏