2, జులై 2020, గురువారం

రామభక్త తులసీదాస్

 ఒక మహాభక్తుడు తీర్థయాత్రలు చేస్తూ పండరీపురం చేరుకున్నాడు.

 చంద్రభాగా నదిలో  స్నానమాచరించి అక్కడే నదీతీరాన కూర్చుని కొంతసమయం ధ్యానం చేసి; విఠలుని దర్శనానికై దేవాలయం వైపు నడవసాగాడు.
అంతలో  ఒక అంధుడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి పరుగుపరుగున వెళుతున్నాడు.

  దివ్యభావపారవశ్యంలో ఉన్న  ఆ భక్తుడికి ఎదురుగా వస్తున్న  వ్వక్తిని సరిగా గమనించలేదు

.ఆ అంధుడు భక్తున్ని  ఢీకొని కిందపడిపోయాడు.వెంటనే ఆ భక్తుడు అతణ్ణి  పైకి లేపి క్షమించమని అడిగాడు.

అతడు అంధుడని భక్తునికి తెలియదు. ఎంత సేపు పిలిచినా కళ్ళు తెరవకపోవడంతో నాయనా ! కళ్ళు తెరవు అనగానే కళ్ళు తెరిచాడు.

    అంధుడు ఆశ్చర్యంతో తన ముందు నిలబడివున్న  భక్తున్ని  చూసి పట్టరాని సంతోషంతో  "స్వామీ! మీ దయ వల్ల నా అంధత్వం తొలిగిపోయింది .నాకు దృష్టిని ప్రసాదించిన  మీరు మహ్మతులు అని కన్నీరు కారుస్తూ భక్తుడికి ప్రణమిల్లాడు.

ఆ భక్తుడు ఎంతటి పరమపావనుడో అతని వాక్క ఎంతటి శక్తిమంతమో కదా!

అతనే  రామభక్త తులసీదాస్... హనుమాన్ చాలీసా రచించిన మహాభక్త కవి

కామెంట్‌లు లేవు: