8, అక్టోబర్ 2024, మంగళవారం

కంబరామాయణం 103

 కంబరామాయణం 103

( జటాయువు పరిచయం)


వీరులారా !ఎవరు మీరు ? అని అడిగాడు జటాయువు ! అందుకు ప్రతిగా " మేము దశరథచక్రవర్తి కుమారులము, పేర్లు రామ ,లక్ష్మణులు ! ఈమె నా భార్య సీత" అని బదులిచ్చాడు రామచంద్రుడు !

...

దశరథుని కుమారులని తెలియగానే పట్టరాని సంతోషంతో రయ్యిమని క్రిందకు దూకాడు జటాయువు ! తన రెండురెక్కలతో వారిని చుట్టేసి ఆలింగనం చేసుకున్నాడు !

...

తన ఛత్రఛాయలో లోకాలను చల్లగా పాలించే నా మిత్రుడు దశరథుడు క్షేమమే కదా ! అని ప్రశ్నించాడు జటాయువు !

...

తమ తండ్రి స్వర్గస్తుడయినాడని తెలిపాడు రామచంద్రుడు !

...

ఆ వార్త వినటంతోటే పిడుగుపాటుకు దెబ్బతిని నేలకూలినట్లుగా ఒక్కసారిగా పడిపోయాడు జటాయువు ,కనుల వెంట ధారాపాతంగా కన్నీరు కారుస్తూ పెద్దపెట్టున విలపించసాగాడు !

...

రామలక్ష్మణులు వెనువెంటనే ఆయనను లేవదీసి కనులనీరు తుడిచి దగ్గరకు తీసుకున్నారు !

...

ఓ రాజా ! ఓ చక్రవర్తీ ! అధర్మపరులకు అసత్యవాదులకు సింహస్వప్నమా ! నేడు నీవే స్వప్నమయి పోయినావా ! నాడు శంబరాసురునితో పోరుసలిపినప్పుడు ఒకరికొకరము బాసటగా నిలిచి రణములో నిలబడినామే ! నీ మరణవార్త తెలిసిన తదుపరికూడా నా కంఠములో ప్రాణమింకా నిలచియున్నదే ! ఏమి జన్మనాది ! అంటూ దుఃఖించసాగాడు జటాయువు !

...

కొద్దిసేపటి తరువాత నెమ్మదించి రామలక్ష్మణులవైపు చూసి నాయనలారా నాపేరు జటాయువు సూర్యభగవానుడి రధసారధి అరుణుడి పుత్రుడను ! నేను పుట్టి యుగాల గడచినవి ! నీ తండ్రికి నేను ప్రాణస్నేహితుడను ! నాకొక అన్నగలడు అతని పేరు సంపాతి ! నేను గరుడజాతి పక్షులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు .

...

జటాయువులో తమ తండ్రిని చూసుకొని ఆనందించారు రామలక్ష్మణులు !

...

వారిరువురినీ కౌగలించుకొని ! నాయనలారా నా పుత్రులవంటివారు మీరు ! నా అంతిమసంస్కారములు మీరే జరిపించవలె ! అది నా కోరిక అని పలికిన జటాయువును చూసి ,తండ్రీ ! మా నాయనగారి మరణము నుండి కలిగిన దుఃఖము మా హృదయమునుండి ఆరిపోలేదు ! నీవు కూడా మమ్ములను విడిచి వెళ్ళినట్లయితే మాకిక దిక్కెవ్వరు ? అని కడుప్రేమతో పలికాడు రాముడు .


అంత జటాయువు రాముని జూచి ,నాయనా ! రాజ్యము నేలకుండా నీవు తాపసివేషములో అడవిలో సంచరించుటకు గల కారణమేమి అని ప్రశ్నించాడు 

...

వూటుకూరు జానకిరామారావు

కంబరామాయణం 102

 కంబరామాయణం 102

( జటాయువు )

...


మధురమనోహర రూపాన్ని తనివితీరా చూస్తూ "రామా" ! అంటూ తన్మయత్వంతో పిలిచారు అగస్త్యమహర్షి ! 

..

నాయనా ! ఇక్కడికి దగ్గరలోనే ఒక చిన్నపర్వతమున్నది ! సెలయేళ్ళు,మట్టిదిబ్బలు ,ఫలవృక్షాలతోపులతో మనోహరంగా ఉంటుందా ప్రదేశము ! 

..

 సీతమ్మ స్నేహం చేయటానికి అక్కడ రాయంచలు,రాచిలుకలు ఎన్నో ఉన్నాయి ! అక్కడ నివాసమేర్పరచుకొంటే బాగుంటుంది అని సూచించారు మహర్షి !

..

 ఆ ప్రాంతం పేరు పంచవటి

...

రాముడు మహర్షి వద్ద సెలవు తీసుకొని పంచవటి వైపు పయనం సాగించాడు !

...

సమున్నత పర్వతపంక్తులు ,వేగంగా పారే గొప్పనదులు దట్టమైన అరణ్యాలు దాటి నడుస్తున్నారు .

...

 ఒక కొండ మీద లేతబంగారు రంగులో ప్రకాశిస్తూ దివ్యకాంతులు ఆకాశంలోకి వెదజల్లుతున్న మరొక కొండ వారికి కనిపించింది ! 

..

అదేమిటో చూడాలనే కుతూహలంతో దగ్గరికి సమీపించారు వారు !

...

ఆ కొండ మరెవరో కాదు ! ఆకాశమంత విశాలమైన రెక్కలతో దివ్యప్రభలు వెదజల్లుతున్న ఒక గరుడపక్షి ! ఆ పక్షిపేరు జటాయువు ! సృష్టిలోని ఏ ప్రాణి చూడలేనంత దవ్వు తన చూపు ప్రసరించగల శక్తి ఆయన స్వంతం !

...

ఆ జటాయువు మెడలో  నవగ్రహాలను తలపించే నవరత్నాల మాల ధరించి ఉన్నాడు ! సూర్యుడే తన కిరీటమన్నట్లుగా ఠీవిగా కొండమీద ఆయన నిలుచున్నాడు ! ఆయన బరువు మోయలేక కొద్దిగా క్రుంగిపోయింది ఆ కొండ !

...

సూర్యభగవానుడి రధసారధి అరుణుడి( అనూరుడు ) కుమారుడు ఆయన ! 

ఇప్పటివాడా ఆయన ! ఎప్పటివాడో తెలియనంత పాతకాలము వాడు !

...

ఎవరై ఉంటారు ? తన నాశము కోరి మనలను సమీపించినవాడు కాకపోతే తప్పకుండా గరుడుడే అయి ఉంటాడు అని అనుకున్నారు రామలక్ష్మణులు !

...

సీతారామలక్ష్మణులను చాలాదూరం నుండి గమనిస్తున్నాడు జటాయువు !

..

 ఒకరు కాటుకకొండ మరియొకరు బంగరుకొండ ! వీరి కాలధూళికి కూడా సరితూగడా మన్మథుడు !


కాటుకకొండకు బంగరుమెరుపుతీగ చుట్టినట్లు అపురూపలావణ్యవతి అయిన స్త్రీ !

...

ఎవరు వీరు ?

...

వీరిని చూడగనే నా ప్రాణస్నేహితుడు దశరథుడు గుర్తుకు వస్తున్నాడే !!! అని తలపోశాడు జటాయువు !

....

వూటుకూరు జానకిరామారావు

కంబరామాయణం 101

 కంబరామాయణం 101

(అగస్త్యభగవానునిచే అస్త్రప్రదానము )

...

రామయ్యను చూడగనే అగస్త్యభగవానుడి ఆనందం అవధులు దాటింది ! 

ఆయన సామాన్యుడు కాడు ! సముద్రంలో దాక్కున్న అసురుల ఆచూకీ తెలియడం కోసం సముద్రాన్నే పుక్కిటపట్టిన అమిత తపఃసంపన్నుడు..వింధ్యపర్వత గర్వాన్ని అణచివేసినవాడు ! శివమహాదేవుడివలన ఉత్తరధృవము బరువై భూమి ఒరిగిపోతే తాను దక్షిణాన నిలుచుండి భూమియొక్క సంతులనాన్ని కాపాడినవాడు !

...

ఒక్కమాటలో చెప్పాలంటే మహావృక్షము దాగి ఉన్న మర్రివిత్తనము వంటివాడు అగస్త్యభగవానుడు !

...

అందరి అంతరంగాలలో కొలువైఉండి అంతటానిండి ఉండే సర్వవ్యాపకుడైన మహావిష్ణువు అవతారమైన రామచంద్రుడి కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నాడాయన !

...

ప్రపంచాన్ని పీడించే రాక్షసులనే విషానికి విరుగుడు రామచంద్రుడు ! ఆయనను సేవించిన మునులు ఆ విషము బాధనుండి విముక్తులైనారు !

...

తామరాకులనుండి నీటిబిందువులు జలజలరాలినట్లుగా రామచంద్రుని దర్శించగనే  తన కమండలములో కావేరిని దాచుకున్న అగస్త్యులవారి కనుకొలకులనుండి ఆనందబాష్పాలు అప్రయత్నంగా జాలువారాయి !

...

రామచంద్రుడు సీతాలక్ష్మి తో కూడి అగస్త్యులవారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు !

...

ఆశ్రమం వేదఘోషతో ప్రతిధ్వనించింది !

..

దండకారణ్యంలో నివసించే నీవు నా వద్దకు వస్తావని ఎదురు చూస్తున్నానయ్యా రామా !

...

ఇదుగో ! నీకోసము ఈ ధనువు ! దీనిని స్వీకరించు !

ఇది విష్ణుభగవానుడి ధనుస్సు ! ఇదుగో అక్షయతూణీరము ! ఇదుగో ఎదురులేని అజేయ ఖడ్గము ! 

నీకు పాశుపతాన్ని కూడా ఇస్తున్నాను !

రామా ! ఎదురులేని ఈ అస్త్ర సంపద రాక్షస సంహారానికి నీకు ఉపయోగపడుతుంది అని అపురూపమైన అస్త్రసంపదను రామునికిచ్చారు మహర్షి !

...

వూటుకూరు జానకిరామారావు

కంబరామాయణం 100

 కంబరామాయణం 100

( దండకారణ్య నివాసము )


తపస్సాచరిస్తూ జీవించే మిమ్ములను కాపాడలేని నా ధనుస్సెందుకు ? నా ధనుర్విద్యానైపుణ్యమెందుకు ?

రాక్షసుడనేవాడు ఈ చుట్టుప్రక్కల కాలుమోపడానికి కూడా భయపడేలా చేస్తాను ! మీరు నిశ్చింతగా ఉండండి అని అభయమిచ్చాడు రామచంద్రుడు !

...

రామచంద్రా మా తోనే ఉండవయ్యా ! ఇక్కడే నీ అరణ్యవాసము పూర్తిచేయి స్వామీ అని మునులు ప్రార్ధించగా సరేనన్నాడు రామచంద్రుడు !

...

పది సంవత్సరాల కాలం గిర్రున తిరిగిపోయింది !

..

ఒకరోజున అగస్త్యభగవానుడిని కలవాలనే ఉద్దేశంతో బయలు దేరారు సీతారామలక్ష్మణులు !

...

సన్నటి అడవిదారులవెంట వెదురుపొదలను తప్పించుకుంటూ సాగుతూ సుధీక్షణ మహాముని ఆశ్రమం చేరుకున్నారు. 

..

రామచంద్రా నీ దర్శనమాత్రము చేత నా జన్మ తరించినదయ్యా ! అని సాదర స్వాగతం పలికారు మహర్షి ! 

..

మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు మువ్వురూ.

..

మహర్షి ఆతిథ్యం స్వీకరించి ఆ రాత్రికి అక్కడే విశ్రమించి మరునాడు అగస్త్యభగవానుడిని చూడాలనే ఆకాంక్ష వ్యక్తపరచాడు రామచంద్రుడు.

...

రామా ! నేను కూడా నీకు అదే విషయం చెబుదామనుకుంటున్నాను ,నీవే అడిగావు !

..

 ఆయనను చూసిన తరువాత ఇక నీవు చూడదగినది,చేరదగినది ఏవీ మిగలవు ! అంతటి మహాత్ముడాయన ! ఆయనకూడా నిన్ను చూడవలెనని ఆతురతతో ఉన్నాడు ! మీ ఇరువురి సమాగమం లోకకళ్యాణ కారకమవుతుంది వెళ్ళిరా నాయనా అని ఆశీర్వదించి పంపాడు మహర్షి !

..

మహావిష్ణువు లోకాలను తన పాదాలతో కొలిస్తే 

అగస్త్యుడు ద్రావిడభాషతో లోకాలను సుసంపన్నం చేశాడు !

....

సీతారామలక్ష్మణులు అగస్త్యాశ్రమం చేరుకున్నారు !

...

వూటుకూరు జానకిరామారావు

...

కంబరామాయణం 99

 కంబరామాయణం 99

( మునుల వేదన )

...


భారమైనహృదయాలతో శరభంగ మహర్షి ఆశ్రమం నుండి బయలు దేరారు మువ్వురూ !

...

సుందర పర్వతసీమలు ,మనోహర ఉద్యానవనాలు, కఠినశిలలు, ఉత్తుంగతరంగాలతో ఉధృతంగా ప్రవహించే నదీనదాలు, ఆకసం నుండి దూకుతున్నవా అన్నట్లున్న జలపాతాలు... ఎన్నింటినో దాటుకుంటూ వారి నడక సాగుతున్నది .

...

మునివాటికలకు చేరుకునే సమయానికి సూర్యుడు పడమటివైపు క్రుంగుతున్నాడు .

...

కార్చిచ్చులో కాలుతున్న అరణ్యంలో కారుమేఘాలు వర్షించినప్పుడు తిరిగి ఊపిరిపోసుకొన్న చెట్లవలే సీతారామలక్ష్మణులను చూడగానే ఆయాప్రాంతాలలో నివసిస్తున్న మునుల ప్రాణాలు లేచివచ్చాయి !

..

 క్రూరరాక్షసులు వారిని పెట్టే బాధలు చెప్పనలవిగాకుండా ఉన్నాయి . 

..

అడవిలో తప్పిపోయి విలవిలలాడే లేగదూడ తిరిగి తన తల్లిఆవును చేరినప్పుడు పొందే మనశ్శాంతి కనపడుతున్నది మునుల ముఖాలలో !

...

అడవిని విడిచిపెట్టలేరు, రాక్షసులను ఎదిరించనూలేరు ! వారి తపఃశక్తిని వృధాచేసుకొని రాక్షసులకు శాపమూ ఇవ్వలేరు ! ఇన్నాళ్ళకు వారి కష్టాలు కడతేరే మార్గం కనపడింది వారికి రాముని రూపంలో !

...

రామదర్శనమాత్రముచేత వారి హృదయాలు ప్రేమతో పొంగిపొర్లిపోయి రామయ్యమీద ఆశీస్సుల జడివానలు కురిపించారు  ! 

..

సీతారామలక్ష్మణులు బసచేయడానికి వీలుగా ఒక కుటీరాన్ని సిద్ధం చేసి వారికి అవసరమైన కందమూలఫలాలు అందించి అప్పటికి రాత్రి అయినది కావున రామయ్యను విశ్రమించమని చెప్పి వారివారి కుటీరాలకు వెళ్ళిపోయారు మునులంతా !

...

రాత్రిగడచి బాలభానుడి కిరణాలు పుడమిని తాకు సమయానికి స్నానసంధ్యాదులు పూర్తిచేసుకున్నారు రామలక్ష్మణులు !

మునులంతా వచ్చి వారి చుట్టూ కూర్చున్నారు ..

...

 రామచంద్రుడు వారినుద్దేశించి మాటాడుతూ ,ఆర్యులారా నేను చేయవలసిన కర్తవ్యాన్ని నాకు ఆదేశించండి అని పలికాడు.

...

జగద్రక్షకా రామచంద్రా ! ధర్మదూరులైన రాక్షసుల వలన మేము పొందే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు ! మమ్ములను మా తపస్సుకు దూరం చేసి అణచివేస్తున్నారు !పులల గుంపు మధ్యలో పడిపోయిన జింకలవలె అయినది మా పరిస్థితి ! ఎప్పుడు ఏమి జరుగుతుందో  తెలియకుండా ఉన్నది ! మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణమొక యుగములాగ జీవిస్తున్నాము !

...

యజ్ఞములు లేవు ,వేదాధ్యయనము లేదు అన్నింటినీ ఆపివేసుకొని జీవచ్ఛవాలవలె నివసిస్తున్నాము ,చివరకు దేవేంద్రుడు సైతము వారి ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తున్నాడు ! 

..

నీవుదప్ప మాకు వేరొండు దిక్కులేదు రామా! రక్షకా! మమ్ములను కాపాడు తండ్రీ అంటూ మొరవెట్టుకున్నారు మునులంతా !

....

వూటుకూరు జానకిరామారావు

కంబరామాయణం 98

 కంబరామాయణం 98

(పరమపదం చేరిన శరభంగ మహర్షి )


శరభంగ మహర్షి కుటీరములోనికి ప్రవేశించాడు రామచంద్రుడు !

(శరభంగ మహర్షి అనగా మన్మథుడి శరములను భంగము చేసి యుగముల పర్యంతము తపస్సునాచరించినవాడు )

...

రామచంద్రుడి దివ్యమంగళ విగ్రహాన్ని తనివితీరా చూసి పరవశత్వానికి లోనయి ఆయనను ప్రస్తుతించాడు దేవేంద్రుడు !

...

రామా ! వేదపురుషా ! జీవులలోని అంతఃప్రకాశము నీవే !బ్రహ్మాదిదేవతలు కూడా  తెలుసుకొనుటకు కష్టసాధ్యమయినవాడా ! ఆద్యంతరహితా !  నీకివే నా కైమోడ్పులు అంటూ నమస్కరించాడు దేవేంద్రుడు ! 

...

ఆ వెనువెంటనే మహర్షి వద్ద సెలవు తీసుకొని తిరిగి వెళ్ళిపోయాడాయన !

...

రామచంద్రుడు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు.

...

మహర్షి ఆయనను లేవదీసి గాఢంగా తన కౌగిలిలో బంధించాడు !

..

తదుపరి సీతాదేవి, లక్ష్మణుడు కూడా కుటీరం లోనికి ప్రవేశించారు .

...

సీతారామలక్ష్మణులు ఆ రాత్రికి మహర్షి ఆశ్రమంలో విశ్రమించారు !

...

తెల్లవారింది ! సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకొని మహర్షి చెంతకు చేరారు వారు.

...

మహర్షి రామచంద్రుని చూచి ," రామా ! నీ సమక్షములో నా శరీరాన్ని యోగాగ్నిలో దగ్ధం చేసుకోవాలనుకుంటున్నాను అందుకు నన్ననుమతించవయ్యా " అని అడిగారు

...

నా సమక్షంలోనే ఎందుకు ? ప్రశ్నించాడు రామచంద్రుడు !

...

నేను వేలకొలది యజ్ఞాలు చేశాను యుగాలపర్యంతము తపమాచరించాను ! నీ రాకతో నాకున్న భవబంధాలన్నీ పటాపంచలైపోయినాయి ! ఇక నేనిక్కడ ఉండి చేయవలసిన పనులేవీ లేవు ! 

...

దేవేంద్రుడు వచ్చి సత్యలోకానికి రమ్మని బ్రహ్మదేవుడు పంపిన ఆహ్వానమందించాడు ! నేను చేరుకోవాలనుకున్నది పునరావృత్తిరహిత శాశ్వత పరమపదం ! కావున నాకు నీవు అనుమతినీయవలె అని అర్ధించాడు మహర్షి !

...

సీతారామలక్ష్మణుల సమక్షములో అర్ధాంగితో కూడి యోగాగ్నిలో భస్మమయి పోయి పరమపదం చేరుకున్నాడు మహర్షి !

...

మహావిష్ణువుకు గల వేల నామాలలో ఒక్కనామము పలికినా చాలు మనిషికి మోక్షం ప్రాప్తించడానికి ! మరి సాక్షాత్తూ ఆ మహావిష్ణువే తరలి తనముందుకు వస్తే తపస్సు ఫలించినట్లే పరమపదము సాధించినట్లే !!!!

....

వూటుకూరు జానకిరామారావు

కంబరామాయణం 97

 కంబరామాయణం 97

( శరభంగ మహర్షి )

...

దట్టమైన దండకారణ్యంలో నడకసాగిస్తున్నారు సీతారామలక్ష్మణులు .చాలా దూరం నడచిన తరువాత ఒక మనోహరమైన ప్రదేశం కనుపించింది వారికి .అందమైన చెట్లతోపులు ,సుందరజలపాతాలు కనువిందుచేసే పక్షితతులు నాట్యమాడే మయూరాంగనలు మధురంగా వినిపించే కోకిలమ్మపాటలు ! ప్రకృతి అంతా రసరమ్యంగా ఉన్నది !

...

ఎందుకు ఉండదూ ! అది మహాతపఃసంపన్నుడైన శరభంగమహర్షి ఆశ్రమమున్న తావు !

...

ఆశ్రమప్రాంగణంలోకి అడుగుపెడుతుండగా వారొక దివ్యపురుషుడిని చూశారు ! ఆయన శరభంగ మహర్షి ఆశ్రమంలోనికి వెళ్ళాడు ! త్రిమూర్తులకు తప్ప ఎవరికీ తలవంచని దేవేంద్రుడాయన !

..

బ్రహ్మదేవుడు పంపగా శరభంగమహర్షి వద్దకు వచ్చాడు దేవేంద్రుడు !

...

మహర్షికి వినయంగా నమస్కరించాడాయన ! తమ రాకకు కారణమేమిటి అని అడిగారు మహర్షి !

...

వేలసంవత్సరాల కఠోరమైన నీ తపస్సు తానుకూడా చేయలేనని భావించిన బ్రహ్మదేవుడు మిమ్ములను తన లోకానికి ఆహ్వానించారు మహర్షీ ! అని పలికాడు దేవేంద్రుడు !

...

దేవేంద్రా ! క్షణకాలంలో మాసిపోయి చిరిగిపోయే చిత్రాలవంటివి ఈ లోకాలు అనేవి ! నేనేమి చేసుకుంటాను వాటితో  ! బ్రహ్మలోక ప్రాప్తి కలిగినా ఒకటే నాకు కలుగకపోయినా ఒకటే ! ఎందుకు అన్ని లోకాలు ?నా తపస్సు ఎన్నోయుగాలనుండీ నడుస్తున్నది !

...

కాలానికి అతీతమైన ,మార్పులేనటువంటి , అనంతమైన ఒక దివ్యలోకం ప్రాప్తించాలని నా తపస్సు ! అని దేవేంద్రుడికి బదులిచ్చాడు మహర్షి

...

సీతారామలక్ష్మణులు అప్పుడే ఆశ్రమముఖద్వారం చేరుకున్నారు . వారికి లోపలనుండి ఎవరో మాటాడుకుంటున్న ధ్వని వినిపించింది !

...

రాముడొక్కడే లోనికి ప్రవేశించాడు ! సీతమ్మ ,లక్ష్మణస్వామి ఇరువురూ బయటనే నిలుచున్నారు .

...

వూటుకూరు జానకిరామారావు

కంబరామాయణం 96

 కంబరామాయణం 96

( విరాధ శాపవిమోచనం )

...

ఒక దివ్యపురుషుడు విరాధుడి కళేబరం నుంచి బయటకు వచ్చి ఆకాశాన నిలుచున్నాడు . అతడు కుబేరుడి శాపం కారణంగా రాక్షసరూపం ధరించిన గంధర్వుడు ! 

...

తనకు శాపవిమోచనం కలిగించినవాడు సాక్షాత్తూ వైకుంఠ వాసుడని ఎరిగిన విరాధుడు  రామచంద్రుని వేనోళ్ళ స్తుతించాడు !

...

శ్రీరఘురామా సీతారామా !

జయరఘురామా జానకిరామా!

 నను కరుణతో బ్రోచిన కమనీయ నామా రామా ! 

నీ దివ్యపాదారవిందాలు వామనావతారంలో లోకాలను ఆక్రమించి అద్భుతం చేశాయి ! మొన్నటికి మొన్న అహల్యాదేవికి నీ పాదమే శాపవిమోచనం కలిగించింది ! నేడు నీపాద స్పర్శతో నా జన్మతరించింది స్వామీ ! కమలాక్షా నీ కరుణార్ధ్రదృక్కులు నా పై సదా ప్రసరింపచేయుమయ్యా !

...

నీవే తల్లివి! నీవే తండ్రివి !నీవె తోడునీడ !

లోపలనీవే బయటనీవే విశ్వమంతటా నీవే !

..

తల్లి తెలియని దూడలేదు తన దూడను గుర్తుపట్టలేని తల్లిలేదు ! అదేమి చిత్రమో నీ సంతానమై ఉండి కూడా లోకులు నిన్నెరుగలేరు !

అని స్తుతిస్తున్న విరాధుడిని చూసి నీవెవరు ? నీకు రాక్షస రూపమెందువలన వచ్చింది అని అడిగాడు రామయ్య !

...

స్వామి పాదాలమీద వాలి చెప్పటం మొదలుపెట్టాడు విరాధుడు !

...

తండ్రీ ! నా పేరు తుంబురుడు ,నేనొక గంధర్వుడను మా రాజు కుబేరుడు !

రంభ నాట్యము, గానము చూసి మోహించి ఆమె ప్రేమలో పడి ఆమెతో రమిస్తూ ఇంద్రియాలన్ని వశము తప్పగా లోకాలన్నింటిని మరచి పోయాను .

...

కుబేరుడది చూసి నన్ను రాక్షసుడిని కమ్మని శపించాడు ! ఆయన కాళ్ళావేళ్ళాపడి శాపవిమోచన మార్గము కొరకు ప్రార్ధించగా ," రామచంద్రుడి పాద స్పర్శతో నీకు శాప విమోచనం కలుగుతుందని సెలవిచ్చాడు " అప్పటినుండి క్రూరత్వానికి మారు పేరయి ఈ అరణ్యములో అందరినీ బాధిస్తూ బ్రతుకుతున్నాను ! 

...

స్వామీ ! మీతో యుద్ధము చేసినందుకు ఈ దాసుడిని మన్నించి సెలవిప్పించండి అని కోరగా రాముడు విరాధునికి అనుమతినిచ్చాడు .

...

విరాధుడి నిష్క్రమణ తరువాత రామచంద్రుడు దండకారణ్యంలోనికి ప్రవేశించాడు !

...

వూటుకూరు జానకిరామారావు

*శ్రీ కాళహస్తీశ్వర శతకము*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*తలమీఁదం గుుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్*

*గళసీమంబున తండ, నాసిక తుద న్గంధప్రసారంబు లో*

*పల నైవేద్యముఁ జేర్చు నేమనుజుడా భక్తుండు నీకెప్పుడుం*

*జెలికాఁడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 54*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఎవడైతే సదా తలమీద నీ నిర్మాల్యమును, నుదుట విభూతిని, మెడలో రుద్రాక్షలను, ముక్కుయందు నీ అభిషేకజల సుగంధమును, ఉదరములో నైవేద్యమును కలిగి ఉంటాడో అతడు వెండికొండపై నీ స్నేహితుడితో సమముగా వర్తించగలడు.....*


✍️🌷🌺🌹🙏

Vidyardhi విద్యార్ధి

 

విద్యార్థి 


సాధకుడు ప్రతి విషయంమీద శ్రర్ధ వహిస్తేనే కానీ సాధనలో ముందుకు పోలేడు. ఏరకంగా అయితే ఒక విద్యార్థి పరీక్షలముందు చదువు యందు చాలా శ్రర్ధ తీసుకొని తనకు ఎక్కువ మార్కులు రావటానికి ఏయే పాఠ్యముసాలని చదవాలి వాటిని ఎలా ఆకటింపు చేసుకోవాలి. ప్రతి రోజు యెంత సమయం కేటాయించాలి అని ఏంటో విశ్లేషణ చేసుకొని పరీక్షలకు ముందు ప్రిపేర్ అవటం మనం చూస్తాము. విద్యార్థి తానూ ముఖం కడుకుంటున్న, స్నానమాచరిస్తున్నాన్న, భోజనం చేస్తున్నాకూడా తానూ చేస్తున్న పనులు కాకతాళీయంగా చేస్తూ మనస్సు మాత్రం తానూ చదివిన విషయాలను మనననమ్ చేసుకోవటానికి మాత్రమే వినియోగిస్తుంటారు. అలా సంపూర్ణంగా విద్య యందె నిమగ్నుడైన విద్యార్థి పరీక్షలలో ఎక్కువ మార్కులను సంపాదించుకోవటం మనం చూస్తూవుంటాము. ఒక సాధారణ పరీక్షకోసమే ఒక విద్యార్థి అంతగా కష్టపడితే మరి ఎన్నో జన్మలనుంచు ప్రయత్నిస్తున్న పరీక్ష ఇది అదేమిటంటే మోక్షపదం చేరటం అంటే యెంత కష్టంగా ఉంటుందో యెంత కృషి సల్పాలో మనం వేరే చెప్పనవసరం లేదు. మోక్షార్ధి ఒక విద్యార్థి కన్నా ఎన్నో రేట్ల కష్టం, కృషి, శ్రమ చేస్తూ నిరంతరం జ్ఞానాన్వేషణలో ఉండి ఒక సత్ గురువు ద్వారా నిత్యానిత్య వివేకా జ్ఞానాన్ని పొంది నిత్యమూ సత్యము అనంతము అయిన ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించి సదా నిదిజాసలో వుంటూ ఉంటే మాత్రమే మోక్షసిద్ది కలుగదు.

ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా |
క్షురస్య ధరా నిశితా దురత్యయా దుర్గాం పాఠస్తత్కవయో వదంతి || 14 ||

నిద్రలెమ్ము సాధక అంటే అజ్ఞానం అనే నిద్రలో వున్నావు నీవు ఆ నిద్రను తొలగించి జ్ఞానానం అనే ప్రకాశం వైపు నడువు ఆ దోవ ఎటువంటిదంటే ఒక క్షురకుని పదునైన కత్తిమీద నడవటం వంటిది. అటువంటి కష్టసాధ్యమైన దానిని సాదించటానికి ఒక మంచి స్టేగురువును ఆశ్రయించు అని ఈ ఉపనిషత్ మంత్రం మనకు ప్రబోధిస్తున్నది. 

సద్గురువు ఎవరు: 

కలి ప్రభావం వలన మనకు అనేక మంది తమకు తామే సద్గురువులని చెప్పుకుంటూ అనేక ఆశ్రమాలను నిర్మిస్తూ ,లక్షలకొద్దీ శిష్యులను కలిగి నిరంతరం పాద పూజలు చేయించుకుంటూ, విలువైన వస్తువులను దక్షణలుగా తీసుకుంటూ మనకు అనేక మంది తారసపడుతున్నారు. విచిత్రమేమిటంటే వారు నిత్యం అనేక వేదాంత ఉపన్యాసాలను చేస్తూ అనేకులను ఆకాసర్షిస్తున్నారు. వారి దర్శనానికి ఫీజు, పాదపూజకు ఫీజు మనకు వారి భక్తులు చెపుతుంటారు మేము ఈ స్వామీజీని నమ్ముకున్నాము. ఆయనకు పాదపూజ జరిపిస్తే మాకు ఈ మంచి జరిగించి ఆయనకు పూజలు జరిపిస్తే అది జరిగింది. ఆయన సాక్షాత్తు ఫలానా దేముడి అవతారం. మీరు మీ కోరికలు తీర్చుకోండి అని చేసే ప్రచారాలకు, ప్రలోభాలకు ప్రలోభపడి అప్పుడప్పుడే ఆత్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్న సాధకుడు తనకు భక్తిమార్గమే శరణ్యం అని అనుకుంటూ ఇటువంటి గురువుల శిష్యుల మాటలకు ఆకర్షించబడి ఆ గురువు సేవనమే తన జీవిత పరమావధి భావంచి తన ఆమెయిల్యమైన జీవితమును వృధా చేసుకుంటున్నారు. సాధకులను త్రప్పుడు త్రోవ పట్టించి వారివద్ద వున్నా ద్రవ్యాన్ని తస్కరించి ఈ రకమైన గురువులు వారి సంపదను వృద్ధి చేసుకోవటమే కాకుండా పెద్దపెద్ద భవనాలలో అనేక ఆశ్రమాలను నిర్మించిప్రజా సేవ చేస్తున్నట్లుగా ప్రగల్బాలు పలుకుతూ తమ పగ్గం గడుపుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే మన హిందువులు మాత్రమే కాకుండా మహమ్మదీయుడైన ఒక సాదువుకూడా ఇటీవల బాబాగా ప్రసిద్ధి చెంది తన మరణానంతరము గుడులు,గోపురాలు కలిగి నిత్యం పూజలు అనుడుకోవటం మనం చూస్తూవున్నాము. బాబా భక్తీ మత్తులో వున్న వారిని తిరిగి హిందుత్వపు వైపు తీసుకొనిరావటానికి సాక్షాత్తు ఆదిశంకర భగవతపాదులకు కూడా సాధ్యం కాదేమో అని ఈ సాధకుని అనిపిస్తున్నది. ఎందుకంటె వారు బాబా మత్తులో అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం మృగతృష్ణలోనుంచి నీటిని తోడటం వంటిది. 

ప్రతి సాధకుడు ముందుగా రెండు విషయాలు తెలుసుకోవాలి అవి సద్గురువు ఎవరు అనేది ముందుగా తెలుసుకోవాలి, రెండవది సద్గురువు కేవలం ఒక మార్గదర్శకుడిగా మాత్రమే తనకు ఉపకరిస్తాడు కానీ సద్గురువు మోక్షాన్ని ప్రసాదించే వాడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే గురువును మనం ఒక ఉపకారణంలాగా మాత్రమే చూడాలి కానీ గురువుచుట్టూ తిరుగుతూ జీవితాన్ని వృధా చేయకూడదు. మనం ఒక ప్రయాణం చేస్తూవున్నాము మధ్యలో ఒక నది వచ్చింది ఆ నదిని దాటటానికి ఒక పడవను ఉపయోగిస్తాము నది దాటినా తరువాత మనకు ఆ పడవతో నిమిత్తం లేదు మరల మన ప్రయాణం మనమే చేస్తూ మన గమ్యస్థానాన్నికి చేరుకుంటాము. ఇక్కడ మన ప్రయాణంలో పడవ ఎలా ఉపయోగ పడిందో అలానే మనకు సద్గురువు కూడా గురువు బోధనలను విని మన సందేహాలను నివృతి చేసుకొని తిరిగి మన సాధనను కొనసాగించాలి. అంటే కానీ జీవితాంతం గురువుకు సేవచేస్తూ జీవితాన్ని వృధా చేసుకోకూడదు. 

సద్గురువు ఎలా వుంటారు. సద్గురువు తనకు తానుగా ఆత్మా సాక్షాత్కారం పొందినవాడుగా ఉండాలి అటువంటివాని వల్లనే మనము జ్ఞ్యానాన్ని పొందగలము మనకు జ్ఞ్యానాన్ని ఇవ్వాలనే ముందుగా మన గురువు జ్ఞాని అయివుండాలి కదా. గురువు అరిషడ్వార్గాన్ని త్యజించిన వాడై ఉండాలి. అంటే ఆయనకు మన సామాజిక జీవనపు లక్షణాలు ఏవి వున్దకూడాదు. అంటే ఏ విషయాలమీద ఆసక్తి, అనురక్తి,మోహము, కామము లేని వాడై ఉండాలి. కేవలము బిక్షాటన చేస్తూ తనకు దొరికిన దానిని భుజిస్తూ పరుల సొమ్మును ఆశించని వాడు అస్సలు ఇతరులతో మాట్లాడని వాడు ఇతరులనుంచి ఏది కోరని వాడు. కౌపీనము (గోచీ) మాత్రమే ధరించే వాడు అయివుండాలి అటువంటి సత్ గురువు మీకు లభిస్తే వెంటనే ఆయన పాదాలను ఆశ్రయించి శిష్యత్వాన్ని సవీకరించండి

సాధకుడు ముందుగా ఒక భక్తుడిగా తన ఆధ్యాత్మిక జీవనాన్ని మొదలుపెడతాడు. అదే అతనికి ఒకరకంగా రెండవ జన్మగా మనం అభివర్ణించవచ్చు. దేవి దేవతల యందు భక్తి కలిగి నిత్యం దూప దీప నైవైద్యంతో పూజలు చేసే భక్తుడు తానూ త్రికరణ శుద్ధిగా ఆచరించే పూజల ఫలితంగా ముందుగా అంతకరణ శుద్ధి ఏర్పడుతుంది. కొంతకాలం పూజలు చేసిన తరువాత కొద్దీ కొద్దిగా వాక్సుద్ధి ఏర్పడుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఆ స్థితిలో సాధకునికి ఒక ప్రశ్న తలయెత్తుతుంది. తానూ చేసే పూజలు మాత్రము చాలవు ఇంతకన్నా ఎక్కువగా నేను ఏమైనా చేయాలి అనే ఉదయిస్తుంది. ఆ భావన కలగటమే జీవితంలో మలుపుకు దారితీస్తుంది. అప్పుడు తరువాత జపం,తరువాత ధ్యానం చేస్తూ సాధకుడు భగవంతునికి దగ్గరగా అవుతాడు. 

 నిత్యం భగవంతుని ధ్యానిస్తూ నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన సాధకుడు బ్రతికి ఉండగానే మోక్షాన్ని సిద్దించుకున్న సిద్ధుడే. కాబట్టి సాధకులారా మీ అమూల్య మైన సమయాన్ని వృధా చేసుకోకుండా కుటింటిత దీక్షతో కమ్ము. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః    

మీ భార్గవ శర్మ 

 

గురు దక్షిణ

 ⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



              *గురు దక్షిణ*

             ➖➖➖✍️


డు, ము, వు, లు ప్రధమా విభక్తి,

నిన్, నున్, లన్, కూర్చి, గురించి.. ద్వితీయా విభక్తి.


తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతోంది. సూది మొన పడినా వినపడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్ లో. 


తెలుగు మాస్టర్ గారంటే ఆక్లాస్ కే కాదు, స్కూల్ మొత్తం భయం. క్రమశిక్షణకు మారుపేరు మాస్టారు. అల్లరి చేసిన వాడి వీపు వంచి గుల్ల దెబ్బ ఒక్కటి వేసేరంటే చాలు, స్కూలు మొత్తం వినపడేది. ఆ శబ్దానికే పిల్లలకు చచ్చేంత భయం. కర్ర విరగాకూడదు, పాము చావాకూడదు అనేది ఆయన సిధ్ధాంతం. దెబ్బ తగిలేదు కాదు కానీ, ఆ శబ్దానికే బిక్క చచ్చి పోయేవారు కుర్రాళ్లంతా. 


“నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరిపడతది..

నేను ఈలవేస్తే గోలకొండ అదిరిపడతది..

దివికి దివికి దిమాడి... గుబుకు గుబుకు గుమాడి... దివికి దివికి దిమాడి ... గుబుకు గుబుకు గుమాడి....”

అంటూ పెద్దగా ఈల వేసుకుంటూ, ప్లే గ్రౌండ్ లో వున్న ఉసిరి చెట్టెక్కి కోసిన ఉసిరికాయలు ఒక ముచ్చికవర్ లో వేసుకుని, క్లాస్ రూమ్ లోకి అప్పుడే ఎంటర్ అయిన శీను గాడు….


పాఠం చెబుతున్న తెలుగు మాస్టర్ గారిని చూసి గతుక్కు మన్నాడు. భయంతో బిక్క చచ్చిపోయేడు. వాడి పై ప్రాణాలు పైనే పోయేయి. తెలుగు మాస్టర్ గారు ఆరోజు సెలవు, స్కూల్ కి రారు అనుకున్న శీను గాడికి పాపం మాస్టర్ గారు లీవ్ క్యాన్సల్ చేసుకుని క్లాస్ కి వచ్చేరన్న విషయం తెలీదు. ఎంచక్కా తెలుగు పీరియడ్ ని ఉసిరి కాయలకోసం కేటాయించుకున్నాడు. 


“ఒరేయ్..ఇలా రారా!” మాస్టారి కళ్ళు చింత నిప్పుల్లా వున్నాయి. 

భయంతో ఉసిరికాయలన్నీ అక్కడే కిందన పడేసాడు. 

పిల్లలంతా ఒకింత భయంతోనూ, ఒకింత 

ఆతృతతోను చూస్తున్నారు , ఏం జరగబోతుందా అని!


అంతలోనే ధామ్...ధామ్ అంటూ గట్టిగా రెండు శబ్దాలు వినపడే సరికి శీను గాడి పని అయిపోయిందివాళ అనుకున్నారంతా. 


“వెధవా..! నీ తల్లి, తండ్రి అంతంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తుంటే, నువ్వు చేసే ఘన కార్యం ఇదా? చదువు లేకపోయినా ఫర్లేదు, క్రమశిక్షణ లేకపోతే ఎలా? పెద్దయ్యాక ఏం సాధిద్దామని? అంట్లు తోముకుని బతుకుదామని అనుకుంటున్నావా?” మాస్టర్ గారి తిట్ల సునామీ కి అడ్డుకట్టలేదు. అంత కోపం అతనిలో మునుపెన్నడూ చూడలేదు ఎవరూ. పిల్లలు క్రమశిక్షణ లేక చెడిపోతున్నారన్న బాధ, ఆయన కళ్ళల్లో రౌద్రమై తాండవిస్తోంది. శీను గాడు అది చూసి తట్టుకోలేకపోయేడు. ఒహటే ఏడుపు. 


ఇంతలో మిగిలిన క్లాస్ టీచర్స్, హెడ్ మాస్టర్ గారు వచ్చి తెలుగు మాస్టర్ గారిని శాంతింప చేయడంతో పరిస్థితి కుదుటపడింది. 


తుఫాన్ తరువాత ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ క్లాస్ రూమ్ ని చూస్తే అర్ధం అవుతుంది. కానీ ఈ సంఘటన తరువాత మాస్టర్ గారు అన్యమనస్కంగా వున్నారు. మిగిలిన పాఠం చెప్పే మూడ్ లేక, పిల్లలికి ఏదో వర్క్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయేరు. 


ఈ ఘటన జరిగి చాలా రోజులైనా, శీను గాడికి మాత్రం మాస్టర్ గారిపై కోపం తగ్గలేదు. ఆయన అంటే బాగా అయిష్టం పెంచేసుకున్నాడు. ఆయనికి కనిపించకుండా తిరుగుతూ జాగ్రత్త పడుతుండేవాడు. ఏదో విధంగా టెన్త్ పరీక్షల్లో పాస్ అనిపించుకుని, స్కూల్ చివరి రోజున కూడా మాస్టర్ గారికి కనిపించకుండా, కనీసం పలకరించకుండా వచ్చేశాడు. 


ఆ తరువాత శీను వాళ్ళ నాన్న గారికి వేరే వూరు బదిలీ అవడంతో, ఆ వూళ్ళో కాలేజీలో చేరిపోయేడు.


రోజులు గడిచి పోతున్నాయి. క్యాలెండర్లు మారిపోతున్నాయి. అవి రోజులా....లేక కళ్ళాలు లేని గుర్రాలా అన్నట్టున్నాయి. 

*****************


తెలుగు మాస్టారి చిన్న అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. తను పనిచేసే రోజుల్లో యేవో లోన్లు అవీ పెట్టి మెల్లగా పెద్దమ్మాయి పెళ్లి చేసేశారు. ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి కోసం,తను జాగ్రత్త చేసి కొనుక్కున్న కొంత భూమిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు.


కానీ తను, తనతో పాటు కొంతమంది కలిసి కొన్న ఆ జాగా వున్న ఏరియాలో యేవో కొన్ని వివాదాల కారణంగా భూమిని అమ్మడానికి ప్రభుత్వ పరంగా కొన్ని అడ్డంకులు వున్నాయి. ఆ అడ్డంకులు తొలిగితే కానీ తాను అమ్మే పరిస్థితి కానరాకపోవడంతో, తెలిసిన వ్యక్తుల సలహా మేరకు జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే పని జరగొచ్చు అని చెప్పడంతో కలెక్టర్ ని కలవడానికి అప్పోయింట్మెంట్ తీసుకున్నారు మాస్టర్ గారు. 


“అబ్బే... కుదరదండి. రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం అస్సలు కుదరదండి!” అంటూ పంపేశారు కలెక్టర్ గారు. 


రెండు, మూడు సార్లు అతని చుట్టూ తిరగవలసి వచ్చింది మాస్టారికి.

“మీరు ఎన్ని సార్లు నా దగ్గరికి వచ్చినా ప్రయోజనం లేదు సార్! ఈ విషయంలో నేను ఏమీ చెయ్యలేను. నా పరిధి దాటిపోయింది. మీ వలన అవుతుంది అంటే వెళ్లి మంత్రి గారిని కలవండి. ఏమైనా చెయ్యగలిగితే ఆయనే చెయ్యగలడు. దయచేసి వెళ్లిపోండి...” అంటూ ఖరాఖండి గ చెప్పేసేడు కలెక్టర్ శ్రీనివాస్.


చేసేది లేక మాష్టారు, మంత్రి గారి అప్పోయింట్మెంట్ కోసం ప్రయత్నిచసాగేరు. ఎట్టకేలకు తనకు వున్న పరిచయాల ద్వారా మంత్రి గారి అప్పోయింట్మెంట్ సాధించారు. 


“సర్.. ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారంట. ఈ జాగా విషయమై అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు.. కుదరదంటే వినిపించుకోవట్లేదు. అమ్మాయి పెళ్లి అంట.. ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇదిగో ఇవి అతని వివరాలు.” అంటూ ఆ ఫైల్ ని మంత్రి గారి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయేడు సెక్రటరీ. 


కాసేపు ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాస్టర్ గారిని లోపలికి పంపించ వలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీ కి చెప్పారు మంత్రిగారు.


“రండి..! కూచోండి. మీ వివరాలన్నీ చూసాను.” అంటూ మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించారు మంత్రివర్యులు. 


“ఈ భూమి విషయమై కొన్ని అడ్డంకులు వున్న మాట వాస్తవమయినా, మీ కేసు జెన్యూన్ కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను. మరేమీ ఫర్లేదు...మీరు నిశ్చింతగా ఉండొచ్చు,” అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి, సెక్రటరీని పిలిచి, త్వరగా క్లియర్ చెయ్యమంటూ ఆదేశాలు జారీ చేసారు మంత్రిగారు. 


మాస్టారు ఉప్పొంగిపోయేరు. “గత మూడు నెలలనించీ తిరుగుతున్నా పని కాలేదు. మీ దయ వలన ఇప్పుడు పూర్తయ్యింది.” అంటూ కృతఙ్ఞతా పూర్వకంగా నమస్కరించబోయేరు మాస్టర్ గారు. 


“అయ్యో... మీరు పెద్దవారు. మీరు నమస్కరించరాదు. మీ బోటి వారికి సేవ చెయ్యడమే మా లక్ష్యం!” అంటూ మాస్టర్ గారిని వారించారు మంత్రి గారు.


కృతఙ్ఞతా పూర్వకంగా ఆశీర్వదించి వెనుదిరిగి తలుపు తీసుకుంటూ వెళ్లబోయారు తెలుగు మాస్టారు. 


“చేతన్, చేన్, తోడన్, తోన్.. చేతనైన చేయూతనందించి తోడుగా నిలవడం....

తృతీయా విభక్తి...!”


“కొఱకున్, కై ... ప్రజల కొరకు, ప్రజల కోసం పోరాడటం.. చతుర్ధీ విభక్తి ...!”


“వలనన్, కంటెన్, పట్టి.....

ప్రజల వలన ఎన్నుకోబడిన నేను, వాళ్ళ కంటే గొప్పవాడినేమీ కాను, పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించటమే.....

పంచమీ విభక్తి ....!”


“కిన్, కున్, యొక్క , లోన్, లోపల.....

వ్యవస్థ లోపల వున్న కలుపు మొక్కల్ని ఏరి పారేసి, సంఘం యొక్క మేలు కోరడమే..... షష్టీ విభక్తి...!”


“అందున్, నన్.......

అందుకు కట్టుబడి వుంటాను, ఆ విధంగా నన్ను నేను మలుచుకుంటాను.

సప్తమీ విభక్తి...!”


“ఇదే మాకు మా గురుదేవులు నేర్పిన పాఠం! అందుకే మా తెలుగు మాస్టారంటే మాకు అమితమైన భక్తి !!! ఆయన నేర్పిన క్రమశిక్షణే మాకు యెనలేని శక్తి!!!!”


అమాంతం వెనక్కి తిరిగి చూసిన తెలుగు మాస్టారి కళ్ళు నీటి కుండల్లా వున్నాయి. 


“అవును మాస్టారు... నేనే చిన్నప్పటి మీ శీను గాణ్ణి...” అన్నాడు మంత్రి శీనయ్య!!!


నీటి పొరలు కప్పేయడం వలన ఏమో, ఒకరికొకరు మసక, మసకగా కనపడుతున్నారు. తన శిష్యుడి ఉన్నతి చూసి మురిసిపోయేరు మాస్టారు. గట్టిగా కౌగిలించుకున్నారు.


కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జీవితం పాఠాలను నేర్పసాగింది మాస్టారు. అప్పుడు తెలిసి వచ్చింది మీరు క్రమశిక్షణపై ఎందుకు అంత శ్రద్ధ వహించేవారో, మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడేవారో! ఆ నాడు మీరు నేర్పిన పాఠాలను నెమరు వేసుకుంటూ.....

నా బతుకు చిత్రాన్నేమార్చుకున్నాను. ప్రజాసేవ చేస్తూ దేశానికి ఎంతో కొంత ఋణం తీర్చుకోవాలనుకున్నా.....

చూస్తున్నారుగా......ఇపుడిలా”


“మీరేమీ అనుకోక పోతే అమ్మాయి పెళ్లి కి నాకు చేతనైనంత సహాయం చేసి, మీకు గురుదక్షిణగా చెల్లించుకుంటా.......

ఆ భూమిని మాత్రం అమ్ముకోవద్దు. 

మీ జీవిత భద్రత కోసం మీ దగ్గరే అట్టే పెట్టుకోండి ....”

“ఇది నా విన్నపం. కాదనకండి.” అంటూ అభ్యర్ధించాడు మంత్రి శీనయ్య ఉరఫ్ శీను.


గురుభక్తిని కాదనలేకపోయారు తెలుగు మాష్టారు. తన శిష్యుడు అంత ఎత్తుకి ఎదిగినందుకు సంబర పడిపోయారు.


“సార్ ..! మీ మొబైల్ అందుబాటులో లేనట్టుంది. మేడం గారు ఫోన్ చేసేరు. మీ చిన్నబ్బాయి స్కూల్ లో ఉసిరి చెట్టెక్కి కాయలు కోయబోతూ కింద పడ్డాడంట.”


“మరేమి ఫరవాలేదు ... హి ఈస్ ఆల్రైట్ అని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి చెప్పారంట ...” అంటూ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణలు చెప్తూ... వచ్చి చెప్పాడు సెక్రటరీ.


“మరేమీ ఫర్వాలేదు ప్రిన్సిపాల్ గారిని వాడికి ఇంకో నాలుగు తగిలించమను. మరీ బుద్ధి లేకుండా తయారౌతున్నాడు ఈ మధ్య!” అంటూ ... తెలుగు మాస్టర్ గారి ముఖం లోకి చూసారు సదరు మంత్రి గారు.


ఆ ఇద్దరూ అంతలా పకా, పకా ఎందుకు నవ్వుతున్నారో ఓ పట్టాన అర్ధం కాలేదు సెక్రటరీ కి.....✍️


అంతర్జాల సేకరణ 

షరా: అలాంటి ఉపాధ్యాయుల్ని, విద్యార్ధుల్ని చూపించమంటే చూపగలను, కానీ అలాంటి మంత్రులను చూపమని అడగొద్దు. అసాధ్యం.✍️


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కాలనేమినిహా

 👆 శ్లోకం 

కాలనేమినిహా శౌరిః.                            

శూర శ్శూరజనేశ్వరః|

త్రిలోకాత్మా త్రిలోకేశః                          

కేశవః కేశిహా హరిః||


ప్రతిపదార్థ:


కాలనేమినిహా - కాలనేమి యను రాక్షసుని వధించినవాడు.


వీర: - వీరత్వము గలవాడు.


శౌరి: - శూరుడను వాడి వంశమున పుట్టినవాడు.


శూరజనేస్వర: - శూరులలో శ్రేష్ఠుడు.


త్రిలోకాత్మా - త్రిలోకములకు ఆత్మయైనవాడు.


త్రిలోకేశ: - మూడు లోకములకు ప్రభువు.


కేశవ: - పొడవైన కేశములు గలవాడు.


కేశిహా: - కేశి యనుడి రాక్షసుని చంపినవాడు.


హరి: - అజ్ఞాన జనిత సంసార దు:ఖమును సమూలముగా అంతమొందించువాడు.

మూక పంచశతి

 శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన

పాదారవిందశతకం

🙏🌸🙏🙏🙏🌸🙏

 

శ్లోకము:-

జగన్నేదం నేదం పరం                     

ఇతి పరిత్యజ్య యతిభిః.           

కుశాగ్రీయ స్వాంతైః                            

కుశలధిషణైః శాస్త్రసరణౌ |

గవేష్యం కామాక్షీ ధ్రువ.                  

 మకృతకానాం గిరిసుతే.                     

గిరా మైదంపర్యం తవచరణ                  మాహాత్మ్య గరిమా ||24||

 

 

భావము:

శాస్త్రపద్దతిలో కుశాగ్రంలా చురుకైన సూక్ష్మబుద్దులుకల మేధావులైన యతులు ఈ దృశ్యమైనది జగత్ కాదు. వేదములకు వాస్తవంగా అన్వేషాణీయం గిరిసుతయైన కామాక్షీదేవీ నీ దివ్య చరణముల మహిమాతిశయం మాత్రమే సుమా అని గ్రహించారు.

 

*********

 

🔱 ఆ తల్లి 

పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱                                                                                                                                                                                             🙏🌸🌸🌸🌸🌸🙏

పంచాంగం 08.10.2024 Tuesday,

 ఈ రోజు పంచాంగం 08.10.2024 Tuesday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష పంచమి తిధి భౌమ వాసర: జ్యేష్ట నక్షత్రం ఆయుష్మాన్ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


 పంచమి పగలు 11:15 వరకు.

జ్యేష్ట రా. తె 04:06 వరకు .


సూర్యోదయం : 06:11

సూర్యాస్తమయం : 05:56


వర్జ్యం : పగలు 08:23 నుండి 10:06 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:32  నుండి 09:19 వరకు తిరిగి రాత్రి 10:50 నుండి 11:39 వరకు.


అమృతఘడియలు : సాయంత్రం 06:40  నుండీ రాత్రి 08:32 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30  వరకు.



శుభోదయ:, నమస్కార:

హైందవం వర్ధిల్లాలి 24*

 *హైందవం వర్ధిల్లాలి 24*


*ధర్మప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు,  పీఠాధిపతులు,  హిందూ నాయకులు హైందవ జాగృతికై ప్రజలలోకి రావాలి*. v):-  భారతదేశ ప్రజలలో చైతన్యము మరియు ఐకమత్యము లోపించిందా అంటే లేదనే చెప్పాలి.  ఐకమత్యం  అర్థాలు లోగడ వ్యాసాలలో పరిశీలించాము. ప్రస్తుత పదం *చైతన్యం* యొక్క సాధారణ అర్థాలు చూద్దాము = ఎరుక, తెలివి,  స్పృహ, కదలిక,  జాగృతి, మెచ్చదగిన మార్పు. విశేష నిర్వచనము =  ప్రత్యేకమైన ఆలోచనలు, స్థిరమైన భావాలు, అవసరాలపై ప్రత్యేక అవగాహన. చైతన్యం ఎన్ని విధాలో చూద్దాం = ఆత్మ చైతన్యము, స్త్రీ చైతన్యము, కార్మిక చైతన్యము, సామాజిక చైతన్యము ఇత్యాది. ఐకమత్యం ఎన్ని విధాలో పరిశీలిద్దాము =  హక్కుల సంఘాలు,సహకార, గ్రహ, ఉద్యోగ, మహిళా, కార్మిక, వయోవృద్ధ ఈలా ఎన్నెన్నో సాధన సంఘాలు. 


ఈలా ఇవన్నీ నిర్మించుకోవడానికి ప్రవచనకారులు, ధర్మ ప్రచారకులు లాంటి పెద్దలెవరైనా *హితవు* పలికారా అంటే  లేదనే చెప్పాలి. ప్రజలలో ఇంత చైతన్యానికి, ఐకమత్యాన్నికి కారణం గమనిస్తే అవసరాలు, హక్కుల పోరాటానికి సన్నద్ధత, వారి వెనుక ఉన్న సంబంధిత కుశాగ్ర ధీశాలురు. ఈ పోరాట సంఘాలు దేశాన్ని ఏలా మరియు ఎంత స్పందింపజేస్తావో సర్వులకు విదితమే. హక్కులు సాధించే వరకు వారి ప్రయత్నాలు విరమించరు, జరిగే కాల, ధన, జన నష్టాన్ని గూడా ఖాతరు చేయరు. గత సంవత్సరం దేశ ముఖ్య పట్టణం "డిల్లీలో" వ్యవసాయదారుల  అసత్య దీక్షలు ఎంత సంచనలకరమో మనందరికీ విదితమే. *పెద్దలు అంటూ ఉంటారు చైతన్యము మరియు ఐకమత్యం "ఒక్కొక్కసారి" దుర్వినియోగం పాలవుతున్నదని*.

చైతన్యానికి  వృద్ధాప్యం ఉండదు, నిరంతరం ఈ స్రవంతి సాగుతూనే (ముందుకు) ఉంటుంది.


దేశం సంస్కృతి, సంప్రదాయాలు మరియు ధర్మానికి హాని జరుగుచున్నపుడు, మరియు తోటి జనుల జీవనం చిన్నాభిన్నమవుతున్నప్పుడు, వీటితో పాటు దేశ  శాంతి భద్రతలకు, ప్రతిష్టకు భంగం కల్గుతున్నప్పుడు పైన ఉదహరించబడిన  చైతన్య మరియు ఐకమత్య ధృఢ సంకల్ప ప్రజలలో *నీరసము, నిస్త్రాణత, ఉదాసీనము, స్థావరత, క్రియాశూన్యత, అనిర్ణీత, అయిష్టత, వ్యాకులతగా* చోటుచేసుకుంటున్నది.

 వారు దేశ పరిస్థితుల గురించి పట్టించుకోని వైనం  *ఆ సంఘ పెద్దలు మరియు మేధావులు ప్రజలకు తెలియజేయవల్సి ఉంటుంది*.  ఇంత పరపతి ఉన్న పెద్దలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పెద్దలను సంప్రదించ వచ్చును. *హక్కులేనా ముఖ్యం బాధ్యతలు గూడా ముఖ్యమే గదా*. కావున మన హైందూ ధర్మానికి, సంస్కృతికి  ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి. 


ధన్యవాదములు.

*(సశేషం)*.