16, ఆగస్టు 2022, మంగళవారం

 తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం  -


    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.


      వాము  250 గ్రాములు .


      జీలకర్ర  250 గ్రాములు .


      ధనియాలు  250 గ్రాములు . 


         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.


            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.


  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు  -


  పాటించవలసిన నియామాలు  -


      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .


 పాటించకూడనివి  -


       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం 


          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.


   పూర్తి తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం -


    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.


      వాము 250 గ్రాములు .


      జీలకర్ర 250 గ్రాములు .


      ధనియాలు 250 గ్రాములు . 


         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.


            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.


  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు -


  పాటించవలసిన నియామాలు -


      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .


 పాటించకూడనివి -


       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం 


          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.


   పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034 సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

mobile surrender at night

 ఆఫీస్ పని మీద పొద్దున్నే హైద్రాబాద్ వచ్చాను.ఒక రోజులొనే పని అయిపోతే, సాయంత్రమే బయలు దేరి వెళ్లి పోవచ్చు అనుకున్నాను. కానీ ఒక రోజులో అయ్యేలాగా లేదు మరి. ఏదైనా  Lodge లో రూమ్ బుక్ చెయ్య మని చెప్పాను మా ఆఫీస్  వాళ్ళకి.వాళ్లు అదే పనిలో ఉన్నారు. 


ఈ లోగా నా బాల్య మిత్రుడు మూర్తి కి ఫోన్ చేసాను. వాడు చాలా సంతోషించాడు. కుశల ప్రశ్నలు అయ్యాక అడిగాడు నేను ఎక్కడ stay చేస్తున్నాను అని. నేను చెప్పాను మా వాళ్లు రూమ్ బుక్ చేస్తున్నారు అని.

మా వాడికి కోపం వచ్చింది, వాళ్ళ ఇంటికి రాకుండా ,ఎక్కడో ఓ lodge రూమ్ లో ఉండ వలసిన అవసరం ఏమిటి అని నన్ను తిట్టి, వాళ్ళ ఇంటికే రమ్మన్నాడు. నేను సరే అని వాళ్ల ఇంటికే బయలు దేరాను, మా ఆఫీస్ వాళ్లకు రూమ్ బుక్ చేయ వద్దు అని చెప్పి.


నేను వాళ్ల ఇంటికి ఒక అరగంటలో చేరుకున్నాను.

అప్పటికి మా మూర్తి  ఇంటికి రాలేదు. వాడి శ్రీమతి నన్ను అన్నయ్య గారు అని పిలుస్తుంది ఎంతో ఆప్యాయంగా. చల్లటి మంచి నీళ్లు, వేడి coffe ఇచ్చింది. కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటే తెలిసింది, వాళ్ల అత్త గారు, అంటే, మా మూర్తి గాడి అమ్మగారు ఇక్కడే ఉంటున్నారు అని.  నాకు చాలా సంతోషం అనిపించింది, వెంటనే ఆవిడ ఉండే రూమ్ లో కి వెళ్లి, ఆవిడకు  నమస్కారం చేసాను. నేను ఆవిడ పడుకున్న  మంచానికి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుని ,ఆవిడతో మాట్లాడుతో ఉన్నాను. ఈ లోగా మూర్తి కూడా వచ్చాడు ,వాడు కూడా ఆ గది లోకే వచ్చాడు సరాసరి.

వాడు నాతో మాట్లాడక ముందే, వాడి జేబు లోనుంచి మొబైల్ తీసి ,వాళ్ల అమ్మ చేతిలో పెట్టాడు. మేము ఇద్దరం మాట్లాడు కుంటున్నాము, coffe తాగుతూ,

నేను రెండో సారి. ఇంతలో మూర్తి గాడి అబ్బాయి వచ్చాడు , ఆ అబ్బాయి  ఎంటెక్ చేస్తున్నాడు,jntu లో.

అతను కూడా, మొబైల్ హాండ్సెట్  తీసి  మామ్మ చేతిలో పెట్టాడు. ఇంకో అయిదు నిముషాలు ఆయాక మూర్తి గాడి అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి ఇంజనీరింగ్  చేస్తున్నది ట, ఆ అమ్మాయి కూడ వాలెట్ లోనుంచి మొబైల్ తీసి పెద్దావిడ చేతిలో పెట్టి, నన్ను పలకరించి వెళ్లి పోయింది.

నేను ఆశ్చర్య పోయి అడిగాను మూర్తిని, అందరూ మొబైల్స్ ఆ పెద్దవిడకి ఎందుకు  ఇచ్చేస్తున్నారు అని.

అప్పుడు మెల్లగా నవ్వి చెప్పాడు మూర్తి 'ఒరే, ఇంటికి వచ్చాక కూడా అందరూ  మొబైల్స్ పట్టుకుని, వాట్సాప్  లు, ఫేస్ బుక్లు చూసుకుంటూ ఉంటే, ఇది ఇల్లులా ఉండటంలేదు,ఒకళ్ళ సంగతలు వీరోకళ్లకు తెలియటం లేదు, అసలే బయట జీవితం   యాంత్రికంగా ఉంటోంది,ఇంట్లో కూడా అలా ఉండ కూడదు అని, మా శ్రీమతి ఈ నిర్ణయం తీసుకుంది " అని ఏకధాటిగా చెప్పి వాళ్ళ  ఆవిడను మెచ్చుకోలుగా చూసాడు.


 "అవును అన్నయ్య గారు,  పిల్లలు,ఆయన ఎపుడు వస్తారా,వాళ్ళతో  కబుర్లు చెపుదాము అని నేను ఆశగా ఎదురు చూస్తూ వుంటే, వాళ్ళు మాత్రం మొబైల్స్ తో నే కాలం గడిపేస్తున్నారు, ఇంటికి వచ్చినా, అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను, దానికి మా అత్త గారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. మొదట్లో moblies నా దగ్గరే పెట్టు కునే దాన్ని, కానీ వాళ్ళు న మాట వినే వారు కాదు,ముఖ్యంగా మా ఆయన, అందుకే ఇప్పుడు ఆ డ్యూటీ పెద్దవిడకి ఇచ్చాను,ఆవిడ అంటే అందరికి గౌరవం , అందుకే అందరూ కట్టుబడి ఉంటారు, ఈ నిబంధనకి " అని ముగించారు Mrs murthy.

నేను కూడా మా ఆవిడతో క్లుప్తంగా మాట్లాడి, నా మొబైల్ కూడా ఆ పెద్దవిడకు ఇచ్చేసా.


కానీ అప్పుడు ఓ సందేహం వెలుబుచ్చాను, ఎవరైనా బయట వాళ్లు ,వీళ్ళతో మాట్లాడాలి అంటే ఎలా అని.

Mrs murthy చెప్పారు, ,అన్నయ్య గారు, నా ఫోన్ నెంబర్ అందరికి తెలుసు, urgent  అయితే నాకు వాళ్లు ఫోన్ చేస్తారు, పైగా నా ఫొన్ స్మార్ట్ ఫొన్ కాదు, ఒక బేసిక్ ఫోన్ మాత్రమే, నా ఫోన్ కి ఈ నియమం వర్తించదు'  అని  వివరణ ఇచ్చారు


రాత్రి dinner చేస్తున్నప్పుడు, అందరూ చక్కగా మాట్లాడు కుంటూ, ఒకరి సంగతులు మరొకరు తెలుసు కుంటూ, వంటకాలను ఆస్వాదిస్తూ కడుపు నిండా తిన్నారు. ఓ మంచి idea  వాళ్ళ ఇల్లుని బొమ్మరిల్లుగా మార్చేసింది. 

నేను మా ఇంట్లో  mobile surrender  @ night

అనే  నిబంధన అమలు పరచాలి అని నిర్ణయించుకుని,

వాళ్ళ అందరి లాగే ఓ మంచి తెలుగు పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకున్నాను.

Janaganamana

 


ధర్మాకృతి

 ధర్మాకృతి : శ్రీమఠం ఖైదు అయిన కథ -3


స్వామివారికి కూడా ఒక్కటే మనఃక్లేశము. నా కాలంలో మఠానికి ఇంత క్లిష్ట పరిస్థితి వచ్చిందేమా అని. నేనీ కేసు వ్యాజ్యము లాంటి లౌకిక వ్యవహారాలలో ప్రవేశించాల్సిన అవసరం రాకుండానే సర్వజనామోదకంగా ఏది జరిగితే మంచిదో ఆ మంచి జరిగి ఉండకూడదా! కక్షిదారులు తమకే ఆ ప్రతిష్ఠరావాలని కేసు వేసినపుడు, ఎదురు వ్యాజ్యమాడక వారికే ఆ ప్రతిష్ఠ వదిలితే పోయేదికదా! అని వారు ద్వితీయుని ముందు క్లేశపడినారు. కార్యనిర్వాహణాధికారిగా వున్న వీరికి తాము సరిగా కార్యము నిర్వర్తింపజాలనందులకే స్వామివారికి మనఃక్లేశమేర్పడినదని బాధవేసింది.


బాగుంది! విజయం కలిగిన వెంటనే మనకు అహంకారమెక్కడ పెరిగిపోతుందో అని అమ్మ ఈ రకమైన కష్టములు కలుగజేస్తుంది. ఆమె కృప చేతనే కష్ట నివృత్తికి దారి దొరుకుతుందనే నమ్మకంతో మనస్సులో నొచ్చుకోకుండా మన కర్తవ్యము మనం నిర్వహించుకు పోతూ ఉంటే తుదకు సంతోషం, జయం లభిస్తాయి. ద్వితీయులు శ్రీచరణులపై, అమ్మవారి అనుగ్రహ బలంపై నమ్మిక యుంచి ఈ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనడానికి తన వల్లనయ్యే అన్ని ప్రయత్నాలూ చేయడానికి తీర్మానించుకొన్నారు. తన ప్రయత్నాలు ఏ రకంగా ఫలిస్తాయో అని స్వామివారితో సహా ఎవరికీ తెలియపరచకుండా, చడీచప్పుడు చేయకుండా తాను నిర్ణయించుకొన్న ప్రణాళికను అమలుపరచ సంకల్పించారు. 


వెంటనే తంజావూరు వెళ్ళారు. అప్పటికే సర్వోజీ రాజా కాలం ముగిసి వారి పుత్రుడు శివాజీ మాహారాజు రాజ్యానికొచ్చారు. వారి వద్దకు పోయిన ఈ ద్వితీయులు మఠగౌరవానికి భంగము వాటిల్లని విధంగా నాజూకుగా విషయం తెలియజేశారు. ఒక పెద్ద వ్యాజ్యం అయింది. తంజావూరు సీమకే ప్రతిష్ఠ తెచ్చిన శ్రీమఠాన్ని తిరుచ్చి నుండి కుంభకోణం పోయేటప్పుడు తంజావూరు ఆహ్వానించి తగిన మర్యాద చేస్తే బాగుంటుందని సూచించారు. రాజావారు ఏ రకమైన ఇబ్బందుల్లో వున్నారో, వెంటనే ఆ సూచనను ఒప్పుకోనూ లేదు, తిరస్కరించనూ లేదు. మూడునాళ్ళు ఆలోచించి తుదకు తన అశక్తతను తెలియబరిచారు. రాజుగార్ని కలిసి శ్రీమఠాన్ని ఈ ఇక్కట్ల నుండి కొంత వరకూ బయటపడవేయవచ్చని దిటవు చేసుకున్న ఈ ద్వితీయుని హృదయం మరల దిగజారిపోయింది. తన ఉద్దేశ్యము మంచిదే అయినప్పటికీ తన గురువులయిన శ్రీచరణులు ఆజ్ఞ తీసుకొనకయే, వారి ఆశీర్వాదము లేకయే ఈ ప్రయత్నము చేసినందున శ్రమ వృధా అయింది అని చాలా బాధపడ్డారు. స్వామివారి వద్దకు తిరిగి వచ్చి తన హృదయ వేదనంతా వెళ్ళబోసుకున్నారు. స్వామివారు ఎంతో దయతో ఓదార్పు వాక్యములు పలికి “అమ్మ దయ! అంతా ఆమె దయకు వదిలి మనం బయలుదేరదాం అంటూ శ్రీమఠం కుంభకోణం తిరుగు ప్రయాణానికి ఆజ్ఞాపించారు. 


శ్రీమఠం కుంభకోణానికి బయలుదేరింది. తిరువానైక్కావల్ నుండి కుంభకోణం పోయేటప్పుడు తంజావూరు మీదుగా పోనవసరం లేదు. కోవలడి మీదుగా మఠం పరివారం, బళ్ళు, లొట్టి పిట్టలు, ఏనుగులు, గుర్రపు బళ్ళు ఈవిధంగా సాగిపోతున్నాయి. వెనుక మేనాపై స్వామి వెళుతున్నారు. బళ్ళు తిరువయ్యార్ కి కావేరి అవతల గట్టున సాగిపోతున్నాయి. హఠాత్తుగా అనేకమంది సిపాయిలు ఆ బళ్ళను చుట్టుముట్టి కావేరిలో దింపి ఇవతలి గట్టు మీదుగా తంజావూరు మార్గం పట్టించారు. బండి వారంతా ఇవి శ్రీమఠం బళ్ళు, మేమీ గట్టునే పడి కుంభకోణం పోవలెనని విన్నవించుకొన్నారు. సిపాయిలు వింటేనా! వారిలో కొందరు ఆ బళ్ళకు కావలిగా పోయారు. వెనుక వస్తున్న ఏనుగులు, గుఱ్ఱములు, ఒంటెలకు కూడా అదే గతి పట్టింది.


స్వామి మేనా కూడా ఆపబడింది. అయితే వారితో ఎంత మర్యాదతో ప్రవర్తించారు. రాజుగారి పురోహితులు పూర్ణ కుంభములతో స్వామిని తంజావూరు విచ్చేయవలెనని ప్రార్థించుతుండగా, నాల్గు ప్రక్కల సిపాయిలు మొహరించి ఉన్నారు. ప్రస్తుత కాలంలో కూడా సిపాయిలు coup చేసినపుడు రాజుగారిని ఎంతో మర్యాదగా గృహనిర్బంధం చేస్తారు కదా! తానావిధంగా చేయబడినానని అర్థం చేసుకున్నారు స్వామివారు.


స్వామివారు అంతకు 6-10సం. ముందు కామాక్షీ దేవి ఆలయము జీర్ణోద్ధారణ, కుంభాభిషేకము చేసిన వారు. అమ్మవారే స్వప్నంలో ఆదేశించి వారి మూలంగా కుంభాభిషేకం చేయించుకున్నది. పిదప ఇప్పుడు అఖిలాండేశ్వరీ తాటంక ప్రతిష్ఠ చేశారు. అయినా తిరువానైక్కావల్ నుండి బయలుదేరే ముందు అంతా అమ్మ దయకు వదలి బయలు దేరుదాం అని కదా బయలుదేరారు. “అమ్మా నీదయ! ఈ రకంగా నడుపుతున్నావా? అయితే ఇదీ సమ్మతమే” అనుకుంటూ సిపాయిల మధ్యలో బ్రాహ్మణుల వేదఘోష నడుమ స్వామి తంజావూరు బయలుదేరారు. 


ఈ రకంగా సిపాయిలను పంపినది సర్వోజీ మాహారాజా వారి పుత్రులు శివాజీ మహారాజా! శ్రీ మఠాన్ని ఆహ్వానించి మర్యాద చేయడానికి తగిన వసతి లేదని మూడు రోజుల ప్రతీక్షానంతరముచెప్పినది వీరే! శ్రీమఠాన్ని శివాజీ మహారాజా అరెస్ట్ చేయించారు అని మొదట్లో చెప్పాను కదా! అది వీరిని ఉద్దేశించి చెప్పినదే. మీరందరూ ఛత్రపతి శివాజీ అని ఏమరుపాటునొంది ఆశ్చర్యపోవాలనే ఆ రకంగా చెప్పాను. కతారసం కోసం ఈ రకంగా కికురించడం కవులకు సహజమే కదా! మీకందరికీ చరిత్ర గుర్తు ఉండి ఉంటే అంత ముందు శతాబ్దంలోని ఛత్రపతి ఈ కథలోనికి ఎలా వచ్చారా అని మీకు వెంటనే సంశయం కలిగి నన్నడిగి ఉండేవారే!


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Message

 Message of  Pujyashri Shankara Vijayendra Saraswathi Shankaracharya Swamigal on the 75th Anniversary of INDIA'S Independence


शान्ति समृद्धं अमृतम्


15th August 2022


Bharata Varsha' is a sacred land, a Punya Bhoomi. It is not merely a geography or a physical entity, but a repository of great culture-a great civilization. It is a land of great spirituality - a place of Dharma. Blessed by the Gods and nurtured by holy sages, the Punya Bhoomi is venerable as our Mother land-fynfeft teft - Janani Janma Bhumishcha Svargadapi Gariyasi- as remarked by Sri Rama addressing Lakshmana.


This holy land witnessed several trials and tribulations at different points in time in the past. Several sacrifices were made by men and women, families and the entire society. Finally, Bharat attained independence 75 years ago on the 15th August 1947. bestowing on us "Freedom". The country was born again, unshackling itself from the bonds. People of our country kept immense faith and patience. throughout these difficult times. through their devotion to almighty and the Country.


Our Paramacharya Pujya Mahaswamigal had given a special message of blessings on the day of Independence in 1947 emphasising the spiritual greatness of our Nation and how the tricolored Indian Flag symbolises three Shaktis - Durga, Lakshmi and Saraswathi with the Chakra - the embodiment of Dharma in the middle. He also pointed out the importance of every individual to develop independence- one

can consider himself independent if he can understand oneself fully. One must endeavour to develop that state of mind which ensures complete freedom.


75 years have passed since the birth of our Nation. Several developments have occurred, and several things have changed. That one constant which guides us all is our Sanatana Dharma- the bedrock of our civilization. Vedas and Shastras help sustain our Dharma. Upansihad says -Satyam Vada- Dharmam Chara - Dharma is the path on which we must lead our lives. It is the moral compass, it is the differentiator between the Good and Evil. If our country has withstood aggressions of various types for acons. it is because, our people had the strength given to them by Dharma. Dharma can be translated as virtuous acts, as being good to others, being charitable, not harming anyone or anything, being truthful to our inner conscience. When the mortals digressed from the path of Dharma, God himself incarnated in different forms to uphold Dharma. Ramo Vigrahavan Dharma - Sri Rama was the epitome of Dharma and by his very conduct, he showed to the world the greatness of Dharma. Our puranas and Itihasas abound with episodes that show how the adharmic paths appear to be easy and successful, but the path of dharma even though riddled with difficulties is the one that leads us to victory ultimately - Truth alone Triumphs. Sage Tiruvalluvar in Tirukkural has written several profound couplets on Truth and Dharma. If one does not accept Dharma and is opposed to it, he or she is not only causing great harm to oneself, but also to the Society and the Nation.


Sri Adi Shankaracharya through his teachings and works has not only guided us about the Advaita philosophy, but has also shown the path of National Integration so very vital for our Bharata. His yatras throughout the country from Kanyakumari to Kashmir and Kasi to Rameshwaram in his brief earthly sojourn instil in us a feeling of oneness. The Shankaracharya Hills in Kashmir are testimony to this. When forces inimical to our Dharma were increasing. He won over them through discussions and debate and reestablished the Dharmie way of life and established Shanmata the six schools of worships, namely Ganapatyam,Saivam, Saktam, Sauram, Vaishnavam and Kaumaram. The seeds of unity sown by him provide the vital undercurrents for the Unity of our Nation to this day - in spite of diversities in different aspects like region, religion, language etc.


Ours is a very ancient civilization. It is the Bhumi of Rishi- Krishi - the land of Rishis and the land of agriculture. Our Dharma is unique and provides us with a broad mindset we have always believed in the concept of "Vasudhaiva Kutumbakam" and Swadeso bhuvanatrayam" - the whole world is one for us. While we may not be most advanced or prosperous in materialistic terms, our Culture and civilization is the richest. Villages are the soul of our Nation - they show us the virtues of simplicity, of being content with limited wants, of being in harmony with Nature, of being altruistic.


If our Dharma could be propagated, it would lead to peace and happiness in the whole world. If there is any country in the world which can be a Gurn in the realm of Dharma & religion, it can only be our country. Adi Shankara's teachings will provide us with a sound basis for peace and friendship not only among the people of India but also peoples of the whole world.


We pray to Lord Chandramouleeswara to shower His blessings on the entire Nation on this auspicious 75th Independence Day.


Dharmo Rakshati Rakshitaha.

15, ఆగస్టు 2022, సోమవారం

ఆనంద స్వరూపం

 

 ఆనంద స్వరూపం 

భూమిమీద వున్న ప్రతి మానవుడు నేను అది నేను ఇది అని తనగురించి చెపుతువుంటారు కానీ నిజానికి చాలామంది నీవు ఏమిటి అని అడిగితె ఇదేమి పిచ్చి ప్రశ్న నేను ఎవరు అని అడుగు అంతే కానీ నేను ఏమిటి అంటావేమిటి అని అనటం కద్దు.  ఎందుకంటె తానూ ఏమిటి అనేది చాలామంది గుర్తించినా తెలియనట్లే వుంటారు. నీవు ఎవరు అనే ప్రశ్నకు నేను రాజారావుని నేను పుల్లారావుని, నేను శేఖరుని అని ఇలా తమ తమ పేర్లు చెపుతారు.  లేకపోతె నేను ఆఫీసరుని, నేను రైతుని, నేను ఇంకోటి ఇంకొకటి అని వారి వృత్తిని చెపుతారు.  కానీ నీవు ఏమిటి అంటే మాత్రం జావాబు లేదు. 

మిత్రమా నీవు ఏమిటి అనే ప్రశ్న ఏమిటంటే నీ స్థితి ఏమిటి అని అర్ధం.  నిజానికి ఈ ప్రపంచంలో వున్న ప్రతి మనిషి వున్న, ఉండాల్సిన స్థితి ఏమిటంటే "ఆనందము" అంటే ప్రతి మనిషి ఆనందస్వరూపుడే.  ఇది వినటానికి వింతగా వుంది కదా.  కానీ ఇది అక్షరాల నిజం. అది ఎట్లనో చూద్దాం. 

మా పిల్లవాడు డిగ్రీ చదివాడు పని లేకుండా తిరుగుతున్నాడు అంటాడు ఒక తండ్రి.  ఆ పిల్లవానిని పిలిచి బాబు నీవు ఏపని చేయగలవు అంటే తాను తన ప్రావీణ్యత ఎందులో ఉందొ దానిగూర్చి చెప్పుతాడు.  ఉదాహరణకు నేను ఎలక్ట్రిషను అని ఒకడు అన్నాడనుకోండి నీవు యేమిటీచేస్తావు అంటే కరెంటుకు సంబందించిన పనులు అన్నీ నేను చేయగలను అంటాడు.  మరి మా ఇంట్లో సీలింగ్ ఫాను బిగించాలి వచ్చి బిగిస్తావా అంటే ఆ వస్తాను. అని ఊరుకోడు ఏమిస్తారు అని ప్రశ్నిస్తాడు.  అదేమిటయ్యా నీవు పనిలేదు అన్నావు కదా నేను పని చెప్పాను  పని చేయక ఏమిస్తావు అంటావేమిటి అని నీవు అంటావా అనవు   ఎందుకంటె అతను చేసే పని కేవలం ప్రతిఫలం కోసమే కానీ ఆ మాట అతను చెప్పడు నిజానికి అతనికి పనిచేయాలని లేదు కానీ పని చేస్తాడు ఎందుకంటె పనిచేస్తేనే వానికి ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి పనిచేయటం ఇష్టంలేక పోయినా కష్టమైన పనిచేస్తాడు.  కారణం పనికారణంగా వచ్చే ఆర్జన. తెలిసిందా పని చేయటం కేవలం డబ్బులకోసం మాత్రమే.  అదే నీవు పనిచేయకుండా డబ్బులు ఇస్తానంటే అతను పని చేసే పనే ఉండదు. డబ్బులు ఎందుకు అంటే డబ్బులతో ఆతను సంతోషాన్ని, సుఖాన్ని కొనుక్కుంటాడు.  వాటి అంతిమ విషయమే ఆనందం. 

నీవు నీ దగ్గర వున్న ద్రవ్యంతో తినుబండారాలు కోన్నావనుకో అవి దేనికోసం అంటే తినటానికి అని అంటాం కానీ నిజానికి వాటి లక్ష్యం తినటం వలన కలిగే ఆనందం మాత్రమే.   ఒక భర్త ఆఫీసులో అలసి ఇంటికి వచ్చి భార్యతో అన్నం పెట్టు బాగా ఆకలిగా వుంది అంటే కేవలం ఒక చింతకాయ తొక్కు లేక  గోంగూర పచ్చడో వేసి అన్నం పెట్టిందనుకోండి అది అతనికి రుచికరంగా ఉండేదే అయినా పూర్తీ అన్నం ఒక్క పచ్చడితో తినలేడుగా అందుకే ఏడుస్తూ తింటాడు అంతేకాదు కడుపునిండా తినడు.  రోజు వండే అంత పరిమాణంలోనే అన్నం వండినా ఆ రోజు సగానికన్నా ఎక్కువ అన్నం మిగులుతుంది.  ఏమండీ ఈ రోజు మీరు సరిగా తినలేదు చూడండి వండినది వండినట్లుగానే మిగిలింది అని ఆమె అంటే, ఒక్క పచ్చడితో ఎవరైనా కడుపునిండా తింటారా నా కడుపు ఇంకా ఆకలితోనే వుంది ఏమిచేయమంటావు అని నీళ్లు తాగి గొణుక్కుంటూ పడుకుంటాడు. 

మరుసటి రోజు అదే భార్య చక్కగా రెండు పచ్చళ్ళు, కూరలు, పప్పు పులుసు చేసి వడ్డించిందనుకోండి. ఆ భర్త తన భార్యను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తి కడుపునిండా భోజనం చేయటమే కాదు ఆమె వాటా అన్నం కూడా తినేస్తాడు.  ఏమండీ మొత్తం మీరే తింటే నేనేమి తినాలి అని ఆమె అంటే ఎందుకోయి నీవు బాధపడతావు నీవు అన్నానికి కూర్చొని తింటూవుండు నేను అన్నం వండుతాను అని వండి చక్కగా భార్యకు వడ్డిస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నిన్న భార్యను విసుక్కున్న భర్త ఈ రోజు ఆమెను మెచ్చుకోవటమే కాకుండా చక్కగా అన్నం వండి వడ్ఢిచ్చి మరీ సంతోషపడ్డాడు ఎందుకు అంటే ఈ రోజు ఆమె చేసిన వంటకాలతో తృప్తిగా భోజనం చేసాడు.  అంటే తానూ భుజించటం వలన ఆనంద పడ్డాడు. అదే ఆనంద స్వరూపం. 

ప్రతి మనిషి కోరుకునేది ఆనందమే కానీ మరొకటి కాదు.  ఎందుకంటె మనిషి యదార్ధ స్థితి ఏమిటంటే అది ఆనంద స్వరూపం. తన యదార్ధ స్థితిని పొందటానికి ప్రతి మనిషి కోరుకుంటాడు. 

ఆనంద స్వరూపం అంటే ఏమిటి : ఆనందం అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కక్క విధంగా ఉంటుంది. ఒకనికి ఇంట్లో వంట నచ్చదు బైట హోటల్లో బాగా ఖర్చుచేసి వివిధ వంటలను భుజించి ఆనంద పడతాడు. ఇక ఒకనికి సిగరెట్ త్రాగటం ఆనందాన్ని ఇస్తుంది. ఇంకొంకనికి  మద్యం సేవించటం ఆనందాన్ని ఇస్తుంది. ఒకడికి ఇంకొకడిని మోసం చేసి డబ్బు సంపాయించటం ఆనందాన్ని ఇస్తుంది. ఒకనికి ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకోవటం ఆనందం ఇస్తుంది. ఇలా చేప్పుకుంటూ పొతే అనేకమైన విధాలుగా ఒక్కొక్కరికి ఆనందం చేకూరుస్తుంది.  కానీ ఒక్కటి మాత్రం.  నిజం ఎవ్వరికీ ఏది ఆనందాన్ని ఇచ్చినా కూడా అది కేవలం తాత్కాలికం మాత్రమే. ఉదాహరణకు చక్కటి విందు ఆరగించటం వలన ఆనందం కలిగే వానికి తాను విందు భోజనము చేసే అంతవరకే ఆ ఆనందం ఉంటుంది.  కానీ తరువాత కాదు అదే విధంగా పైన పేర్కొన్న అన్ని విషయాలకు వర్తిస్తుంది.  కానీ ఎవ్వరు అది గమనించక మరల మరల తాను ఆ పనులు చేస్తూ ఆనందాన్ని వెతుకుంటూ ఉంటారు. 

నీకు నీ మిత్రుడో లేక బంధువో కనపడితే నీవు అడిగే మొదటి ప్రశ్న" నీవు బాగున్నావా" అంటావు లేకపోతె "నీవు క్షేమంగా వున్నావా" అని అడుగుతావు.  పూర్వకాలంలో లేఖలు వ్రాసుకునేవారు ముందుగా "ఉభయ కుశలోపరి" అని వ్రాసేవారు అనగా ముందుగా ఉభయుల కుశలం తెలుపుతూ   తరువాత ఇతర విషయాలు ప్రస్తావించేవారు. నీవు బాగున్నావా అంటే నీవు బాగుండాలని నీ మిత్రుడు కోరుకుంటున్నాడు అని అర్ధం అంటే నీవు ఆనందంగా వున్నావా అని అర్ధం.  ఎవ్వరు కూడా నీవు భాదపడుతున్నావా, నీవు ఏడుస్తున్నావా, నీవు దుఃక్కిస్తున్నవా అని అడగరు.  అంటే అవి ఏవి నీ స్వరూపం కాదు అని అర్ధం.  బాధలో వున్నవాడు కూడా ఆనందంకోసం వెతుకుతూవుంటాడు అంతే కానీ ఆనందంలో వున్నవాడు యెవ్వడు దుఃక్కించాలని కోరుకోడు  అవునా కాదా

కాబట్టి భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనిషి నిజ స్వరూపం ఆనందం మాత్రమే కానీ అందుకు వేరుకాదు. ప్రతి వారు తమ జీవితం ఆనంద మయం కావాలని ప్రయత్నించే వారే.  తన వద్ద వున్న డబ్బులు తాను పొందాలనుకునే ఆనందానికి సరిపోవు అని అనుకున్నప్పుడు ఇంకా ఇంకా డబ్బులు సంపాయించటానికి మనిషి ప్రయత్నిస్తాడు. యెంత ఎక్కువ డబ్బులు ఉంటే అంత ఎక్కువ సుఖాలను, భోగాలను అనుభవించవచ్చు అంటే అంత ఎక్కువ ఆనందం కలుగుతుంది అని అనుకుంటాడు.  కానీ తానూ అనుభవించే ఆనందం పూర్తిగా క్షణికమని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు మొదలవుతుంది శాశ్వితమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందా అనే వెతుకులాట.  అదే మనిషిని భగవంతుని వైపు మళ్లించే భావన.  అప్పటినుండి మనిషి తాను శాశ్విత ఆనందం పొందాలని ప్రయత్నిస్తాడు. . అందుకే మన మహర్షులు " ఆనందో బ్రహ్మ" అని అన్నారు. భగవంతుడు ఆనంద స్వరుపుతూ. మనం ఒక వెంకటేశ్వర స్వామికో లేక సత్యనారాయణ స్వామికో లేక మారె ఇతర దేవి దేవతలకైనా వివిధ పుష్పాలతో వస్త్రాలతో అలంకరించటం చేస్తాము.  దానికి కారణం ఎప్పుడైతే భక్తుడు ఆ దేవతా విగ్రహాన్ని కళ్ళతో చూస్తాడో అతని మనసులో ఆనందం కలుగుతుంది.  ఆనందం కలగాలి అని ఆలా అలంకారం చేస్తారు.  అంతిమ లక్ష్యం ఆనందమే కానీ వేరొకటి కాదు.  భక్తి భావం అంటే దాని ఫలితం ఆనందం మాత్రమే.

వైదిక శాస్త్రాలు అనేక పర్యాయములు భగవంతుడిని అనంతమైన దివ్య ఆనంద సాగరంగా అభివర్ణించాయి.

ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ (తైత్తిరీయ ఉపనిషత్తు 3.6)
"భగవంతుడంటే ఆనందమే అని తెలుసుకో."

కేవలానుభవానంద స్వరూపః పరమేశ్వరః (భాగవతం 7.6.23)
"భగవంతుని స్వరూపము స్వచ్చమైన ఆనందము చే తయారుచేయబడినది."

ఆనంద మాత్ర కర పాద ముఖోదరాది (పద్మ పురాణం)
"దేవుని చేతులు, పాదాలు, ముఖము, ఉదరము మొదలగునవన్నీ ఆనందము చే తయారు చేయబడినవి"

జో ఆనంద్ సింధు సుఖరాసి (రామాయణం)
"భగవంతుడు సంతోష-ఆనందముల మహాసాగరము"

ఈ శాస్త్రాల్లో ఉన్న మంత్రములు మరియు శ్లోకములు అన్నీ, దివ్య ఆనందమే భగవంతుని వ్యక్తిత్వ స్వభావమని వక్కాణిస్తున్నాయి. తన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి భగవంతుని యందే నిమగ్నం చేసినవారు, తమలోనే ఉన్న భగవంతుని యొక్క దివ్య ఆనందాన్ని అనుభవించటం ప్రారంభిస్తారు.

కాబట్టి భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే మనిషి నిజ స్వరూపం ఆనందం మాత్రమే కానీ అందుకు వేరుకాదు. కాబట్టి నిత్యమైనది, శాశ్వితమైనది అయిన ఆనందమే మోక్షము.  కాబట్టి మిత్రమా ఇప్పుడే శాశ్వితము, నిత్యమూ అయిన ఆనంద స్వరూపుడైన భగవంతుని తెలుసుకో మోక్షార్థివి కమ్ము. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

సరస్వతీ రాజమణి '..

 15 ఏళ్ళకే దేశం కోసం వజ్రాల నగలు త్యాగం చేసి నేతాజీ దగ్గర గూఢచారిణి గా చేసిన 

' ధీరమణి సరస్వతీ రాజమణి '..


అది ఒక విశాలమైన రాజభవనం లాంటి మందిరం ! అడుగడుగునా వైభవం తొణికిసలాడుతున్నది ! ఆ భవనం ఉన్నది రంగూన్ లో 

.

ఆ భవనపు హాలులో గాంధీగారు ఆసీనులయి ఉన్నారు ! ఆ కుటుంబ యజమాని తదితర సభ్యులంతా చాలా శ్రద్ధగా గాంధీగారు చెప్పే విషయాలు వింటున్నారు ! 

.

ఎందుకో గాంధీగారి చూపు ఆ హాలు కిటికీ దాటి ఆ ఇంటి ఆవరణలో గల ఒక విశాలమైన మైదానంలో తుపాకీతో సాధన చేస్తున్న ఒక పది సంవత్సరాల బాలికమీదకు‌ ప్రసరించింది ! 

ఆ అమ్మాయి ని తన వద్దకు పిలిపించుకున్నారు 

..

అమ్మా ! నీవు ఈ తుపాకీతో సాధన చేస్తున్నావుకదా ఎందుకు ?...అడిగారు గాంధీగారు 

..

నా తుపాకీతో కనీసం ఒక్క బ్రిటీష్ వాడినైనా చంపెయ్యాలని నా కోరిక ...బదులిచ్చింది బాలిక 

..

"హింసా మార్గము తప్పుకదా" అని అంటూ అహింస యొక్క విశిష్టత గాంధీ గారు చెప్పటం మొదలుపెట్టారు ! 

..

వెంటనే ఆ బాలిక " నాకు మీ అహింసా మార్గము నచ్చదు ,అహింసవలన బ్రిటిష్ వాడు మనకు స్వతంత్రం ఇవ్వడు " అని నిర్మొహమాటంగా చెప్పింది ! ...నిరుత్తరుడయ్యారు గాంధీగారు 

.

ఆ బాలిక పేరు రాజమణి ఆమె తండ్రి చాలా గొప్ప సంపన్నుడు భారతదేశంలో ఒక బంగారుగనికి యజమాని ! బ్రిటిష్ వారి అణచివేతకు తట్టుకోలేక కుటుంబ సమేతంగా రంగూన్ లో నివాసం ఏర్పరచుకున్నాడు ...

..

ఈ సంఘటన జరిగిన కొద్దికాలానికి నేతాజీ రంగూన్ వచ్చి తన సైన్యానికి కావలసిన నిధులు సేకరిస్తున్నారు ! అప్పటికి రాజమణికి 15 సంవత్సరాలు వచ్చాయి ! 

.

అందరూ తమ వంటిమీది ఆభరణాలు వలిచి ఇస్తుంటే చూసిన బాలిక తానుకూడా తను ధరించిన అతిఖరీదైన వజ్రాలతో కూడిన నగలను వలిచి మూటగట్టి నేతాజీకి ఇచ్చివేసింది ! గమనించారు నేతాజీ అప్పుడు ఏమీ మాట్లాడలేదు .

.

మరుసటి రోజున రాజమణి ఇంటిముందు ఆగిన వాహనం నుండి నేతాజీ దిగారు నేరుగా ఇంటిలోనికి వచ్చి తన చేతిలోని అత్యంత ఖరీదైన నగలమూటను ఆ బాలిక తండ్రికి ఇచ్చి తెలిసీ తెలియని వయస్సులో తన నగలు దానం చేసింది ఈ బాలిక కావున ఇవి నాకు వద్దు అని తిరిగి ఇచ్చి వేశారు .

.

తండ్రి చేతిలోని మూటను అలాగే తీసుకొని మరల నేతాజీకి ఇచ్చి "నేను తెలిసే ఇచ్చాను ! అవి నా నగలు ,నా సొమ్ము భారత స్వతంత్ర పోరాటానికి ఉపయోగ పడాలి ...అని స్థిరంగా గొప్ప పరిణతితో పలికింది .. ఆ బాలిక విజ్ఞతకు ముగ్ధుడైన నేతాజీ ఆమెకు సరస్వతి అని నామకరణం చేశారు ! 

.

అప్పటినుండి ఆవిడ

 " సరస్వతి రాజమణి ""

.

ఇంకొక రెండేళ్ళు గడిచాయి నేతాజీ మరల రంగూన్ వచ్చినప్పుడు సరస్వతి తన నలుగురు స్నేహితులతో కలిసి INA లో చేరతామని నేతాజీని అభ్యర్ధించారు ! వారి తల్లిదండ్రుల అనుమతితో వారిని తన గూఢచారిదళంలో చేర్చుకున్నారు నేతాజీ ! 

.

వారి బాధ్యత ఏమిటంటే బ్రిటిష్ సైనికాధికారుల ఇండ్లలో పని చేస్తూ సైనిక రహస్యాలను I.N.A కు చేరవేయడం ! 

.

కొంతకాలం వారి పని సజావుగా నడిచింది ...ఒకరోజు ...సరస్వతి స్నేహితురాలు దొరికిపోయింది ! 

.

బ్రిటిష్ వారు ఆమెను బంధించారు ! 

.

బంధింపబడిన తన స్నేహితురాలిని విడిపించడానికి సరస్వతి పథకరచన చేసింది ! ...ఆ కారాగారంలో ఒక వేడుక జరుగుతున్నప్పుడు తాను నృత్యకళాకారిణిగా వెళ్ళింది ! నాట్యం చేస్తూ బ్రిటిషు వారికి మత్తుమందు ఇచ్చి సమయం చూసి తన నెచ్చెలిని తప్పించి పరుగెత్తుతూ బుల్లెట్ దెబ్బతిని మూడు రోజులు చెట్టుమీద దాక్కొని బయటపడింది ..

..

తదనంతర కాలంలో ఆ గాయం తనను కుంటిగా మార్చినా చలించలేదు ఆ ధీర వనిత ! 

.

స్వతంత్ర వచ్చిన తరువాత భారత్ తిరిగి వచ్చి సరి అయిన గుర్తింపులేక పోషణకోసం పాతబట్టలు కుట్టు కుంటూ పొట్ట పోసుకుంటూనే తనకు ఉన్నంతలో సమాజసేవ చేస్తూ దుర్భరదారిద్ర్యంలో జీవనయానం సాగించింది ఆ ఆగర్భశ్రీమంతురాలు ! 

.

ఈ వీరవనిత పరిస్థితి ఎవరి ద్వారానో విన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈవిడ ఉండటానికి అద్దెలేకుండా ఒక మంచి ఫ్లాటు ,5 లక్షల నగదు 2006 సంవత్సరంలో ఇచ్చారు ....

..

ఎందరో ధీరవనితలు ,వీరసైనికుల త్యాగఫలం మన స్వతంత్రం ! కేవలం అహింసవలననే వచ్చింది అంటే ....????

courtesy : వూటుకూరు జానకిరామారావు

Kashmir issue atal bihari Vajpai

 PV నరసింహారావు గారు PM గా  ఉన్నప్పుడు atal bihari Vajpai గారిని India representative గా UNO కి పంపడం జరిగింది. UNO లో Kashmir issue గురించి hot డిస్కషన్స్ జరుగుతున్నయ్యి. Vajpai గారు తన ఉపన్యాసం start చేశారు. నా views చెప్పడానికి ముందు చిన్న స్టోరీ చెప్తాను అన్నారు.  చాలా కాలానికి ముందు కశ్యప్ అనే ఒక ఋషి (saint)ఉండేవాడు. ఆయన పేరు మీదనే ప్రస్తుత Kashmir కి ఆ పేరు వచ్చింది.  కశ్యప్ దట్టమైన అడవి దారిలో వెళ్తూ ఒక అందమైన  సరస్సు చూసాడు. అక్కడ స్నానం చేద్దామని నిర్ణయించుకొని బట్టలు తీసి ఒడ్డున  పెట్టి సరస్సులోకి దిగాడు. స్నానం చేసి ఒడ్డుకొచ్చేసరికి ఒక పాకిస్తానీ తన దుస్తులు అపహరించారని గ్రహించాడు. ఇలా  చెప్పుకుపోతూ ఉండగా సభలో నుండి ఒక పాకిస్తానీ లేచి objection  raise చేసాడు.  ఋషి కశ్యప్ కాలంలో అసలు పాకిస్తాన్ లేనేలేదు,  పాకిస్తానీ ఋషి యొక్క బట్టలెలా అపహరిస్తాడు అని చెప్పి  Vajapayi మీద  కేకలు వేసాడు.  అపుడు Vajpayi నవ్వుతూ "నేను UNO కి చెప్పదలచుకున్న అంశం పూర్తి అయింది, అప్పుడు పాకిస్తాన్ లేనేలేదు అంటున్నారు ఇప్పుడు Kashmir,  Pakistan కి చెందినది  అంటున్నారు" అని అన్నారు.  సభలో వాళ్లంతా తమ కరతాళధ్వనులతో జయజయ  నినాదాలు చేసారు. 

దీనిని మీ ఇతర గ్రూప్ లకి f/w చేయండి.

స్వాతంత్ర్య పతాకం

 శీర్షిక.. స్వాతంత్ర్య పతాకం 

వందనం..వందనం..మన జాతీయ జెండాకు వందనం..అభివందనం

ఎగురుతోంది ఎగురుతోంది మన భారత జెండా గౌరవం నిండా

గ్రామ గ్రామంలో నగర నగరంలో

రాజధాని ఢిల్లీలో సగర్వంగా ఎగురుతోంది...భారత కీర్తి కిరీటమై శాశ్వత సౌర్యమై జాతికి స్పూర్తి యై  ......వందనం వందనం

రూపకర్తలు పింగళి కృత మువ్వన్నె ల జండా..ముచ్చటగా గగనాన విజయవిహారం...మన జాతీయ జెండా...గౌరవం నిండా......

కాషాయం...త్యాగముగా..శ్వేతవర్ణం స్వచ్ఛంగా..హరితవర్ణం...సంపద అభివృద్ధి ల సంగమమై..

మధ్యనుండు అశోకచక్రం...ధైర్యం..పరాక్రమం సూచిస్తూ....ఎగురుతోంది...జాతీయ జెండా.....

ఎదురు లేని భారతికీ...అలుపెరుగని విజయానికి చిహ్నంగా...జాతీయ జెండా....జాతి గౌరవ కీర్తి మకుటమై.....

వందనం..వందనం...నీకిదే అభివందనం

దేశమంత జరుపుకునే ఉత్సవాలు....గణతంత్ర దినం..స్వాతంత్ర్యదినం..బాపూజీ జన్మదినం. అల్లూరి జన్మదినం ...

మురిపెముగా చూసుకునే మన జెండా నేర్పుతోంది...శాంతి..ధర్మం.....ధైర్యం సాహసం..స్పూర్తిగా...

  వందనం...వందనం...నీకిదే అభివందనం

విప్లవ జ్యోతి అల్లూరి కలలు కన్న స్వాతంత్ర్య దేశం

హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులం

అందరమొకటై...హాయిగ కలసి.

చేసుకునే వేడుకే... ..

వందనం...వందనం..జాతీయ జెండాకు అభివందనం..మనసాభివందనం.

ఆజాదీ కా అమృతోత్సవ శుభ వేళ సమైక్య వందనం

సంతోష వందనం ..వందనం వందనం

.

 ...డాక్టర్ దేవులపల్లి పద్మజ 

 విశాఖపట్నం....

శ్రీచక్రాలయం

 .

*...*

ప్రపంచం మొత్తంలో … అతి పెద్ద అందమైన, అద్భుతమైన *శ్రీచక్రాలయం*…!


🛕🛕🛕🛕🛕🛕🛕🛕


          *దేవీపురం*

                  

      *(సహస్రాక్షిగా రాజరాజేశ్వరీదేవి)*


*విశాఖ జిల్లాలోని దేవీపురం - ఇంత పెద్ద శ్రీ చక్రాలయం ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడా లేదు.*


*విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కి.మీ దూరంలో, నారపాడు గ్రామశివార్లలో తొమ్మిది కొండల నడుమ, పచ్చని తోటల మధ్య, దేవీపురంలోని శ్రీచక్రాలయంలో “సహస్రాక్షి” గా శ్రీరాజరాజేశ్వరీ దేవి భక్తులకు దర్శనమిస్తోంది.*


*ఇక్కడి ఆలయం అంతా ఒక శ్రీ చక్రమే. ఇంత పెద్ద శ్రీచక్రాలయం ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడా లేదు.*


*“నాకు ఇల్లు కట్టించు!”*


*న్యూక్లియర్ ఫిజిక్స్ లో డాక్టరేట్ చేసి, ముంబాయిలోని టాటా ఇన్ స్టిట్యూట్ లో శాస్త్రవేత్త గా పనిచేస్తున్న నిష్ఠల ప్రహ్లాద శాస్త్రిని ఈ ఆలయ నిర్మాణానికి అమ్మవారు ఎన్నుకుంది. ఒకసారి ప్రహ్లాదశాస్త్రి గారు హైదరాబాద్ లో బిర్లామందిర్ కు వెళ్ళి, బాలాజీని దర్శించి, ఒకచోట ధ్యానం చేసుకుంటుండగా, వారికి బాలాజీ స్త్రీ రూపంలో త్రిపురసుందరిగా దర్శనమిచ్చి "నాకు ఇల్లు కట్టించు!" అని పలికి అంతర్థానమైనట్లుఅనిపించిందిట.*


*అప్పుడే కాకుండా మరొకమారు వారికి ధ్యానసమయంలో దర్శనమిచ్చి "ఈ కార్యం నీ వల్లే నెరవేరాలి. జాగ్రత్తగా, దోషరహితంగా, ప్రజలందరికీ మేలు కలిగేలా శ్రీదేవి నిలయం నిర్మించు!" అని ఆదేశించింది.*


*ప్రహ్లాద శాస్త్రి తమ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వస్థలమైన విశాఖపట్నం వచ్చారు.*


*ఆలయం ఎక్కడ కట్టాలి ?*


*ఆలయం నిర్మించాలనే సంకల్పంతో 1982 లో 108 రుత్విక్కులతో 16 రోజులు దేవీయాగం చేశారు. ఆ యజ్ఞంలో ఆలయం నిమిత్తం మూడు ఎకరాల భూమి యజ్ఞప్రసాదంగా లభించింది. ఈ విధంగా శ్రీ చక్రాలయ నిర్మాణ స్థలాన్ని త్రిపురసుందరీ దేవి స్వయంగా ఎంచుకుంది. తొమ్మిది కొండల మధ్య, రమణీయంగా, ప్రశాంతంగా ఉన్న ఆ స్థలంలో ప్రహ్లాదశాస్త్రి తిరుగుతూ ఉండగా, ఒకరోజు ఒక అగ్ని గుండంలో మెరుపులతో మెరిసే శరీరంతో 16 ఏళ్ళ అమ్మాయిలా దేవి కనిపించింది. పూజలు అందుకుంది. తనకు అక్కడే ఇల్లు కట్టాల్సిందిగా ఆదేశించింది.* 


*ఆ ప్రదేశంలో తవ్వితే, అగ్నిలో కాల్చిన గుర్తులున్న పంచలోహ శ్రీచక్ర మేరువు లభించింది. దాని గురించి విచారించగా సుమారు 250 ఏళ్ళ క్రితం అక్కడ గొప్ప యజ్ఞం జరిగినట్లు తెలిసింది.*


*ఆ శ్రీచక్రమేరువును మళ్ళీ భూమిలో నిక్షిప్తం చేసి దానిపై కామాఖ్యపీఠం ప్రతిష్టించారు.* 


*ప్రక్కనే వున్న ఎత్తైన కొండమీద శివాలయం కట్టించారు.*


*ఆలయ సొగసులు :*


*ఈ దేవీపురం ప్రాంతంలోని శ్రీచక్రమేరునిలయం 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు కొలతలతో నిర్మితమైంది. *


*ప్రహ్లాదశాస్త్రి ఏకాగ్రతతో, సౌందర్యలహరిలో ఆదిశంకరులు సూచించిన విధంగా, లలితా సహస్రనామ స్తోత్రంలో వాగ్దేవతలు వర్ణించిన విధంగా ఉండేటట్లు, ఆలయ నిర్మాణం పూర్తి చేయించారు.* 


*1990 లో జూన్ 4 వతేదీన మూలవిరాట్ ‘సహస్రాక్షి’ విగ్రహ ప్రతిష్ట జరిగింది.*


*శ్రీ చక్రాలయంలో బిందు స్థానంలో (మూడో అంతస్తు) పవళించిన సదాశివుని మీద కూర్చున్న, నిలువెత్తు ఆ విగ్రహం కళ్ళలోకి చూస్తుంటే, జీవకళ ఉట్టిపడుతూ, జీవితం ధన్యమవుతుంది. ఆమె చుట్టూ, క్రింది అంతస్తులలో, నక్షత్రాలను పోలిన ఆవరణలు, వాటిలో ఆమె పరివార దేవతలు ఉన్నారు.*


*నిష్ఠల ప్రహ్లాద శాస్త్రికి ధ్యానంలో గోచరించిన విధంగా ఖడ్గమాల దేవతలకు రూపకల్పన చేసి గంధర్వ మాతృమూర్తులుగా 68 విగ్రహాలను భూమి మీద, 10 విగ్రహాలను మొదటి అంతస్తులోను, రెండో అంతస్తులో 10 విగ్రహాలను సిమెంటు చేసి పెట్టారు. మిగిలిన విగ్రహాలను పంచలోహాలతో చేయించి మూడో అంతస్తులో అష్ట దళ పద్మంలో ఉంచారు. ఇవికాక భూమిమీదే భ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండీ, మహాలక్ష్మీ, బాలాజీ, కాళియమర్దన చేస్తున్న శ్రీకృష్ణుడు _ఈ పది విగ్రహాలనూ రాతితో చెక్కించి ప్రతిష్టించారు. ఈ విగ్రహాలకు భక్తులు అభిషేకాలు చేస్తారు…*

🙏🙏🙏🛕🙏🙏🙏

సేకరణ

నాలుగు ప్రశ్నలు

 శ్లోకం:☝️

*సముద్యతే కుత్ర న యాతి పాంశులా*

*సముద్యతే కుత్ర భయం భవేజ్జలాత్ l*

*సముద్యతే కుత్ర తవాపయాత్యారి:*

*ప్రహేణ సంబోధన వాచికం పదం ll*


భావం: ఈ శ్లోకంలో నాలుగు ప్రశ్నలున్నాయి. మొదటి సమాధానం నుండి ఒక అక్షరం తగ్గిస్తే రెండో సమాధానం వస్తుంది. రెండోదాన్ని నుండి ఒక అక్షరం తగ్గిస్తే మూడో సమాధానం వస్తుంది. మూడో సమాధానం నుండి ఒక అక్షరం తగ్గిస్తే నాల్గవ ప్రశ్నకు సమాధానం వస్తుంది.

ఒకటవ ప్రశ్న: ఎవరు ఉదయిస్తే వ్యభిచారులు తిరగడం మానేస్తారు? సమాధానం 'హిమకరః' అంటే (చంద్రుడు), ఈ శ్లోకం లోని ప్రశ్నలన్నీ సతి సప్తమిలో (సప్తమీ విభక్తిిిి లో) వున్నాయి. కనుక సమాధానాలు కూడా సతి సప్తమిలోనే ఉండాలి. కనుక సమాధానం *హిమకరే*

రెండవ ప్రశ్న: ఏ జంతువు నీటినుండి బయటకు వస్తే భయం కలుగుతుంది? మొసలి. సంస్కృతంలో మొసలిని 'మకరః' అంటారు. సప్తమీ విభక్తి కనుక *మకరే* సమాధానం.

మూడవ ప్రశ్న: నీవు ఏది ఎత్తితే నీ శత్రువులు పారిపోతారు? 'కరః' అంటే చేయి. సతి సప్తమి కనుక *కరే* నీవు చేయి ఎత్తితే శత్రువులు పారిపోతారు.

నాలుగవ ప్రశ్న: హీన కర్మల నాచరించే వాడిని ఏమని పిలుస్తారు? 'ఒరే' అని గౌరవం లేకుండా పిలుస్తారు. దీన్ని సంస్కృతములో *రే* అంటారు.

14, ఆగస్టు 2022, ఆదివారం

హిందువులు

 *🚩🕉హిందువులు అల్పసంఖ్యాకులే!!🕉🚩*


*సామవేదం షణ్ముఖశర్మ*

...............


    *భారతదేశంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కానీ మరో కోణంలో అల్ప సంఖ్యాకులు. మనం మైనారిటీ అనుకుంటున్న వారే అధికసంఖ్యాకులనడం సత్యదూరం కాదు.        ఒక్కసారి పరిశీలిస్తే ఈ వాస్తవాన్ని అంగీకరించుదాం.* *హిందువులు పేరుకి ఎక్కువ సంఖ్యలో ఉన్నా, అందులో కొందరు కేటాయింపుల కోసం హిందువులుగా చెలామణి అవుతూ, ఇతరుల మతాల్లోకి మారిన వారు.*


        *మరికొందరు - ఇందులో ఉన్నా ఈ మతం పట్ల శ్రద్ధ, హిందువులుగా జీవించాలనే ఆసక్తి, ఈ మతాన్ని కాపాడుకోవాలనే భక్తి ఏ మాత్రం లేనివారు. ఏదో పండక్కో, పబ్బానికో, పురుటికో, చావుకో కాసింత హిందూ పద్దతి అవలంబిస్తారు. మొక్కులు తీర్చుకోడానికి గుళ్ళోకి వెళతారు. అంతేకానీ హైందవ ధర్మానికీ, ఆలయాలకీ ప్రమాదం వాటిల్లుతున్నా స్పందించరు. నాయకులు వివక్ష చూపిస్తున్నా చలించరు. పైగా ‘ఏ మతమైతే ఏం పోయింది?’ అని ఉదాసీనంగా ఉంటారు.*


        *ఇంకొందరు - నాస్తికులై హిందూ గ్రంథాలను, దైవాలను, సంప్రదాయాలను, ఆలయాలను దుయ్యపడుతుంటారు. పుస్తకాలు రాస్తుంటారు.*


        *ఇలా హిందువుల్లో మూడు రకాల వారిని మినహాయిస్తే - శ్రద్ధగా ధర్మాన్ని అవలంబిస్తున్నవారు అల్ప సంఖ్యాకులే.       నిజమైన హిందువులు వీరే.  దీనికి వ్యతిరేకంగా-ఇతర మతాల్లో వారు నూటికి నూరు పాళ్ళు ఒకే రకంగా ఉంటారు. కుటుంబా లన్నీ తమ మతాన్ని మించిన మతం లేదనే తీవ్ర అభినివేశంలో ఉంటారు. తమ మత గ్రంథాలపై, శ్రద్ధా కేంద్రాలపై, అలవాట్లపై వ్యతిరేకంగా మాట్లాడరు. ఇతర మతాలను అణచివేయడంలో, దూషించడంలో వెనుకాడనంత ఉగ్రాభిమానం కూడా ఉంటుంది.* *పిల్లా, పెద్దా, ఆడా, మగా ఖచ్చితంగా మత పద్దతులు అధ్యయనం చేస్తారు, అవలంబిస్తారు. తమ మత నాయకుడు అవినీతిపరుడైనా, హింసా స్వభావి అయినా కిమ్మనరు. పైగా ఒకే తాటిపై నిలబడి అతడిని విజయుడ్ని చేస్తారు. తమ మతాల పేరున తీవ్రవాదం ఉగ్రవాదాలతో ఉత్పాతాలు సృష్టిస్తున్న సంస్థల్ని కూడా పల్లెత్తు మాట అనరు.*


        *ఇలా అన్య మతాలు రెండూ చక్కని అనుష్ఠాన నిష్ఠతో ఉంటారు. వారిలో రెండో రకం లేదు. అందుకే వాళ్ళు సంఖ్యలోనూ, అనుష్ఠానంలోనూ, దృఢంగా ఉంటారు. వాళ్ళిద్దరి అభిలాష, తమ మతం ఈ దేశాన్ని ఏలాలి. వాళ్ళ లక్ష్యం హిందూమతం అణచివేయబడాలి.*


        *వీరి తపన ఆ దిశగా కృషి చేయడమే.   వీరిలో ఉన్న ఈ ఏకతాటి లక్షణాన్ని గమనించిన హిందూ(పుట్టుకతో) నాయకులు కూడా వీళ్ళని మురిపిస్తూ, మెప్పిస్తూ, బుజ్జగిస్తూ, జాతి సంపద పంచిపెడుతుంటారు. వాళ్ళ పండుగల్లో వెళ్ళి వాళ్ళ వేషాలు వేసుకొని విందులారగిస్తుంటారు. కానీ ఆ మతాలకి చెందిన ఒక్క నాయకుడు కూడా హిందూ పండగల్లో కనపడరు. వీలైతే ఆంక్షలు పెట్టేలా గొడవలు చేస్తారు.*


        *ఈ హిందూ నాయకులకు తెలుసు. నాలుగు రకాల హిందువుల్లో మళ్ళీ ‘మా కులం వాడే రావాలి - కావాలి’ అనే గోల చేసే నలభై రకాలున్నారని. వీరు ఏనాడూ హిందువులను సంఘటిత పరచలేరని.*


        *భారతదేశంలో గతంలో జరిగిన ఎన్నికల ఫలంగా పేట్రేగిపోయిన కొందరు క్రికెట్ లో పాకిస్థాన్ గేలిస్తే దౌర్జన్యంగా ఆకుపచ్చ జండాలతో దాడులు చేసి ‘పాకిస్తాన్‍కీ జై .....’ అంటూ బిగ్గరగా నినాదాలు చేసినా - ఏ రక్షణ వ్యవస్థా, ఏ నాయకమ్మన్యుడూ నోరెత్తలేదు. చర్య తీసుకోలేదు. దేశ భద్రతకి, వ్యవస్థకీ పెనుప్రమాదం పొంచి ఉందని తెలిసినా స్పందన లేదు. మతం మారడం లేదనే అక్కసుతో కర్ణాటక రాష్ట్రంలో ఒక దేవీ మందిర ఉత్సవ సమయంలో ఆలయంలో చొరబడి ప్రసాదంలో విషం కలిపి అనేకమంది అమాయకుల మరణానికి కారకులయ్యారు.*


        *ఇటువంటివి హిందూ మనుగడకి మాత్రమే కాదు, దేశ క్షేమానికీ, శాంతి సామరస్యాలకు ప్రమాదకరమైన పరిస్థితి. అల్పసంఖ్యాకులైన హిందువులు ఏం చేయగలరు? అన్ని మతాలవారితో సహా అందరం హాయిగా ఉండాలి - అని కోరుకునే స్వభావం సహజంగా కలిగిన హిందువులు బలంగా ఉండకపోతే, ఈ దేశంలో ఉనికి కూడా అసాధ్యమౌతుంది. ఇప్పుడు, వేల ఏళ్ళ క్రితం ఉన్న  పరాయి పాలనకు భిన్నంగా ఏమీ లేదు.* *కేరళ, పశ్చిమబెంగాల్‍, కాశ్మీర్‍, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హిందువులు మనుగడ సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‍, మధ్యప్రదేశ్‍, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో నేటికీ కొన్ని ప్రాంతాలలో (అన్యుల ప్రాధాన్యం ఉన్నవి) . హిందువులు అనుక్షణం అభద్రతతో, భయాందోళన ల్లోనే బిక్కు బిక్కుమంటున్నారు.*


        *కొందరు మేధావులు గణాంక వివరాలతో సహా వాస్తవాల్ని చెబుతుంటే అవి ఫేస్‍బుక్కుల్లో, వాట్సాప్‍లలో, యూ ట్యూబ్‍లలో లైకింగ్‍లు, షేరింగ్‍లతో సరిపోతున్నాయి. సరియైన ప్రతిచర్య లేదు.*


        *ప్రధాన మాధ్యమాలన్నీ వాస్తవాల్ని కప్పిపెడుతున్నాయి. తమ కుల నాయకులకు భజనలు చేస్తూ, పల్లకీలు మోయడంతోనే కాలక్షేపం చేస్తున్నాయి.*


*గతచరిత్రలో భారతీయతపై, హిందూధర్మంపై జరిగిన అన్యుల దాడులు, దౌర్జన్యాలు గానీ, నేడు జరుగుతున్న కిరాతకాలు గానీ నేడు హిందూ యువతకి తెలియవు తేలియనీయట్లేదు సేక్యూలర్ మీడీయా ఎందుకంటే పేంచి పోషిస్తున్నది వారే కాబట్టి. కోందరూ వారు ‘నోటా’వర్గంలో ఉంటారు. బాధ్యతతో దేశ ధర్మాలను కాపాడుకునే ప్రయత్నం చేయరు. ఈ నేపథ్యంలో ఈ దేశాన్నీ, ధర్మాన్నీ పరిరక్షించమని పరమేశ్వరుని ప్రార్థించడం కన్నా ఏమి చేయగలం స్పందన లేని స్వార్ధజాతిని మేల్కొల్పమని  వేడుకోవడం కన్నా ఏమి సాధించగలం??*

తెలుగు వ్యక్తి గొప్పదనం.

 🤷‍♂️🤷‍♂️

ఓ తెలుగు వ్యక్తి గొప్పదనం.

కడప జిల్లా ప్రొద్దటూరు కు గర్వకారణం. కాని ఆయన విగ్రహం లేదు 🤷‍♀️🤷‍♀️టిప్పు సుల్తాన్ కు గౌరం ఇచ్చారు ప్రొద్దటూరు నాయకులు 🤗

గణితబ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయ శర్మ  (నవంబర్ 22, 1907 - డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. సంజీవరాయశర్మ 1907 నవంబర్ 27 న కడపజిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించాడు.


జన్మతః అంధుడు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మ గారి అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవి విని గుర్తు  పెట్టుకుని గణితంలో అపార విజ్ఞానం సాధించాడు.


తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించే వారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకొన్నారు.


శ్రీ సంజీవరాయశర్మ తొలిసారి 1928 లో గణితావధానం నిర్వహించారు.yg అప్పటినుంచి 1995వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు లలోను పలు ప్రదర్శనలను ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినపుడు ప్రధాన ఆకర్షణ శ్రీ సంజీవరాయ శర్మ గారి గణితావధానమే.

సాధారణంగా గణితావధానంలో, పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం-కాని, ఈ విషయంలో శ్రీ సంజీవరాయ శర్మకు ఒక ప్రత్యేకత ఉంది. 

ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవారు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడా చెప్పి, కొంతవరకు జాతకం కూడా చెప్పేవారు.


ఈ ప్రత్యేకతను (మానవ గణన యంత్రంగా [Human Computer] పేరొందిన శకుంతలా దేవితో సహా) మరెవరూ చూపలేక పోయారు. ఆవిధంగా, 

ఇది అనితర సాధ్యమైన ప్రత్యేకత. 1966 డిసెంబరు ఏడో తేదీ.. అది హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక 2 power 103 ఎంత? 


దానికి సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని. 

'క' నుంచి 'క్ష' వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, 'స, రి, గ, మ, ప, ద, ని'' అక్షరాల లబ్దం ఎంత? ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు... 


కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు! ఆయనేమన్నా విద్యావంతుడా?... కాదు. 


*పోనీ రెండు కళ్లూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగిన* *వారా ?... కాదు. పుట్టుగుడ్డి!* 

*పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన* *చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం* *కావలసి వచ్చింది).*

*ఆయనే గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ "అంకెల ఆకాశంలో* *అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల* *గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!"  శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు* *బహుమానంగా...* 

*మొదటి గడిలో ఒక* వడ్లగింజ,*

*రెండో గడిలో రెండు* *గింజలు,*

*మూడో గడిలో* *నాలుగు, నాలుగో* *గడిలో ఎనిమిది...* *ఇలా అరవై నాలుగు గళ్లు నింపి* *ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి* *వచ్చేటప్పటికీ.. అందరూ తలలు పట్టుకుంటారు!*


*దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధానం... *ఒక కోటి 84 లక్షల*

*46 వేల 74 కోట్ల 40 లక్షల,*

*73 వేల, 70 కోట్ల, 95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజలన్నమాట... (1,84,46,74,40,73,70,95,51,615!)*

*ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే...*


*అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల.. ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు *వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు!*


*అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు!  ఇదంతా అబ్బురమని పించవచ్చు.* *కానీ సంజీవరాయశర్మ గణితావధాన వివరణ మహిమ అదంతా!  ఒకటి, రెండు, మూడు.... ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు!*


*సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షత్రాలు, వారాలు, పక్షాలు... గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు..* *తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించిన అప్పట్నించీ 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు.* *మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు,* *హైదరాబాదుల్లోను  పలు ప్రదర్శనలు నిర్వహించారు.. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ *ప్రముఖులు*

*ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు! నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు సైతం తయారుచేశారు. అప్పటి #రాష్ట్రపతి* *డా. #రాజేంద్రప్రసాద్ శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న* సొమ్ము ఎం.ఓ చేయడం విశేషం! 

అప్పట్లో అనీబ్‌సెంట్, నెహ్రూ,*

*రాజేంద్రప్రసాద్‌లతో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు,* *పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా శర్మ గణితావధాన..* *ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేనోళ్ల కీర్తించారు.*


*శర్మ పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంధాలయాల పిలుపునందుకొని పలు *గ్రంధాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు.*

*అలాగే మేధమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు.*

*ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే* *1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేథావి ఇల్లు కదలలేక పోయారు.*


*వివిధ విశ్వవిద్యాలయాలు... ఆయన్ని సత్కరించాయి. *కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సత్కరించాయి. దురదృష్టమేమిటంటే* *1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్‌కేసును దొంగలు తస్కరించారు.*


*ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్‌మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్‌న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర *కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు.. మంచి శిక్షణ పొందారు.* 


*కానీ సంజీవరాయశర్మ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే... ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు*


*ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ''ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు.. చేసేవాళ్లం'' అని శర్మనుద్దేశించి అన్నారు.*


*శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు.** *శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే* *సంజీవరాయశర్మని రక్షించుకోలేక పోయింది. 1997 డిసెంబరు రెండోతేదీన సంజీవరాయశర్మ అస్తమించారు. 'అంక విద్యాసాగర* *విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి* *గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి" రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ* *స్వామినర్చిస్తూ గడిపారు!*


*నిజానికి... ఈ నోబెల్ బహుమతులు, మెగ్‌సెసేలు,* *జ్ఞాన్‌పీఠ్‌లు...*

*ఆయన ప్రతిభ ముందు ఎంత* *చిన్నవో!*

*సేకరణ    (చరిత్రలో  తెలుగు వాడు)*

🍎🍎🍎🍇🍇🍇☀️☀️☀️      ----------------------

ఉద్వేగం

 ఉద్వేగం తన్నుకొస్తోంది!

ఉత్సాహం అంతరిస్తోంది!

మారిన జగతి పొకడల్ని చూసి!

అంతరించిన మానవతా విలువలకు వగచి!

భారతీయతను మరిచాం!

ఆధునికత పేరుతో అన్నీ మార్చేస్తున్నాం!

కడకు వసుధనే ఏమార్చే స్థితికి

ఎదిగాం!

మనకు కావల్సింది ఎదురులేని స్వేచ్ఛ!

మనతరంగాల్లో దాగుంది!

సర్వమూ నా సొంతం కాకుంటే

పాదాక్రాంతం కావాలనే ఇచ్ఛ!

ఈ వింత ధోరణులన్నీ!

ప్రగతికి ప్రతిబంధకాలుగా మారుతున్న వేళ!

ఏ గీతా ప్రబోధం వీరిని మార్చాలి!

ఏ బైబిల్ వీరిలోని విజ్ఞానాన్ని

మేల్కొల్పాలి!

ఏ ఖురాను ఈ జనతకు సుగమ మార్గాన్ని ప్రబోధించాలి!

మత మౌఢ్యం తొలగిపోయి!

మిత వాదం పరిఢవిల్లి!

సమత మమత ల స్వర్ణయుగం!

సాకారం కావాలని!

ఆ ఆకారానికై!

ఇకనైనా, ఇపుడైనా!

పురోగమిస్తూ మనమంతా!

మానవత తో ఇమ్మహిపై!

మనమంతా పురోగమిద్దాం!

మళ్లీ భారతీయతా సంస్కృతీ

సంప్రదాయాల పరిరక్షణలో!

భారతీయ పురోభివృద్ధికి!

ఎందరో మహనీయుల,త్యాగధనుల

అడుగుజాడల్లో పయనిద్దాం!

గగన వీధుల్లో మన భారత కేతనాన్ని స్వేచ్ఛగా ఎగుర నిద్ధాం!

నిజంగా!..మనమంతా భారతమ్మ ముద్దుబిడ్డ లనీ

చాటుకుందాం!

దోస పాటి.సత్యనారాయణ మూర్తి

సామర్లకోట

9866631877

న్యస్తాక్షరి

 *** న్యస్తాక్షరి (పాదాదిగ) *** 

""""""""""""''''""'''"""'"""''"""''''""''""'" 

నం --- ద --- న --- ము.  


తే:గీ: 


నందనవనము చేసుకొనవలె బ్రతుకు  

దయయు ధైర్యము న్యాయము ధర్మగుణము 

నడతలోనున్న మనిషి ఘనముగనుండు  

ముత్యము వలె స్వఛ్ఛమగుచొ మోక్షమదియె. 




*** సమస్యా పూరణము *** 

"""""""""'''''''"""""""""""''"""""""""""" 

గుణము ముఖ్యము మనిషికి కులము కాదు. 


తే:గీ:  


భారతము భాగవతమును వ్రాసినట్టి  

వ్యాసునిది జాలరి కులము,భారతీయు 

లెల్ల గర్వించు రాజ్యాంగ మెల్ల వ్రాయు 

జ్ఞాని అంబేద్కరుడు శూద్ర జాతి రత్న  

గుణము ముఖ్యము మనిషికి కులము కాదు. 




                💐💐💐 


* యర్నాగుల వేంకట రమణా రావు *