24, మార్చి 2025, సోమవారం

మా గురువుల్ పరాశరులు

 ఉ.మా గురువుల్ పరాశరులు మాన్యులు వేద పురాణ వేద్య సం

యోగులు, వాగ్మి, ప్రాజ్ఞులు మహోన్నత గోకుల నాథ కృష్ణులా

వాగనుశాసనుం దయను పద్యములన్ రచియింప నేర్చి నే

నీగతి నిల్చి, భక్తి స్మరియించుచుఁ గొల్చుచునుందు భారతీ!౹౹ 103


మ.ముదిగొండాన్వయ వీరభద్రులు దయన్ మోదమ్ముతో నెంచి యీ

సదసద్భావ విశేష నైపుణిని నీ సాహిత్య సాంగత్యమున్

మదికిన్ గూర్చ గ్రహించి, ధీపతులు, సమ్యగ్భావ సంధాన కో

విదులన్ సన్నుతిఁ జేయుచుందుఁ గొలుతున్ వేడ్కన్ సదా భారతీ!౹౹104

కామెంట్‌లు లేవు: