*క్షమా గుణం:-*
🙏🙏🙏🙏🙏🙏🙏
*మన మనసు లో రెండు వైరుధ్య భావాలుంటాయి...*
*ఒకటి క్షమించడం...*
*రెండోది...*
*పగ తీర్చు కోవడం...*
*ఈ రెంటికీ సదా...* *సమరం జరుగుతూ...* ఉంటుంది.. *
*అదే 'కురుక్షేత్రం'...*
*క్షమ గెలిస్తే హృదయం...* *ఆనందమయం...*
మనసులో అంతు లేని సంతోషం.
మనిషికి తృప్తి.
మన లో ఉండే ప్రేమ ఎప్పుడూ...
'క్షమించు క్షమించు' అని చెబుతూనే ఉంటుంది.
ప్రేమి స్తే ప్రేమను.. పొందుతాం.
ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం.
'గుండెలో పగ దాచుకోవడం అంటే పామున్న ఇంటిలో ఉండటమే' అంటుంది. భారతం.
పగవల్ల పగ పోదనీ,
ఏ విధంగా చూసినా పగని అణచడం లెస్స అనీ భారత మహేతిహాస ఉద్బోధ!
'నా కన్ను నువ్వు పొడిస్తే...
నీ కన్ను నేను పొడుస్తా' అని 'కన్ను,కు కన్ను పన్నుకు పన్ను' సిద్ధాంతం తో అందరూ ముందుకు దూకితే...
లోకం అంతా గుడ్డివాళ్లతో, బోసినోటివాళ్లతో నిండి పోతుంది...
ఈ పగ, ప్రతీకారం అనే విషచక్రం నుంచి బయట పడాలంటే క్షమించడం ఒక్కటే ఉపాయం.
ఇందువల్ల రెండు లాభాలు.
ఒకటి- క్షమించే వారు ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు.
రెండోది- క్షమ పొందేవారు.
తమ జీవితాలను సరిదిద్దు కుంటారు.
క్షమాగుణం శత్రువును సైతం మిత్రుడి గా మార్చేస్తుంది.
'పొరపాటు మానవ సహజగుణం,
క్షమ దైవ విశిష్టగుణం' అని ఆంగ్ల సామెత.
మహాభక్తుల జీవితాలన్నీ ప్రేమమయాలు.
ఏకనాథుడు పాండురంగడి భక్తుడు. ప్రశాంత చిత్తుడు.
సదా స్వామి సేవలో, భజన లో కాలం గడిపే వాడు.
ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్యపడ్డారు.
ఎలాగైనా ఏకనాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించ సాగారు.
ఒక దుష్టుడికి డబ్బు ఆశచూపి, ఆ పనికి నియోగించారు.
ఏకనాథుడు రోజూ తెల్లవారు జామునే నదిలో స్నానం చేసి వచ్చేవాడు.
ఆ సమయంలో ఆ దుష్టుడు ఏకనాథుడిపై ఉమ్మి వేశాడు.
ఏకనాథుడు ప్రశాంత చిత్తంతో,
చిరునవ్వు చెరగ నీయ కుండా వెనక్కి వెళ్లి నదీ స్నానం ఆచరించాడు...
ఇలా మొత్తం నూట ఏడుసార్లు జరిగింది.
ఏకనాథుడు ఏమాత్రం నిగ్రహం వీడ కుండా, మందస్మిత వదనం తో అన్నిసార్లూ...
మరల మరల స్నానం చేసి వస్తున్నాడు.
దీంతో ఆ కుటిలుడి హృదయం చలించిపోయింది!
ఆయన ఏకనాథుడి కాళ్లపై పడ్డాడు.
'స్వామీ,
మీరు నిజంగా... దైవస్వరూపులు.
మీ నిగ్రహం చెడగొట్టి, ఎలాగైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమాయించారు.
మీకు ఆగ్రహం తెప్పించ గలిగితే నాకు ధనం ఇస్తామని ఆశచూపారు.
మీ క్షమాగుణం తెలియక...
నేనీ నీచ కృత్యానికి అంగీకరించాను!' అన్నాడు.
ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో.
ఏకనాథుడు అతడికి నమస్కరిస్తూ...
ఇలా అన్నాడు.
'నాయనా,
నీవు నాకెంతో మేలు చేశావు.
నా చేత నూట ఎనిమిదిసార్లు పవిత్ర నదీస్నానం చేయించిన మహాను భావుడివి. నువ్వు!
నేను నీ మేలు ఎన్నటికీ మరచి పోను!'
ఏక నాథుడి పలుకులు విని అవతలి వ్యక్తి నిర్విణ్ను డయ్యాడు.
ఆ భక్తాగ్రేసరుడి క్షమాగుణం...
ఆ ఉమ్ము వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది.
పశ్చాత్తాపం తో అతడు కన్నీరు కార్చాడు...
క్షమ అంటే భూమి.
భూమి ఓర్పు గల తల్లి...
కనుకనే మనం ఎంత బాధ పెట్టినా...
భూమాత మనపై పగ తీర్చుకోవాలను కోదు.
క్షమించే గుణం ఉన్నది.
కదా...అని మనం...
భూ మాత ను...
అదే పని గా హింసించ కూడదు.
క్షమాగుణానికీ హద్దు లుంటాయని గుర్తుంచు కోవాలి!
క్షమాగుణం పురాణాలకు,
ప్రాచీన ఇతిహాసాలకే పరిమితం కాదు.
ఇటీవలి చరిత్రలో క్షమాగుణంతో చరితార్థులైన మహాపురుషు లెందరో ఉన్నారు.
ఆర్య సమాజ స్థాపకులైన మహర్షి దయానంద నిష్కాపట్యం, నిర్భయత్వం సమాజంలో అనేకులకు కంట గింపైంది.
ఆయన వద్ద వంటవాడికి లంచం ఇచ్చి,
ఆహారంలో విషం పెట్టించారు.
దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు.
తన వంట వాడిని దగ్గరకు పిలిచారు.
కొంత డబ్బు అతడి చేతి లో పెట్టి ఇలా... అన్నారు.
'వెంటనే నువ్వు నేపాల్కి వెళ్లిపో!
నా శిష్యులకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతక నీయరు!'
తనకు ప్రాణ హాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి, అతడికి ప్రాణ దానం చేసిన మహర్షి దయానంద చరితార్థు లయ్యారు.
*క్షమా గుణం:-* *మానసిక రుగ్మతలకు మంచి మందు...*
పగ తీర్చు కుంటే ప్రశాంతత చిక్కుతుందను కోవడం కేవలం భ్రాంతి మాత్రమే!
నిజానికి అభద్రత మిగులు తుంది.
చిత్త వికారం ఏర్పడు తుంది.
చివరకు జీవితం విషాదాంతం అవుతుంది.
ఒక అరబ్బీ సామెత ఇలా చెబుతుంది-
'ఇతరులు మనకు చేసిన అప కారాలను ఇసుక పై రాయాలి.
ఇతరులు మనకు చేసిన...
ఉపకారాలను...
చలువ రాయి పై చెక్కు కోవాలి!'
*సృష్టి ధర్మం శరణం గఛ్ఛామి*
*ప్రకృతి ధర్మం శరణం గఛ్ఛామి*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి