26, జులై 2023, బుధవారం

అగద తంత్రము

 అగద తంత్రము - విషం , దాని పుట్టుక లక్షణాలు.


 ఈ అగద తంత్రము . ఆయుర్వేదాన్గములలో ఒకటి   అసలు ఆయుర్వేదంగములు 8 . అవి 


 1. శల్య తంత్రము.

 2. శౌలాక్య తంత్రము.

 3. కాయ చికిత్స .

 4. భూత విద్య.

 5. కౌమార భ్రుత్యము.

 6. అగద తంత్రము.

 7. రసాయన తంత్రము.

 8. వాజికరణ తంత్రము.


 ఈ 8 విభాగములు ఆయుర్వేదం లొని భాగాలు  అందులొ ఈ అగద తంత్రము అనునది అనేక రకమయిన విషాలు శరీరం నందు ప్రవేశించి నానా విధములగు బాధలు శరీరమున ఏర్పడినప్పుడు అట్టి భాధలను ఉపశమింప చేసి మరణం కలగకుండా కాపాడుటకు ఉద్దేశింపబడింది . 


       అనేక రకములు అగు పాములు , తేళ్ళు, ఎలుకలు, పిచ్చి కుక్కలు , సాలిళ్ళు , దోమలు మొదలగు జంతువులు విష జంతువులు. ఈ జంతువుల యెక్క బాగాలు అనగా శుక్రము, చొంగ మొదలగు భాగములు కూడా విషం అనియు అవి తీవ్రమయిన వ్యాధులను కలుగజేయు ప్రభావం కలవు అని మన పూర్వీకులు కనుగొన్నారు .


 విషము పుట్టుక  - 


 దేవదానవులు అమృతం కొరకు పాలసముద్రం చిలుకుతున్నప్పుడు అమృతం కంటే విశేష కాంతి కలదియు , నీలవర్ణం అయిన వస్తువోకటి పుట్టి లోకమును నశింప చేయుటకు క్షణక్షణం వ్యాపించచుండగా దానిని చూసి జగత్తు అంతా విషాద భరితం అయ్యెను . అందువలన దానికి విషం అని పేరు వచ్చింది.  అప్పుడు ఆ విషం ఈశ్వరునిచే ఎదుర్కొనబడినది. ఆ తరువాత ఆ విషం తన అసలు రూపం వదిలి కృత్రిమ రూపం ధరించి స్థావర, జంగమ ల యందు ప్రవేశించెను .


 విష భేదములు - 


 స్థావరం, జంగమం అను విషములు రెండు విధములు . ఇవి ఆక్రుతిమములు ( రూపం కలవి )

అందు స్థావరమునకు 10 , జంగమునకు 16 ద్రవ్యములను ఆశ్రయించుకొని ఉండును. అదే విధంగా సవిషయమనియు , సవిశావిషములు అనియు రెండు విధములు . 


            రసాది దాతువుల యందును , ముస్తకాది కందల యందు ఉండు విషములను స్థావర విషములు అనియు, పాము , ఎలుక , తేలు మొదలగు వానియందు ఉండు విషములను జంగమ విషములు అని అందురు. ఇవి విషములు అన్నింటిలోను తీవ్రమైనవి.


 విష లక్షణ గుణములు - 


 విషములు అన్నియు ఆర్చుట, ఉష్ణం , తీక్షణం , చిక్కదనం లేకుండా ఉండుట, ముందు శరీరం అంతా వ్యాపించి తరువాత జీర్ణం అగుట , శీగ్రంగా చంపుట, అలగే శరీరం నుండి పోవుచూ శరీర బంధాలును ( బాగాలు ) శిధిలం చేయుట , సూక్ష్మ నాళాల యందు కూడా ప్రవేశించుట, జట రాగ్ని వలన కూడా జీర్ణం కాకుండా ఉండుట, దోష ధాతువులను క్షీనింప చేయుట , సూక్ష్మ తత్వం వలన శరీరం యందు అవయవాల నందు ప్రవేశించి వికారం కలగచేయును .


 విష ప్రభావం - 


 విషములు యందు గుణములు తీక్షనములు . అందువలన అవి త్రిదోషములను ప్రకొపిమ్పచేయును . అట్లు విషము చే ప్రకోపించబడిన త్రిదోషములు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించ లేకపోవును. అందువలన విషము పిత్తము వలన జీర్ణం కాలేకపోవడం వలన ప్రాణం బంధించును. విషంతో కూడిన శ్లేష్మం చే పోవు త్రోవ మార్గము శ్లేష్మంచే నిరోదింప బడటం ములాన ఉచ్చ్వాసం బంధింపబడును. అందువల్ల ప్రాణం ఉన్నప్పటికి లేని వాడివలే సంజ్ఞా రహితుడై పడి ఉండును.


          విషం మొదట శరీరం నందు ప్రవేశించి మొదట రక్తమును, తరవాత కఫమును, పిత్తమును,వాతమును వాటి పనులను చెడగొట్టి చివరికి హృదయం నందు ప్రవేశించి ప్రాణాలు హరించును.


 స్థావర విషం యుండు స్థానములు - 


 వేరు , ఆకు , పండు, పువ్వు పట్ట, పాలు, చేప బంక, దాతువులు, దుంప ఈ పది స్థానములు విషం నిలువ ఉండు స్థానములు . అలాగే శుశ్రుతం నందు అశ్హ కూర , గుంజ, సుగంద, నల్ల యష్టిమధుకం , గన్నేరు , గురువింద, ఈశ్వరి, పోత్తిదుంప, గంజాయి మొక్కల వేర్లు విషపురితమైనవి .


    నేపాళ గింజ మద్య ఉండు సన్నని ఆకు , చేదు అనప, పాల టేకు, ప్రెంకనమ్ , అందుగ, మొక్కల యెక్క ఆకులు విషం కలవి.


     ఈ విధంగా స్థావర విషాలు 55 రకాలుగా ఉంటాయి అని శుశ్రుతుడు తన గ్రంధంలో వివరించాడు.


 ధాతు విషాలు - 


 పాదరసం, తాలకం , తామ్రము , సత్తు, సీసము , తగరము, అంజనము, మణిశిల, పాషానములు , మణులు ఇవి ధాతు విషములు .


 కంద విషాలు - 


 సక్తుకము, ముస్తకము, కూర్మము , నార్వికము, సర్షపము , ఫైకథమ్ , వత్స నాదము,శ్వేత శృంగి, కాలకుటము , మేష శృంగి, ధర్దుకము, హాలాహలము, కర్మాట ము గ్రంది. , హరిధ్రకము, రక్త శృంగి, కీసరము, యమధంష్ట్రా అనునవి 18 కంద విషములు 


        పైన చెప్పిన 18 విధములు అగు కంద విషములు ప్రాణాంత కములు. మొదటి 8 ఔషధాల యందు , మిగిలిన 10 రసవాదం ( బంగారం తయారు చేయు విద్య.) యందు ఉపయోగిస్తారు.


 స్థావర విషం లక్షణాలు - 


 స్థావర విషం జ్వరము, ఎక్కిళ్ళు, దంత హర్షము, మింగుడు పడకుండా ఉండుట, మరపు వచ్చుట, వమనం ( వాంతి ) , అరుచి,  శ్వాస, మూర్ఛ వీటిని కలుగచేయును .


 మూల విషం లక్షణాలు. - 


 మూల విషం భక్షణ వలన చుట్టుకొని పొవుట, ప్రలాపం, మొహం కలుగును. పత్ర విషం 

( ఆకు లొని ) విషం వలన ఆవులింతలు, శరీరం చుట్టుకొని పొవుట, శ్వాస లొ ఇబ్బంది కలుగును.

ఫల విషం వలన వృషణాల వాపు , దాహం , అన్నా ద్వేషం కలుగును. పుష్ప విషం వలన వాంతి , మూర్ఛ కలుగును. పట్టచేప జిగురు విషము వలన నోటి వాసన, జిహ్వాకాటిన్యం , తలనొప్పి, సొల్లు కారుట, కలుగును. క్షార విషం వలన నోట నురుగ వచ్చుట, విరేచనం , నాలుక బరువు ఎక్కుట కలుగును. ధాతు విషం వలన గుండె యందు పీకుడు , మూర్ఛ కలుగును. సాధారణంగా ఈ విషములు అన్నియు తినిన కొంతకాలం తరువాత ప్రాణములు హరించును.


 స్థావర విషం లక్షణములు -


 స్థావర విషం తిన్న వానికి మొదటి వేగమున నాలుక నల్లగా మారి మోద్దుబారుతుంది. మూర్ఛ , శ్వాస, వాంతి కలుగును. రెండొ వేగమున వణుకు, తాపము, కం టం నందు భాద కలుగును, మూడో వేగమున గుండె యందలి భాద మొదలగును. ఆమాశయం నందు శుల మొదలై కన్నులు రంగు మారి పచ్చబడి వాచుట కలుగును. నాలుగో వేగమున పక్వాశయం నందు పోటు , ఎక్కిళ్లు , దగ్గు తలబరువు కలిగించును. అయిదో వేగమున కఫం కారుట, కళ్ళు పోటు, ఆరో వేగమున తెలివి నశించి విరేచనం ఎక్కువ అగును. ఏడో వేగమున మెడ, వీపు, నడుములు నిలవకపోవుట ఆతరువాత ప్రాణం పొవుట సంభవించును .


  మాటలు సరిగ్గా రానివారికి మాటలు తెప్పించే  రహస్య యోగం  -


వసకొమ్ముని దంచి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక పాత్రలో పోసి ఆ చూర్ణం నిండేవరకు ఉసిరికాయలు రసం పొసి బాగా కలిపి ఒక రాత్రి నానబెట్టి తరువాత ఎండబెట్టి బాగా ఎండబెట్టి బాగా ఎండిన తరువాత మళ్ళి దంచి మెత్తగా తయారుచేసుకుని ఆ చూర్ణాన్ని రోజూ పూటకు మూడు గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే మాటలు తడబడే వారికి , మాటలు ముద్దగా పలికేవారికి , మాటలు ఆగిఆగి మాట్లాడేవారికి ఆ సమస్యలు తొలగి స్వచ్చముగా మాటలు వస్తాయి.

 

     లేత మర్రి ఊడలు సాన పైన అరగదీసి ఆ గంధమును నాలిక పైన రాయుచున్నను మాటలు త్వరగా వచ్చును . 


 

   మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


 ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

        9885030034                     


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


   కాళహస్తి వేంకటేశ్వరరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: