8, అక్టోబర్ 2024, మంగళవారం

కంబరామాయణం 98

 కంబరామాయణం 98

(పరమపదం చేరిన శరభంగ మహర్షి )


శరభంగ మహర్షి కుటీరములోనికి ప్రవేశించాడు రామచంద్రుడు !

(శరభంగ మహర్షి అనగా మన్మథుడి శరములను భంగము చేసి యుగముల పర్యంతము తపస్సునాచరించినవాడు )

...

రామచంద్రుడి దివ్యమంగళ విగ్రహాన్ని తనివితీరా చూసి పరవశత్వానికి లోనయి ఆయనను ప్రస్తుతించాడు దేవేంద్రుడు !

...

రామా ! వేదపురుషా ! జీవులలోని అంతఃప్రకాశము నీవే !బ్రహ్మాదిదేవతలు కూడా  తెలుసుకొనుటకు కష్టసాధ్యమయినవాడా ! ఆద్యంతరహితా !  నీకివే నా కైమోడ్పులు అంటూ నమస్కరించాడు దేవేంద్రుడు ! 

...

ఆ వెనువెంటనే మహర్షి వద్ద సెలవు తీసుకొని తిరిగి వెళ్ళిపోయాడాయన !

...

రామచంద్రుడు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు.

...

మహర్షి ఆయనను లేవదీసి గాఢంగా తన కౌగిలిలో బంధించాడు !

..

తదుపరి సీతాదేవి, లక్ష్మణుడు కూడా కుటీరం లోనికి ప్రవేశించారు .

...

సీతారామలక్ష్మణులు ఆ రాత్రికి మహర్షి ఆశ్రమంలో విశ్రమించారు !

...

తెల్లవారింది ! సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకొని మహర్షి చెంతకు చేరారు వారు.

...

మహర్షి రామచంద్రుని చూచి ," రామా ! నీ సమక్షములో నా శరీరాన్ని యోగాగ్నిలో దగ్ధం చేసుకోవాలనుకుంటున్నాను అందుకు నన్ననుమతించవయ్యా " అని అడిగారు

...

నా సమక్షంలోనే ఎందుకు ? ప్రశ్నించాడు రామచంద్రుడు !

...

నేను వేలకొలది యజ్ఞాలు చేశాను యుగాలపర్యంతము తపమాచరించాను ! నీ రాకతో నాకున్న భవబంధాలన్నీ పటాపంచలైపోయినాయి ! ఇక నేనిక్కడ ఉండి చేయవలసిన పనులేవీ లేవు ! 

...

దేవేంద్రుడు వచ్చి సత్యలోకానికి రమ్మని బ్రహ్మదేవుడు పంపిన ఆహ్వానమందించాడు ! నేను చేరుకోవాలనుకున్నది పునరావృత్తిరహిత శాశ్వత పరమపదం ! కావున నాకు నీవు అనుమతినీయవలె అని అర్ధించాడు మహర్షి !

...

సీతారామలక్ష్మణుల సమక్షములో అర్ధాంగితో కూడి యోగాగ్నిలో భస్మమయి పోయి పరమపదం చేరుకున్నాడు మహర్షి !

...

మహావిష్ణువుకు గల వేల నామాలలో ఒక్కనామము పలికినా చాలు మనిషికి మోక్షం ప్రాప్తించడానికి ! మరి సాక్షాత్తూ ఆ మహావిష్ణువే తరలి తనముందుకు వస్తే తపస్సు ఫలించినట్లే పరమపదము సాధించినట్లే !!!!

....

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: