28, ఏప్రిల్ 2023, శుక్రవారం

పూజ - ప్రసాదం

 పూజ - ప్రసాదం


1945లో పరమాచార్య స్వామివారు మయూరంలో మకాం చేస్తున్నప్పుడు దగ్గర్లోని అణైతాండవపురంలో చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారు. పూజ పూర్తైన తరువాత ప్రసాదం పెట్టడానికి మఠం ఏనుగుని పూజాస్థలికి తీసుకురమ్మని ఆదేశించారు. పూజ జరుగుతున్న ప్రదేశం చిన్నదిగా ఉండడం, ప్రవేశద్వారం మొక్కజొన్న పొత్తులతో అలంకరింపబడి ఉండడం వల్ల అంతపెద్ద ఏనుగుని లోపలికి ఎలా తీసుకురావాలో అర్థం కాక అక్కడున్నవారు కలవరపడుతున్నారు.


ఏనుగుని తీసుకునిరాకపోవడానికి గల కారణాలను పరమాచార్య స్వామివారికి విన్నవించగా, స్వామివారు మావటిని పిలిచి పూజకు ఏనుగును పంపవలసిందిగా ఆజ్ఞాపించారు.


మావటి వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్ళి దాంతో సంభాషించి పూజకు రావల్సిందిగా మహాస్వామివారు పిలిచారు అని చెప్పి దాని బంధనాలను తొలగించాడు. వెంటనే అది వస్తున్నాను పద అన్నట్టుగా తలాడించి పూజామందిరం ద్వారం వద్దకు వచ్చి అంతపెద్ద తన దేహాన్ని చిన్నదిగా చేసుకుని, వంచుతూ, మెలికలు తిప్పుతూ ఆ ద్వాఅరం గుండా లోపలికి ప్రవేశించింది. పూజ పూర్తి అయ్యేదాకా అక్కడ నిశ్శబ్ధంగా నిలబడి తరువాత ఎలా లోపలికి వచ్చిందో అలాగే బయటకు తిరిగి వచ్చింది.


ఏనుగు స్వామివారి మాటల్ని విని అలా ప్రవర్తించడం చూసి అక్కడున్న వారందరూ పారవశ్యంతో అలా చూస్తూ నిలబడిపోయారు.


--- యమ్. ఆర్. బాలసుబ్రమణియన్, తిరుచ్చి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 6


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: