అసలు సనాతనధర్మం సంబంధించిన విషయ జ్ఞానాన్ని పొందండి...
మొట్టమొదటి సనాతన ధర్మం ఏమిటో మార్కండేయుడు చెప్పాడు...తల్లిదండ్రులకు సేవచేయాలని ...అది మొదటి విషయము...ఆ ధర్మానికి యముడు సైతం కట్టుబడియుండినాడు.
రెండవ సనాతన ధర్మంలో రాముడు వైరాగ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు. ప్రతి వ్యక్తి ప్రతిరోజు రెండుగటల సమయాన్ని వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారతాలు , భగవత్గీత , జ్ఞానవాశిష్టం , యోగ వాశిష్టాలు , సాంఖ్యాలు , స్మృతులు వంటివి అభ్యసనం చేయాలి...ఇవి ప్రతియొక్కరు అనుసరించండి.
తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, సంతానాన్ని ఎలా పెంచాలి , భార్యతో ఎలా ఉండాలి , భర్తతో ఎలా మెలగాలి , ఇరుగుపొరుగు లతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి , బంధు మిత్రులతో ఎలా ఉండాలి , సోదర సోదరీ వర్గముతో ఎలా ఉండాలి...రాజ్యాన్ని ఏలే వారితో ఎలా మెలగాలి ..ఇలాంటి కోకొల్లలు సనాతన ధర్మం వేల సంవత్సరాల క్రితమే తెలియచేసింది. విద్యా విధానంలో పెద్దబాలశిక్షలో తెలిపిన సమాచారాన్ని ఖచ్చితంగా పాఠ్యశాలల్లో అమలు పరచాలి అని ఏదయినా చట్టం ఉంటే మంచిది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి