16, జనవరి 2021, శనివారం

భాగవతము

 భాగవతము -- సుయజ్ఞోపాఖ్యానము


అప్పుడు మృతపతి  యమధర్మరాజు 

యతివల రోదన లాలకించియును 

భూసురబాలుడై భూమిపైకొచ్చె 

భూపతి చావుకు బొగులు చున్నట్టి 

ప్రేత బంధువులను ప్రియమార గాంచి 

వినుచుండ వారితో నిట్లని బలికె


చచ్చిన వానికై హెచ్చగు నట్టి 

విపరీత మోహంబు వింతయే యగును 

పుట్టుక చావులు పుడమి దేహులలొ 

కన్నార మనుజులు  గాంచు చుండేరు 

అయినను యీ నరుల్ యాశ్చర్యముగను 

తము జావ మనయును  తలచియు మదిలొ 

చచ్చిన వానికై తా మేడ్చు చుంద్రు 

తప్పునే దేహికి చావు వద్దన్న 

చావున కొల్లక దాగుండ గలమె 

ఎచ్చట బుట్టెనో నచ్చటి కేగ

ప్రాణుల నైజంబు భావించి జూడ 

తప్పించ లేరది తప్పదేరికిని 


తల్లిని దండ్రిని తా మెడబాసి 

ఘనమగు తోడేళ్ళ గాటున పడక 

తా వని నున్ననూ తప్పించు కొంద్రు 

హేతువు యేమని యెంచి చూడంగ 

తల్లి గర్భమునందు తా ముండు నపుడె 

యెవ్వండు పోషించ యెదుగు చున్నా మొ 

యడవిలో నున్ననూ యతడె పోషకుడు 


ఎవ్వండు సృజియించు నెల్ల ప్రాణులను 

యెవ్వండు రక్షించు నెల్ల ప్రాణులను 

యెవ్వండు ద్రుంచును నెల్ల ప్రాణులను 

యెవ్వ డనంతుండు యెవ్వండు విభుడు 

యత డివ్విధంబున యఖిల లోకముల 

రక్షించు పోషించు రాగంబు తోడ 

అవ్వాని లీలయే నరయ నీ జగతి 

సర్వేశ్వరుని దివ్య సంకల్ప మునను 

సర్వంబు లీలగా సాగుచూ నుండు 


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

కామెంట్‌లు లేవు: