14, ఆగస్టు 2022, ఆదివారం

హిందువులు

 *🚩🕉హిందువులు అల్పసంఖ్యాకులే!!🕉🚩*


*సామవేదం షణ్ముఖశర్మ*

...............


    *భారతదేశంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కానీ మరో కోణంలో అల్ప సంఖ్యాకులు. మనం మైనారిటీ అనుకుంటున్న వారే అధికసంఖ్యాకులనడం సత్యదూరం కాదు.        ఒక్కసారి పరిశీలిస్తే ఈ వాస్తవాన్ని అంగీకరించుదాం.* *హిందువులు పేరుకి ఎక్కువ సంఖ్యలో ఉన్నా, అందులో కొందరు కేటాయింపుల కోసం హిందువులుగా చెలామణి అవుతూ, ఇతరుల మతాల్లోకి మారిన వారు.*


        *మరికొందరు - ఇందులో ఉన్నా ఈ మతం పట్ల శ్రద్ధ, హిందువులుగా జీవించాలనే ఆసక్తి, ఈ మతాన్ని కాపాడుకోవాలనే భక్తి ఏ మాత్రం లేనివారు. ఏదో పండక్కో, పబ్బానికో, పురుటికో, చావుకో కాసింత హిందూ పద్దతి అవలంబిస్తారు. మొక్కులు తీర్చుకోడానికి గుళ్ళోకి వెళతారు. అంతేకానీ హైందవ ధర్మానికీ, ఆలయాలకీ ప్రమాదం వాటిల్లుతున్నా స్పందించరు. నాయకులు వివక్ష చూపిస్తున్నా చలించరు. పైగా ‘ఏ మతమైతే ఏం పోయింది?’ అని ఉదాసీనంగా ఉంటారు.*


        *ఇంకొందరు - నాస్తికులై హిందూ గ్రంథాలను, దైవాలను, సంప్రదాయాలను, ఆలయాలను దుయ్యపడుతుంటారు. పుస్తకాలు రాస్తుంటారు.*


        *ఇలా హిందువుల్లో మూడు రకాల వారిని మినహాయిస్తే - శ్రద్ధగా ధర్మాన్ని అవలంబిస్తున్నవారు అల్ప సంఖ్యాకులే.       నిజమైన హిందువులు వీరే.  దీనికి వ్యతిరేకంగా-ఇతర మతాల్లో వారు నూటికి నూరు పాళ్ళు ఒకే రకంగా ఉంటారు. కుటుంబా లన్నీ తమ మతాన్ని మించిన మతం లేదనే తీవ్ర అభినివేశంలో ఉంటారు. తమ మత గ్రంథాలపై, శ్రద్ధా కేంద్రాలపై, అలవాట్లపై వ్యతిరేకంగా మాట్లాడరు. ఇతర మతాలను అణచివేయడంలో, దూషించడంలో వెనుకాడనంత ఉగ్రాభిమానం కూడా ఉంటుంది.* *పిల్లా, పెద్దా, ఆడా, మగా ఖచ్చితంగా మత పద్దతులు అధ్యయనం చేస్తారు, అవలంబిస్తారు. తమ మత నాయకుడు అవినీతిపరుడైనా, హింసా స్వభావి అయినా కిమ్మనరు. పైగా ఒకే తాటిపై నిలబడి అతడిని విజయుడ్ని చేస్తారు. తమ మతాల పేరున తీవ్రవాదం ఉగ్రవాదాలతో ఉత్పాతాలు సృష్టిస్తున్న సంస్థల్ని కూడా పల్లెత్తు మాట అనరు.*


        *ఇలా అన్య మతాలు రెండూ చక్కని అనుష్ఠాన నిష్ఠతో ఉంటారు. వారిలో రెండో రకం లేదు. అందుకే వాళ్ళు సంఖ్యలోనూ, అనుష్ఠానంలోనూ, దృఢంగా ఉంటారు. వాళ్ళిద్దరి అభిలాష, తమ మతం ఈ దేశాన్ని ఏలాలి. వాళ్ళ లక్ష్యం హిందూమతం అణచివేయబడాలి.*


        *వీరి తపన ఆ దిశగా కృషి చేయడమే.   వీరిలో ఉన్న ఈ ఏకతాటి లక్షణాన్ని గమనించిన హిందూ(పుట్టుకతో) నాయకులు కూడా వీళ్ళని మురిపిస్తూ, మెప్పిస్తూ, బుజ్జగిస్తూ, జాతి సంపద పంచిపెడుతుంటారు. వాళ్ళ పండుగల్లో వెళ్ళి వాళ్ళ వేషాలు వేసుకొని విందులారగిస్తుంటారు. కానీ ఆ మతాలకి చెందిన ఒక్క నాయకుడు కూడా హిందూ పండగల్లో కనపడరు. వీలైతే ఆంక్షలు పెట్టేలా గొడవలు చేస్తారు.*


        *ఈ హిందూ నాయకులకు తెలుసు. నాలుగు రకాల హిందువుల్లో మళ్ళీ ‘మా కులం వాడే రావాలి - కావాలి’ అనే గోల చేసే నలభై రకాలున్నారని. వీరు ఏనాడూ హిందువులను సంఘటిత పరచలేరని.*


        *భారతదేశంలో గతంలో జరిగిన ఎన్నికల ఫలంగా పేట్రేగిపోయిన కొందరు క్రికెట్ లో పాకిస్థాన్ గేలిస్తే దౌర్జన్యంగా ఆకుపచ్చ జండాలతో దాడులు చేసి ‘పాకిస్తాన్‍కీ జై .....’ అంటూ బిగ్గరగా నినాదాలు చేసినా - ఏ రక్షణ వ్యవస్థా, ఏ నాయకమ్మన్యుడూ నోరెత్తలేదు. చర్య తీసుకోలేదు. దేశ భద్రతకి, వ్యవస్థకీ పెనుప్రమాదం పొంచి ఉందని తెలిసినా స్పందన లేదు. మతం మారడం లేదనే అక్కసుతో కర్ణాటక రాష్ట్రంలో ఒక దేవీ మందిర ఉత్సవ సమయంలో ఆలయంలో చొరబడి ప్రసాదంలో విషం కలిపి అనేకమంది అమాయకుల మరణానికి కారకులయ్యారు.*


        *ఇటువంటివి హిందూ మనుగడకి మాత్రమే కాదు, దేశ క్షేమానికీ, శాంతి సామరస్యాలకు ప్రమాదకరమైన పరిస్థితి. అల్పసంఖ్యాకులైన హిందువులు ఏం చేయగలరు? అన్ని మతాలవారితో సహా అందరం హాయిగా ఉండాలి - అని కోరుకునే స్వభావం సహజంగా కలిగిన హిందువులు బలంగా ఉండకపోతే, ఈ దేశంలో ఉనికి కూడా అసాధ్యమౌతుంది. ఇప్పుడు, వేల ఏళ్ళ క్రితం ఉన్న  పరాయి పాలనకు భిన్నంగా ఏమీ లేదు.* *కేరళ, పశ్చిమబెంగాల్‍, కాశ్మీర్‍, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హిందువులు మనుగడ సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‍, మధ్యప్రదేశ్‍, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో నేటికీ కొన్ని ప్రాంతాలలో (అన్యుల ప్రాధాన్యం ఉన్నవి) . హిందువులు అనుక్షణం అభద్రతతో, భయాందోళన ల్లోనే బిక్కు బిక్కుమంటున్నారు.*


        *కొందరు మేధావులు గణాంక వివరాలతో సహా వాస్తవాల్ని చెబుతుంటే అవి ఫేస్‍బుక్కుల్లో, వాట్సాప్‍లలో, యూ ట్యూబ్‍లలో లైకింగ్‍లు, షేరింగ్‍లతో సరిపోతున్నాయి. సరియైన ప్రతిచర్య లేదు.*


        *ప్రధాన మాధ్యమాలన్నీ వాస్తవాల్ని కప్పిపెడుతున్నాయి. తమ కుల నాయకులకు భజనలు చేస్తూ, పల్లకీలు మోయడంతోనే కాలక్షేపం చేస్తున్నాయి.*


*గతచరిత్రలో భారతీయతపై, హిందూధర్మంపై జరిగిన అన్యుల దాడులు, దౌర్జన్యాలు గానీ, నేడు జరుగుతున్న కిరాతకాలు గానీ నేడు హిందూ యువతకి తెలియవు తేలియనీయట్లేదు సేక్యూలర్ మీడీయా ఎందుకంటే పేంచి పోషిస్తున్నది వారే కాబట్టి. కోందరూ వారు ‘నోటా’వర్గంలో ఉంటారు. బాధ్యతతో దేశ ధర్మాలను కాపాడుకునే ప్రయత్నం చేయరు. ఈ నేపథ్యంలో ఈ దేశాన్నీ, ధర్మాన్నీ పరిరక్షించమని పరమేశ్వరుని ప్రార్థించడం కన్నా ఏమి చేయగలం స్పందన లేని స్వార్ధజాతిని మేల్కొల్పమని  వేడుకోవడం కన్నా ఏమి సాధించగలం??*

తెలుగు వ్యక్తి గొప్పదనం.

 🤷‍♂️🤷‍♂️

ఓ తెలుగు వ్యక్తి గొప్పదనం.

కడప జిల్లా ప్రొద్దటూరు కు గర్వకారణం. కాని ఆయన విగ్రహం లేదు 🤷‍♀️🤷‍♀️టిప్పు సుల్తాన్ కు గౌరం ఇచ్చారు ప్రొద్దటూరు నాయకులు 🤗

గణితబ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయ శర్మ  (నవంబర్ 22, 1907 - డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. సంజీవరాయశర్మ 1907 నవంబర్ 27 న కడపజిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించాడు.


జన్మతః అంధుడు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మ గారి అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవి విని గుర్తు  పెట్టుకుని గణితంలో అపార విజ్ఞానం సాధించాడు.


తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించే వారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకొన్నారు.


శ్రీ సంజీవరాయశర్మ తొలిసారి 1928 లో గణితావధానం నిర్వహించారు.yg అప్పటినుంచి 1995వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు లలోను పలు ప్రదర్శనలను ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినపుడు ప్రధాన ఆకర్షణ శ్రీ సంజీవరాయ శర్మ గారి గణితావధానమే.

సాధారణంగా గణితావధానంలో, పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం-కాని, ఈ విషయంలో శ్రీ సంజీవరాయ శర్మకు ఒక ప్రత్యేకత ఉంది. 

ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవారు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడా చెప్పి, కొంతవరకు జాతకం కూడా చెప్పేవారు.


ఈ ప్రత్యేకతను (మానవ గణన యంత్రంగా [Human Computer] పేరొందిన శకుంతలా దేవితో సహా) మరెవరూ చూపలేక పోయారు. ఆవిధంగా, 

ఇది అనితర సాధ్యమైన ప్రత్యేకత. 1966 డిసెంబరు ఏడో తేదీ.. అది హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక 2 power 103 ఎంత? 


దానికి సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని. 

'క' నుంచి 'క్ష' వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, 'స, రి, గ, మ, ప, ద, ని'' అక్షరాల లబ్దం ఎంత? ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు... 


కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు! ఆయనేమన్నా విద్యావంతుడా?... కాదు. 


*పోనీ రెండు కళ్లూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగిన* *వారా ?... కాదు. పుట్టుగుడ్డి!* 

*పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన* *చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం* *కావలసి వచ్చింది).*

*ఆయనే గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ "అంకెల ఆకాశంలో* *అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల* *గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!"  శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు* *బహుమానంగా...* 

*మొదటి గడిలో ఒక* వడ్లగింజ,*

*రెండో గడిలో రెండు* *గింజలు,*

*మూడో గడిలో* *నాలుగు, నాలుగో* *గడిలో ఎనిమిది...* *ఇలా అరవై నాలుగు గళ్లు నింపి* *ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి* *వచ్చేటప్పటికీ.. అందరూ తలలు పట్టుకుంటారు!*


*దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధానం... *ఒక కోటి 84 లక్షల*

*46 వేల 74 కోట్ల 40 లక్షల,*

*73 వేల, 70 కోట్ల, 95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజలన్నమాట... (1,84,46,74,40,73,70,95,51,615!)*

*ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే...*


*అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల.. ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు *వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు!*


*అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు!  ఇదంతా అబ్బురమని పించవచ్చు.* *కానీ సంజీవరాయశర్మ గణితావధాన వివరణ మహిమ అదంతా!  ఒకటి, రెండు, మూడు.... ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు!*


*సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షత్రాలు, వారాలు, పక్షాలు... గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు..* *తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించిన అప్పట్నించీ 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు.* *మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు,* *హైదరాబాదుల్లోను  పలు ప్రదర్శనలు నిర్వహించారు.. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ *ప్రముఖులు*

*ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు! నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు సైతం తయారుచేశారు. అప్పటి #రాష్ట్రపతి* *డా. #రాజేంద్రప్రసాద్ శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న* సొమ్ము ఎం.ఓ చేయడం విశేషం! 

అప్పట్లో అనీబ్‌సెంట్, నెహ్రూ,*

*రాజేంద్రప్రసాద్‌లతో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు,* *పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా శర్మ గణితావధాన..* *ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేనోళ్ల కీర్తించారు.*


*శర్మ పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంధాలయాల పిలుపునందుకొని పలు *గ్రంధాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు.*

*అలాగే మేధమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు.*

*ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే* *1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేథావి ఇల్లు కదలలేక పోయారు.*


*వివిధ విశ్వవిద్యాలయాలు... ఆయన్ని సత్కరించాయి. *కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సత్కరించాయి. దురదృష్టమేమిటంటే* *1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్‌కేసును దొంగలు తస్కరించారు.*


*ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్‌మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్‌న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర *కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు.. మంచి శిక్షణ పొందారు.* 


*కానీ సంజీవరాయశర్మ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే... ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు*


*ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ''ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు.. చేసేవాళ్లం'' అని శర్మనుద్దేశించి అన్నారు.*


*శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు.** *శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే* *సంజీవరాయశర్మని రక్షించుకోలేక పోయింది. 1997 డిసెంబరు రెండోతేదీన సంజీవరాయశర్మ అస్తమించారు. 'అంక విద్యాసాగర* *విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి* *గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి" రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ* *స్వామినర్చిస్తూ గడిపారు!*


*నిజానికి... ఈ నోబెల్ బహుమతులు, మెగ్‌సెసేలు,* *జ్ఞాన్‌పీఠ్‌లు...*

*ఆయన ప్రతిభ ముందు ఎంత* *చిన్నవో!*

*సేకరణ    (చరిత్రలో  తెలుగు వాడు)*

🍎🍎🍎🍇🍇🍇☀️☀️☀️      ----------------------

ఉద్వేగం

 ఉద్వేగం తన్నుకొస్తోంది!

ఉత్సాహం అంతరిస్తోంది!

మారిన జగతి పొకడల్ని చూసి!

అంతరించిన మానవతా విలువలకు వగచి!

భారతీయతను మరిచాం!

ఆధునికత పేరుతో అన్నీ మార్చేస్తున్నాం!

కడకు వసుధనే ఏమార్చే స్థితికి

ఎదిగాం!

మనకు కావల్సింది ఎదురులేని స్వేచ్ఛ!

మనతరంగాల్లో దాగుంది!

సర్వమూ నా సొంతం కాకుంటే

పాదాక్రాంతం కావాలనే ఇచ్ఛ!

ఈ వింత ధోరణులన్నీ!

ప్రగతికి ప్రతిబంధకాలుగా మారుతున్న వేళ!

ఏ గీతా ప్రబోధం వీరిని మార్చాలి!

ఏ బైబిల్ వీరిలోని విజ్ఞానాన్ని

మేల్కొల్పాలి!

ఏ ఖురాను ఈ జనతకు సుగమ మార్గాన్ని ప్రబోధించాలి!

మత మౌఢ్యం తొలగిపోయి!

మిత వాదం పరిఢవిల్లి!

సమత మమత ల స్వర్ణయుగం!

సాకారం కావాలని!

ఆ ఆకారానికై!

ఇకనైనా, ఇపుడైనా!

పురోగమిస్తూ మనమంతా!

మానవత తో ఇమ్మహిపై!

మనమంతా పురోగమిద్దాం!

మళ్లీ భారతీయతా సంస్కృతీ

సంప్రదాయాల పరిరక్షణలో!

భారతీయ పురోభివృద్ధికి!

ఎందరో మహనీయుల,త్యాగధనుల

అడుగుజాడల్లో పయనిద్దాం!

గగన వీధుల్లో మన భారత కేతనాన్ని స్వేచ్ఛగా ఎగుర నిద్ధాం!

నిజంగా!..మనమంతా భారతమ్మ ముద్దుబిడ్డ లనీ

చాటుకుందాం!

దోస పాటి.సత్యనారాయణ మూర్తి

సామర్లకోట

9866631877

న్యస్తాక్షరి

 *** న్యస్తాక్షరి (పాదాదిగ) *** 

""""""""""""''''""'''"""'"""''"""''''""''""'" 

నం --- ద --- న --- ము.  


తే:గీ: 


నందనవనము చేసుకొనవలె బ్రతుకు  

దయయు ధైర్యము న్యాయము ధర్మగుణము 

నడతలోనున్న మనిషి ఘనముగనుండు  

ముత్యము వలె స్వఛ్ఛమగుచొ మోక్షమదియె. 




*** సమస్యా పూరణము *** 

"""""""""'''''''"""""""""""''"""""""""""" 

గుణము ముఖ్యము మనిషికి కులము కాదు. 


తే:గీ:  


భారతము భాగవతమును వ్రాసినట్టి  

వ్యాసునిది జాలరి కులము,భారతీయు 

లెల్ల గర్వించు రాజ్యాంగ మెల్ల వ్రాయు 

జ్ఞాని అంబేద్కరుడు శూద్ర జాతి రత్న  

గుణము ముఖ్యము మనిషికి కులము కాదు. 




                💐💐💐 


* యర్నాగుల వేంకట రమణా రావు *

Independence Day and Republic Day

 Many people get confused between Independence Day and Republic Day, but do you know there is also a difference in the way the flag is hoisted on 15th August and 26th January?


1) First difference:

On the occasion of 15th August — the Independence Day, the flag is pulled up by a rope from below, then it is opened and hoisted. This is done to honor the historical event of 15 August 1947. In the constitution, it is called Flag Hoisting. On the other hand, on the occasion of 26 January — Republic Day, the flag remains tied at the top, which is then opened and hoisted. In the constitution, it is called Flag Unfurling.


2) Second difference:

On August 15, the Prime Minister (who is the head of the Central Government) hoists the flag, because the Constitution of India did not come into force on the day India got independence. The President (who is the constitutional head of the nation), did not take office till then. On the other hand, on Republic Day the President addresses the nation. 26 January is celebrated to commemorate the implementation of the Constitution in the country. On this day, the constitutional head hoists or the President hoists the flag.


3) 3rd difference:

The flag hoisting is done from the Red Fort on Independence Day. At the same time, the flag is unflured on the Rajpath on Republic Day.


As we INDIANS gear up to celebrate the 75th anniversary of Independence, this information is for every INDIAN to know about FLAG HOISTING JAI HIND 🇮🇳😊👍💐

సాధకుడు - సద్గురువు

సాధకుడు - సద్గురువు 

ప్రతి సాధకుని మదిలో తొలిచేది ఏమిటంటే నాకు సద్గురువు దొరుకుతారా ఆయనను నేను ఎలా తెలుసుకోవాలి అన్నది ఒక ప్రశ్న ఎంతో మంది ముముక్షువులు తనను తరింపచేసే సద్గురువు కోసం వెతుకులాట చేస్తుంటారు. ముందుగా అసలు సాధకుడు ఎవరో తెలుసుకుందాము.  

సాధకుడంటే ఈ ద్వైత ప్రపంచాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకొని ఇక్కడ ప్రతిదీ రెండుగా వున్నది మరి దీనికి కారకుడు ఎవరు? నేను ఆ కారకుడిని తెలుసుకోవటం ఎలా అని పరితపించే ముముక్షువే సాధకుడు.  సాధకుడు తాను చూస్తున్నది ప్రతిదీ నశించేదని గ్రహించి ఇక్కడ నశించనిది, శాశ్వితమైనది ఏది అని వెతకటం మొదలిడుతాడు.  వాడు మరణాన్ని జయించటం ఎలా అని ఆలోచిస్తాడు. 

గురువు: గురువు అనగా అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞనాన్ని ప్రసాదించే వాడే గురువు.  అజ్ఞ్యానం చీకటిగా భావిస్తే జ్ఞ్యాన ప్రకాశాన్ని నిలిపే వాడే గురువు.  మనకు అనేక విషయాలను తెలియచేసే గురువులు వున్నారు.  కానీ బ్రహ్మ జ్ఞనాన్ని చెప్పే గురువే సద్గురువు.. జ్ఞ్యానం అంటే మనకు తెలియనిది తెలుసుకోవటం.  బ్రహ్మ జ్ఞ్యానం అంటే అన్నిటి కన్నా ఉత్తమమైన జ్ఞనం.  ఒక్క మాటలో చెప్పాలంటే ఏది తెలుసుకుంటే మరొకటి తెలుసుకోవలసిన పనిలేదో అదే బ్రహ్మ జ్ఞ్యానం.  అటువంటి జ్ఞనాన్ని ప్రసాదించే గురువే సద్గురువు. 

సద్గురువు లక్షణాలు: ఏ మహానుభావుడు అయితే ఈ భవసాగరాన్ని దాటి మోక్షాన్ని పొందాలనుకుంటాడో ఆయనే బ్రహ్మ జ్ఞ్యాని అటువంటి జ్ఞనే సద్గురువు . ముందుగా మనం పరిశీలిస్తే ఆ మహానుభావుడు అరిషడ్వార్గాన్ని జయించిన వాడైవుంటాడు. అనగా  కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు ఆయన వాటినుండి విముక్తి పొందినవాడై ఉంటాడు. అంటే 

1) కామ: ఆయనకు ఈ ప్రపంచంలో వేటి మీద కోరిక కలిగి ఉండడు ఏది అతనికి కావాలని ఉండదు అది స్త్రీ కానీ, ధన, వస్తు, వాహన కనకాలైన కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మహానుభావునికి తనదనేది ఏది ఉండదు, సమాజ అర్ధంలో చెప్పాలంటే పూర్తి దారిద్యపు జీవనం గడుపుతుంటాడు. నిరాడంబరగా ఉంటాడు.,

2) క్రోధ: క్రోధం అంటే కోపం ఆయన ఎల్లప్పుడూ కోపానికి లోనుకాకుండా సదా శాంత స్వభావంగా ఉంటాడు, మిత బాషి

3) మోహ: మొహం అంటే విషయ వాంఛనాలు నాకు ఇదికావాలి అది కావాలనే కోరిక అది అతనికి ఉండదు. 

4) లోభ: లోభం అంటే మన వాడుక భాషలో పిసినారితనం. అనగా తనదైన దానిని వదులుకోవటానికి ఇష్టపడని తత్త్వం.  ఆయనకు ఏమి ఉండదు కాబట్టి ఇక వదులుకోవడం అనేదే  ఆయనకు ఉండదు.

5) మద: మదం అనేది నా అంతవాడు లేడనే గర్వము, నేను గొప్పవాడిని అనే  భావం. ఆయనకు అవి వుండవు. 

6) మాత్సర్యం :మాత్సర్యం అనగా తనకున్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండటం.  అది అతని మనస్సులోకూడా రాదు.

బ్రహ్మ జ్ఞ్యాని అయినవాడు పైన పేర్కొన్న ఆరు మానసిక స్థితులను అధిగమించి కేవలము సదా బ్రహ్మ్మములోనే చరిస్తూ ఉండి తనను తాను ఉద్దరించుకుంటాడు. అటువంటి మహానుభావుడు మాత్రమే సద్గురువుగా పరిగణించబడతాడు.  ఇప్పుడు చెప్పండి మనకు ఇటువంటి గొప్పవారు తారసపడతారా ? 

నేటి గురువులు: ప్రస్తుతం సమాజంలో మనం అనేక మందిని వారికి వారే సద్గురువులం అని చెప్పుకునే వారిని చూస్తున్నాము. మిత్రమా ఒక్కసారి వారిలో పైన తెలిపిన లక్షణాలు ఉన్నాయా అని పరిశీలించు.  ఒక్కటి అంటే ఒక్కటి కూడా వారిలో వుండవు. 

ఖరీదైన కాషాయ వస్త్రాలను ధరిస్తూ, ఖరీదయిన భవనాలలో నివసిస్తూ, విలువైన ఆసనాలఫై ఆసీనులు అవుతూ ప్రవచనాలు చేస్తున్నవారు మనకు కోకొల్లలుగా కనపడతారు.  మీకు కౌపీనం (గోచి) పెట్టుకున్న యోగి ఎక్కడైనా తారసపడ్డాడా? నేను చూడలేదు, మీరు చుస్తే తెలియచేయండి.

సాధకునికి గురువు ఆవశ్యకత: నేను కొన్ని ఉపమానాలతో సాధకునికి గురువు ఎంతవరకు అవసరమో తెలియచేయ ప్రయత్నిస్తాను. 

నీవు మీ ఊరుకు బస్సులో వెళ్లాలని అనుకోని దారి ఖర్చులకు తగు డబ్బులు సమకూర్చుకొని బస్స్టాండు చేరుకొని నీ బస్సు ఏదో తెలుసుకోలేక అక్కడ వున్న అక్కడి విషయాలు తెలిసిన ఒక వ్యక్తిని నీ ఉరుకు వెళ్లే బస్సు యెక్కడ ఆగుతుంది అని అడిగితె అతను నీకు ఫలానా ప్లాటుఫారమ్ లో దొరుకుతుంది అని చెప్పాడనుకో, ఇప్పుడు ఆతను నీకు ఏవిధంగా సహకరించాడు? కేవలం నీకు ఒక మాట సహాయం చేసాడు, గురువు కూడా అంతే. 

నీవు కారులో ఒక వూరు వెళ్లదలిచావు కొంత దూరం వెళ్లిన తరువాత రెండు రోడ్లు చీలాయి అక్కడ ఒక మార్గనిర్దేశం అంటే సైను బోర్డు కనపడినది అందులో రెండు రోడ్లు ఏ ఏ ఊర్లకు వెళతాయో తెలియపరచి వుంది దానిని అనుసరించి నీవు నీ గమ్యాన్ని  నిర్ధారించుకుంటావు. ఆ బోర్డు నీకు ఎలా ఉపయోగ పడింది? గురువు కూడా అలానే సహాయపడగలడు 

నీవు వెళ్లే మార్గంలో ఒక మురికి కాలువ అడ్డం వచ్చింది దానిని దాటటం ఎలా అని నీవు అనుకుంటుంటే అక్కడ ఒక వ్యక్తి దూరంలో వున్న ఒక రాయిని చూపి అది ఆ కాలువలో వేసి దానిమీద కాలు పెట్టి బురజ అంటకుండా దాటామని సలహా ఇచ్చాడు.  అలాగే నీవు ఆ కాలువను దాటావు .  ఇక్కడ మురికి కాలువ అనేది సంసారం అనేది. దానిని దాటాలి అని అనుకోవటం నీ ప్రయతనం. అక్కడ వేసిన రాయి నీవు చేయవలసిన సాధన ఆ రాయిని చూపినవాడు నీ గురువు. 

గురువు కేవలం నీవు ఎలా సాధన చేయాలో మార్గదర్శనం చేస్తాడు.  కానీ ప్రయత్నం, సాధన కృషి అన్నీ నీవే కలిగి ఉండాలి.  నీ ప్రయత్నం లేకుండా నీకు మోక్షం సిద్దించదు.  ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమిమీద నివసించే ఎవ్వరు కూడా నీకు మోక్షాన్ని ఇవ్వలేరు.  కేవలం సద్గురువు నీకు పైన తెలిపినట్లు మార్గదర్శనం చేయగలరు. 

గురువును వదిలి వేయాలి: ఓ సాధక మిత్రమా నీకు గురుత్వం వహించిన గురువును కేవలం కొద్దికాలం మాత్రమే సంబంధం కలిగి తరువాత గురువుని వదిలి వేయాలి.  కేవలం సాధనతోటె మోక్షాన్ని పొందాలి.  అంటే నీకు గురువుతో ఇప్పుడు  పనిలేదు. ఎలాగైతే పై సందర్భంలో రాయిని చూపిన వాడిని, అలాగే రాయిని వదిలి నీ మార్గంలో వెళ్ళావో అదే విధంగా గురువుని గురువు చూపిన సాధనను  వదలాలి. అంటే ఎప్పుడైతే నీవు సమాధి స్థితిని పొందుతావో అప్పుడు నీకు గురువు నేర్పిన ధ్యానం తో పనివుండదు. 

సమాజంలో ఈ రోజుల్లో అనేకమంది ధన సంపాదన అభిలాషులు నేనే గురువుని ఈ పద్దతి నేనే కనుక్కున్నాను అని పేర్కొంటూ వారి శిష్యగణాలను వృద్ధి చేసుకుంటూ వారి వద్దనుండి ధనాన్ని  సేకరిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొందరు గురువులు తాము నేర్పిన విద్య (యోగ పద్దతి) వేరే ఎవ్వరికీ చెప్పరాదని ప్రమాణం చేయించుకొని వారి శిష్యుల వద్ద ఎక్కువ మొత్తంలో ద్రవ్యాన్ని వసులు చేస్తున్నారు. అమాయకులైన ఆ శిష్యులు వారి గురువు గారి గొప్పతనాన్ని వారు నేర్చుకున్న యోగాన్ని ప్రచారం చేస్తూ గురువుగారి వ్యాపారాభివృద్ధి చేస్తున్నారు.  భార్గవ శర్మ అలాంటి ఒక శిష్యుడిని తమరు నేర్చుకున్న యోగం ఏమిటని ప్రశ్నించాడు.  తాము సుదర్శన క్రియ అనే యోగసాధన గురువుగారి వద్దనుండి నేర్చుకున్నామని.  దానిని ఎవ్వరికీ చెప్పకూడదని ప్రమాణం చేశామని చెప్పి మీరు అందులో చేరండి బాగుంటుంది అని సలహా ఇచ్చాడు.  మిత్రమా తెలిసిన విద్య పలువురికి చెప్పటానికి పనికిరానప్పుడు విద్య అభ్యసించటం ఎందుకు అంటే సమాధానం లేదు.   ఇక కొందరు వారి గురువు ఫోటోని పెన్నులకు పెట్టుకొని మేడలో వేసుకొని ప్రచారం చేస్తున్నారు.  అలాటి వారు తమ గురువుకి శిష్యులను చేర్చటమే తమ జీవిత పరమావధి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. 

బ్రహ్మకుమారి యోగ సంఘంలో పరిచయం అయిన ఒక మిత్రుడు భార్గవ శర్మతో నా వద్ద అమ్మా భగవాన్ పాసు ఒకటి వున్నది నాకు వెళ్ళటం కుదరటం లేదు దాని ఖరీదు ఐదు వేలు నేను మీకు ఉచితంగా ఇస్తాను మీరు ఆధ్యాత్మికత వైపు పయనిస్తున్నారు కదా మీరు వెళ్ళండి అని అనటం జరిగింది.  దానికి ఆయన మిత్రమా భగవంతుడు నిరాకారుడు అతడు ఈ జగత్తుకి కారకుడు అటువంటి భగవంతుని మనం సాధన చేసి తెలుసుకోవాలి కానీ నేనే దేముడు అని ప్రగల్బాలు పలికే వారిచుట్టూ తిరిగితే ఏమి లాభం ఉండదు.  మీరు ఇచ్చే పాసుతో పాటు ఇంకొక ఐదు వేలు దారిఖర్చులకు ఇచ్చినా నేను వెళ్ళాను.  మీరు కూడా అటువంటి ప్రలోభాలకు లోను కావద్దని చెప్పాడు 

కాకుండా సాధక మిత్రమా నీవే ఆలోచించు నీ గమ్యం మోక్షమా లేక గురువుల ప్రచారామా?  ఇలా తమ గురువులని ప్రచారం చేసే వారు సారా తాగుతున్నానని మెడలో కాళీ సీసాలు వేసుకొనే మూర్ఖులకన్నా అధములు. ఇటువంటి గురువులు మురికి కాలువ దాటించామని చెప్పుకొంటూ మురికి కాలువలో (సంసార బంధనాలలో) జలకాలాడుతూ నిన్నుకూడా ఆ మురికి కాలువలో నిర్బంధిస్తున్నట్లు తెలుసుకో. మిత్రమా నీ సాధన సిద్దించిన తరువాత నీ గురువుని విస్మరించి ముందుకు పో 

ఇటీవల ఒక మిత్రుడు తాను ఒక గురువును నమ్ముతున్నానని అయన చాలా మహిమాన్వితుడని అయన కొన్ని యోగ పద్ధతులు కనుకొన్నారని నాకు తెలిపితే అది విన్న తరువాత తట్టిన భావాలతో ఈ వ్యాసం. 

గమనిక: దయచేసి సాధక మిత్రులారా గమనించ గలరు, శ్రీ పరమేశ్వరుడు, శ్రీ కృష్ణ భగవానులు పతంజలి మహర్షి, ఆది శంకరాచార్యులు ఇంకా ఉపనిషత్తులలో పేర్కొనిన మహర్షులు మనకు మార్గదర్శకులు.  వారు చెప్పిందే కొందరు తెలుసుకొని అది వారి ప్రతిభ అన్నట్లు చెపుతూ అమాయక సాధకులను తప్పుత్రోవ పట్టిస్తున్నారు.  కాబట్టి మోసపోకండి.  మీకు నిజంగా మోక్ష ప్రాప్తి కావాలంటే నా దగ్గరకు (ఇక్కడ "నా" అంటే ఎవరి వద్దకు వారు అని అర్ధం) రండి మీకు తప్పకుండ మోక్షం సిద్ధిస్తుంది.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతిశాంతిహి 

మీ భార్గవ శర్మ


 

13, ఆగస్టు 2022, శనివారం

Laugh at this

 *Laugh at this* :😂😂😂🤣🤣🤣 You cannot beat the Indians


A  Doctor can't find a job in a Hospital  so he opens a clinic and puts a sign outside 'GET TREATMENT FOR $20 - IF NOT CURED GET BACK $100


A lawyer thinks this is a great opportunity to earn $100 and goes to the clinic...


*Lawyer* :  "I have lost my sense of taste"


* doctor* :  "Nurse, bring medicine from box no. 22 and put 3 drops in patient's mouth"


*Lawyer* :  "Ugh..this is kerosene"


* doctor* :  "Congrats, your sense of taste is restored. Give me $20"


The annoyed lawyer goes back after a few days to recover his money...


*Lawyer* :  "I have lost my memory. I cannot remember anything"


* doctor* :  "Nurse, bring medicine from box no. 22 and put 3 drops in his mouth"


*Lawyer (annoyed)* :  "This is kerosene. You gave this to me last time for restoring my taste"


* doctor* : "Congrats. You got your memory back. Give me $20"


The fuming lawyer pays him, and then comes back a week later determined to get back $100.


*Lawyer* :  "My eyesight has become very weak I can't see at all "


* doctor* :  "Well, I don't have any medicine for that, so take this $100"


*Lawyer (staring at the note)* : "But this is $20, not $100"


* doctor* :  "Congrats, your eyesight is restored. Give me $20"

పాట

** !!!!! 😂😂😂😂😂

కర్ణుడి చావుకి బాలీవుడ్ కి చావు

 కర్ణుడి చావుకి వేయి కారణాలు !

ఒక్క అమీర్ ఖాన్ కె కాదు మొత్తం బాలీవుడ్ కి చావు దగ్గరలో ఉంది. గత 6 ఏళ్లుగా బాలీవుడ్ సినిమా రంగం వెనకబాట పట్టడానికి ప్రధాన కారణం ఇంటర్నెట్ అంటే అతిశయోక్తి కాదు!

2014 లో రిలయన్స్ జియో విప్లవాత్మక ధరల తగ్గింపు వల్ల మొబైల్ ఇంటర్నెట్ సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చింది. 

దాంతో ఉత్తరాది ప్రజలకి దక్షిణ భారత సినిమాలని విరివిగా చూడడానికి అవకాశం దొరికింది. అందివచ్చిన అవకాశాన్ని కొంతమంది హిందీ నిర్మాతలు కూడా అందిపుచ్చుకున్నారు. ఏ మాత్రం వివక్ష లేకుండా దొరికిన కాడికి అన్ని తమిళ్,తెలుగు,కన్నడ,మలయాళ చిత్రాల హక్కులు తక్కువ ధరకి కొనడం వాటికి హిందీ సబ్ టైటిల్స్ వేసి డబ్ చేసి విడుదల చేశారు. అప్పటిదాకా ఖాన్ త్రయం నటించిన సినిమాలు వాటి తాలూకు కధ డిమాండ్ చేయకపోయినా సరే విదేశాలలో భారత సంతతి కి చెందిన వారి జీవితాలని ఖరీదయిన శైలిలో చిత్రీకరించి వదలడం చూసిన ఉత్తరాది ప్రేక్షకులకి దక్షిణా పధాన పల్లెటూరిలో జరిగే సంఘటనల మీద తీసిన సినిమాలు బాగా నచ్చాయి. ఎంతలా అంటే డబ్బింగ్ ఖర్చులు కూడా రావేమో అనుకున్న తరుణంలో కాసుల వర్షం కురిపించాయి దక్షిణాది డబ్బింగ్ సినిమాలు. 

ప్రేక్షకులు సబ్ టైటిల్స్ లేకపోయినా సరే నేరుగా దక్షిణాది చిత్రాలని చూడడం మొదలుపెట్టారు. 

ఒక్క ఉత్తర భారత దేశంలో నే దక్షిణాది సినిమాలకి విపరీత ఆదరణ దొరికింది అంటే పప్పులో కాలేసినట్లే !

పాకిస్థాన్ లో కూడా ఉర్దూ సబ్ టైటిల్స్ తో దక్షిణాది సినిమాలు ఇంటర్నెట్ లో విపరీత ఆదరణ లభించింది. ఫలితంగా ప్రకటనల రూపంలో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చింది. 

చివరకి పాకిస్థాన్ ప్రేక్షకులలో కూడా దక్షిణాది హీరోలకి విపరీతమయిన ఆదరణ లభించింది. 

నాలుగేళ్ల క్రితం పాకిస్థాన్ ప్రేక్షకులు తమ స్వంత యూట్యూబ్ ఛానెల్స్ ని ప్రారంభించి భారతీయ సినిమాల మీద మరీ ముఖ్యంగా దక్షిణాది సినిమాల మీద రివ్యూ లు చేయడం మొదలుపెట్టారు ఈ ట్రెండ్ 2017 లో మొదలయ్యి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది పాకిస్థాన్ లో. 

నిజం చెప్పాలి అంటే ఏదన్నా ఒక తెలుగు సినిమాకి సంబంధించి ట్రైలర్ కావొచ్చు లేదా టీజర్ కావొచ్చు రిలీజ్ అవగానే వెంటనే పాకిస్తానీ యూ ట్యూబ్ ఛానెల్స్ దానిమీద కూడా రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టారు. మొదట్లో కొంచెంగా చూసేవాళ్ళ సంఖ్య ఉన్నా రాను రాను అది లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఫలితంగా వాళ్ళకి యూట్యూబ్ ద్వారా నెలకి కనీసం 500 డాలర్ల ఆదాయం రావడం మొదలుపెట్టి కొందరికి ఇప్పుడు అది నెలకి రెండు వేల డాలర్ల ఆదాయం ఇచ్చేంతగా ఎదిగింది. ఆదాయం రావడం మొదలవగానే పాకిస్తానీ యూట్యూబ్ చానెల్ ని నిర్వహించే వాళ్ళు తమ రివ్యూ లలో చాలా స్పష్టంగా ఎలాంటి యాస లేకుండా తెలుగు ని తెలుగు గా , కన్నడ ని కన్నడ గా చాలా స్పష్టంగా పలకడం లో జాగ్రత్త తీసుకోవడం వలన పాకిస్థాన్ తో పాటు భారత్ లో కూడా వీళ్ళ ఛానెల్స్ కి ఆదరణ లభించింది అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 

విశేషం ఏమిటంటే మన దక్షిణాది హీరో లని మనం పెద్దగా పట్టించుకొము కానీ పాకిస్తానీ యూట్యూబర్స్ మాత్రం ఇంటర్నెట్ లో వెతికి మరీ మనకి కూడా తెలియని విషయాలని ప్రస్తావిస్తున్నారు అంటే దక్షిణ సినిమా రంగం వాళ్ళని ఎంతలా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు. 

సంస్కృతి !

పాకిస్తానీయులు కూడా దక్షిణ భారత సంస్కృతి మీద అవగాహన పెంచుకున్నారు. కానీ అదే సమయంలో బాలీవుడ్ హీరోల పాశ్చత్య సంస్కృతి మీద ఉన్న మక్కువని ద్వేషించడం మొదలుపెట్టారు. ఇది మొదట 2017 లో ఉత్తర భారత ప్రేక్షకుల నుండి మెల్లగా పాకిస్థాన్ వరకు పాకింది. ఎవరి సంస్కృతి,సాంప్రదాయాలని వాళ్ళు పాటించడం అనేది ఏ దేశానికి అయినా మామూలే కానీ బాలీవుడ్ మాత్రం భిన్నంగా కనిపించడం మొదలయ్యే సరికి అది కాస్త మరింత ద్వేషానికి కారణం అయ్యింది. దక్షిణ భారత హీరోల ఆచార,వ్యవహారాల మీద నిశితంగా దృష్టి పెట్టడం మొదలయ్యే సరికి అది క్రమేణా బాలీవుడ్ హీరోల పాలిట శాపంగా మారింది. 

సినిమా ముహూర్త సమయంలో చేసే పూజ దగ్గర దక్షిణ భారత హీరోలు చెప్పులు,బూట్లు వదిలేసి మరీ వచ్చి కొబ్బరి కాయ కొట్టడం,హారతి కళ్ళకి అద్దు కోవడం దగ్గర నుండి ఉత్తరాది ప్రేక్షకులు తేడాని చూడడం ప్రారంభించారు మెల్లగా. కొన్ని బ్లాగులలో బాగా చదువుకున్న ఆధునికమయిన జీవన శైలిని గడుపుతున్న ఉత్తరాది విద్యావంతులు దక్షిణ,ఉత్తర భారత సినీ పరిశ్రమలోని తేడాలని స్పష్టంగా వేలెత్తి చూపడం కూడా ఉత్తరాది ప్రేక్షకుల వైఖరిలో మార్పు రావడానికి కారణం అయ్యింది. 

బాహుబలి సిరీస్ రెండూ కూడా ఉత్తరాదిన అఖండ విజయం సాధించడం వెనుక ఇంటర్నెట్ ప్రధాన పాత్ర పోషించింది. గంపగుత్తగా బాలీవుడ్ సినిమాలని అక్కడి ప్రేక్షకులు నిరాకరించడం మొదలయ్యి ఇప్పటికీ 5 ఏళ్లు అవుతున్నది కానీ ప్రేక్షకుల లో వచ్చిన మార్పుని గుర్తించకపోవడం బాలీవుడ్ నిర్మాత,దర్శకులు,హీరోల వైఫల్యం ఆని అనే కంటే డబ్బు తెచ్చిన అహంకారం అనే చెప్పాల్సి ఉంటుంది. 

సత్యం తెలుసుకునే సమయం ప్రేక్షకులు ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేక పోయింది బాలీవుడ్. 

గుర్తింపు తో పాటు డబ్బుని ఇచ్చేదీ సగటు ప్రేక్షకుడు అన్న సంగతి మరిచిపోయిన బాలీవుడ్ కి అదే ప్రేక్షకులు తమ ద్వేషాన్ని వాళ్ళ సినిమాలని చూడకుండా ఉండడం లో విజయం సాధించారు. మరీ ముఖ్యంగా నటన విషయంలో అగ్ర హీరోల బండారం బయటపెట్టింది OTT . దక్షిణాది నటుల తో పోలిస్తే ఉత్తరాది నటుల [అందరూ కాదు ] నటనని పొలుస్తూ ట్రోలింగ్ వీడియొ లు కొ కొల్లలుగా వచ్చేశాయి యూ ట్యూబ్ లలో. ఇదీ మరో కారణం అయ్యింది బాలీవుడ్ విఫలం అవడానికి. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హత్య !

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మీద కొన్ని అగ్ర సినీ హౌస్ లు పగ పట్టాయి. అయితే వీటి వెనుక కారణం మాత్రం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి లభిస్తున్న ఫాలోయింగ్ కొందరు హీరోలకి నిద్ర లేకుండా చేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరులో ఉన్న రాజ్ పుత్ ని తీసేయమని ఒత్తిడి తెచ్చారు కానీ నేను రాజ్ పుత్ ని నా పేరుని నేను మార్చుకోను అంటూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనడం కూడా పరోక్షంగా అతని హత్యకి కారణం అయ్యింది. నిజానికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పాటు రాజ్ కుమార్ రావ్,నావాజుద్దీన్ సిద్దికి లాంటి టాలెంట్ ఉన్న నటులు బాలీవుడ్ లో ఉన్నా వాళ్ళకి తగిన అవకాశాలు ఇవ్వలేదు. ఇక నవాజుద్దీన్ సిద్దికీని  అయితే B గ్రేడ్ సినిమాలకి పరిమితం చేసింది బాలీవుడ్. ప్రేక్షకులు మాత్రం టాలెంట్ కె తమ వోటు అని చెప్తున్నా కపూర్,ఖాన్,సిప్పీ ఇలా కుటుంబ వారసులకే అవకాశాలు ఇవ్వడం మానుకోలేదు. ఇక ముందు అలా జరగదు అని భావిస్తే పప్పులో కాలేసినట్లే. 

మొత్తంగా చూస్తే వరుస పరాజయాలతో బాలీవుడ్ పరిశ్రమ కుప్ప కూలే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఎంత మాఫియా అయినా ఎల్ల కాలం డబ్బుని ఇస్తూ పోలేదు. ఎక్కడో అక్కడ దానికి ఫుల్ స్టాప్ పడక తప్పదు. లేకపోతే ఎలాంటి ప్రోమోషన్ లేకుండానే పుష్ప సినిమా హిందీ బెల్ట్ లో అంత వసూళ్లు ఎలా చేయగలిగింది ? ఇప్పుడు ఉత్తరాదిన అల్లు అర్జున్,రామ్ చరణ్,ప్రభాస్,జూనియర్ ntr లకి ఉన్న ఫాలోయింగ్ ఖాన్ బ్రదర్స్ కి లేదు. ఎంతో వ్యయ ప్రయాసలకి పోయి తీసిన పృధ్వీ రాజ్ చౌహాన్ ఫ్లాప్ అవడానికి కారణం బాహుబలి తో పోల్చి చూడడమే కారణం.  మళ్ళీ రాజమౌళి పృధ్వీరాజ్ మీద సినిమా తీసినా ప్రేక్షకులు చూస్తారు. కధని నడిపించడం ఎలానో దక్షిణాది దర్శకులు బాగానే తెలుసుకున్నారు ఇప్పుడు అదే విజయానికి కారణం అవుతున్నది. పుష్ప సూపర్ హిట్ అవగానే సుకుమార్ తీసిన అన్ని సినిమాలు యూట్యూబ్ లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి అంటే అర్ధం చేసుకోవచ్చు. 

నిజానికి బాలీవుడ్ పతనానికి పునాది రాయి 20 ఏళ్ల క్రితమే పడ్డది , అది ఖుషీ సినిమాలో పవన్ మీద స్ట్రీట్ ప్లే ఆధారంగా చిత్రీకరించిన  'ఏ మేరే జహ ఏ మేరే ఘర్ మేరే ఆషియ ' అనే పాటని పూర్తిగా హిందీలోనే KK చేత పాడించి విజయం సాధించింది. అప్పట్లో బాలీవుడ్ హీరోలతో పాటు దర్శకులు కూడా ఖుషీ సినిమాని స్పెషల్ షో వేయించుకుని మరీ చూశారు. 

మారిన ప్రేక్షకుల అభిరుచి ఏమిటో తెలుసుకొని తీస్తే హిందీ సినిమాకి పూర్వ వైభవం వస్తుంది కానీ ఆ పని వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేరనే అనిపిస్తున్నది. 

నటుల వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో అనే దానిని కూడా ఇప్పటి ప్రేక్షకులు పరిగణలోకి తీసుకుంటున్నారు అన్న సంగతిని బాలీవుడ్ గుర్తించలేదు. 

గత కొంత కాలంగా ఉత్తరాది సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశం బ్రహ్మానందం తన చేతితో గీసిన వేంకటేశ్వర స్వామి చిత్రాన్ని అల్లు అర్జున్ కి బహుకరించిన ఫోటో. గిన్నీస్ బుక్ లో చోటు చేసుకున్న బ్రహ్మానందం ని కేవలం హాస్య నటుడుగా కాకుండా డౌన్ to ఎర్త్ అంటూ బ్రహ్మానందం సర్ అంటూ సంబోధించడం మొదలుపెట్టారు. ఈ గౌరవం ఖాన్ బ్రదర్స్ కి ఇవ్వడం మానేశారు. అదే ఇప్పటి అమీర్ ఎర్ర చెడ్డీ పరాజయానికి కారణం అయ్యింది. ఏదీ ఒక్క రోజులో జరిగిపోదు. ఎర్ర చెడ్డీ పరాజయం నేరుగా ఖాన్ త్రయం రాబోయే సినిమా బిజినెస్ మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మార్కెట్ ఉంటే ఎంత డబ్బు అయినా పెట్టి తీస్తారు కొంటారు. సినిమా ఫ్లాప్ అయితే బయ్యర్లకి డబ్బు తిరిగి ఇచ్చే సాంప్రదాయం బాలీవుడ్ లో లేదు. ఇదీ ఒక మైనస్ పాయింట్ అక్కడ. 

వోట్లు వేసేది,సినిమా హిట్ చేసేది ఒకళ్ళే అని వీళ్ళు ఎప్పుడు గుర్తిస్తారు ?

నీతి_కథ 🦅

 నీతి_కథ  🦅


తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు.


రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు  మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు. 


"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం  "ప్రభు శ్రీరాముడి" కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి   వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను  కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.


కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు 58 రోజులు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను  చిరునవ్వు నవ్వుతున్నారు!


ఈ దృశ్యం చాలా అలౌకికమైనది.


రామాయణంలో జటాయువు శ్రీరాముడి  ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.


అక్కడ మహాభారతంలో, 


భీష్మ పితామహుడు  ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా?


అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా  అయింది. కాని భీష్మపితామహుడు  చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది!


జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు.  జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు  ఏడుస్తున్నాడు. 


ఇంత తేడా ఎందుకు? 


ఇంతటి తేడా ఏమిటంటే, 


ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో  పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు  చూశాడు. అడ్డుకోలేకపోయాడు!

దుశ్శాసనునికి  ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూ వున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.


దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే  వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.


జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!


ఇతరులుకు తప్పు జరిగిందని చూసి  కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో,  వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు.


 #నిజం అనేది  కలత చెందుతుంది, కానీ ఓడిపోదు. 


" *సత్యమేవ జయతే "*

సేకరణ: వాట్సాప్ పోస్ట్.

12, ఆగస్టు 2022, శుక్రవారం

సాధ్వీమ తల్లులు

 మన అందరికీ పురందరదాసు కథ తెలిసిందే . అందులో సాధ్వీమతల్లి అయిన ఆయన ధర్మపత్ని సరస్వతమ్మ గూర్చి తెలిసిందే . పురందరదాసు అసలు పేరు శీనప్ప . కన్నడ సామ్రాజ్యములో పేరుబడసిన రత్నాల వ్యాపారి . ఆయన పిల్లికి బిక్షం వేసే రకం కాదు . మరి అయన ధర్మపత్ని మాత్రం అడిగినవారికి లేదనకుండా దాన ధర్మాలు అందరికీ వారు వీరు అనిలేకుండా సకల మర్యాదలు చేసే మహా ఇల్లాలు . ఇదంతా గమనించిన శీనప్ప ప్రతీవాటినీ తన ఇంటిలో చెక్క పెట్టెలలో పెట్టించి తాళాలు వేసుకుని తాళాల గుత్తి తన దగ్గరే ఉంచుకునే వారు . ఒక సారి ఓ పేద బ్రాహ్మణుడు శీనప్ప ఇంటికి రాగా ప్రతీ రోజు రేపు రమ్మని తిప్పుకునేవాడు . అలా తిరిగీ తిరిగీ ఆ బ్రాహ్మణుడు అలసిపోయాడు గానీ విత్తం గానీ ఇంత ధాన్యం కానీ దానం చేయలేదు శీనప్ప . ఓ రోజు శీనప్ప ఇంట లేని నాడు ఆ బ్రాహ్మణుడు సరస్వతమ్మను దర్శించి తన పేదరికం బాపమని వేడుకున్నాడు . ఆమె ఇంట ఇపుడు ఏమీ ఆమె స్వాధీనములో లేదు . ఆ పేద బ్రాహ్మణుని పేదరికం చూసి జాలిపడి ఆమె తన ముక్కుకు ఉన్న రత్నం పొదిగిన ముక్కెర ఇచ్చి వేసి అమ్మి వేసి సొమ్ము తీసుకుని జీవించమంది . ఆ బ్రాహ్మణుడు అది అమ్మడానికి నేరుగా శీనప్ప కొలువై యున్న రత్నాల అంగడికి వెళ్లి అమ్మజూపాడు . ఆ ముక్కెర తానే స్వయంగా రత్నం పొదిగి చేయించింది , అత్యంత విలువైనది . అది చూసిన ఆయనకు నమ్మబుద్ధి కాక వెంటనే తన వద్ద ఉన్న నౌకరుని పంపి వెంటనే తన శ్రీమతి వద్ద యున్న రత్నం పొదిగిన ముక్కెర తీసుకురమ్మనమని చెప్పమని వ్రాసి పంపాడు . ఆమె ఆ పత్రం చదివి బెంబేలు పడిపోయి ఇంక తనకు ఇక దిక్కు తాను నిరంతరం కొలిచే పాండురంగడే అని తలచి విషం తీసుకోబోగా ఆపాత్రలో ధగ ధగ మెరిసే ముక్కెర కనబడింది దానిని తీసి శుభ్రం చేసి ఆమె ఆ ముక్కెరను నౌకరు చేత పంపింది . అది గాంచిన తరువాత శీనప్ప ఖరీదు కట్టి ఆ రత్నం పొదిగిన ముక్కెర కొని దానిని ఇంటికి తీసుకు పోయి అసలు విషయం విచారించగా అపుడు సంగతి తెల్సింది . ఆమె ఆ ముక్కెర ఆ బ్రాహ్మణునికి దానం చేసిన విషయం .. విష పాత్రలో ముక్కెర ఉండటం . అంతే అంతవరకూ కాకికి ఎంగిలి చేయి విదల్చని శీనప్పలో మార్పు వచ్చేసింది . మొత్తం తన వద్ద ఉన్న ధనాన్ని అందరికీ దాన ధర్మాలు వినియోగించారు . భక్తితో శ్రీరంగని మీద , వెంకటేశ్వర స్వామి వారి మీద కన్నడములో అనేక కీర్తనలు రచించారు . దాస సంగీతానికి ఆద్యుడు , కర్ణాటకా సంగీత పితామహుడు అయిన పురందర దాసులో మార్పు తెచ్చిన సంఘటన ఇదే . ఇటువంటి సాధ్వీమ తల్లులు పుట్టిన నేల ఈ భారతం .

వర్షాలు

 *దైవ సృష్టిలో ప్రకృతి లీలలు-వర్షాలు.* 

💧💧💧💧💧💧

దైవ సృష్టికార్యక్రమము లలో,ప్రకృతి మానవాళికి, జీవ జంతు జాలములన్ని టికీ ఇచ్చిన,ప్రాణాధారమై నది,ముఖ్యమైనది;నీరు. 

వర్ష రూపములో,జీవజాలా

నికి,ఇచ్చిన వరము.

ఇందులోకూడా పలు రక

ముల వర్షములతో,ఉప యోగకరముగా,ఆనంద

దాయకంగా అందిస్తున్నది.

ఎప్పుడూ ఒకే‌ వాన కాకుండా,రకరకాల విన్యాసాలతో,వర్షాలు వస్తుంటాయి. అవి :-


* గాంధారి వాన = కంటికి ఎదురుగా ఉన్నది,  కనిపించనంత జోరుగా కురిసే వాన.

* మాపుసారి వాన = సాయంత్రం కురిసే వాన.

* మీసరవాన = మృగశిర కార్తెలో కురిసే వాన.

* దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన.

* సానిపి వాన = అలుకు (కళ్లాపి) జల్లినంత కురిసే వాన.

* సూరునీల్ల వాన = ఇంటి చూరు నుండి,ధారగా  పడేంత వాన.

* బట్టదడుపు వాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన.

* తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన.

* సాలు వాన = ఒక నాగలి సాలుకు సరిపడా వాన.

* ఇరువాలు వాన = రెండు సాల్లకు, విత్తనాలకు సరిపడా వాన.

* మడికట్టు వాన = బురద పొలం దున్నేటంత వాన.

* ముంతపోత వాన = ముంత తోటి పోసినంత వాన.

* కుండపోత వాన = కుండ తో కుమ్మరించినంత వాన.

* ముసురు వాన = విడువకుండా కురిసే వాన.

* దరోదరి వాన = ఎడతెగ కుండా కురిసే వాన.

* బొయ్య బొయ్య గొట్టే వాన = హోరుగాలితో కూడిన వాన.

* రాళ్ల వాన = వడగండ్ల వాన.

* కప్పదాటు వాన =అక్కడ క్కడా కొంచెంకురిసే వాన.

* తప్పడ తప్పడ వాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.

* దొంగ వాన = రాత్రంతా కురిసి, తెల్లారి కనిపించని వాన.

*తుఫాన్ వాన = ఈ వాన 

ప్రకృతి సమతుల్యం లేనప్పుడు,సముద్రాలు, నదులు పొంగుతూ,కష్ట, నష్ట దాయకంగా కురిసే అతి భీకరమైన వర్షము. 

* కోపులు నిండే వాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన.

* ఏక్దార వాన = ఏకధారగా కురిసే వాన.

* మొదటివాన = విత్తనా లకు బలమిచ్చే వాన.

* సాలేటి వాన = భూమి తడిసేంత భారీ వాన.

* సాలు పెట్టు వాన = దున్నేందుకు సరిపోయేంత వాన.


సర్వేజనా 

సుఖినో భవంతు. 

💦💦💦💦💦💦

రామాయణానుభవం_ 121*

 🌹 *రామాయణానుభవం_ 121*


*రావణ మందిరం*

రావణాసురునితో సుఖాన్ని అనుభవించిన రమణీమణులు ఆయనకు సమీపంలోనే ఉన్నారు. కొందరు కూచున్నారు. అలసినవారు పడుకొన్నారు.


ఆ రాక్షస స్త్రీలకు దూరంగా ఒంటరిగా ఒక అందమైన శయ్యలో రూప సంపన్నురాలైన మరొక స్త్రీని హనుమ చూచాడు.


ఆమె అద్భుత సౌందర్యవతి, సర్వాభరణ భూషిత, రాజలక్షణ లక్షిత. ఆమె రావణుని పట్టపురాణి మండోదరి.


హనుమ ఆ అతిలోక సుందరిని చూచి సీతాదేవే అనుకొన్నాడు. "ఓహో! నా ప్రయత్నము ఫలించింది! నా అన్వేషణ (వెతుకుట) నెరవేరింది! సీతాదేవి నాకు కనబడింది" అని అత్యంత హర్షాన్ని పొందాడు.


ఆ ఆనందము పట్టలేకపోయాడు. తన భుజాలను, తొడలను చరుచుకొన్నాడు. తన తోకను ముద్దుపెట్టుకొన్నాడు. నవ్వుతున్నాడు. ఆడుతున్నాడు. ఇటు వెళ్లాడు. అటు వెళ్లాడు. " ఆ భవనములోని స్థంభాలపై పాకుతూ ఎక్కాడు. వాటినుండి జారి భూమిపై పడ్డాడు.


*ఆయాస్పోటయామాస చుచుంబ పుచ్చం!*

 *ననంద, చిక్రీడ, జగౌ, స్థంభానరోహత్,* *నివపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం* ॥


హనుమ తన కోతి స్వభావాన్ని ప్రదర్శించాడు అంటాడు వాల్మీకి.


మనుష్యులమైన మనమే కోతి చేష్టలను చేస్తుంటే నిజంగా కోతి అయిన హనుమ సహజమైన కోతి చేష్టలను చేస్తే కోతి బుద్ధిని చూపితే తప్పేమిటి?


"హనుమ నిజంగా కోతి మాత్రమే కాదు. బుద్ధిమతాం వరిష్ఠుడు. అంటే బుద్ధిమంతులలో గొప్పవాడు.


అందువలన హనుమ నిజంగా తన ఆలోచనకు మరొకసారి సిగ్గుపడ్డాడు. "ఛీఛీ ఎంత పాడు ఆలోచన!" అని తనను తానే అసహ్యించుకొన్నాడు.


*న రామేణ వియుక్తాసా స్వప్ను మర్హతి భామినీ। న భోక్తుం న్యాలంకుం। నపానముపసేవితుం।*


శ్రీరాముని ఎడబాసి నిరంతరము దుఃఖించే సీతామతల్లి నిద్రపోతుందా? ఆమెకు తిండి సహిస్తుందా? పానీయాన్ని ఆమె సేవిస్తుందా? ఆమెకు అలంకారాలు ఇష్టమవు తాయా?


*నాన్యం వరముపస్థాతుం। సురాణామపిచేశ్వరం||*


ఆమె అన్యుడైన పురుషుని మహేంద్రుని సైతము సమీపిస్తుందా? 


అందువలన ఈమె సీత కాదు. వేరే ఏ స్త్రీయో? అని నిశ్చయించుకొని పానభూమిలో సంచరించాడు.


**

హనుమకు మరొక విచారము ఆయన మనస్సులో బాధించడం మొదలుపెట్టింది.


"సాధారణంగా స్త్రీలను దగ్గరినుండి చూడకూడదు కదా! అందులో నిద్రిస్తున్న వారిని దగ్గరగా చూడడం మరింత పనికిరాదు కదా! మరి నేనిప్పుడు చేసిన పనేమిటి? బొట్టు చెదిరి, అందెలు తొలిగి, హారాలు, చీరలు జారిన ఆడవాళ్లను నిద్రిస్తుండగా దగ్గరి నుండి చూచానే? ఇది పాపం కాదా?"


హనుమ కొంతసేపటికి ఒక నిశ్చయానికి వచ్చాడు. తనకు తానే సమాధానం చెప్పుకొన్నాడు.

*తదిదం మార్గితం తావచ్ఛుద్ధేన మనసా మయా৷৷*

*రావణాన్తఃపురం సర్వం దృశ్యతే న తు జానకీ.*

“మనము ఏ పనిచేసినా ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామన్నదే ముఖ్యము. 


నేను దురుద్దేశ్యంతో ఈ స్త్రీలను గమనించలేదు. వీరు ఇంత అస్తవ్యస్తంగా పడుకొని ఉన్నా,

వీరిని చూచినప్పుడు నా మనస్సు చెడు ఆలోచనలకు చోటివ్వలేదు. 

*న హి మే పరదారాణాం దృష్టిర్విషయవర్తినీ৷৷*

*అయం చాత్ర మయా దృష్టః పరదారాపరిగ్రహః.*

ఇంద్రియాలు చెడుగా ప్రవర్తించాలన్నా, మంచిగా నడుచుకోవాలన్నా మనస్సే కారణము. వీరిని ఈ స్థితిలో చూచినా నా మనస్సు చక్కగానే ఉంది. అయినా సీతాదేవి కూడ ఒక స్త్రీయే కదా!


ఆమెను స్త్రీల మధ్యలోకాక పోతే ఇంకెక్కడ వెతుకుతాము?


సీత కోసం సముద్రం దాటి లంకకు వచ్చాను. లంకలో ఎక్కడ వెదకాలి? ఏ జాతి జంతువు తప్పిపోతే ఆ జాతి జంతువులలోనే వెదకాలి.


 *న శక్యా ప్రమదా నష్టా మృగీషు పరిమార్గితుమ్.* 

స్త్రీ తప్పిపోతే స్త్రీలలోనే వెదకాలి. ఆడలేళ్ళలో వెదికితే స్త్రీ దొరకదు కదా! 


సీతజాడ తెలుసుకోమన్న ప్రభువు ఆజ్ఞను పాటించి రావణాంతఃపురం అంతా వెదికానే తప్ప స్త్రీలను చూడాలనే ఆసక్తితో కాదు. అందువలన నాకు ధర్మలోపం కలగదు." అనుకున్నాడు.


హనుమంతుడు నిరుత్సాహానికి లోనయ్యాడు. రావణమందిరం నుంచి దూరంగా వెళ్ళి ఆలోచించాడు.

ధాతుపౌష్టిక లేహ్యం

 ధాతుపౌష్టిక  లేహ్యం  ఉపయోగాలు  - 


 *  శరీరమునందలి ధాతువులకు బలం చేకూర్చును . 


 * రక్తము నందలి దోషములను  పోగొట్టి రక్తమును శుభ్రపరచును . 


 *  కండరములు బలాన్ని చేకూర్చును . ఎముకలు గట్టిబడచేయును . 


 *  వాత, కఫ సంబంధ రోగములు నాశనం చేయును . 


 * శరీర నిస్సత్తువ , నరాల దోషములు నివారణ చేయును . 


 *  వృద్దాప్యము నందు కలుగు శారీరక రుగ్మతలు నశింపచేయును . 


 *  ఎదైనా రోగము చేత శరీరము కృశించబడి ఉండువానికి శరీరం కండబట్టి దుర్బలత్వము నుండి బయటపడును . 


 *  రక్తశుద్ధి వలన ముఖవర్చస్సు పెరుగును . 


 *  చిన్నపిల్లల శారీరక ఎదుగుదల మీద అద్బుతముగా పనిచేయును . 


 *  స్త్రీలయందు కలుగు హార్మోనల్ సమస్యలకు చక్కగా పనిచేయును . 


 * మెనోపాజ్ స్ధితికి దగ్గరగా ఉండు స్త్రీలలో కలుగు "ఆస్ట్రియోపోరొసిస్ " అను ఎముకల బలహీనపరిచే వ్యాధిని  దరిచేరనియ్యదు . 


 * పిల్లల ఙ్ఞాపకశక్తి పెరుగును . 


 *  మగవారిలో సంభోగ సంబంధ సమస్యలకు , నరాల బలహీనత పైన పనిచేయును . 


 *  థైరాయిడ్ సమస్యల వలన వచ్చు నీరసం మరియు అసహన సంబంధ సమస్యలకు దీన్ని తప్పక వాడాలి . 


 *  మానసిక సంభంద సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేయును . 


       

పాలుతో

 పాలుతో ఔషదాలు తీసుకొనడం వలన ఉపయోగాలు  - 


 *  లంఘనం ( ఉపవాసం ) చేత బలహీనుడు అయినవాడు క్షీరం పానం చేయడం వలన బలవంతుడు అగును. అట్టివానికి జ్వరం నశించును. 


 *  కాగి చల్లారిన పాలు , కొంచం ఉష్ణంగా ఉన్న పాలు కాలమునెఱిగి జ్వరపీడితుడు సేవించవలెను 

కాచబడినదియు , గోరువెచ్చగా ఉండని పాలను జ్వరపీడితుడు సేవించిన మృత్యుడు అగును.


 *  పాలయందు శొంటి , ఖర్జురపు కాయ , ద్రాక్ష వీటిలో ఏదైనను కాచి అందు చెక్కర  కాని , నెయ్యి గాని , తెనే కాని వేసి చల్లార్చి అనుపానంగా సేవించిన యెడల  దప్పిక , తాపము వీటిని నివర్తింప చేయును . 


 *  పాల యందు ద్రాక్ష , చిట్టాముదపు వేరు , యష్టిమధూకం , సుఘంద పాల వేరు , పిప్పిలి , చందనం వీటిచే కాచబడిన పాలు సేవించిన లేక పాలకు నాలుగింతలు నీరు పోసి పిప్పిలి వేసి నీరంతా ఇగురునటుల కాచి తగినంత వేడిగా ఉన్నప్పుడు లొపలికి తీసుకున్న జ్వరం నశించును. 


 *  జ్వరం గలవాడు పంచమూలములు పాలల్లో వేసి కాచి అనుపానంగా సేవించిన యొడల చిరకాల జ్వరం నశించుటయే కాక కాసాశ్వాస , తలనొప్పి , పార్శ్వపునొప్పి కూడా నశించును.


 *  పాలయందు ఆముదపు వేరు గాని లేక బిల్వపత్రములు గాని వేచి  కాచి అనుపానంగా సేవించిన జ్వరం , మలబద్దకం నశించును. 


 *  పాల యందు శొంటి , చిట్టాముదపు వేరు , వాకుడు , పల్లేరు , బెల్లము వీటిని వేసి కాచి అనుపానంగా సేవించిన రక్తపిత్తము , అతిసారం , దప్పికతో కూడిన నొప్పులు అన్ని నివర్తించును.


  

     

సయాటికా నొప్పి - తీసుకోవలసిన జాగ్రత్తలు .

 సయాటికా నొప్పి - తీసుకోవలసిన జాగ్రత్తలు .


   వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు 

సర్వసాధారణంగా వచ్చే కేసులలో ప్రధానం అయినది సయాటికా . ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు inflamation ని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కాని కనిపించదు. 


              ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజక్షన్ ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మొన నరానికి తగిలి వాపుకి గురికావొచ్చు. దాదాపు ఇలాగే నడుము ప్రాంతంలో వెన్నముక నుంచి బయటకు వచ్చే సయాటికా నరం మీద వత్తిడి ఏర్పడినపుడు అది కాలిలో వెళ్ళినంత మేర సలుపులు , నొప్పి అనుభవం అవుతాయి. 


          ఈ వత్తిడి అనేది వెన్నపుసల మద్యలో ఉండే డిస్క్ లు తొలగడం వలన ఏర్పడవచ్చు చుట్టుపక్కల కండరాలు , లిగమెంట్లు వాపుకి గురికావడం వలన ఏర్పడవచ్చు . లేదా ఈ నిర్మాణాలు గట్టిపడిపోయి ఫైబ్రస్ గా తయారు అవ్వడం కూడా ఏర్పడవచ్చు . కనుక మనం సాధారణంగా చూసే సయాటికాకు , నరాలు వాపు నకు గురికావడం వలన వచ్చే న్యురరైటిస్ కి సంభంధం లేదు . ఈ రెండు స్థితులు ఒకేసమయంలో ఉండొచ్చు.


         సయాటికా నొప్పి నడుము ప్రాంతంలో ఉండే వెన్నపూసలు క్షయానికి ( డీ జనరేషన్ ) లొను కావడం వలన ఏర్పడే పర్యావసన లక్షణం మాత్రమే సయాటికా నొప్పి లక్షణాలు ఆయుర్వేదంలో గృ ధసీవాతం అని పిలుస్తారు .


  లక్షణాలు - 


     నడుమునొప్పి ఉంటుంది. అయితే ఎప్పుడు ఉండాలి అని నియమం లేదు . దీనికంటే కుడికాలిలో నొప్పి ప్రధానంగా ఉంటుంది. పిరుదుల లొపల నుంచి నొప్పి మొదలై నరం వెళ్లే ప్రాంతం అంతా తోడ వెనకపక్కన , పిక్కల లొపల , పాదం వెలుపలి వైపు నొప్పి వ్యాపిస్తుంది.


            ముఖ్యంగా ముందుకు వంగినప్పుడు , దగ్గినప్పుడు , తుమ్మినప్పుడు , నడుములో నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. కొంచం దూరం నడిస్తే కాలులో నొప్పి రావడం అనేది దీనిలో ప్రధాన లక్షణం. కాలులో తిమ్మిరి పట్టినట్లు కాని , సూదులతో గుచ్చినట్టుగా కాని అనిపించవచ్చు. ఈ చివరి లక్షణం వ్యాధి తాలూకు తీవ్రత సూచిస్తుంది .


              సయాటికా నొప్పిని నిర్ధారించడానికి ఒక పద్ధతి ఉంది. బల్లమీద వెల్లికిలా పడుకొని కాలుని నిటారుగా పైకి లేపండి ఇలా చేసేప్పుడు ఒక వేళ మీకు నడుము ప్రాంతంలో నొప్పి అనిపిస్తే సయాటికా ఉన్నట్లు లెక్క . మీరు కాలుని ఎంత ఎత్తు వరకు లేపగలరు అన్నదానిని ఆధారం చేసుకోని వ్యాధి తీవ్రతను అంచనా కట్టవచ్చు.సయాటికా వ్యాధిని గుర్తించడానికి X - ray పరీక్షల కంటే పైన పేర్కొన్న పరీక్ష బాగా ఉపయోగపడుతుంది.


  సలహాలు - సూచనలు - 


    సయాటికానోప్పి ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మాత్రలను యధేచ్చగా కొనుక్కొని వాడటం అంత మంచిది కాదు. అల్లోపతి మందులు నొప్పిని అదిమిపట్టి లక్షణాలు దాచేస్తాయి. విశ్రాంతి తీసుకునే అవసరం మీకు కనిపించదు. 


            వెన్నముకలో అరుగుదల యదావిధిగా కొనసాగి చివరికి వెన్నపూసలు బాగుచేయలేని విధంగా దెబ్బతింటాయి. ఇలా కాకుండా నొప్పి తెలుస్తూ ఉండటమే మంచిది. దీనివలన విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు తప్పనిసరి అవుతుంది. 


         సయాటికా లో ప్రదానమైన చికిత్స విశ్రాంతి. గట్టిబల్లపైన విశ్రాంతి గా వెల్లికిలా పడుకోవాలి. దిండు వాడకుడదు. మెడ వంపులో తువ్వాలను మెత్తగా అముర్చుకోవచ్చు. పక్కకి తిరిగి పడుకోవాలి అనుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకుని రెండు కాళ్ళ మధ్య దిండు ని అమర్చుకోవడం చేయాలి . బల్ల మీద దుప్పటి పరుచుకోవచ్చు.


       

       ఈ వ్యాధి చికిత్సలో నేను రసఔషదాలు మరియు మూలికలు కలిపి ప్రయొగించినప్పుడు అద్బుత ఫలితాలు వచ్చాయి . ఈ వ్యాధి చికిత్స కొరకు నన్ను సంప్రదించగలరు . 


            ఆపరేషన్ చేయించుకొనవలసిన అవసరం లేదు.