19, జనవరి 2026, సోమవారం

హిందువుల విషాద అధ్యాయం

 💔 1972 – ప్రపంచం మరిచిపోయిన హిందువుల విషాద అధ్యాయం 💔


నాటి ఉగాండా నియంత ఇదీ అమీన్ కు “అల్లాహ్ తనకు కలలో కనబడి హిందువులను..సిక్కులను దేశం నుంచి వెళ్లగొట్టమని చెప్పాడట…”


ఇది 1972లో ఉగాండాలో వేలాది హిందువులు అనుభవించిన భయంకరమైన నరకం..


1972లో జనరల్ ఇడి అమిన్ ఉగాండాలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే, ఒక్క ప్రకటనతో —

👉 ఉగాండాలో ఉన్న భారతీయులందరూ 90 రోజుల్లో దేశం విడిచిపెట్టాలి అని ఆదేశించాడు.


ఆ 90 రోజులు…

భయంతో నిండిపోయాయి.

భద్రత లేకుండా పోయాయి.


భారతీయుల ఇళ్లపై దాడులు,

వ్యాపారాల దోపిడీ,

మహిళలపై అఘాయిత్యాలు…

దీంతో వేలాది కుటుంబాలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి, ఏమీ తీసుకోలేక, రాత్రికి రాత్రే దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది.


ఉగాండాలో ఉన్న భారతీయుల్లో 90% గుజరాతీలు, పంజాబీలు.

వారికి చెప్పిన మాట ఒక్కటే..


👉 “మూడు జతల బట్టలు తప్ప ఇంకేమీ తీసుకెళ్లకూడదు.”


ప్రతి విమానాశ్రయం, ప్రతి బస్ స్టేషన్…

కఠిన తనిఖీలు.

మహిళలకు అవమానం.


👉 సుమారు 80,000 మంది హిందువులు ఒక్క రాత్రిలోనే వలస వెళ్లారు.

వాస్తవ సంఖ్యలు ఇంకా ఎక్కువనే నమ్మకం ఉంది…

కానీ ఈ భారీ స్థాయి జాతి శుద్ధిని (ethnic cleansing) ప్రపంచం తక్కువగా మాట్లాడింది.


ఇది ఎందుకు జరిగిందో చెబుతూ, అమిన్ అనుచరులు చెప్పిన కారణం..


👉 “అల్లాహ్ కలలో చెప్పాడు” అని.


అప్పట్లో భారత్‌లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఉక్కు మహిళ అని కీర్తించబడ్డ ప్రధానమంత్రి — ఇందిరా గాంధీ.

పంజాబ్, గుజరాత్‌లో కూడా అదే పార్టీ పాలన.


అప్పుడే పాకిస్తాన్ ను ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేశామని చంకలు గుద్దుకుంటున్న కాంగ్రేస్ నాయకత్వం, ఉగాండా హిందువుల మీదా సిక్కుల మీదా కనీస మానవత్వం చూపలేదు.. 


👉 భారతీయులపై జరిగిన ఈ దారుణంపై భారత్ నుంచి గట్టి స్పందన లేదు..

👉 ఖండన లేదు.

👉 చర్చలు లేవు.

👉 పైగా, ఉగాండా నుంచి వచ్చిన భారతీయ శరణార్థులను భారత్‌లోకి తీసుకోవడానికి కూడా నిరాకరణ.


ఆ సమయంలో ఎవరు ముందుకు వచ్చారు తెలుసా?


👉 బ్రిటన్.


తమ దేశం పాలనలోనే ఒకప్పుడు ఉగాండాకు వెళ్లిన భారతీయులని గుర్తు చేసుకున్న బ్రిటన్,

👉 వారిని స్వదేశానికి ఆహ్వానించింది.

👉 ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా ఆశ్రయం ఇచ్చింది.

👉 శిబిరాలు ఏర్పాటు చేసింది.

👉 జీవితాన్ని మళ్లీ మొదలు పెట్టే అవకాశం ఇచ్చింది.

👉 సిక్కులకు హిందువులకు లకు బ్రిటిష్ పౌరసత్వం కూడా కల్పించింది.


ఈరోజు బ్రిటన్‌లో ఉన్న లక్షలాది హిందూ సిక్కు కుటుంబాల వెనుక

వేదన అవమానాలతో నిండిన ఉగాండా కథ ఉంది.


ఇది రాజకీయ కథ కాదు…

ఇది తమ మట్టిని కోల్పోయిన హిందువుల కధ..సిక్కుల కన్నీటి గాథ.


ఈ చరిత్రను మర్చిపోవద్దు.

ఒక దేశం తన ప్రజలను ఎలా కాపాడిందో — లేదా కాపాడలేకపోయిందో అన్న ప్రాతిపాధికనే దేశ నాయకత్వ పఠిమ ను గుర్తిస్తారు..దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తారు..


ఈ ఉక్కు మహిళ గా చెప్పబడే ఇందిరా గాంధీ గారు ఏనాడూ హిందువుల పట్ల..సిక్కుల పట్ల మానవత్వంతో వ్యవహరించలేదు..


గోపాష్టమి రోజు హిందూ సన్యాసులను కాల్చి చంపించడం దగ్గర నుంచి ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో సిక్కు మారణహోమం వరకూ..

స్వంత భూభాగం మిజోరం మీద వైమానిక దాడులు..

ఆపరేషన్ బ్లూ సార్ లో ఆర్మీ ని వాడడం..కుటుంబ నియంత్రణతో హిందూ జనాభా తగ్గించే కుట్ర చేయడం వరకూ అన్నీ హిందూ వ్యతిరేక చర్యలే..


ఇవన్నీ దాచేసి బంగ్లాదేశ్ యుద్ధం మాత్రమే హైలెట్ చేస్తారు..ఆ యుద్ధంలో కూడా గెలిచి ఏ ప్రయోజనమూ సాధించకుండానే రాజీ పడ్డారు..


మరోసారి చెప్తున్నాము..వాస్తవ చరిత్రను తెలుసుకుందాం..కాంగ్రేస్ సృష్టించే కధనాల ట్రాప్ లో పడకుండా మనల్ని మన దేశాన్ని కాపాడుకుందాం..


భారత్ మాతాకీ జై..🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: