21, జనవరి 2022, శుక్రవారం

సూక్ష్మ శరీరయానం



 మనం నానో టెక్నాలజీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ ఇదే విషయం సనాతన ధర్మం ఎన్నో ఏళ్లనుంచే చెప్తుంది..


హిమాలయాల్లో వందల సంవత్సరాలు జీవించే వ్యక్తులు ఉన్నారని విన్నాము కదా ఇదిగో సాక్ష్యం..

ఇలా ధ్యానంలో కూర్చుని ఎండ వాన చలి నుండి తట్టుకుని ఎలాంటి పరిస్థితిలోనైనా జీవించే శక్తి మన రుషులు, మునుల సొంతం.


ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి వెళ్తే...


  మన ఋషులు,యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మనం పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. 


వీటన్నింటికీ సమాధానం ఒకటే అదే సూక్ష్మ శరీర యానం. అదే నానో టెక్నాలజీ. నాగసాదువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం. ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని మనం నమ్మం.


అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు,జర్మనీ వాడు చెప్పే సోది అంతా విని చంకలు ఎగరేస్తుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదవండి. వాటిని అనుసరించి, అమలు చేసే ప్రయత్నం చెయ్యడి. ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు.


అనేక మంత్రరహస్య గ్రంథాలున్నాయి

అనేక శాస్త్రాలున్నాయి!

వేదాలు, ఉపనిషత్తులు పురాణఇతిహాసాలున్నాయి!

ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను, పురాణ గ్రంథాలను చదవండి.. వాటిని అధ్యయనం చేయండి, సద్గురువులను ఆశ్రయించండి, వారిని అనుసరించి, వారి అడుగుజాడలలో నడవండి! ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు నేర్పించవచ్చు, జయహోభారత్!!

కామెంట్‌లు లేవు: