17, ఏప్రిల్ 2021, శనివారం

నిర్లక్ష్యం వద్దు

 నిర్లక్ష్యం వద్దు అదేసమయంలో భయపడాల్సిన అవసరం లేదు.

కరోనా ఎవరికీ రావొద్దు అనేదే మన కోరిక అయితే పరిస్థితి చూస్తే  సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. దీనిని అందరం కలిసి కట్టుగా ఎదుర్కోవాలి. ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి అయితే అది మాత్రమే సరిపోదు. మానసిక సంసిద్ధత అవసరం.


పొరపాటున వస్తే భయం వద్దు.

జ్వరం,కాళ్ళు లాగడం, జలుబు, రుచిలేకపోవడం, వాసన లేకపోవడం , ఆకలి తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే RTPCR టెస్ట్ చేయించుకోవాలి. 

రాపిడ్ సాధ్యమైనంత వరకు వద్దు. 

వయస్సు ఎక్కువ ఉంటే HR CT scan చేయించాలి. దాని వల్ల వ్యాధి తీవ్రత తెలుస్తుంది.

సంవత్సర కాలం లో వైద్యులకు దీనిపై పూర్తి పట్టు దొరికింది.

సకాలం లో టెస్ట్ చేయిస్తే ఎలాంటి ప్రమాదం లేదు.

వచ్చిన వాళ్ళు, రానివాళ్ళు అందరూ నువ్వుల లడ్డు, బొప్పాయి పండు, అక్రూట్, ఖర్జురం , తినాలి. రోజు కొద్దిసేపు ఉదయంఎండలో నిలబడాలి.

కొద్దిగా వ్యాయాయం, యోగా చేయాలి. బాగా తినాలి.

అవసరమైతేనే బయటకు వెళ్ళాలి . 

నిపుణుల మాటలను బట్టి ఇది జూన్ మొదటి వారం నుండి మళ్ళీ మామూలు అవుతుంది.

45 ఏళ్ల పై వారు తప్పకుండా వాక్సిన్ తీసుకోవాలి. ఎలాంటి భయం వద్దు.

రెండవ డోస్ తరువాత 15 రోజులకు మనకు పూర్తి శక్తి వస్తుంది.

ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా ఒకరికి ఒకరు మాట్లాడుకొందాం . కలిసి ఎదుర్కొందాం

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Good message