26, జులై 2023, బుధవారం

అంతర్జాతీయ ఎగ్జిబిషన్

 



అత్యద్భుత నిర్మాణ సౌందర్యం..!! భారతీయ వారసత్వ సంపద ఉట్టిపడేలా కొత్త ఢిల్లీ లోని ప్రగతి మైదానంలో నిర్మాణమైన 'అంతర్జాతీయ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్' (IECC) ఇది.. రేపు గౌరవ ప్రధాని శ్రీ Narendra Modi గారి చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుగనుంది. 


2700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ IECC ని 'శంఖం' రూపంలో నిర్మించడం జరిగింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరగబోయే G20 శిఖరాగ్ర సమావేశాలు ఈ కన్వెన్షన్ సెంటర్ లోనే జరుగనున్నాయి. 20 దేశాలకు చెందిన అతిరథమహారధులు ఈ సమావేశంలో పాల్గొననున్న నేపథ్యంలో భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఉండాలని కేంద్రం ఈ అత్యద్భుత నిర్మాణం చేపట్టింది. ఇది భారత దేశ ప్రజలందరికి గర్వకారణం!!

కామెంట్‌లు లేవు: