పద్యభారతి వర్ణన:-"పశుపోషణ"నాడు -నేడు".
పూరణ:-",సీసము "
"పాడి పంటలు నాడు ప్రాణమై దేశము
పశు పాలనము జేసి పరిఢవిల్లె
ఆయు రారోగ్యము లద్భుత రీతిని
యందరి సొత్తుగ పొంది నారు
పాడి పంటల వల్ల ఫలితంబు లేదని
పశు పాలనము మాని పనులు లేక
కాయ కష్టము మర్చి కని విని యెరుగని
రోగాల మూల్గుచు రోగు లయిరి
తే"గీ"
"పశువు లను జంపి ప్రకృతిని పాడు జేసి
పుడమి యునికిని గూల్చంగ బూను కొనిరి
శాస్త్ర విజ్ఞాన మనుచును చతికిల బడి
నిలచు కొమ్మను నరికిరి నేటి నరులు".
నమస్సులతో...
డి.సి.నరసింహులు,
మేడ్చల్.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి