31, మార్చి 2021, బుధవారం

*ఒకే గోత్రీకుల మధ్య

 *ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు ఎందుకు చేయరాదు?*



శ్లో ll సప్తమాతృచం మాద్థీమాన్ య:కన్యాముద్వహేన్నరః !

గురుతల్పీన విజ్ఞేయః సగోత్రాన్ చైవ ముద్వహన్!! - ధర్మసింధు 


తండ్రి తరుపున ఏడులతరాలలోగాని, తల్లితరపున ఐదు తరాలలోగాని సగోత్రీకులైన వారిని వివాహం చేసికొనరాదు. అట్లుచేసికొన్నచో తల్లిని (గురుపత్నిని) వివాహం చేసికొన్నంత పాపం సంభవిస్తుంది.


సనాతన సంప్రదాయంలో యజ్ఞయాగాలు మొదలైన వైదిక కర్మలకు, వివాహాది శుభకార్యాలకు, శ్రాద్దాది పితృకర్మలకు తప్పనిసరిగా గోత్రం, ప్రవర తప్పనిసరిగా తెలియపర్చవల్సి వుంటుంది. మనందరి గోత్రాలకు ఎనిమిది మంది మహర్షులు మూలపురుషులుగా వున్నారు. అగస్త్యమహర్షి- భరద్వాజ మహర్షి - గౌతమ మహర్షి - వశిష్టమహర్షి - కాశ్యపమహర్షి - భరద్వాజ మహర్షి - అత్రిమహర్షి - జమదగ్నిమహర్షి ఈ ఎనిమిది మంది మహర్షులు మనకు గోత్రపురుషులు.


ఏ గోత్రం వారు ఆ గోత్రం వారికి రక్తసంబంధీకులు అవుతారు.


 ఈ ఎనిమిది మంది గోత్రపురుషులకు కలిపి నలభైతొమ్మిది మంది ప్రవర పురుషులున్నారు. సంతానోత్పత్తి క్రియకు (దాంపత్యానికి) ఒకే గోత్రీకులు అయి వుండ రాదు. ఒకే ప్రవర వున్నవారు కూడా పనికిరారు దాంపత్య బంధానికి పనికిరారు (వివాహం కుదరదు). 


వధూవరులు ఒకే గోత్రం కలవారైనా, ఒకే ప్రవర' వారైనా అన్నాచెల్లెళ్ళవుతారు.


ఒకే గోత్రీకులకు బిడ్డలు పుడితే పరమదుర్మార్గులవుతారు.


సగోత్రీకుల వివాహబంధం కంటే వర్ణాంతర వివాహమే మేలైనది.


సగోత్రీకులు, సప్రవరీకుల మధ్య మాత్రమే కాకుండా మేనత్త కూతురిని అన్నగారి మరదలిని (వదిన చెల్లెలిని) మేనమామ కూతుర్ని కూడా వివాహం చేసుకోకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది. తండ్రితరపు రక్తసంబంధీకులు ఏడుతరాలవారు, తల్లితరపున రక్తబంధువులు ఐదుతరాలవారు కాకుండా వున్న కన్యను పెండ్లిచేసుకోవాలని అన్నిశాస్త్రాలు చెబుతున్నాయి. అక్క కూతురిని పెండ్లి చేసుకోవటం కూడా ధర్మాచారం కాదు. అనగా తండ్రిగారి చెల్లెలి బిడ్డను (మేనత్త కూతురు) తల్లిగారి చెల్లెలిబిడ్డను (పినతల్లి కూతురు) వివాహ మాడరాదు.


కుండ మార్పిడి వివాహాలు కాని, ఒకే పందిరిలో రెండు పెళ్ళిళ్ళుగాని నిషిద్ధం.


*దూర సంబంధీకులైన భార్యాభర్తలకు పుట్టే పిల్లలు

ఆరోగ్యంగానూ తెలివిగలవారుగానూ, సౌందర్యవంతులుగానూ వుంటారనేది మాత్రం నిజం. సగోత్ర సంబంధాలను 

పురాణాలు, స్మృతులు, అన్ని వ్యతిరేకిస్తున్నాయి*

🙏🏻

కామెంట్‌లు లేవు: