🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
నేటి…
*ఆచార్య సద్బోధన*
➖➖➖✍️
*ఎవరైనా అన్యాయంగా ..*
*ఎవరి మీదైనా, చెడు ఆరోపణలు, నిందలు, వేసినంత మాత్రాన, వారి జీవితంతో చెడు అయిపోతుంది, జరుగుతుంది, అనుకోవడం పొరపాటు!*
*నిందలు వేసిన వారిని కూడా, మనం వారిని ఏమీ చేయనవసరం లేదు ..*
*ప్రశాంతంగా ఉన్న ..*
*జీవితమనే కొలనులో ఎవరైనా, అన్యాయంగా అబద్దాలతో, నిందలనే రాయిని వేసినప్పుడు, ఆరోపణలు చేసినప్పుడు, కేవలం ఆ సమయంలో, అప్పుడు మాత్రమే, అక్కడ ఉన్న ఆ నీటి ప్రశాంతతను, ఆ రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు ..*
*కానీ, కాసేపు తరువాత, నీరు తేరుకుని నిర్మలంగా, శుభ్రంగా, స్వచ్ఛంగా, ప్రశాంతంగా కనబడుతుంది, ఉంటుంది కూడా ..*
*కానీ, నిందలు వేసినవారు, అందరి దృష్టిలో, మనస్సులో, ఆ రాయిలా, ఆ నీటి కొలనులో శాశ్వతంగా ఎప్పటికీ అడుగునే ఉండిపోతారు!*
*అందుకే, మీరు ఎవరిపైనా అనవసరంగా లేని పోని ఆరోపణలు, నిందలు వేయడానికి ఇష్టపడకండి, మంచిది కూడా కాదని గ్రహించండి ..*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి