30, జులై 2021, శుక్రవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 16

  ప్రశ్న పత్రం సంఖ్య: 16                          కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

నేను కూర్పు చేసి సమర్పిస్తున్న ప్రశ్న పాత్రలకు విశేష ఆదరణ లభిస్తున్నదని  నేను బొంకలేను కానీ కొద్దీ మంది సభ్యులు స్పందిస్తున్నారన్నది యదార్ధం.  వారిని స్ఫూర్తిగా  దృష్టిలో ఉంచుకొని ఈ పరంపరను కొనసాగిద్దామనుకుంటున్నాను  

క్రింది  ప్రశ్నలకు జవాబులు తెలుపండి 

1) "చందమామ రావే జాబిల్లి రావే" పాట పాడని తెలుగు అమ్మ లేదు.  ఇది ఎవరు వ్రాసారో తెలుసా.  

2) "ప్రస్థాన త్రయం" అని ఏ గ్రంధాలని అంటారు.  

3) "ఉరక రారు మహాత్ములు" అనేది ఒక పద్య పాదం ఇది మనం నిత్యం వాడుతూ ఉంటాము కానీ ఈ వాక్యం ఎక్కడిదో, ఎవరు వ్రాసారో తెలుసా. 

4)  సాధారణంగా ఒక పద్యానికి ఎన్ని పాదాలు ఉంటాయి. 

5) ఉపమాలంకారం అంటే ఏమిటి. 

6) " పరి పరి విధముల  వరమొసంగెడి " పాదము ఎందులోది దీనిని వ్రాసిన వాగేయకారుడు ఎవరు. 

7) "హరి హరి సిరి యురమున గల హరి"  పద్యపాదం  ఏ గ్రంధము లోనిది. కవి ఎవరు. 

8) ”పోగాలము దాపురించినవారు దీపనిర్వాణగంధమును, అరుంధతిని, మిత్ర వాక్యమును మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు”  ఏ పుస్తకములోది రచయిత ఎవరు.  ఇందులో వున్న అలంకారాన్ని చెప్పగలరా 

9) నంది తిమ్మన కవికి ఇంకోపేరు ఏమిటి. 

10) "కృష్ణం వందే జగద్గురు" అని ఎందుకు అంటారు. 

11) "పరివ్రాజకుడు"  అని ఎవరిని అంటారు. 

12) కంచుకాగడా వెలిగించి చూచినా 

13) భావగర్భితము అనగా నేమి 

14) రమణ మహర్షి ప్రకారము "ముక్తి" అనగా నేమి. 

15) పోతన తన శ్రీ భాగవతంలో " మధుపం" అనే పదం ఏ పద్యంలో వాడారు. 

16) "వరూధిని" పాత్ర ఏ గ్రంధములోనిది, దాని కవి ఎవరు. 

17) "వావి వరుస" అనే ద్వంద పదాల  అర్ధము తెలుపండి. 

18) "విద్యుత్లతలు" అంటే వృక్ష విశేషమా కాదా ఏమిటి తెలుపండి 

19) "కొంపలు మునిగినట్లు" పద ప్రయోగం ఎప్పుడు చేస్తారు.   

20) మిత్ర లాభము అనే కధ ఏ గ్రంధములోనిది దాని రచయిత ఎవరు. 

 

కామెంట్‌లు లేవు: